పరీక్షలకు సన్నద్ధం చేయాలి
మామడ: విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. శుక్రవారం మండలంలోని రాశిమెట్ల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, సరుకులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. పరిసరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని సూచించా రు. ఉపాధ్యాయులు, విద్యార్థులు వందశా తం హాజరయ్యేలా చూడాలని తెలిపారు. ప దో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి చదువులో వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, అధికారులు, ఉపాధ్యాయులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment