అంత్యోదయ గృహ పథకం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అంత్యోదయ గృహ పథకం ప్రారంభం

Published Tue, Apr 1 2025 11:03 AM | Last Updated on Tue, Apr 1 2025 3:09 PM

అంత్యోదయ గృహ పథకం ప్రారంభం

అంత్యోదయ గృహ పథకం ప్రారంభం

పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్‌లో అంత్యోదయ గృహ పథకం ప్రారంభానికి మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ముఖ్యఅతిథిగా విచ్చేసి 28 మంది లబ్ధిదారులకు వర్క్‌ ఆర్డర్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌మఝి ఉగాది రోజు ఈ పథకం ప్రారంభించారు. జిల్లాలో రాయఘడ, గుసాని బ్లాక్‌, మోహనాలలో కలెక్టర్‌ బిజయకుమార్‌ దాస్‌ ఈ పథకాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాయఘడ బ్లాక్‌ అధ్యక్షురాలు పూర్ణబాసి నాయక్‌, డి.ఆర్‌.డి.ఎ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర్‌ కెరకెటా, ప్రోగ్రాం మ్యానేజర్‌ బి.రోహిత్‌ కుమార్‌, రాయఘడ బి.డి.ఓ సుకాంత కుమార్‌ ప్రదాన్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ సిద్ధార్థ శంకర్‌ త్రిపాఠీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement