hajipur
-
Bihar: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హాజీపూర్లోని ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ట్రాలీలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది కావడియాత్రికులు హైవోల్టేజీ విద్యుత్ వైరు తగిలి మృతి చెందారు.ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సోన్పూర్లోని బాబా హరిహరనాథ్ ఆలయానికి ఈ కావడి యాత్రికులు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీలో ప్రయాణిస్తున్న కావడియాత్రికులంతా పహెల్జా నుండి గంగాజలాన్ని తీసుకుని, సోన్పూర్లోని బాబా హరిహరనాథ్ ఆలయానికి వెళుతున్నారు.ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఎస్డీపీఓ ఓంప్రకాష్ మాట్లాడుతూ కావడియాత్రికులంతా ట్రాలీలో డీజేని తీసుకెళ్తున్నారని, ఆ డీజేకి 11 వేల వోల్టుల విద్యుత్ తీగ తగిలిందన్నారు. ఈ కారణంగానే వారంతా విద్యుదాఘాతానికి గురయ్యారని తెలిపారు. -
45 డిగ్రీలు దాటేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం నుంచే మంట పుట్టిస్తున్న సూర్యుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చండ ప్రచండ వేడితో ప్రజలు తల్లడిల్లుతున్నారు. గురువారం మంచిర్యాల జిల్లా హాజిపూర్లో గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అదే విధంగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో కూడా గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీ ల సెల్సియస్, ములుగు జిల్లా మేడారంలో 45.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతా యని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావొద్దని సూచించింది. ఎండల తీవ్రతకు తోడు వడగాల్పుల ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, ఏప్రిల్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడంతో వచ్చే నెల మేలో పరిస్థితేంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా... రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సగటున 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 43.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్లో 24.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.6 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా, భద్రాచలం, నల్లగొండలో 4 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, మెదక్, హనుమకొండ, నిజామాబాద్, రామగుండంలో 3 డిగ్రీల సెల్సియస్ మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల సెల్సియస్ మేర సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం ఉత్తరాది జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. -
Chirag Vs Pashupati: అబ్బాయి వర్సెస్ బాబాయి
జాతీయ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన వారసత్వ పోరుకు తెర లేచింది. బిహార్లో దిగ్గజ నేత దివంగత రాం విలాస్ పాశ్వాన్ వారసత్వం కోసం ఆయన కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి కుమార్ పారస్ మధ్య జరుగుతున్న పోరు తుది దశకు చేరుకుంది. పాశ్వాన్ ఏకంగా ఎనిమిది సార్లు ఎంపీగా నెగ్గిన హాజీపూర్ లోక్సభ స్థానంలో ఈసారి వారిద్దరూ నేరుగా అమీతుమీ తేల్చుకోనున్నారు... పాశ్వాన్ల కంచుకోట హాజీపూర్ లోక్సభ స్థానంతో పాశ్వాన్లది విడదీయరాని బంధం. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రాం విలాస్ పాశ్వాన్ 1977 లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా అక్కడ విజయం సాధించారు. మధ్యలో 1984, 2009 మినహా మరో ఏడుసార్లు హాజీపూర్ నుంచే నెగ్గారు. ఆనారోగ్య కారణాలతో పాశ్వాన్ రాజ్యసభకు వెళ్లడంతో తమ్ముడు పశుపతి 2019లో తొలిసారి హాజీపూర్ నుంచి పోటీ చేసి నెగ్గారు. చిరాగ్ 2014తో పాటు 2019లోనూ జముయ్ లోక్సభ స్థానం నుంచి నెగ్గారు. 2020లో పాశ్వాన్ మృతి చిరాగ్, పశుపతి మధ్య వారసత్వ పోరుకు దారితీసింది. పాశ్వాన్ వారసుడిని తానేనని పశుపతి ప్రకటించుకోవడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తానని చిరాగ్ హెచ్చరించారు. పశుపతి మిగతా నలుగురు ఎల్జేపీ ఎంపీలతో కలిసి తిరుగుబావుటా ఎగరేయడంతో వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. చివరికి వివాదం ఎన్నికల సంఘం వద్దకు చేరింది. ఎల్జేపీ పేరును, పార్టీ గుర్తును ఈసీ స్తంభింపజేసి పశుపతి వర్గానికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ), చిరాగ్కు ఎల్జేపీ (రాం విలాస్) పేర్లు కేటాయించింది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీఏతో చిరాగ్ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో పశుపతి 2021లో ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. చిరాగ్ ఇన్, పశుపతి ఔట్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో బిహార్లో 40 స్థానాలనూ క్లీన్స్వీప్ చేయడం లక్ష్యం పెట్టుకున్న బీజేపీ మరోసారి చిరాగ్ను చేరదీసింది. అలా మళ్లీ ఎన్డీఏలో చేరిన చిరాగ్, పొత్తులో భాగంగా తమకు కేటాయించే 5 స్థానాల్లో హాజీపూర్ ఉండాల్సిందేనని పట్టుబట్టి సాధించుకున్నారు. దాంతో పశుపతి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీనికి తోడు ఆర్ఎల్జేపీకి బీజేపీ ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో వారం క్రితం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను హాజీపూర్ నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. తనతో పాటు మిగతా నలుగురు ఎంపీలు కూడా మళ్లీ బరిలో దిగి తీరతారని స్పష్టం చేశారు. బాబాయిని ఓడిస్తే పాశ్వాన్ల కంచుకోటైన హాజీపూర్ హస్తగతమవడమే గాక తండ్రి వారసత్వం పూర్తిగా తనదేనని రుజువవుతుందనే భావనతో చిరాగ్ అక్కడి నుంచి బరిలో దిగుతున్నారు. హాజీపూర్లో ఎస్సీ సామాజిక వర్గానికి దాదాపు 4 లక్షల ఓట్లున్నాయి. దీనికి తోడు 1.5 లక్షల దాకా ముస్లిం ఓట్లున్నాయి. యాదవులు, రాజ్పుత్లు, భూమిహార్లతో పాటు కుషా్వహాలు, పాశ్వాన్లు, రవిదాస్ వంటి అత్యంత వెనకబడ్డ సామాజిక వర్గాలకు కూడా చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకుంది. ఈ వర్గాలకు రాం విలాస్ పాశ్వాన్ తిరుగులేని నేతగా కొనసాగారు. 1977లో ఆయన సాధించిన 4.69 లక్షల మెజారిటీ గిన్నిస్ రికార్డుకెక్కింది! 1989లో ఏకంగా 5 లక్షల పై చిలుకు మెజారిటీ సాధించారాయన. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బరిలో బాబాయ్..అబ్బాయ్! గెలుపెవరిదో..
Chirag Paswan Vs Pashupati Paras: రానున్న లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలు ప్రత్యేకతలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబ సభ్యులే విరోధులుగా బరిలోకి దిగుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తన చిన్నాన్న పశుపతి కుమార్ పరాస్పై హాజీపూర్ నుంచి పోటీ చేస్తానని లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. ‘నాన్న కర్మభూమి అయిన హాజీపూర్ నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్విలాస్), ఎన్డీఏ అభ్యర్థిగా నేను పోటీ చేయడం ఖాయం. ఆయనకు (పశుపతి కుమార్ పరాస్) స్వాగతం (అక్కడ నుంచి పోటీ చేయడానికి). నేను అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఎలాంటి సవాళ్లకు నేనెప్పుడూ భయపడలేదు. ఈ ఛాలెంజ్ను కూడా స్వీకరిస్తున్నాను’ అని చిరాగ్ పాశ్వాన్ మీడియాతో అన్నారు. హాజీపూర్ నియోజకవర్గం నుండి తన సొంత బాబాయిపై పోటీ చేయడంపై పాశ్వాన్ మాట్లాడుతూ "ఇది నాకు రాజకీయ ఎంపిక కానే కాదు. ఇది నా కుటుంబానికి కూడా ఇబ్బందికరమే. ఇటువంటి నిర్ణయాలు రాజకీయ పార్టీలుగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మనోభావాలు పరిగణనలోకి తీసుకుని తీసుకోవాలి. కుటుంబం నుండి విడిపోవాలనే నిర్ణయం ముందుగా ఆయనే (పశుపతి పరాస్) తీసుకున్నారు" అని పేర్కొన్నారు. బిహార్లో రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్డీఏ సీట్లు నిరాకరించడంతో రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP) అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. "నేను (లోక్సభ ఎన్నికల్లో) హాజీపూర్ నుండి పోటీ చేస్తాను. మా సిట్టింగ్ ఎంపీలందరూ వారి వారి నియోజకవర్గాల నుండి పోటీ చేస్తారు. ఇది మా పార్టీ నిర్ణయం" అని పరాస్ అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల కోసం బిహార్లో సీట్ల పంపకాన్ని ఎన్డీఏ ప్రకటించింది. బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొంది. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా (HAM), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ఒక్కో స్థానంలో పోటీ చేయనుంది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది. -
Viral Video: దొంగలతో మహిళా కానిస్టేబుళ్ల వీరోచిత పోరాటం
బ్యాంక్ను కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన దుండగులతో వీరోచితంగా పోరాడారు ఇద్దరు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు.. దొంగల పట్ల మహిళలు చూపిన ధైర్యం, తెగువను పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని హాజీపూర్లో చోటుచేసుకుంది. వివరాలు.. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెందూరి చౌక్లో ఉన్న ఉత్తర్ బిహార్ గ్రామీణ బ్యాంక్ వద్ద బ్యాంక్ వద్ద జుహీ కుమారీ, శాంతీ కుమారీ అనే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రోజు ముగ్గురు వ్యక్తులు బ్యాంక్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వాళ్ల ప్రవర్తన అనుమానంగా కనిపించడంతో ఏ పనిమీద వచ్చారని జుహీ ప్రశ్నించింది. దీనికి వారు బ్యాంక్లో పని ఉందని చెప్పగా.. పాస్బుక్ చూపించమని అడిగింది. దీంతో ముగ్గురిలో ఓ వ్యక్తి రివాల్వర్ బయటకు తీశాడు. వెంటనే అప్రమత్తమైన ఇద్దరు కానిస్టేబుళ్లు తమ తుపాకులతో వారిని నిలవురించారు. కానిస్టేబుళ్ల వద్ద ఉన్న తుపాకులను లాక్కోవడానికి దొంగల విఫల ప్రయత్నం చేశారు. దొంగల చేతిలో గన్ ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడలేదు. మహిళలిద్దరూ ముగ్గురు దుండగులపై సాహోసోపేతంగా పోరాడారు. అప్పటికే బ్యాంకులో దొంగతనం చేయడం కుదిరేలా లేదని భయపడ్డ దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా బ్యాంకులో అమర్చిన సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. పారిపోయిన దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. దొంగలను ధైర్యంగా ఎదుర్కొని, తరిమికొట్టిన మహిళా కానిస్టేబుళ్లను బ్యాంకు సిబ్బందితో పాటు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని బ్యాంక్ దోపిడికి ప్రయత్నించిన నిందితుల కోసం గాలిస్తున్నారు. సెందూరి వద్ద ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించారని.. తమ మహిళా కానిస్టేబుళ్లు అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించి వారిని భయపెట్టగలిగారని సీనియర్ పోలీసు అధికారి ఓం ప్రకాష్ తెలిపారు.. ఈ ఘటనలో ఎలాంటి కాల్పులు జరగలేదని.. కానిస్టేబుళ్లకు రివార్డ్ అందిస్తామని పేర్కొన్నారు. చదవండి: దారుణం.. బైకర్ను ఢీకొట్టి 1.5 కిమీ ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్.. అరుస్తున్నా ఆపకుండా.. The Gallant act of two lady constables of Bihar Police is laudable. Their bravery thwarted an attempt of Bank Robbery in Vaishali.#Bihar_Police_Action_against_Criminal pic.twitter.com/M3Nn9w33Xw — Sawant Suman ساونت سمن 🇮🇳💙 (@SumanSawant) January 19, 2023 -
మంచిర్యాల: మమ్మీ.. నా రోగం ఎంతకీ తగ్గదేమోనే!
మంచిర్యాల రూరల్(హాజీపూర్): మాయదారి జబ్బు.. నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక అమ్మాయి జీవితాన్ని బలిగొంది. అదేం జబ్బో అర్థంకానీ తల్లిదండ్రులు.. ఎంతకీ తగ్గదేమో అనే దిగులుతో.. ఆ కుటుంబం వేదనకు గురైంది. మానసికంగా కుంగిపోయిన ఆ టీనేజర్ చివరకు ప్రాణం తీసుకుంది. హాజీపూర్ మండలంలోని దొనబండలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రచన, సత్తయ్య దంపతుల కుమార్తె కోట హారిక (19). మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో హారిక డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు పలు ఆస్పత్రులు తిరిగినా.. చికిత్స కోసం ఎంత ఖర్చు చేసినా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హారిక బాబాయ్ కోట స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. సమస్యలొస్తే ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలి. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
స్కూల్కు వెళ్లాలంటే మూడు గంటలు నడవాల్సిందే
-
'ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు'.. బస్సు మీ ఊరికి వస్తోంది
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్కు చెందిన విద్యార్థులు బస్సు సౌకర్యం లేక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండటంపై ‘ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ మెయిన్లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఆర్టీసీ కుషాయిగూడ డిపో మేనేజర్ సుధాకర్, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి బుధవారం హాజీపూర్ గ్రామంతో పాటు మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈసీఐఎల్ నుంచి బొమ్మలరామారం మండల కేంద్రం వయా మల్యాల గ్రామం నుంచి హాజీ పూర్కు బస్సు ఆరు ట్రిప్పులు నడుస్తోందని, హాజీపూర్ విద్యార్థుల సౌకర్యం కోసం ధర్మారెడ్డి గూడెం చౌరస్తా నుంచి మోడల్ స్కూల్కు బస్సు నడిపిస్తామన్నారు. ఎస్ఐ వెంకన్నతో పాటు షీ టీమ్ బృందం ఎస్ఐ మారుతి, కానిస్టేబుళ్లు అనిల్, పార్వతి మోడల్ స్కూల్ విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆకతాయిలను గుర్తించి వారి వాహనాల నంబర్లను అందజేయాలని కోరారు. మోడల్ స్కూల్ పరిసరాలలో పెట్రోలింగ్ జరుగుతుందని, మరింత నిఘా పెంచుతామని చెప్పారు. ఆపద సమయంలో 100 నంబర్కు ఫోన్ చేయాలని విద్యార్థినులకు సూచించారు. -
పోలీసుల అత్యుత్సాహం.. నవ వధువు బెడ్రూమ్లోకి చొరబడి మద్యం కోసం
పాట్నా: బిహారలో సంపూర్ణ మధ్య నిషేధం విధిస్తూ 2016లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్లో లో గుజరాత్, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాలు మద్యపాన నిషేధం విధించగా.. నాలుగో రాష్ట్రంగా బిహార్ నిలిచింది. తాజాగా సీఎం నితీష్ కుమార్ మద్యపాన నిషేదంపై శుక్రవారం మధుబనిలో జరిగిన ఓ సభలోనూ ప్రసంగిస్తూ.. మహిళల డిమాండ్ మేరకే తాను మద్యపాన నిషేధంపై నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసరాగా చేసుకున్న రాష్ట్ర పోలీసులు కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల బీహార్ పోలీసుల బృందం పాట్నాలోని నవ వధువు గదిలోకి వెళ్లి మద్యం కోసం వెతికారు. ఆ సమయంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా రాష్ట్రంలో ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మరోసారి కొత్తగా పెళ్లైన వధువు గదిలోకి చొరబడి పోలీసులు దాడులు నిర్వహించారు. వైశాలి జిల్లా పోలీసులు హాజీపూర్ నగరంలోని హతసర్గంజ్ ప్రాంతంతో ఉన్న శీల దేవీ ఇంటిపై గురువారం రాత్రి సోదాలు నిర్వహించారు. చదవండి: 18 ఏళ్లకు ఆడపిల్ల ప్రధానిని ఎన్నుకోగలిగితే... పెళ్లెందుకు చేసుకోకూడదు! అయిదు రోజుల క్రితం తన కొడుకుతో వివాహం చేసుకున్న ఆమె కోడలు బెడ్రూమ్పై దాడి చేశారు. శీలా కుమారి కోడలు పూజా కుమారి తన బెడ్ రూమ్లో ఉండగా.. మహిళా పోలీసుల లేకుండానే పోలీసుల బృందం అక్కడికి వచ్చారు. తన గదిలోకి వెళ్లి ప్రతి చోట వెతికారు. బెడ్, అల్మారా, సూట్కేసులతో సహా రూమ్ అంతా సెర్చ్ చేశారు. తన గదిలో ఏం వెతుకుతున్నారని కోడలు పూజా పోలుసులను ప్రశ్నించగా.. సైలెంట్గా ఉండాలని పోలీసులు అసభ్యంగా మాట్లాడారు. చదవండి: ఒక్క నెలలో కోటిమందికి పైగా.. ఎయిర్లైన్స్ చరిత్రలో మరో రికార్డు ఈ విషయంపై పూజా మాట్లాడుతూ..గదిలో దాచిపెట్టిన మద్యం బాటిళ్ల కోసం వెతుకున్నారని పోలీసులు చెప్పినట్లు తెలిపింది. అయితే ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను తట్టుకోలేక ఆమె అత్త స్పృహ తప్పి పడిపోయినప్పటికీ పోలీసులు తమ సోదాలు కొనసాగించారని వెల్లడించింది. పోలీసుల దాడుల అనంతరం స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నామని తెలిపింది. తమ కుటుంబంలో ఎప్పుడూ మద్యం సేవించిన దాఖలాలు లేవని, అయినా పోలీసులు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేశారని వాపోయింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై స్పందించేందుకు వైశాలి ఎస్ఎస్పీ మనీష్ కుమార్ నిరాకరించారు. చదవండి: జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్.. ఊపందుకున్న ఉద్యమం -
మహిళ చేతిలో కేంద్ర మంత్రికి ఘోర అవమానం
పాట్నా: కేంద్ర మంత్రిగా అయిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు ఓ మహిళ చేతిలో ఘోర అవమానం జరిగింది. అంతకుముందు ఆయన పర్యటనను నిరసిస్తూ పలుచోట్ల నల్లజెండాలు ఎదురుపడ్డాయి. పలువురు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఇంకు కేంద్ర మంత్రిపై చల్లింది. మంత్రి కుర్తాపై ఇంకు మరకలు పడ్డాయి. ఇది జరిగిన కాసేపటికి మంత్రి దుస్తులు మార్చుకుని యథావిధిగా కార్యక్రమం కొనసాగించారు. ఓ పార్టీలో చిచ్చు రేపడంతోనే ఈ తీవ్ర నిరసనకు కారణమని తెలుస్తోంది. చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్ వీడియో బిహార్లోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)కి చెందిన పశుపతి కుమార్ పారాస్ హాజీపూర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవల బిహార్లో రాజకీయ పరిణామాలకు కేంద్ర బిందువుగా పశుపతి మారారు. ఆ ఫలితమే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడానికి కారణం. ఇటీవల జరిగిన మంత్రివర్గ కూర్పులో స్థానం దక్కించుకున్న పశుపతి తొలిసారి సొంత నియోజకవర్గం హాజీపూర్లో సోమవారం పర్యటించారు. ఈ సమయంలో ఆయనకు పరాభవం ఎదురైంది. ఈ క్రమంలోనే అడుగడుగునా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ పార్టీ అధినేత రామ్విలాస్ పాశ్వాన్ మరణంతో ఎల్జేపీలో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ను విబేధించాడు. ప్రస్తుతం పార్టీపై వివాదం కొనసాగుతోంది. రాజకీయ అవసరాల కోసం పార్టీ చీల్చాడని పార్టీ వర్గాల్లో పశుపతిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన కేంద్రమంత్రిగా నియమితుడై తొలిసారిగా వస్తున్నప్పుడే ఈ పరాభవం ఎదురవడం గమనార్హం. చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు -
విషాదం: ప్రాణం తీసిన ఆన్లైన్ పేకాట
మంచిర్యాల రూరల్ (హాజీపూర్): ఇటీవల ఆన్లైన్ వాడకంతో చాలా విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ రుణాల యాప్లతో భారీగా నష్టపోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా.. మరికొందరు ఆన్లైన్ గేమ్లకు బానిసలై అవి లేకపోతే తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్లో పేకాట ఆడుతూ భారీగా నష్టపోయి తీవ్ర అప్పులపాలై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా పడ్తనపల్లిలో జరిగింది. హాజీపూర్ మండలం పడ్తనపల్లికి చెందిన చిందం పోశెట్టి (32) కి భార్య సుకన్య, కుమారుడు మన్విత్ (4) ఉన్నారు. పోశెట్టి ఆన్లైన్ రమ్మీ కల్చర్ తరచూ ఆడేవాడు. దీంట్లో బెట్టింగ్కు అలవాటుపడి పోశెట్టి అప్పుల పాలయ్యాడు. అయితే ఆన్లైన్ జూదం ఆడొద్దని తల్లిదండ్రులు, భార్య మందలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పేకాట ఆడుతూ అప్పులు పెరిగాయి. అప్పులు ఇచ్చిన వారు తీర్చాలని ఒత్తిడి పెంచడంతో పోశెట్టి మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం రాంపూర్ విద్యారణ్య ఆవాస విద్యాలయం వెనుక మైదానంలో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం గాలిస్తుండగా మైదానంలో అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఆలోపే అతడు మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హాజీపూర్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. -
ఆ ఇద్దరు సైకోలకు ఉరిశిక్షల వెనుక..
సాక్షి, హైదరాబాద్ : దశాబ్దం క్రితం నగరంలోని అంబర్పేటలో ఓ కుటుంబంలో ఐదుగురిని పట్టపగలు చంపినా.. ప్రత్యక్ష సాక్షులు లేరన్న కారణంతో నిందితులకు శిక్ష పడలేదు. రెండేళ్ల కింద హాజీపూర్, గొర్రెకుంట ఘటనల్లో సైకోలకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ రెండు ఘటనల్లోనూ ప్రత్యక్ష సాక్షులు లేకున్నా.. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా న్యాయస్థానం నిందితులకు క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చింది. ఈ రెండు ఘటనల్లోనూ దర్యాప్తు చేసింది తెలంగాణ పోలీసులే. కానీ, శిక్షలు పడటంలో ఎందుకంత మార్పు వచ్చింది? అంటే హాజీపూర్, గొర్రెకుంట కేసుల్లో కోర్టు డ్యూటీ ఆఫీసర్ (సీడీవో) లేదా కోర్టు లైజినింగ్ ఆఫీసర్ పోషించిన పాత్రే. నేరం జరిగిన వెంటనే పోలీసులు దర్యాప్తు చేసిన విధానం ఒక ఎత్తైతే, కోర్టు విచారణ మొదలైన తరువాత నిందితుల నేరం నిరూపించడం మరో ఎత్తు. కోర్టులో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. సాక్షులు ప్రభావితమైనా, తడబాటుకు గురైనా పోలీసుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే, ఈ లోపాన్ని సరిచేయడానికి డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఠాణాల్లో సిబ్బంది పనిని మొత్తం 17 వర్టికల్స్గా విభిజించారు. ఇందులో రిసెప్షన్, రైటర్, డయల్ 100, డిటెక్టివ్, క్రైంస్టాఫ్ తదితర విభాగాలు కీలకం. వీటన్నింటిలో సీడీవోల పని కీలకం. ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక ఏటా రాష్ట్రంలో కన్విక్షన్లు పెరిగి డిస్పోజల్స్ తగ్గుతున్నాయి. సెక్షన్లపై శిక్షణ.. 2018 నుంచి వీరిపై డీజీపీ ప్రత్యేక శ్రద్ధ వహించడం ఫలితంగా గతంలో మునుపెన్నడూ చూడని రీతిలో నేరాల్లో న్యాయస్థానాల్లో శిక్షలు పడుతున్నాయి. సీడీవోలుగా రాష్ట్రంలోని అన్ని ఠాణాల నుంచి కానిస్టేబుల్, ఏఎస్సై ర్యాంకు ఆఫీసర్లకు హైదరాబాద్ జేఎన్టీయూలో ప్రత్యేకంగా పలు ఐపీసీ సెక్షన్లు, లీగల్ వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చారు. సాక్షుల వాంగ్మూలం రికార్డు, వారికి రక్షణ, వాయిదాలకు హాజరయ్యేలా చూడటం, సాంకేతిక ఆధారాల నివేదిక, చార్జిషీటు సరైన సమయంలో ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్) ద్వారా కోర్టుకు సమర్పించడం, సీసీ నంబర్ తీసుకోవడం కోర్టు వాయిదాలపై క్యాలెండర్ రూపొందించడం తదితర విధులు అతనే నిర్వర్తించాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కలసి దర్యాప్తు అధికారులు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)కు న్యాయస్థానం విషయాలు వివరించాలి. వీరు ప్రతీ శనివారం ఠాణాలో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి ఎస్హెచ్వో, దర్యాప్తు అధికారులు హాజరవుతారు. వారంలో కోర్టులో నడిచిన ట్రయల్స్ లోటుపాట్లు, అదనంగా చేయాల్సిన పనులపై చర్చిస్తారు. ఈ నివేదికను డీజీ కార్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు అందజేస్తారు. ‘ఉత్తము’లకు అభినందనలు.. అన్ని వర్టికల్స్తోపాటు సీడీవోల పనితీరుపై సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నిరంతరం డేటా నిర్వహిస్తోంది. ఇక్కడ అధికారులు రాష్ట్రంలోని అన్ని యూనిట్ల నుంచి నిరంతరం వచ్చే నివేదికలు చూసి పొరపాట్లు ఉంటే సరిచేస్తారు. కన్విక్షన్, డిస్పోసల్స్ వివరాలు డేటాబేస్లో నమోదు చేస్తారు. సీడీవోల అత్యుత్తమ ప్రతిభను, లోటుపాట్లను పేర్లు లేకుండా అందరికీ అందజేస్తారు. వీరి గణాంకాల ఆధారంగా నెలనెలా డీజీపీ కన్విక్షన్లలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి అభినందనలు పంపుతారు. దీంతో అందరిలోనూ జవాబుదారితనం పెరిగి కేసుల్లో న్యాయస్థానం త్వరగా తీర్పులు వస్తున్నాయని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్చార్జి డీఎస్పీ సత్యనారాయణ వివరించారు. -
డిసెంబర్లో హజీపూర్ ఉప ఎన్నిక
న్యూఢిల్లీ: బిహార్లోని హాజీపూర్ రాజ్యసభ సీటుకు డిసెంబర్ 14 ఎన్నిక నిర్వహిస్తామని, ఫలితాలు సైతం అదేరోజు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పోలింగ్ ఏర్పాట్ల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని బిహర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది. లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపకుడు, దళిత నాయకుడు ఎంపీ రామ్ విలాస్ పాసవాన్ గుండె పోటుతో మరణించడంతో హాజీపూర్ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గత లోక్సభ ఎన్నికల్లో హాజీపూర్ స్థానాన్ని తన తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ కోసం పాశ్వాన్ వదులుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్కు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2024, ఏప్రిల్ 2 వరకు ఉంది. 74 ఏళ్ల పాశ్వాన్కు గత అక్టోబర్ 3న గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. అక్టోబర్ 8న ఆయన మరణించారు. కాగా, 2014లో రాష్ట్రీయ జనతాదళ్తో విడిపోయి ఎన్డీఏతో పాశ్వాన్ జతకట్టారు. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ఎల్జేపీ.. తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసింది. అయితే జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో ఎల్జేపీకి చుక్కెదురైంది. (చదవండి: తప్పంతా నాదే.. బలంలేని చోట పోటీకి దిగాం) -
మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం..
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కరోనా కలకలం రేపింది. హాజీపూర్ మండలం రాపెళ్లి గ్రామంలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలింది. ముంబైకి వలస కూలీలుగా వెళ్లిన వీరు మే 5వ తేదీన స్వస్థలాలకు తిరిగివచ్చారు. అయితే వీరు ముంబై నుంచి రావడంతో హాజీపూర్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా హోం క్వారంటైన్ చేశారు. అయితే రెండు రోజుల క్రితం వారిలో కరోనా లక్షణాలు ఉండటంతో.. వారిని బెల్లంపల్లి ఐసోలేషన్కు తరలించారు. అనంతరం వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలు పంపించారు. శనివారం రాత్రి ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలడంతో.. వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: లక్షణాలు స్వల్పంగా ఉంటే ఇంటి వద్దే చికిత్స..) కాగా, జిల్లాలోని చెన్నూర్ మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళకు చనిపోయిన అనంతరం కరోనా పాజిటివ్గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమె కాంటాక్ట్లో ఉన్నవారికి పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగిటివ్గా తెలింది. ఆ తర్వాత నుంచి జిల్లాలో ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. తాజాగా ముంబై నుంచి స్వస్థలాలకు వచ్చిన వలస కూలీలకు కరోనా సోకడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
పోలీసు వ్యవస్థపై నమ్మకం కల్పించారు
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో గ్రామస్తులు, బాధితులతో అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం ఆద్యంతం భావోద్వేగంగా సాగింది. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, కలెక్టర్ అనితా రామచంద్రన్ హాజీపూర్లో గురువారం ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ బాధితురాలి బాబాయ్ ప్రవీణ్ ఏసీపీ భుజంగరావు కాళ్లపై పడి బోరుమన్నాడు. పోలీసు వ్యవస్థపై నమ్మకం కల్పించారని ప్రశంసల వర్షం కురిపించారు. ముగ్గురు బాలికల తండ్రులు మల్లేష్, నర్సింహ, తుంగని నందం మాట్లాడుతూ నిందితుడికి ఉరి శిక్ష త్వరగా అమలు చేయాలని, వాడి ప్రాణం పోయినప్పుడే తమ పిల్లల ఆత్మలు శాంతిస్తాయన్నారు. గ్రామానికి వంతెన మంజూ రు చేయాలనే ప్రజల వినతిపై కలెక్టర్ అనితా రామచంద్రన్ స్పందించి రూ. కోటి 70 లక్షలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. సాంకేతిక కారణాలతో ఓ కుటుంబానికి ప్రభుత్వసాయం అందడం లేదని, కోర్టు ద్వారా అíప్పీల్కు వెళితే తప్పక న్యాయం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ గారూ ఆదుకోండి.. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. పెద్ద కూతురుకు మానసిక సమస్య. ఉన్న ఒక్క కొడుకు వికలాంగుడు. ఉండేందుకు ఇల్లు కూడా సరిగా లేదు. ఇంటి పెద్ద పనిచేస్తేనే పూట గడుస్తుంది. చురుకుగా ఉన్న నా చిన్న కూతురు ను కిరాతకుడు శ్రీనివాస్రెడ్డి పొట్టన పెట్టుకున్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం రూ.లక్ష దాటలేదు. ఇప్పుడేమో తమకు ప్రభుత్వ సాయం అందదని తెలిసింది. ఎలాంటి ఆధారం లేని తమను మీరే పెద్ద మనసు చేసుకొని ఆదుకోవాలి. జీవనోపాధి కోసం ఉద్యోగం ఇప్పించాలి. – మైసిరెడ్డిపల్లి బాలిక కుటుంబ సభ్యులు -
హాజీపూర్: ఈ కారణం వల్లే వారు బలయ్యారు!
సాక్షి, యాదాద్రి: ‘బేటీ బచావో బేటీ పడావో’నినాదంతో బాలికల రక్షణ, చదువు కోసం ప్రాధాన్యమిస్తున్న ఈ రోజుల్లో చదువు కోసం వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు ఓ కిరాతకుడి చేతిలో బలయ్యారు. సరైన రవాణా వసతి లేకున్నా.. తమ కుమార్తెలను చదువు కోసం పొరుగున ఉన్న గ్రామాలకు పంపించాయి ఆ పేద కుటుంబాలు. కానీ లిఫ్ట్ ఇచ్చే పేరుతో ఓ రాక్షసుడు ఆ బాలికలపై ఘోరానికి ఒడిగట్టాడు. హాజీపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మరో బాలికపై హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన విషయంలో కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. రాజధానికి శివారునే ఉన్న బొమ్మలరామారం మండలం హాజీపూర్కు గ్రామాల మీదుగా భువనగిరి వరకు బస్సు సౌకర్యం లేకపోవడంతోనే ముగ్గురు బాలికలు బలైపోయారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. స్పెషల్ క్లాసులకు వెళ్లి.. మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల నర్సింహా, నాగమణి దంపతుల కుమార్తె(14) మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని సెరినిటీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఆమె గతేడాది ఏప్రిల్ నెల 25న పాఠశాలలో ప్రత్యేక తరగతులకు వెళ్లి సాయంత్రం 3 గంటలు దాటినా ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 2019 మార్చి 6 నుంచి కనిపించకుండా పోయిన హాజీపూర్ గ్రామానికే చెందిన మరో బాలిక(18) మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని కేఎల్ఆర్ కాలేజీలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో 2019 మార్చిలో శివరాత్రి పర్వదినం అనంతరం 6వ తేదీన కాలేజీకి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఇద్దరు బాలికలనూ హాజీపూర్కే చెందిన శ్రీనివాస్రెడ్డి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి అత్యాచారం, హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష పడింది. సాక్షి కథనంతో తెరపైకి మరో మిస్సింగ్ కేసు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న బాలిక (11) 2015లో అదృశ్యమైంది. ఈ మిస్సింగ్ కేసులో పోలీసులు నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. 2019 ఏప్రిల్ 29న ‘సాక్షి’దినపత్రికలో ఆ బాలిక మిస్సింగ్పై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పోలీసు లు కస్టడీలో ఉన్న శ్రీనివాస్రెడ్డిని విచారించగా, ఆ బా లికనూ తానే పొట్టన పెట్టుకున్నట్లు ఒప్పుకొన్నాడు. ఉద్యోగానికి పంపుదామంటే ఊపిరి తీసిండు: పేద కుటుంబానికి చెందిన నేను కూతురిని చదివించి ఉద్యోగం చేసే స్థాయికి తీసుకొద్దామంటే సైకో శ్రీనివాస్రెడ్డి తన కూతురు ఊపిరి తీసి నా ఆశలు ఆవిరి చేసిండు. శ్రీనివాస్రెడ్డికి బతికే హక్కు లేదు. కోర్టు తీర్పుతో పానం నిమ్మలమైంది. వాయిదాలు లేకుండా తొందరగా ఉరి తీసి మా పిల్లల పానాలు తీసిన బావిలోనే సైకోను పాతి పెట్టాలి. అప్పుడే పోకిరీలకు కనువిప్పు కలుగుతుంది. – తిప్రబోయిన మల్లేశ్, బాలిక తండ్రి -
శాస్త్రీయ ఆధారాలతో రుజువు...
సాక్షి, యాదాద్రి: హాజీపూర్ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్రెడ్డి ఉరిశిక్ష ఖరారు చేయడం వెనుక తీవ్ర కసరత్తే జరిగింది. అత్యాచారాలు జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేకున్నా.. శాస్త్ర, సాంకేతికత, వైద్యరంగాన్ని ఉపయోగించుకుని కేసును ఛేదించి నిందితుడికి ఉరి శిక్షపడటంలో పోలీసులు సఫలీకృతులయ్యారు. పాఠశాలకు వెళ్తున్న బాలికలను టార్గెట్ చేసి లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మించి బైక్పై ఎక్కించుకుని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన వివరాలను పోలీసులు సమర్థంగా నిరూపించారు. నిందితుడి మొబైల్ కాల్డేటా, సాంకేతిక పరిజ్ఞానం, డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక సాయంతో ఈ మూడు కేసుల్లో చార్జీషీటు దాఖలు చేశారు. హాజీపూర్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, హత్యకు గురైన బాలికకు సంబంధించిన పుస్తకాల బ్యాగ్ ద్వారా నిందితుడిని గుర్తించారు. సవాలుగా తీసుకున్న పోలీసులు హజీపూర్ బాలికల కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితుడిని వెం టనే పట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు. ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య చేసి వ్యవసాయ బావుల్లో పూడ్చిపెట్టిన మర్రి శ్రీనివాస్రెడ్డి అరెస్టు విషయంలో ప్రభుత్వం, పోలీసుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానిక ఎస్సై వెంకటేశ్ను సస్పెండ్ చేశారు. కేసు విచారణ అధికారిగా భువనగిరి ఏసీపీ భుజంగరావును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ నియమించారు. ఏప్రిల్ 29న శ్రీనివాస్రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి వరంగల్ జైలుకు తరలించారు. వివిధ శాఖల సహకారం రాచకొండ పోలీసులు.. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖలు, ఫింగర్ ప్రింట్స్, క్లూస్టీం, ఐటీ సెల్, వివిధ పాఠశాలల బాలికలు, సెల్ఫోన్ నెట్వర్క్ విభాగాలు, డీఎన్ఏ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీలు, ఇంకా వివిధ విభాగాల ఆధారాల ఆధారంగా చార్జిషీట్లు దాఖలు చేసి నేరాన్ని రుజువు చేశారు. రాచకొండ సిబ్బందికి డీజీపీ ప్రశంసలు సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హాజీపూర్ వరుస హత్యలు, అత్యాచార ఘటనల కేసులో బాధితులకు న్యాయం జరిగిందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. హంతకుడికి రెండు కేసుల్లో ఉరిశిక్ష, మరోకేసులో జీవిత ఖైదు పడిందన్నారు. ప్రాసిక్యూషన్తో పాటు కోర్టులో సాక్ష్యాలు సమర్పించడంలో సహకరించిన సాక్షులు, బాధిత కుటుంబీకులు, పౌర సమాజం, వేగంగా విచారణ పూర్తి చేసిన కోర్టుకు కృతజ్ఞతలు చెప్పారు. రికార్డు సమయంలో విచారణను పూర్తి చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించడంలో శ్రమించిన రాచకొం డ కమిషనర్ మహేశ్ భగవత్, యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి, భువనగిరి ఏసీబీ భుజంగరావుతోపాటు విచారణ బృందాన్ని అభినందించారు. కోర్టుకు సాక్ష్యాలను సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సీనియర్ పబ్లిక్ప్రాసిక్యూటర్ సి.చంద్రశేఖర్ను ఆయన మెచ్చుకున్నారు. త్వరితగతిన కేసును ఛేదించాం: భగవత్ నల్లగొండ క్రైం: హాజీపూర్ నేర సంఘటనలో కేసును త్వరితగతిన ఛేదించామని, బాధితులకు నష్ట పరిహారం అందేలా చూస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నేరస్తుడు శ్రీనివాస్రెడ్డి మైనర్లను తన బైక్పై తీసుకెళ్తానని నమ్మబలికి వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి గోనె సంచిలో మూటకట్టి బావిలో పడే శాడని తెలిపారు. జిల్లా కోర్టు చరిత్రలో 55 ఏళ్లలో డబుల్ కేసులో ఉరిశిక్ష పడటం ఈ కేసులోనే కావొ చ్చన్నారు. బాధిత కుటుంబాల కడుపుకోత, ఆవేదన ఎవరూ తీర్చలేనిదని.. చట్ట ప్రకారం నేరస్తుడి ని శిక్షించేందుకు అన్ని విధాలుగా తగిన సాంకేతిక సాక్ష్యాధారాలను సేకరించామని తెలిపారు. గ్రా మంలో నేటికీ పోలీసు పహారా ఉంచామన్నారు. -
ఊపిరిపీల్చుకున్న హాజీపూర్
బొమ్మలరామారం: హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష వేసిన నేపథ్యంలో ఇన్నాళ్లు ఉత్కంఠగా ఎదురుచూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కంటతడిపెడుతూ తమ పిల్లల ఉసురు తగిలిందని బాధితకుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు బాణసంచా కాల్చారు. పలువురు మహిళలు స్వీట్లు తినిపించుకుంటూ కనిపించారు. ఉదయం నుంచి ఎదురుచూపులు సైకో శ్రీనివాస్రెడ్డికి కోర్టు ఏ శిక్ష వేస్తుందో నని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ఉదయం నుంచి ఎదురుచూశారు. ఉదయం 6 గంటల నుంచే గ్రామపంచాయతీ ఆవరణకు చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు ప్లకార్డులతో బైఠాయించారు. మధ్యాహ్నం నేరం రుజువైందని జడ్జి చెప్పినట్లు తెలియడంతో కాసింత ఉపశమనం పొందారు. నిందితుడి శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష పడితేనే తమ పిల్లల ఆత్మలకు శాంతి కలుగుతుందని, లేకుంటే తమకు అప్పగిస్తే తగిన శాస్తి చేసి ఇంకెవరూ ఆడపిల్లల జోలికి వెళ్లకుండా శ్రీనివాస్రెడ్డికి శిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరిశిక్ష వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు. ‘మా చెల్లిని చెరిచి చంపిన సైకోకు సరైన శిక్ష పడింది. ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది’అని ఓ బాలిక సోదరి మీనా ఆనందభాష్పాలు రాల్చడం అక్కడున్న వారి మనస్సు చలింపజేసింది. రాత్రి గ్రామస్తులు ముగ్గురు బాలికల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఉరితీసిన రోజే సంతృప్తి కోర్టు తీర్పుతో మాకు ఊరట లభించింది. నిందితుడికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంపై సంతోషంగా ఉంది. శ్రీనివాస్రెడ్డిని ఉరితీసిన రోజే నిజమైన సంతృప్తి ఉంటుంది. నా కూతురును చిత్రవధ చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లే అతడిని కూడా చిత్రహింసలకు గురిచేసి చంపాలి. ఉన్న ఒక్క కూతురును పోగొట్టుకుని అనునిత్యం తన జ్ఞాపకాలతో బతుకుతున్నాం. శ్రీనివాస్రెడ్డికి పడిన శిక్షతోనైనా ఆడపిల్లల జోలికి వెళ్లేవారికి గుణపాఠంగా మారుతుంది. ఉరిశిక్ష పడటంతో మా పిల్లల ఆత్మలు శాంతించాయి. – పాముల నాగలక్ష్మి, బాలిక తల్లి -
చదువుకునేందుకు వెళ్లి బలయ్యారు..
సాక్షి, యాదాద్రి: ‘బేటీ బచావో బేటీ పడావో’నినాదంతో బాలికల రక్షణ, చదువు కోసం ప్రాధాన్యమిస్తున్న ఈ రోజుల్లో చదువు కోసం వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు ఓ కిరాతకుడి చేతిలో బలయ్యారు. సరైన రవాణా వసతి లేకున్నా.. తమ కుమార్తెలను చదువు కోసం పొరుగున ఉన్న గ్రామాలకు పంపించారు ఆ పేద కుటుంబాలు. కానీ లిఫ్ట్ ఇచ్చే పేరుతో ఓ రాక్షసుడు ఆ బాలికలపై ఘోరానికి ఒడిగట్టాడు. హాజీపూర్కి చెందిన ఇద్దరు, మైసిరెడ్డిపల్లికి చెందిన మరో బాలికపై హాజీపూర్కి చెందిన మర్రి శ్రీనివాస్రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన విషయంలో కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. రాజధానికి శివారునే ఉన్న బొమ్మలరామారం మండలం హాజీపూర్ మీదుగా భువనగిరి వరకు బస్సు సౌకర్యం లేకపోవడంతోనే ముగ్గురు బాలికలు బలైపోయారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. స్పెషల్ క్లాసులకు వెళ్లి.. హాజీపూర్కి చెందిన పాముల నర్సింహా, నాగమణి దంపతుల కుమార్తె(14) మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని సెరినిటీ మోడల్ స్కూల్ లో టెన్త్ చదువుతోంది. ఆమె గతేడాది ఏప్రిల్ నెల 25న పాఠశాలలో ప్రత్యేక తరగతులకు వెళ్లి సాయంత్రం 3 గంటలు దాటినా ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 2019 మార్చి 6 నుంచి కనిపించకుండా పోయిన హాజీపూర్కే చెందిన మరో బాలిక(18) మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని కేఎల్ఆర్ కాలేజీలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ ఇద్దరు బాలికలనూ శ్రీనివాస్రెడ్డి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి అత్యా చారం, హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష పడింది. సాక్షి కథనంతో తెరపైకి మరో కేసు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న బాలిక (11) 2015లో అదృశ్యమైంది. ఈ మిస్సింగ్ కేసులో పోలీసులు నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. 2019 ఏప్రిల్ 29న ‘సాక్షి’దినపత్రికలో ఆ బాలిక మిస్సింగ్పై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పోలీసులు కస్టడీలో ఉన్న శ్రీనివాస్రెడ్డిని విచారించగా, ఆ బాలికనూ తానే పొట్టన పెట్టుకున్నట్లు ఒప్పుకొన్నాడు. పానం నిమ్మలమైంది.. పేద కుటుంబానికి చెందిన నేను కూతురిని చదివించి ఉద్యోగం చేసే స్థాయికి తీసుకొద్దామంటే శ్రీనివాస్రెడ్డి తన కూతురు ఊపిరి తీసి నా ఆశలు ఆవిరి చేసిండు. శ్రీనివాస్రెడ్డికి బతికే హక్కు లేదు. కోర్టు తీర్పుతో పానం నిమ్మలమైంది. వాయిదాలు లేకుండా తొందరగా ఉరి తీసి మా పిల్లల పానాలు తీసిన బావిలోనే సైకోను పాతి పెట్టాలి. అప్పుడే పోకిరీలకు కనువిప్పు కలుగుతుంది. – తిప్రబోయిన మల్లేశ్, బాలిక తండ్రి -
హాజీపూర్ కేసుల్లో శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ కేసుల్లో మర్రి శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష పడింది. నల్లగొండ లోని పోక్సో న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. హాజీపూర్లో ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఎట్ట కేలకు పోలీ సులు నేర నిరూపణ చేశారు. ఇద్దరు బాలికల కేసుల్లో ఉరిశిక్ష, మరో బాలిక కేసులో యావ జ్జీవ కారాగార శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం జడ్జి సిద్ధ వేద విద్యానాథరెడ్డి గురువారం సాయంత్రం 6.24 గంటలకు తుదితీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎగువ కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం కల్పిం చారు. ఈ కేసులో ప్రభుత్వం ప్రత్యే కంగా స్పెషల్ ప్రాసి క్యూటర్గా చంద్రశేఖర్ను నియమించగా, ఆయన రాచ కొండ కమిషనరేట్ పోలీసుల తరఫున వాదించారు. శ్రీనివాస్ రెడ్డి తరఫున వాదిం చడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో న్యాయ సహాయం అందిం చేందుకు లీగల్ సెల్ అథారిటీ ఠాగూర్ను న్యాయవాదిగా నియమించారు. శ్రీనివాస్రెడ్డికి ఎగువ కోర్టులోనూ ఉచిత న్యాయ సహాయం అందించనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 27నే తుది తీర్పు వెలువడాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల తీర్పు వాయిదా పడింది. గురువారం తీర్పు వెలువడిన వెంటనే కోర్టు ప్రాంగణంలోనే ఉన్న బాలిక తండ్రి నర్సింహ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.. ‘మా కడుపు కోత తీరదు. ముద్దాయికి ఉరి శిక్ష పడటంతో న్యాయం జరిగింది. శిక్ష వేయించడంలో పోలీ సులు అన్న మాట నిలబెట్టుకున్నారు’అని వ్యాఖ్యానించారు. కాగా, శ్రీనివాస్రెడ్డిని గురు వారం రాత్రి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. -
ఆ ఆధారాలతోనే శ్రీనివాస్రెడ్డి దోషిగా తేలాడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో సైకో కిల్లర్ శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడారు. హాజీపూర్ వరుస హత్యల కేసులో శ్రీనివాస్రెడ్డి దోషిగా తేలాడని, ముగ్గురు బాలికలను అతను అత్యాచారం చేసి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించిందిన సీపీ భగవత్ చెప్పారు. అభంశుభం తెలియని బాలికలను శ్రీనివాస్రెడ్డి టార్గెట్గా చేసుకున్నాడని, స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న బాలికలకు తన బైక్ మీద లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తీసుకెళ్లేవాడని, తన వ్యవసాయ బావి వద్దకు వారిని తీసుకెళ్లి.. అత్యాచారం చేసి, హత్య చేసేవాడని వివరించారు. అతని వ్యవసాయ బావి వద్ద దొరికిన బాధిత బాలిక స్కూల్ బ్యాగ్ ఆధారంగా ఈ వరుస హత్యల కేసు మిస్టరీని ఛేదించామని, ఈ కేసు విచారణలో సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదిక కీలక పాత్ర పోషించాయని, ఈ ఆధారాలతోనే శ్రీనివాస్రెడ్డిని దోషిగా నిరూపించామని తెలిపారు. కర్నూలులో ఓ మహిళను హత్య చేసిన కేసులోనూ శ్రీనివాస్రెడ్డి దోషి అని సీపీ భగవత్ చెప్పారు. -
హాజీపూర్ హత్యల కేసులో సంచలన తీర్పు
-
హాజీపూర్ హత్యల కేసులో సంచలన తీర్పు
సాక్షి, నల్లగొండ: హాజీపూర్ హత్యల కేసులో పోక్సో స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. సీరియల్ కిల్లర్ శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హాజీపూర్ హత్యలకు సంబంధించిన మూడు కేసుల్లోనూ శ్రీనివాస్రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది. ముగ్గురు చిన్నారి బాలికలపై అత్యాచారం జరిపి.. శ్రీనివాస్రెడ్డి అత్యంత దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఈ మూడు హత్యలకు సంబంధించి పోక్సో స్పెషల్ కోర్టు వేర్వేరుగా తీర్పులు వెలువరించింది. శ్రావణి, కల్పన కేసులలో హంతకుడు శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష విధించిన కోర్టు.. మనీషా కేసులో జీవితఖైదు విధించింది. ఎఫ్ఐఆర్ నంబర్లు 110, 109 కేసుల్లో దోషికి ఉరిశిక్ష పడింది. ముగ్గురు బాలికలను కామాంధుడైన శ్రీనివాస్రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో గత నెల 17వ తేదీన వాదనలు ముగిశాయి. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. బాలికలపై అత్యాచారం, హత్యలకు సంబంధించి కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అదేవిధంగా కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ నివేదికలు కేసులో కీలకంగా నిలిచాయి. హాజీపూర్ కేసులో మొత్తం 90 రోజుల్లో దర్యాప్తు పూర్తయింది. గత ఏడాది జూలై 31న నల్లగొండలోని పోక్సో స్పెషల్ కోర్టులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. గత ఏడాది అక్టోబర్ 14 నుంచి ఈ కేసులలో కోర్టు విచారణ ప్రారంభించింది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి అత్యంత కిరాతకంగా హత్య చేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్రెడ్డి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. గత ఏడాది ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్రెడ్డి చేతిలో హత్యకు గురైన పాములు శ్రావణి కేసు మొదట వెలుగులోకి వచ్చింది. హాజీపూర్కు వెళ్లేదారిలోని తెట్టె బావిలో ఆమె శవాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్రెడ్డిని అదుపులో తీసుకొని విచారించగా.. మనీషా, కల్పనలను శ్రీనివాస్రెడ్డే దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్టు తేలింది. ఈ మూడు కేసులలో వేగంగా దర్యాప్తు చేపట్టిన యాదాద్రి పోలీసులు 90 రోజుల్లో కోర్టుకు చార్జ్షీట్ దాఖలు చేశారు. బాధిత కుటుంబసభ్యుల హర్షం శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష విధించడంపై బాధిత బాలికల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగిందని, శ్రీనివాస్రెడ్డిని వెంటనే ఉరితీయాలని, శిక్ష అమలులో ఏమాత్రం తాత్సారం చేయవద్దని కోరుతున్నారు. -
హాజీపూర్ సర్పంచ్ కిడ్నాప్కు యత్నం
యాలాల: మండల పరిధిలోని హాజీపూర్ సర్పంచ్ ఒంగోనిబాయి శ్రీనివాస్ను నలుగురు వ్యక్తులు అపహరించే యత్నం చేశారు. భయాందోళనకు గురైన ఆయన కేకలు వేయడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. ఆర్థిక వ్యవహారం నేపథ్యంలో ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్ఐ విఠల్రెడ్డి కథనం ప్రకారం.. హాజీపూర్ సర్పంచ్ శ్రీనివాస్ తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన తుప్పుడు సంతోష్ వద్ద గతేడాది రూ.2.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. రూ.1.50 లక్షలు తిరిగి ఇవ్వగా మిగతా డబ్బుల కోసం శ్రీనివాస్ను సంతోష్ వేధించసాగాడు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న టీకొట్టులో ఉన్న సర్పంచ్ శ్రీనివాస్ను తుప్పుడు సంతోష్తో పాటు సాయిలు, శ్రీనివాస్, సునీల్ కలిసి క్రూజర్ (కేఏ 32 ఎం 7563) వాహనంలో వచ్చి బలవంతంగా ఆయనను అందులోకి ఎక్కించుకొని లక్ష్మీనారాయణపూర్ వైపు వెళ్లిపోయారు. ఈ హఠాత్మరిణామంతో ఆందోళనకు గురైన శ్రీనివాస్ తనను రక్షించాలని కేకలు వేశాడు. దీంతో టీకొట్టు యజమాని రాజు వెంటనే యాలాల పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. ఎస్ఐ విఠల్రెడ్డి ఆదేశాలతో బ్లూకోల్ట్ సిబ్బంది క్రూజర్ వాహనాన్ని వెంబడించారు. లక్ష్మీనారాయణపూర్ వద్ద ఉన్న గనుల శాఖ చెక్పోస్టు సిబ్బందికి సమాచారం ఇచ్చి వారిని అప్రమత్తం చేశారు. లక్ష్మీనారాయణపూర్ వద్దకు క్రూజర్ రాగానే అడ్డుకొని వాహనంలోని వారందరిని పోలీసులకు అప్పగించారు. అనంతరం రూరల్ సీఐ జలంధర్రెడ్డి యాలాల ఠాణాలో జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతోనే తుప్పుడు సంతోష్ ఈ చర్యకు దిగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో మండలంలో కలకలం రేపింది. -
‘ఆ కేసులతో సంబంధం లేదు’
నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో జరిగిన బాలికల హత్యలకు సంబంధించిన కేసులో నింది తుడు శ్రీనివాస్రెడ్డి తరఫున వాదనలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టులో మూడు హత్యల్లో బుధవారం నిందితుడి తరఫున ఒక హత్యకు సంబంధించి వాదన పూర్తయింది. న్యాయమూర్తి ఎదుట నిందితుడి తరఫు న్యాయవాది ఠాగూర్ వాదనలు వినిపిస్తూ... శ్రీనివాస్రెడ్డికి, ఈ కేసులకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. ఫోన్నంబర్లు నిందితుడివే అయినా వాటిని ఉపయోగించింది శ్రీనివాస్రెడ్డే అని అనడానికి సరైన ఆధారాలు లేవని వెల్లడించారు. కేవలం హాజీపూర్ గ్రామానికి చెందిన కొంతమంది అనుమానం వ్యక్తం చేయడంతో శ్రీనివాస్రెడ్డిని అరెస్ట్ చేశారంటూ పేర్కొన్నారు. అనుమానం వ్యక్తం చేసిన వారికి, శ్రీనివాస్రెడ్డికి మధ్య భూ తగాదాలు ఉన్నాయని తెలిపారు. ఇది కావాలనే పెట్టిన కేసు తప్ప సరైన ఆధారాలు లేవంటూ కోర్టుకు నివేదించారు. మిగిలిన రెండు కేసులకు సంబంధించి వాదనను ఈనెల 17వ తేదీకి వాయిదా వేశారు. కాగా, పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ పిటిషన్ దాఖలు చేశారు. -
ఓ కిరాతకుడి వాంగ్మూలం
-
హాజీపూర్లో మళ్లీ ఆందోళన
సాక్షి, హైదరాబాద్/ఏఎస్ రావు నగర్: యాదాద్రి–భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో మరోసారి ఆందోళన నెలకొంది. వరుస హత్యాచారాల నేపథ్యంలో గ్రామానికి బస్సులను పెంచిన ఆర్టీసీ తాజాగా ఆదాయం రావడం లేదనే కారణంతో సర్వీసులను రద్దు చేసింది. దీంతో ఆ ఊరు నుంచి స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేకించి అమ్మాయిలకు ఇది మరింత ఇబ్బందిగా మారింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ముందు వరకు ఈ ప్రాంతానికి బస్సులు అందుబాటులో ఉండేవి. సమ్మె విరమణ అనంతరం ఆదాయం వచ్చే మార్గాలు, రాని మార్గాలు అంటూ రూట్లను హేతుబద్ధం చేసే నెపంతో గ్రేటర్ ఆర్టీసీ పెద్ద ఎత్తున బస్సుల రద్దుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే హాజీపూర్ గ్రామానికి సైతం బస్సులను రద్దు చేసింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడం వల్లనే స్కూళ్లకు నడిచే వెళ్లే అమ్మాయిలకు మర్రి శ్రీనివాస్రెడ్డి తన బైక్ పైన లిఫ్ట్ ఇవ్వడం, అనంతరం వారిపై హత్యాచారాలకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని హాజీపూర్ గ్రామ సర్పంచ్ కవితా వెంకటేష్గౌడ్ శుక్రవారం కుషా యిగూడ డిపో మేనేజర్ బి.పాల్ను కోరారు. -
హాజీపూర్ కేసు: ‘పోలీసులే అలా సృష్టించారు’
సాక్షి, నల్లగొండ :ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో హాజీపూర్ కేసు విచారణ శుక్రవారం చేపట్టారు. ఈ కేసులోని నిందితుడు మర్రి శ్రీనివాస రెడ్డిని పోలీసులు మరోసారి కోర్టులో హాజరు పరిచారు. డిసెంబర్ 26న మనీషా కేసులో నిందితుడి వాదన నమోదు చేయగా. ఈ రోజు ఉదయం శ్రావణి, మధ్యాహ్నం కల్పన కేసులో నిందితుడి వాదన న్యాయస్థానం వినగా.. శ్రావణి కేసులో 44 మంది, కల్పన కేసులో 30 మంది సాక్షుల వాదనను నిందితుడికి న్యాయమూర్తి వినిపించారు. అనంతరం అనంతరం న్యాయమూర్తి నిందితుడిని పలు ప్రశ్నలు అడగ్గా.. సెక్షన్ 313 కింద నిందితుడు తన వాదనను వినిపించాడు. తనకేం తెలియదని.. అంత అబద్ధమంటూ నిందితుడు పదే పదే చెప్పాడు. బైక్ పైన శ్రావణిని ఎక్కించుకుని వెళ్లినట్లు చెబుతున్నారని ప్రశ్నించగా తనకు అసలు బైక్ డ్రైవింగ్ రాదని చెప్పాడు. శ్రావణి దుస్తులపై తన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారని అడగ్గా.. పోలీసులే అలా సృష్టించారని నిందితుడు సమాధానమిచ్చాడు. అసలు కల్పన ఏవరో కూడా తెలియదని, పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని వాదించాడు. ఇంతక ముందు ఏ పని చేశావు.. ఎక్కడ పనిచేశావు.. యజమాని ఎవరు అని న్యాయమూర్తి అడగ్గా నిందితుడు వివరాలు చెప్పలేకపోయాడు. (హాజీపూర్ కేసు: ‘సువర్ణ ఎవరో తెలీదు’) అలాగే ఘటనా స్థలంలో దొరికిన బీరు బాటిళ్లపై తన వేలి ముద్రలు ఉన్నట్లు తేలిందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. పోలీసులే బలవంతంగా పట్టించారని పేర్కొన్నాడు. తనను కొట్టి ఒప్పించారని, తన అమ్మ, నాన్నలను తీసుకు రావాలనిన్యాయమూర్తిని కోరాడు. తల్లిదండ్రులు ఎక్కడున్నారని ప్రశ్నించగా తనకు తెలియదని నిందితుడు తెలిపాడు. మరి కోర్టుకు ఎలా తెలుస్తుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. చివరికి తదుపరి విచారణ 6వ తేదికి వాయిదా వేశారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలపై శ్రీనివాస్రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసిననట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా కల్పన కేసులో ఇంకా వాదన కొనసాగుతుంది. చదవండి : లేదు.. తెలియదు.. కాదు! -
కోర్టుకు నిందితుడు శ్రీనివాసరెడ్డి
సాక్షి, నల్లగొండ: హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు నల్లగొండ ఫాస్ట్ట్రాక్ కోర్టులో హాజరుపరిచారు. అదే విధంగా కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను సైతం సమర్పించారు. ఈ క్రమంలో చివరిగా నిందితుడు శ్రీనివాసరెడ్డి వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేయనుంది. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసును నల్లగొండ ఫాస్ట్ట్రాక్ కోర్టు విచారిస్తోంది. గత రెండు నెలల కాలంలో ఈ కేసులో దాదాపు 300 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ క్రమంలో గురువారం చివరిసారిగా నిందితుడి వాంగ్మూలం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు.. శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని బాధిత కుటుంబాలు డిమాండు చేస్తున్నాయి. -
తుదిదశకు ‘హాజీపూర్’ విచారణ
బొమ్మలరామారం: హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం విదితమే. ఈ కేసుపై కొన్ని రోజులుగా నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. కాగా, గురువారం నిందితుడిని విచారించారు. వందమందికి పైగా సాక్షులు, అధికారులను విచారించిన కోర్టు, మరో రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెలాఖరుకు తీర్పు వెలువడే అవకాశం ఉంది. -
తాతను చూసి సంతోషపడింది.. కానీ అంతలోనే
సాక్షి, మంచిర్యాల : హాజీపూర్ మండలంలోని గుడిపేట వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మేకల అశ్విత(5) అనే చిన్నారి మృతి చెందింది. దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన మేకల సరిత తన ఇద్దరు కుమార్తెలు అశ్మిత, అశ్విత(5)తో కలిసి రాఖీ పండగ సందర్భంగా గుడిపేట పేటలోని తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు వచ్చింది. రాఖీ కట్టిన అనంతరం మంచిర్యాలకు వెళ్లిన సరిత తన కుమార్తెలతో తిరిగి మంచిర్యాల నుంచి బస్సులో బయలు దేరి గుడిపేట బస్టాండ్ వద్ద దిగింది. బస్టాండ్లో దిగిన తన కుమార్తె సరిత, మనుమరాలు అశ్వితలను ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చిన సరిత తండ్రి కంకణాల మల్లయ్య వారి కోసం రోడ్డు అవతల వైపు ఉండి చూస్తూ ఉన్నాడు. తాతను గమనించిన అశ్విత ఒక్కసారిగా తాత వద్దకు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో నిర్మల్ నుంచి మంచిర్యాల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అశ్వితను వేగంగా ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలై తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఉదయం నుంచి సంతోషంగా.. గుడిపేటలో ఉంటున్న తన ఇద్దరు సోదరులకు రాఖీ కట్టేందుకు కుమార్తెలతో వచ్చిన సరిత ఉదయం రాఖీ కట్టి ఇంట్లో అందరితో సరదాగా గడిపింది. మంచిర్యాలకు వెళ్లి వస్తా అని వెళ్లిన తమ సోదరి సరిత తన కుమార్తెను పొగొట్టుకోవడంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు బస్సులో తల్లి ఒడిలో కూర్చున్న చిన్నారి అశ్విత(5) క్షణాల్లో రోడ్డు ప్రమాద బారిన పడి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. సంఘటనా స ్థలాన్ని మంచిర్యాల రూరల్ సీఐ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బాలిక తండ్రి మేక ల నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సుధాకర్ తెలిపారు. -
హాజీపూర్ బాధితుల దీక్ష భగ్నం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో జరిగిన బాలికల హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం తెల్లవారుజామున రాచకొండ పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బాధితుల బంధువులు, గ్రామస్తులు బాలికలను చంపి పూడ్చి పెట్టిన తెట్టెబావిలోకి దిగి మరోసారి నిరసనకు దిగారు. దీంతో కలెక్టర్ స్పందించి స్థానిక అధికారులు, నాయకులతో ఫోన్లో చర్చలు జరిపారు. బాధితులతో తాను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని కలెక్టరేట్కు రావాలని కోరారు. నిరసన చేస్తున్న వారు అందుకు అంగీకరించి బావిలోంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వద్దకు వచ్చి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వపరంగా న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళ్తే.. హత్యకు గురైన ముగ్గురు బాలికల కుటుంబాలు, బంధువులు, గ్రామస్తులు బొమ్మలరామారంలో గురువారం నుంచి ఆందోళన చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరడంతో వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇచ్చిన నివేదిక ఆధారంగా దీక్ష శిబిరంలో నిద్రిస్తున్న బాధితులను శనివారం తెల్లవారుజామున సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 22 మందిని మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం గుడిబావి చౌరస్తా వద్ద ఉన్న దీక్ష శిబిరాన్ని తొలగించి ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించారు. దీక్షలో కూర్చుని అనారోగ్యం బారిన పడిన పక్కీరు రాజేందర్రెడ్డి, పాముల ప్రవీణ్లను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. వారి ఆరోగ్యం కొంత వరకు మెరుగుపడ్డాక తిరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. శనివారం ఉదయం మొదటి విడతలో 15 మందిని వదిలివేశారు. మిగతా వారిని తర్వాత వదిలేశారు. కొనసాగుతున్న పోలీస్ పికెట్ ఆందోళనలతో అట్టుడుకుతున్న హాజీపూర్ గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. వరుస హత్యలు వెలుగు చూసిన నాటినుంచి గ్రామంలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. కాగా, శాంతియుతంగా కొనసాగుతున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారనే సమాచారంతో గ్రామంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుం ది. గ్రామంలోని మహిళలందరూ కలసి బొమ్మలరామారం మండల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో చేసేం దుకు సిద్ధమయ్యారు. అనంతరం దీక్షలో పాల్గొన్న వ్యక్తులను విడిచి పెట్టారని తెలిసి ధర్నా ప్రయత్నా న్ని విరమించారు. పోలీసులు వదలిపెట్టాక బాలికల ను హత్య చేసిన బావిలోకి దిగి నిరసన చేట్టారనే సమాచారంతో తెట్టెబావి వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. తెట్టె బావిలోకి దిగిన బాధితులు ప్రభుత్వం తాము శాంతియుతంగా చేపట్టిన దీక్షను భగ్నం చేసిందని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బాధిత కుటుంబాల సభ్యులు శ్రావణి, మనీషాలపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన తెట్టెబావిలోకి దిగి అరగంటకుపైగా నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించి బావి నుంచి బయటకు వచ్చారు. తర్వాత కలెక్టర్ను కలసి తమ డిమాండ్లను వివరించారు. బాధితుల డిమాండ్లను సావధానంగా విన్న కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డిలు చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నా కొడుకును ఉరి తీయాలి శ్రీనివాస్రెడ్డి తండ్రి బాల్రెడ్డి బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసులో తన కొడుకు మర్రి శ్రీనివాస్రెడ్డిని ఉరితీయాలని నిందితుడి తండ్రి బాల్రెడ్డి శనివారం మీడి యా ముందు కోరారు. శ్రీనివాస్రెడ్డి దురాగతాలు తమకు తెలియవన్నారు. గతంలో కర్నూల్లో ఓ కేసు విషయమై బెయిలుపై విడిపించామని తెలిపారు. శ్రావణి హత్యకు పాల్పడినప్పుడు మృతదేహాన్ని వెలికి తీస్తున్న సమయంలో తమతోపాటే తన కుమారుడు శ్రీనివాస్రెడ్డి బావి వద్దనే ఉన్నాడన్నారు. మృతదేహాన్ని వెలికి తీసే సమయంలో, మరుసటి రోజు అతని ముఖంలో ఎలాంటి భ యం, ఆందోళన కనిపించలేదన్నారు. ఏదైనా పనిచేయాలని చెబితే తనవైపు ఉరిమి చూసేవాడని బాల్రెడ్డి వెల్లడించారు. అనుమానంతో పోలీసులు ఇంటికి వస్తే ఈ హత్యలలో నీ హస్తం ఏమైనా ఉందా? అని అడిగితే.. ‘నీకేం భయం వద్దు. ఆ హత్యలతో నాకేం సంబంధం లేదు’అని బుకాయించాడన్నారు. ఆధారాలు లభించవు అన్నాడు శ్రావణి పోస్ట్మార్టంలో అన్ని విషయాలు బయటæపడతాయని తాను కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు శ్రీనివాస్రెడ్డి తనకేమీ పట్టనట్లుగా ఉన్నాడని అతని సోదరుడు మర్రి సుధాకర్రెడ్డి తెలిపారు. మృతదేహం కుళ్లిపోయిందని.. పోస్టుమార్టంలో కూడా ఆధారాలు లభించవని శ్రీనివాస్రెడ్డి బుకాయించాడని పేర్కొన్నారు. తన సోదరుడు ఇలాంటి క్రూరుడనే విషయం తెలిసి చాలా బాధపడుతున్నామని తెలిపారు. తాను కష్టపడి కట్టుకున్న ఇంటిని ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తన సోదరుడు చేసిన పనికి తమను ఎవరూ రానివ్వడం లేదని, హైదరాబాద్ బస్టాండ్లలో తల దాచుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్కు వినతిపత్రం అందిస్తున్న బాధిత కుటుంబాలు బాధితుల డిమాండ్లు ఇవీ.. - నిందితుడు శ్రీనివాస్రెడ్డిపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ఉరిశిక్ష పడేట్టు చేయాలి. దీనిని ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా పరిష్కరించాలి. - ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. - బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. - హజీపూర్–మాచన్పల్లి మధ్యన శామీర్పేట వాగుపై బ్రిడ్జిని నిర్మించాలి. హజీపూర్, మైసిరెడ్డిపల్లి, తిరుమలగిరి, నాగినేనిపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలి. - నిందితుడు శ్రీనివాస్రెడ్డికి సంబంధించిన భూమిని బాధిత కుటుంబాలకు పంచాలి. -
శ్రీనివాస్ చర్యలతో హాజీపూర్లో కలకలం
-
చెట్లపై చిన్నారుల పేర్లు.. హాజీపూర్లో కలకలం
సాక్షి, బొమ్మలరామారం: యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి అత్యంత కిరాతకంగా హత్య చేసిన శ్రీనివాస్రెడ్డి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రావణి, మనీషా, కల్పన అనే చిన్నారులను అత్యంత పాశవికంగా నిందితుడు శ్రీనివాస్రెడ్డి హతమార్చాడు. ఈ సీరియల్ మర్డర్స్పై ఒకవైపు పోలీసులు విచారణ జరుపుతుండగా.. మరోవైపు హాజీపూర్ గ్రామస్తులు ఆ కామాన్మాదిని ఉరితీయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తన పొలానికి తీసుకెళ్లి బాలికలపై అత్యాచారం జరిపి.. హతమార్చిన శ్రీనివాస్రెడ్డి.. తన పొలంలోని పాడుబడ్డ బావిలో బాలికల మృతదేహాలను విసిరేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హాజీపూర్లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మేడిచెట్టుపై మనీషా అనే పేరును రాసి ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. మేడిచెట్టుపై మృతురాలైన బాలిక పేరు ఉండటం హాజీపూర్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇక్కడ రావి, మేడి, వేపచెట్లు పక్కపక్కనే ఉండడంతో.. వాటికి శ్రీనివాస్రెడ్డి గతంలో పూజలు చేస్తూ ఉండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల వరుస హత్యలు వెలుగుచూసిన నేపథ్యంలో ఇక్కడ మేడిచెట్టుపై మనీషా అనే పేరు చెక్కి ఉన్న విషయాన్ని తాజాగా గుర్తించారు. నిందితుడు శ్రీనివాస్రెడ్డే.. మేడిచెట్టుపై ఇలా చెక్కి ఉండాటని, బాలికలను హతమార్చిన తర్వాత వారి పేర్లను అతను చెట్ల మీద చెక్కుతున్నట్టు కనిపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీనివాస్ చర్యలతో హాజీపూర్లో కలకలం -
హాజీపూర్ గ్రామస్తుల దీక్ష భగ్నం..!
యాదాద్రి భువనగిరి : ముగ్గురు బాలికలను పొట్టనబెట్టుకున్న సీరియల్ కిల్లర్ శ్రీనివాస్రెడ్డిని ఉరితీయాలంటూ హాజీపూర్ గ్రామస్తులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో దీక్ష చేస్తున్న30మందిని అరెస్టు చేసి హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. శుక్రవారం (రెండోరోజు) ఆమరణదీక్ష కొనసాగించిన గ్రామస్తులు.. నిందితుడికి పడిన శిక్షలతో సమాజంలో నేరస్తులకు వెన్నులో వణుకు పుట్టాలని భీష్మించుకొని కూర్చున్నారు. బాలికలు శ్రావణి, మనీషా, కల్పన ఆత్మలు శాంతించాలంటే నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని, బాధిత కుంటుంబాకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలనే నినాదాలతో మండల కేంద్రంలోని గుడిబావి చౌరస్తా మారుమ్రోగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యగా అరెస్టు చేసినుట్ట వెల్లడించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి : మానవ మృగాన్ని ఉరి తీయాలి..) -
మానవ మృగాన్ని ఉరి తీయాలి..
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రం హాజీపూర్ గ్రామస్తుల ఆందోళనలతో భగ్గుమంది. ముగ్గురు బాలికలను అతి కిరాతకంగా బలిగొన్న నిందితుడు మర్రి శ్రీనివాస్రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని ప్రభుత్వాన్ని బాధితులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బొమ్మలరామారం మండల కేంద్రంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించి గుడిబావి చౌరస్తా వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం న్యాయం చేయాలని, బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా అందజేసి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ న్యాయ పోరాటానికి మండల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బాధితులను ఆదుకుంటామని హామీలిచ్చిన అధికారులు జాడ లేకుండా పోయారని విమర్శించారు. పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకారుల వద్దకు వచ్చి ఎమ్మెల్యే సునీత దగ్గరికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పినా బాధితులు ససేమిరా అన్నారు. ఇంతవరకు పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడు ఏం మాట్లాడతారంటూ నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. హామీ వచ్చేవరకు దీక్ష విరమించం బాధితులకు ప్రభు త్వం స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష విరమిం చేదిలేదు. ముగ్గురు బాలి కలు దారుణ హత్యలకు గురైనా ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి రాలేదు. శ్రావణి మృత దేహంతో ధర్నా నిర్వహిస్తే కూతవేటు దూరం లో ఉన్న ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. బాధితులకు భరోసా ఇవ్వలేదు. – పక్కీరు రాజేందర్రెడ్డి, హాజీపూర్ వెనకడుగు వేయం కడుపుకోతకు గురైన కుటుంబాలకు న్యా యం జరిగే వరకు వెనకడుగు వేయం. ఆ కిరాతకుడిని ప్రభుత్వం ఉరి తీయలేని పరిస్థితి ఉంటే ప్రజలకు అప్పగించాలి. బడుగు, బలహీన వర్గాల పిల్లలంటే లెక్క లేదా. సైకో కిల్లర్ అంటున్న అధికారులు నిందితుడిని చంపడానికి ఎందుకు ఆలోచిస్తుండ్రు. – తుంగని భాగ్యమ్మ, కల్పన తల్లి కుటుంబాన్నీ ఉరి తీయాలి అభంశుభం తెలి యని ఆడపిల్లలపై అ ఘాయిత్యాలకు పాల్పడిన శ్రీనివాస్రెడ్డితోపాటు అతని కుటుంబ సభ్యులనూ ఉరి తీయాలి. కుటుంబసభ్యుల సహకారంతోనే శ్రీనివాస్రెడ్డి హత్యలకు పాల్పడ్డాడు. నిదితుడిని బహిరంగంగా ఉరితీస్తేనే ఇలాంటి నేరాలు చేసే వారి వెన్నులో వణుకు పుడుతుంది. – తిప్రబోయిన నవనీత, మనీషా సోదరి -
టీఆర్ఎస్ నాయకుల్ని నిలదీసిన గ్రామస్తులు..!
యాదాద్రి భువనగిరి: బొమ్మల రామారం మండలం హాజీపూర్లో బాలికల వరస హత్యలతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఫాస్ట్ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి నిందితుడు శ్రీనివాస్రెడ్డిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ.. హాజీపూర్ గ్రామస్తులు బొమ్మలరామారం చౌరస్తాలో గురువారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారికి సంఘీభావం తెలపడానికి టీఆర్ఎస్ నేతలు రావడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. గత మూడు వారాలుగా గుర్తుకు రాని హాజీపూర్.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా.. అని గ్రామస్తులు, బాధితులు వారిని నిలదీశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వం ఏ ప్రకటనా చేయలేకపోయిందని టీఆర్ఎస్ నాయకులు సర్దిచెప్పే యత్నం చేయగా.. ఇప్పుడు కూడా కోడ్ అమలులోనే ఉందికదా అని గ్రామస్తులు ప్రశ్నించారు. ‘మీ సంఘీభావ యాత్రలతో పనిలేదు. స్థానిక ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్తో సమావేశం ఏర్పాటు చేయాలి’ అని వారు డిమాండ్ చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఇన్నాళ్లు గుర్తుకు రాని హాజీపూర్.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా -
ఇన్నాళ్లు గుర్తుకు రాని హాజీపూర్.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా
-
సైలంట్ కిల్లర్
-
హాజీపూర్కు నిందితుడు శ్రీనివాస్రెడ్డి
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామ పరిసరాలకు వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్రెడ్డిని గురువారం పోలీసులు తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు మరోమారు హాజీపూర్లో పికెట్ ఏర్పాటు చేశారు. బాలికల హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్ను కోర్టు అనుమతితో వరంగల్ జైలు నుంచి స్థానిక పోలీసులు 6 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో నిందితుడిని గ్రామంలోని ఘటనా స్థలాల వద్దకు గురువారం తీసు కొచ్చి విచారణ జరిపినట్లు సమాచారం. అయితే గ్రామ పరిసరాలకు శ్రీనివాస్ను తీసుకొచ్చిన అంశాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఈ నేపథ్యంలోనే హాజీపూర్ లో రెండ్రోజుల క్రితం ఎత్తివేసిన పోలీస్ పికెట్ను గురువారం పునరుద్ధరించారు. బాలికల హత్య కేసు విచారణ అధికారిగా ఉన్న భువనగిరి ఏసీపీ భుజంగరావు స్ధానిక పోలీస్ స్టేషన్తోపాటు హాజీపూర్ను గురువారం సందర్శించారు. -
వరంగల్ సెంట్రల్ జైల్లో సీరియల్ కిల్లర్ శ్రీనివాస్రెడ్డి
-
ఛార్జ్షీట్
-
హాజీపూర్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: శ్రీనివాసరెడ్డి చేసిన దురాగతాలతో హాజీపూర్ వణికిపోతోంది. ఎప్పుడు, ఏం బయటపడుతుందోనన్న ఆందోళన గ్రామస్థులను వెంటాడుతోంది. తమ మధ్యే అమాయకంగా తిరిగిన శ్రీనివాసరెడ్డి... ఓ నరరూప రాక్షసుడనుకోలేదన్నది జనం మాట. ఇప్పటివరకు స్వేచ్ఛగా వ్యవహరించిన పిల్లలు, పెద్దలు ఇప్పుడు చీకటి పడిందంటే ఆందోళన చెందుతున్నారు. రోడ్డు నుంచి బావి మీదుగా ఊరికి వచ్చేప్పుడు జనాన్ని భయం వెంటాడుతోంది. ఆరు రోజుల నుంచి ఇప్పటివరకు హాజీపూర్ ఎలా ఉంది? ఈ పరిస్థితులను తెలుసుకునేందుకు సాక్షి టీవీ గ్రామంలో పర్యటించింది. అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకుంది. హాజీపూర్ నుంచి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్వప్న అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. హాజీపూర్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ను ఇక్కడ చూడండి.. -
హత్య ఎందుకు చేశారంటే..
-
సీరియల్ కిల్లర్ శ్రీనివాస్రెడ్డి బైక్ వీడియో వైరల్
శ్రీనివాస్రెడ్డి ఎప్పుడూ ఎవరితోనూ కలవడు. ఎవరికీ ఎక్కువగా కనిపించడు. కానీ, ఏదైనా అఘాయిత్యం చేసినప్పుడు మాత్రం అందరి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తాడు. తద్వారా తనపై అనుమానం రాకుండా చూసుకుంటాడని తెలుస్తోంది. అదే క్రమంలో ఈ నెల 26వ తేదీన హఠాత్తుగా ఊర్లో ప్రత్యక్షమయ్యాడు. ఊరి మధ్యలో ఉన్న చిన్న ఖాళీ ప్రదేశంలో పిల్లలు క్రికెట్ ఆడుతుంటే తాను కూడా ఆడాడు. మర్నాడు తన పాఠశాల మిత్రుడి పెళ్లికి భువనగిరి వెళ్లాడు. మిత్రులతో కలిసి విందులో పాల్గొని చిందులేశాడు. శ్రీనివాసరెడ్డిలో ఉత్సాహం చూసి తాము ఆశ్చర్యపోయామని.. ముభావంగా ఉండే అతను ఇంతలా ఆనందించడం తాము ఎప్పుడూ చూడలేదని చిన్ననాటి మిత్రులు తెలిపారు. అయితే, తాను చేసిన ఘోరం బయటపడకుండా, అనుమానం రాకుండా ఉండేందుకే తన స్వభావానికి విరుద్ధంగా శ్రీనివాస్రెడ్డి ప్రవర్తించాడని ఇప్పుడు అర్థమవుతోందన్నారు. 25న పాఠశాలకు వెళ్లివస్తున్న బాలికకు లిఫ్ట్ ఇచ్చి బావివద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. దీని వెనుక తానే ఉన్నట్లు ఎవరికీ అనుమానం రాకూడదనే... ఊర్లోకి వచ్చి క్రికెట్ ఆడినట్లు, తర్వాత రోజు మిత్రులతో కలిసి పెళ్లిలో చిందులు వేసినట్లు విశ్లేషిస్తున్నారు. తాజాగా అతను ఒక బైక్ మీద వెనుక కూర్చొని.. హల్చల్ చేస్తూ ప్రయాణిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్రెడ్డి మొహంలో ఎప్పుడూ ఎలాంటి భావం కనిపించదని... అతడితోపాటు పదో తరగతి వరకూ చదివినవాళ్లు చెబుతున్నారు. వాళ్ల క్లాస్లో 150 మంది ఉండేవారని, వారిలో ఏ ఒక్కరితోనూ శ్రీనివాస్రెడ్డి కలిసిపోయేవాడు కాదన్నారు. చదువుల్లో వెనుకబడి ఉండేవాడని, ఒక్కోసారి ఉపాధ్యాయులు కర్రతో కొడుతుంటే ఎన్ని దెబ్బలైనా తినేవాడు కానీ అతడి మొహంలో బాధ, భయం వంటి భావాలేవీ కనిపించేవి కాదంటున్నారు. ఊర్లోనూ ఎవరితో కలిసేవాడు కాదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇంతటి తీవ్రనేర స్వభావం ఉన్న వ్యక్తి ఇన్నేళ్ల నుంచీ ఎందుకు ఖాళీగా ఉంటాడనేది ప్రశ్న. ఈ మధ్యకాలంలోనూ ఇలాంటి అఘాయిత్యాలు చేసి ఉండొచ్చని, అవేవీ బయటకు వచ్చి ఉండవని పోలీసులు అనుమానిస్తున్నారు. లిఫ్టు మెకానిక్గా పనిచేసే శ్రీనివాస్రెడ్డి అనేక ప్రాంతాలు తిరుగుతుంటాడు. దీనిలో భాగంగానే కర్నూలు వెళ్లి అక్కడ ఒక యువతిని హత్యచేసి పీపాలో కుక్కాడు. ఫేస్బుక్ ఖాతాలో 631 మంది స్నేహితులు ఉంటే వారిలో పురుషులు 50 మంది కూడా లేరు. మిగతా యువతులంతా వేరువేరు ప్రాంతాలకు చెందిన వారు. ఆ పరిచయంకొద్ది ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారిలో ఎవరినైనా ఏమైనా చేసి ఉంటాడా? అనేది అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో వేములవాడ, నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో అదృశ్యమైన యువతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దాంతోపాటు హాజీపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విచారిస్తున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండులో ఉన్న శ్రీనివాస్రెడ్డి ద్వారా ఈ అనుమానాలన్నీ నివృత్తి చేసుకునేందుకు మరోమారు తమ అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. గతంలో ఒక మహిళను వేధించడంతో ఊరివారంతా కలిసి శ్రీనివాస్రెడ్డిని చెట్టుకు కట్టేసి కొట్టారు. అది శ్రీనివాస్రెడ్డి మనసులో బలంగా నాటుకుపోయిందని అతన్ని విచారించిన అధికారులు చెబుతున్నారు. ఎవర్నైనా బలవంతం చేసినప్పుడు వారు ఒప్పుకోకపోతే ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేసేవాడు కాదని...ఒకవేళ వారు బయటకెళ్లి చెబితే మళ్లీ కొడతారనే భయంతో అక్కడే హతమార్చేవాడని తెలిపారు. ఇదే అతడి మనస్తత్వమని శ్రీనివాస్రెడ్డిని విచారించిన ఓ అధికారి తెలిపారు. యాదాద్రి భువనగిరిజిల్లా హాజిపూర్లోని సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని పోలీసులు కస్టడీకి కోరనున్నారు. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పథకం ప్రకారమే సిరియల్ హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్రెడ్డి సెల్ఫోన్ డేటా, ఫేస్బుక్ ఐడీని పోలీసులు పరిశీలిస్తున్నారు.నిందితుడు శ్రీనివాసరెడ్డి తరచూ కరీంనగర్ ప్రాంతాలకు వెళ్తున్నట్లు గుర్తించారు. బొమ్మలరామారం బాలికల అదృశ్యం, హత్య ఘటనలపై తీవ్రంగా స్పందించిన రాచకొండ సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
బాలికలకు భద్రత ఎక్కడ?
ఇక్కడ మీరుచూస్తోంది తెలంగాణలోని హజీపూర్లో బాలికల మృతదేహాల కోసం బావిలో పోలీసులు గాలిస్తున్న దృశ్యాలు. చదువుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగి వస్తున్న అమాయక విద్యార్థినిలను ఓ మృగాడు లిఫ్టు ఇస్తానంటూ నమ్మబలికి అత్యాచారం చేసి, హతమార్చి ఇలా బావిలో పాతిపెట్టాడు. ఇలా ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థినుల తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. విద్యార్థినిలు నివాసముండే ప్రాంతాల నుంచి స్కూళ్లకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్లనే ఇంతటి దారుణానికి కారణంగా అధికారుల పరిశీలనలో వెల్లడైంది. అనంత జిల్లా వ్యాప్తంగానూ ఆర్టీసీ బస్సులు తిరగని గ్రామాలు వెయ్యికిపైగానే ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ఆటోలు, ద్విచక్రవాహనాల్లో విద్యార్థినులు స్కూళ్లకు వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలోనూ ఇలాంటి దారుణాలు చోటు చేసుకోకముందే ప్రభుత్వం మేల్కొని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. – అనంతపురం న్యూసిటీ నడకే దిక్కు మీరు చూస్తున్న ఈ చిత్రంలోని విద్యార్థినిలు తనకల్లు మండలం టి.వంకపల్లి గ్రామానికి చెందిన వారు. ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో రోజూ ఐదే కిలోమీటర్లు కాలి నడకన తనకల్లులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుంటూ ఉంటారు. గ్రామంలో చాలా మంది బాలికలను అంత దూరం కాలినడకన పంపలేక తల్లిదండ్రులు మధ్యలోనే వారి చదువులు మాన్పించేశారు. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉంది. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో అభద్రతా భావానికి గురై ఉన్నత చదువులకు బాలికలు దూరమయ్యారు. – తనకల్లు మాకు వేరే మార్గం లేదు మా ఊరు తనకల్లుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. స్కూల్కి వచ్చేందుకు మాకు ఆర్టీసీ బస్సులు లేవు. ఆటోల సౌకర్యం కూడా అంతంత మాత్రమే. దీంతో కాలినడకన స్కూల్కు వెళ్లాల్సి వస్తోంది. మాకు వేరే మార్గమూ లేదు. నడుచుకొంటూ అంత దూరం వెళ్లేటప్పుడు చాలా భయంగా ఉంటుంది.– ఉషా, 9వ తరగతి, టి.వంకపల్లి, తనకల్లు మం‘‘ ఆటోలే శరణ్యం ఈ ఆటోలో వేలాడుతూ వెలుతున్న విద్యార్థినిలు గుమ్మఘట్ట మండలం భూపసముద్రం గ్రామానికి చెందిన వారు. ఈ గ్రామం నుంచి ఎక్కువగా 74 ఉడేగోళం, రాయదుర్గంలోని ఉన్నత పాఠశాలలకు వెళుతుంటారు. వీరికి పాఠశాల సమాయనికి బస్సులు లేక ఇలా ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోంది. – గుమ్మఘట్ట -
హాజీపూర్ గ్రౌండ్ రిపోర్ట్
-
శ్రీనివాసరెడ్డికి కర్నూలులోనూ నేరచరిత్ర..
కర్నూలు: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామాపురం మండలం హాజీపూర్ గ్రామంలో వరుస హత్యలకు పాల్పడిన మర్రి శ్రీనివాసరెడ్డికి కర్నూలులో కూడా నేరచరిత్ర ఉంది. నల్గొండ జిల్లాకు చెందిన ఇతను మూడేళ్ల క్రితం కర్నూలుకు వచ్చాడు. కొంత కాలం టీచర్స్ కాలనీలోని బల్వరీ అపార్టుమెంటులో నివాసముండేవాడు. ఈ సమయంలో లిఫ్ట్ మెకానిక్గా పనిచేసేవాడు. కర్నూలు భగత్సింగ్ నగర్లో నివాసముంటున్న కాశెపోగు మార్క్ అలియాస్ రాజు, గౌండా పని చేసే కాశెపోగు కళ్యాణ్, అపార్టు యజమాని కుమారుడు బల్వరీ అబ్దుల్ హఫీజ్ (గడ్డవీధి), ఎలై శ్యాం, మెకానిక్ అసిస్టెంట్ మండ్ల సురేష్ (భగత్సింగ్ కాలనీ) తదితరులతో కలిసి ఓ మహిళను హత్య చేసిన కేసులో కర్నూలులో జైలు జీవితం కూడా గడిపారు. హత్య ఎందుకు చేశారంటే..: 2016 డిసెంబర్ 27న కర్నూలు కొత్త బస్టాండు వద్ద విటుల కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళను శ్రీనివాసరెడ్డి మాట్లాడుకొని బల్వరీ అపార్టుమెంటు పెంట్ హౌస్కు తీసుకెళ్లాడు. మరో నలుగురితో కలిసి శారీరకంగా అనుభవించారు. డబ్బు విషయంలో శ్రీనివాసరెడ్డితో మహిళ గొడవ పడింది. దీంతో సమీపంలో ఉన్న ఐరన్రాడ్తో ఆమె తలపై బాదగా.. అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పెంట్ హౌస్పై ఉన్న వాడుకలో లేని నీటి ట్యాంకులో పడేసి మూతపెట్టి పరారయ్యారు. 2017 ఏప్రిల్ 12న అపార్టుమెంటు వాచ్మన్ బావమరిది అయిన చాకలి రాజు ట్యాంకును శుభ్రం చేసేందుకు మూత తెరిచి చూడగా అందులో మృతదేహం బయటపడింది. ఈ కేసులో మర్రి శ్రీనివాసరెడ్డితో పాటు మిగిలిన వారు కూడా జైలుజీవితం గడిపారు. తాజాగా హాజీపూర్లో వరుస హత్యల నేపథ్యంలో శ్రీనివాసరెడ్డిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కర్నూలులో మహిళ హత్య సంఘటనలో కూడా పాల్గొన్నట్లు అంగీకరించడంతో అందుకు సంబంధించి కేసు వివరాలను కనుగొనేందుకు తెలంగాణ నుంచి ఒక సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సోమవారం రాత్రి కర్నూలుకు వచ్చారు. రెండవ పట్టణ పోలీసుస్టేషన్లో కేసుకు సంబంధించిన రికార్డులు, సీడీ ఫైళ్లు తీసుకెళ్లారు. -
సీరియల్ కిల్లర్
-
మొన్న శ్రావణి..నిన్న మనీషా..నేడు కల్పన
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
మంచిర్యాల: మంచిర్యాలలోని హాజీపూర్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లారీని ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విశాఖ, మరొకరు హైదరాబాద్కు చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యాదాద్రిని ప్రముఖ పుణ్య క్షేత్రం చేయడానికి సీఎం కృషి
(హాజీపూర్)æబొమ్మలరామారం: యాదాద్రిని ప్రముఖ పుణ్య క్షేత్రం చేయడానికి సీఎం కేసీఆర్ అవిశ్రాంత కృషి చేస్తున్నారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మండలంలోని హాజీపూర్లో సోమవారం జరిగిన టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరిగంటి సతీష్గౌడ్ రిసెప్షన్కు హాజరై వధూవరులను ఆశ్వీరదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుపతిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు గూదే బాల్ నర్సింహ, శాగంటి శ్రీనివాస్, కుషంగల సత్యనారయణ, వెంకటేష్, పాండు పాల్గొన్నారు. -
యువతిపై బీజేపీ ఎమ్మెల్సీ లైంగిక వేధింపులు!
హజిపూర్ (బిహార్): రైల్లో ప్రయాణిస్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో బీజేపీ ఎమ్మెల్సీ టున్నా పాండే అరెస్టయ్యారు. సివాన్కు చెందిన ఆయనను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోరఖ్పూర్ వెళుతున్న రైల్లోని ఏసీ కోచ్లో ఎమ్మెల్సీ టున్నా పాండే తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని, తనను లైంగికంగా వేధించాడని బాధిత యువతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రైల్వే పోలీసులు హజిపూర్లో ఎమ్మెల్సీని అరెస్టు చేశారు. -
దశలవారీగా హాజీపూర్ అభివృద్ధి
- ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి యాలాల : మండల పరిధిలోని హాజీపూర్ గ్రామాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం హాజీపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎంపీ నిధులతో హాజీపూర్లో సీసీ రోడ్లు, తాగునీటి ప్లాంటు, సైడ్ డ్రైనేజీలతో పాటు ప్రభుత్వ పాఠశాల భవనం, అంగన్వాడీ భవనంతో పాటు బీటీ రోడ్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో రైతులు ఎక్కువగా సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉందన్నారు. గ్రామ గేటు నుంచి గల మెటల్ రోడ్డును రూ.40 లక్షలతో బీటీ రోడ్డుగా మార్చడానికి నిధులు మంజూరయ్యాయని, పనుల నవంబర్లో ప్రారంభమవుతాయన్నారు. అనంతరం మండల పరిధిలోని గోరేపల్లి, దేవనూరు, రాఘవపూర్ గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శంకిరి లక్ష్మి, డీపీఓ పద్మజారాణి, మండల మార్పు అధికారి గోపీనాథ్, టీఆర్ఎస్ నాయకుడు రౌతు కనకయ్య, మండల సర్పంచ్లు రవికుమార్, వెంకటయ్య, శివకుమార్, సాయిలు, బిచ్చన్నగౌడ్, గోపాల్, భోజిరెడ్డి, రవి తదితరులు ఉన్నారు. పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు గ్రామ పంచాయతీ కార్యదర్శి మోన్యానాయక్పై స్థానికులు ఎంపీకి ఫిర్యాదు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, కార్యదర్శి తమ గ్రామానికి వద్దని మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. ఎంపీ హాజీపూర్ వస్తున్నారనే అధికారిక సమాచారం ఉన్నప్పటి కీ మండల స్థాయి అధికారులెవరూ హాజరుకాలేదు. దీంతో ఆయన ఇన్చార్జ్ ఎంపీడీఓ భాగ్యవర్ధన్కు ఫోన్ చేసి సమావేశానికి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ఆరోగ్యం బాగాలేదనే సమాధానం ఇవ్వడంతో ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రజా ‘దాసు’డు
రామ్సుందర్ దాస్, ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికలలో పోటీ చేస్తున్న అత్యంత వయో వృద్ధుడు. ఈయన వయసు కేవలం 93 సంవత్సరాలు మాత్రమే. ఈయన జనతాదళ్ పార్టీ సభ్యుడు. ఉత్తర బీహార్లోని హాజీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు మెరూన్ రంగులో ఉన్న ఒక కారు దాస్ ఇంటి ముందు ఆగుతుంది. ఆ కారులో ఒక క్షురకుడిని తీసుకు వస్తారు. అతగాడు దాసుగారికి క్షురకర్మ చేస్తాడు. ఎందుకంటే వయోభారం వల్ల ఆయన తనకు తాను చేసుకోలేకపోతున్నారు. దాస్కి నడవడం కష్టంగా ఉంది. ఒక్కోసారి మాట్లాడటం కూడా ఇబ్బందికరంగా మారుతోంది. 1921, జనవరి 9 న జన్మించిన దాస్, దేశంలో లోక్సభకు పోటీ చేసేవారిలో అత్యంత వయో వృద్ధుడు. కిందటి పార్లమెంటు ఎన్నికలలో రిషాంగ్ కేషింగ్ (94)అత్యంత వృద్ధ పార్లమెంటు సభ్యుడిగా గుర్తింపు పొందారు. ఈ సారి జరుగుతున్న ఎన్నికలలో దాస్ నామినేషన్ వేసిన తరువాత, ఏప్రిల్ 16వ తేదీన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. వెళ్లడమంటే ఆయనంతట ఆయన వెళ్లలేదు, ఇద్దరు పరిచారకులు ఆయనను మోసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టారు. హిజాపూర్లో ఎన్నికలు మే 7 వ తేదీన జరగనున్నాయి. అయితే దాస్ మాత్రం కేవలం నాలుగైదు సార్లు మాత్రమే ఎన్నికల ప్రచారం చేయగలిగారు. ఇంత వృద్ధాప్యంలో ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తున్నారని ఆయనను ప్రశ్నిస్తే, ‘‘నేను నడవలేనని ఎవరన్నారు? నా ఆఖరి శ్వాస వరకూ నేను రాజకీయాలలో ఉంటాను, నా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను’’ అంటారు దాస్. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందరే దాస్ 1945లో రాజకీయాలలోకి ప్రవేశించారు. అతి కొద్దికాలం... ఏప్రిల్ 1979 నుంచి 1980 ఫిబ్రవరి వరకు బీహార్ ముఖ్యమంత్రిగా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రెండు సార్లు విజయం సాధించారు. పార్లమెంట్ సభ్యుడిగా రెండుసార్లు గెలిచారు. నిజాయితీ గల రాజకీయనాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తన రెండంతస్తుల ఇంట్లోఅతి సామాన్యంగా నివసిస్తున్నారు. మూడు మిలియన్ల నగదు, ఒక పాత అంబాసిడర్ కారు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు దాస్. అనారోగ్యంగా ఉంటే ఏ విధంగా ప్రజలకు సేవ చేయగలరు? అని ప్రశ్నిస్తే, ‘‘నేను అనారోగ్యంతో బాధపడుతున్నారని ఎవరన్నారు? నియోజక వర్గ అభివృద్ధి కోసం, పార్లమెంట్ సభ్యులకిచ్చే ఫండ్ని సక్రమంగా ఖర్చుచేసిన వారిలో నేనే అత్యుత్తమంగా నిలిచాను’’ అంటారు దాస్. ఎటువంటి అభివృద్ధి పనులు చేశారని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి ఆయన మౌనం వహిస్తారు. దాస్కి గతంలో రెండుసార్లు గుండెకు శస్త్రచికిత్సలు జరిగాయి. రాజగిరిలో జరిగిన పార్టీ సమావేశానికి హాజరయినప్పుడు ఆయన కుప్పకూలారు. బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఆంబులెన్స్ పిలిపించి, అందులో దాస్ను పాట్నా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ పంపారు. ఆయన మాటలలో కూడా మధ్యమధ్యలో తడబాటు, మతిమరపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘‘ఇదీ నా పరిస్థితి, కొన్ని విషయాలు మర్చిపోతున్నాను. ఇంతకు ముందు నేను యోగా చేసేవాడిని. ధ్యానం కూడా చేసేవాడిని. ప్రస్తుతం అవేమీ చేయట్లేదు’’ అంటారు దాస్. శరీరంలో సత్తువ లేకపోవడంతో ప్రచారానికి దూరంగా ఉన్నారు దాస్. ఆయనను రాజకీయాల నుంచి ఎప్పుడు రిటైర్ అవుతారని ప్రశ్నిస్తే... ‘‘నేను కిందటి ఎన్నికల (2009) లో పోటీ చేయకూడదనుకున్నాను. కాని అప్పటి ముఖ్యమంత్రి అందుకు అంగీకరించలేదు. ఈ సారి కూడా అంతే. పోటీకి దూరంగా ఉందామనుకున్నాను. కాని నితీశ్, నా ప్రజలు నన్ను పోటీ చేయమని ఒత్తిడి చేశారు’’ అంటారు దాస్. ‘‘అయితే ఇది నా ఆఖరి ఎన్నికల సంగ్రామం. అది మాత్రం వాస్తవం’’ అంటారు. ఇంతకుముందు దాస్కి ఓటు వేసిన ఓటర్లు, ‘ఇదే ఆయన చివరి పోటీ’ అంటున్నారు. ‘‘రామ్విలాస్పాశ్వాన్ (లోక్జనశక్తి పార్టీ) ని ఓడించడానికి, కిందటిసారి మేం దాస్కు ఓట్లు వేశాం’’ అంటున్న సదరు ఓటర్లు, ‘‘ఈసారి మాత్రం దాస్కు ఓటు వేయలేం, ఎందుకంటే ఆయన కనీసం నడిచే స్థితిలో కూడా లేరు’’ అంటున్నారు. ‘‘దాస్ నిజాయితీకి మారు పేరు, సామ్యవాది. అందువల్లే మేం ఆయనకు 2009లో ఓట్లు వేసి గెలిపించాం. అయితే ఆయన మమ్మల్ని నిరాశపరిచారు’’ అంటున్నారు ఓటర్లు. ‘‘ఆయన ఇంక రాజకీయాలకు రాజీనామా చేయాలి. ఇప్పుడు ఆయన గెలిచినా కూడా, ఈ వయస్సులో ఆయన మాకు ఏ మంచి చేయగలరు?’’ అని ప్రశ్నిస్తున్నారు ఓటర్లు. ఏది ఏమైనా ఇంత పెద్ద వయసులో కూడా సేవ చేయడానికి అత్యుత్సాహంగా ఉన్న దాస్కు సలాం చేయాల్సిందే.