
హర్యానా: పెంపుడు కుక్కే యజమాని భార్య, పిల్లలపై ఘోరంగా దాడి చేసింది. ఈ ఘటన హర్యానాలోని రేవారిలో బలియార్ ఖుర్దే గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఆ గ్రామ మాజీ సర్పంచ్ సూరజ్ తాను తన భార్య, పిల్లలు ఇంటి తిరిగివచ్చినప్పుడు తమ పెంపుడు కుక్క పిట్బుల్ ఘోరంగా దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో తన భార్య, పిల్లలు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు.
తాను తనవారిని కాపాడుకోవటం కోసం ఆ కుక్కను ఆపేందుకు ఎంతగా కర్రలతో కొట్టినా...దాడి చేయడం మాత్రం ఆపలేదని చెప్పారు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడిందని, ఆమె తల, కాళ్లు, చేతులకు దాదాపు 50 కుట్లుదాక పడ్డాయని ఆమె కుటుంట సభ్యులు తెలిపారు.
(చదవండి: అరుదైన సంగీత శస్త్ర చికిత్స: బ్యాండు మేళం వాయిస్తుంటే.. సర్జరీ చేసేశారు)
Comments
Please login to add a commentAdd a comment