
సాక్షి, కంప్లి(కర్ణాటక): ఎమ్మిగనూరు గ్రామ సమీపానగల జడెసిద్ధేశ్వర రామక్క వంక గట్టున మొసలి కనిపించడంతో గ్రామస్తులు హడలిపోయారు. సోమవారం ఓ రైతు పశువులను కడుగుతుండగా మొసలి ప్రత్యక్షం కావడంతో భయాందోళనకు గురై గ్రామస్తులకు తెలిపాడు.
నిత్యం వ్యవసాయ పనుల నిమిత్తం గ్రామస్తులు ఇదే వంక దాటి వెళ్తుంటారు. ఆ సమయంలో వారిపై ఎక్కడ దాడి చేస్తుందో అనే భయంతో ఉన్నారు. ఈ వంకలో పదేపదే మొసళ్లు ప్రత్యక్షమవుతున్నాయని తెలిపారు.
చదవండి: పూజ సామాగ్రిని నీటిలో కలపడానికి వెళ్లారు.. అంతలోనే..
Comments
Please login to add a commentAdd a comment