గుడారాల పండగ ఏర్పాట్ల పరిశీలన
అమరావతి : గుడారాల పండగ ఏర్పాట్లను బుధవారం ఎస్పీ పరిశీలించారు. ఆయన హోసన్నా దయాక్షేత్రం ప్రాంగణంలో పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నియంత్రణ, కంట్రోల్ రూం వంటి అంశాలపై నిర్వాహకులతో చర్చించారు. పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, నిర్వాహకులు అబ్రహం, జాన్వెస్లీ, అనీల్, సీఐ అచ్చియ్య పాల్గొన్నారు.
నేడు మద్యం
దుకాణాలకు లాటరీ
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం గీత కులాలకు మద్యం దుకాణాలను కేటాయిస్తున్నట్లు ఎకై ్సజ్ ఈ.ఎస్ మణికంఠ బుధవారం తెలిపారు. జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 13 మద్యం దుకాణాలకు 199 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కలెక్టర్ అరుణ్బాబు ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు జరుగుతుందన్నారు. దరఖాస్తు దారులంతా హాజరై లాటరీలో మద్యం దుకాణం దక్కించుకొన్న వారు ప్రభుత్వం నిర్ధారించిన సొమ్ము చెల్లించాలన్నారు.
ప్రపంచబ్యాంక్
బృందం పర్యటన
తాడికొండ: రాజధాని అమరావతిలో నిపుణులతో కూడిన ప్రపంచ బ్యాంక్ బృందం బుధవారం పర్యటించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రపంచ బ్యాంక్ బృందం నిర్దేశించిన కార్యక్రమాల అమలు, వాటి నిర్వహణ రూపకల్పనపై చర్చ జరిపింది. నీటి నిర్వహణ ప్రాజెక్టులు, పర్యావరణ, సామాజిక రక్షణకు రూపొందించిన కార్యకలాపాలు, ప్రొక్యూర్మెంట్ విషయాలపై ఏపీ సీఆర్డీయే అధికారులతో బృంద సభ్యులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్ కో టాస్క్ టీం లీడర్ గెరాల్డ్ ఒలీవర్ తదితరులు ఉన్నారు.
రెడ్క్రాస్ ప్యాట్రన్ సభ్యత్వం
బాపట్ల : ఇండియన్ రెడ్క్రాస్ జిల్లా ప్యాట్రన్ సభ్యత్వం 24 మందికి ఇవ్వటం ఎంతో సంతోషకరమని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. ఈ మేరకు రూ.6.02 లక్షల చెక్కును రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణభట్టుకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, రెడ్క్రాస్ బృందం సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో రెడ్క్రాస్ సేవలు విస్తృతం చేయాలని సూచించారు.
పోలీసుల నుంచి
తప్పించుకోబోయి వ్యక్తి మృతి
నరసరావుపేట టౌన్: పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు లాడ్జి పైనుంచి దూకి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెలంగాణ రాష్ట్రం తుకారాంగేట్కు చెందిన రాములు నాయక్ గుంటూరు పరిసరాల్లో జరిగిన చోరీల్లో అనుమానితుడిగా భావిస్తున్నారు. నరసరావుపేట కోర్టుకు వాయిదాకి వచ్చినట్లు తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ సమీపంలోని లాడ్జికి వెళ్లాడు. గుంటూరు నుంచి వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి కిటికీలో నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు జారి మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుడారాల పండగ ఏర్పాట్ల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment