పసుపు–కుంకుమ ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

పసుపు–కుంకుమ ఉత్సవం

Published Tue, Mar 18 2025 10:00 PM | Last Updated on Tue, Mar 18 2025 10:01 PM

పసుపు

పసుపు–కుంకుమ ఉత్సవం

కనుల పండువగా పుట్టింటి

అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): శ్రీతిరుపతమ్మ అమ్మ వారి చిన్న తిరునాళ్ల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అమ్మ వారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు – కుంకుమ బండ్లు తీసుకువచ్చే కార్యక్రమం సోమవారం రాత్రి కనుల పండువగా సాగింది. అమ్మవారి వంశీకులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రంగురంగుల విద్యుత్‌ దీపాలలు, పూలతో అలంకరించిన బండిపై పసుపు – కుంకుమ ఉంచి గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి పుట్టినింటికి చేరుకొని ఆనంద పరవశులయ్యారు. గ్రామంలో రోడ్ల వెంట భక్తులు బారులు తీరి పసుపు – కుంకుమ బండ్లను వీక్షించటంతో పాటు వార్లు పోసి పూజలు నిర్వహించారు. కోలాట నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకు న్నాయి. అర్ధరాత్రి 12 గంటల తరువాత పసుపు – కుంకుమ బండ్లు పెనుగంచిప్రోలులోని అమ్మ వారి ఆలయానికి చేరాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ జంగాల శ్రీనివాసరావు, ఈఓ బి.హెచ్‌.వి.ఎస్‌.ఎన్‌.కిషోర్‌కుమార్‌, ఈఈ ఎల్‌.రమ, డీసీపీ మహేశ్వరరాజు, నందిగామ ఏసీపీ తిలక్‌, ఎంపీటీసీ సభ్యురాలు పొందూరు విజయలక్ష్మి, తహసీల్దార్‌ ఎ.శాంతిలక్ష్మి, ఏఈ రాజు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పసుపు–కుంకుమ ఉత్సవం 1
1/2

పసుపు–కుంకుమ ఉత్సవం

పసుపు–కుంకుమ ఉత్సవం 2
2/2

పసుపు–కుంకుమ ఉత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement