నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళాలు
ఇంద్రకీలాద్రి
(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు బుధవారం విరాళాలను అందజేశారు. విజయవాడ పటమటకు చెందిన గొట్టిపాటి వెంకటరమణ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసిన వెంకటరమణ తన పేరిట రూ. 1,00,116లు, గొట్టిపాటి అరుణకుమారి పేరిట రూ.1,00,116ల విరాళాలను ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు దాతకు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment