
శంషాబాద్: కోవిడ్–19 ప్రారంభం నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై కొనసాగుతున్న ఆంక్షలను డీజీసీఏ మరో నెల పొడిగించింది. ఇప్పటివరకు ఉన్న ఆంక్షలు నవంబరు 30 వరకు యధాతథంగా ఉంటాయని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పరస్పర ఒప్పందం మేరకు మాత్రమే ఆయా దేశాల నడుమ అంతర్జాతీయ విమానాలు రాకపోకలు కొనసాగుతాయని తెలిపింది. కార్గోకు ఆంక్షలు వర్తించవని డీజీసీఏ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment