ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని సంతకాల సేకరణ | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని సంతకాల సేకరణ

Published Fri, Mar 28 2025 1:21 AM | Last Updated on Fri, Mar 28 2025 1:19 AM

బొబ్బిలి: తమ ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు. ఇదే విషయమై సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు స్థానిక పట్టణంలోని పారిశుధ్య కార్మికులతో సంతకాల సేకరణ గురువారం చేపట్టారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన వారి సేవలను గుర్తించాలని శంకరరావు కోరారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా వారిని పొగడడం కాదని వారి పట్ల చిత్తశుద్ధి నిబద్దత ఉంటే వారిని శాశ్వత ఉద్యోగులను చేయాలన్నారు. ఆప్కాస్‌ వంటి ప్రైవేటు ఏజెన్సీకి తమ ఉద్యోగాల భర్తీ, నిర్వహణ బాధ్యతలు అప్పగించవద్దని పారిశుధ్య కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్‌లు కలిగిన వినతిపత్రాన్ని మున్సిపల్‌ శాఖామంత్రి నారాయణకు కూడా పంపిస్తామన్నారు. జి.గౌరి, జె.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement