సంగాం ఆలయంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

సంగాం ఆలయంలో భక్తుల రద్దీ

Published Tue, Mar 4 2025 1:48 AM | Last Updated on Tue, Mar 4 2025 1:45 AM

సంగాం

సంగాం ఆలయంలో భక్తుల రద్దీ

త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు

వంగర: మండల పరిధి సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వరస్వామి ఆలయానికి సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న సువర్ణముఖి, వేగావతి, నాగావళి నదులు కలిసే కూడలి(త్రివేణి) సంగమం వద్ద పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించి సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. పితృదేవతలకు అధిక సంఖ్యలో భక్తులు పిండప్రదానాలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సంగాం ఆలయంలో భక్తుల రద్దీ1
1/1

సంగాం ఆలయంలో భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement