సంగాం ఆలయంలో భక్తుల రద్దీ
● త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
వంగర: మండల పరిధి సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వరస్వామి ఆలయానికి సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న సువర్ణముఖి, వేగావతి, నాగావళి నదులు కలిసే కూడలి(త్రివేణి) సంగమం వద్ద పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించి సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. పితృదేవతలకు అధిక సంఖ్యలో భక్తులు పిండప్రదానాలు చేశారు.
సంగాం ఆలయంలో భక్తుల రద్దీ
Comments
Please login to add a commentAdd a comment