Parvathipuram manyam District Latest News
-
పరీక్షలంటే భయాన్ని వీడండి
సాలూరు: విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని విడనాడాలని సబ్కలెక్టర్, ఇన్చార్జ్ ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాచిపెంట మండలంలోని పి.కోనవలస గిరిజన గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని రుచి చూసి మెనూ పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారు? ఏ విధమైన ప్రణాళిక ద్వారా చదువుతున్నారు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు లక్ష్యంతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. పరీక్షల్లో ప్రణాళికా బద్ధంగా చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ -
తరలిపోతున్న వృక్ష సంపద..!
● పట్టించుకోని రెవెన్యూ, అటవీశాఖ అధికారులుకొమరాడ: మండలం నుంచి వేలాది రూపాయల విలువ చేసే అటవీ సంపద రాత్రివేళ నాటుబళ్లు, ట్రాక్టర్ల సహాయంతో తరలిపోతోంది. పట్టించుకోవాల్సిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణులు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వృక్ష సంపద నరికి వేస్తుండడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఒడిశా సరిహద్దు నుంచి టేకు కలప చడీచప్పుడు లేకుండా రవాణా సాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది అక్రమ వ్యాపారులు, రెవెన్యూ సిబ్బంది కుమ్మకై ్కనట్లు తెలుస్తోంది. టేకుకలప తరలించాలంటే కచ్చితంగా రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కొమరాడ మండలం నుంచి పార్వతీపురం సా మిల్లులకు తరలించిన తరువాత అక్కడినుంచే సంబంధిత శాఖ అధికారులకు మామూళ్లు వెళ్తాయని సమాచారం. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
అపార్ట్మెంట్పై నుంచి పడి రిటైర్డ్ హెచ్ఎం మృతి
బొబ్బిలి: పట్టణంలోని నాయుడు కాలనీలో గల ఓ ఆపార్ట్మెంట్లో నివాసముంటున్న రిటైర్డ్ హెచ్ఎం వై.శ్యామ్సుందర్(80) రెండో అంతస్తు నుంచి పడిపోయి మంగళవారం మృతిచెందారు. బాడంగి మండలం పాల్తేరులో హెచ్ఎంగా రిటైరైన ఆయన బొబ్బిలిలోని ప్రముఖ వైద్యుడు, ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ వై.విజయమోహన్ తండ్రి. మంగళవారం మేడపై ఉన్న ఆయన ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందికి పడిపోయినట్లు, ఆల్జీమర్స్తో కొద్దికాలంగా బాధపడుతున్నట్లు కోడలు గ్రేస్కుమారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని ఎస్సై ఆర్.రమేష్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఎస్సై చెప్పారు. -
హైరిస్క్ గర్భిణుల పట్ల అప్రమత్తం
భామిని: ఆస్పత్రి ప్రసవాలకు ప్రాధాన్యం ఇచ్చి,హైరిస్క్ గర్భిణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి డాక్టర్ భాస్కరరావు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన భామిని మండలంలోని బత్తిలి, భామిని, బాలేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. బత్తిలి పీహెచ్సీలో నిర్వహిస్తున్న నూట్రీ–గార్డెన్ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రులకు వస్తున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. భామిని పీహెచ్సీలో మందుల నిల్వలు పరిశీలించి,ల్యాబ్లో చేస్తున్న పరీక్షలను గుర్తించారు. బాలేరు పీహెచ్సీలో వైద్యసిబ్బంది హాజరు పట్టీ పరిశీలించారు. డీఎంహెచ్ఓ వెంట బత్తిలి డాక్టర్లు రవీంద్ర, దామోదరరావు, భామిని వైద్యులు సోయల్, సంతోషిలక్ష్మి, బాలేరు వైద్యాధికారి శివకుమార్, సీహెచ్ఓ భాస్కరరావు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు -
వయోశ్రేష్టుల సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి
విజయనగరం టౌన్: వయోశ్రేష్టుల సంరక్షణ చట్టాన్ని ప్రతి జిల్లాలో కచ్చితంగా అమలుచేయాలని ఆలిండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర వయోశ్రేష్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో వయోశ్రేష్టుల రాష్ట్ర కార్యవర్గ కౌన్సిల్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సబ్డివిజనల్ స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి రెవెన్యూ సబ్ డివిజన్ స్ధాయిలో వచ్చే సమస్యలను పరిష్కరించాలని, కలెక్టర్ స్థాయిలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి జిల్లా స్థాయిలో వచ్చే వయోశ్రేష్టుల సమస్యలను 90 రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి జిల్లాలోనూ కమిటీలు వేసి మూడు నెలలకొకసారి కమిటీ సమావేశం నిర్వహించి వయోశ్రేష్టుల సంక్షేమంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వయోశ్రేష్టుల శేషజీవితం ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా సమృద్ధిగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ ప్రార్థన గీతంతో ప్రారంభమైన సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పరమేశ్వర రెడ్డి, కార్యదర్శి రామచంద్రరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, సత్యనారాయణమూర్తి, వెంకటరమణ, తదితరులు దివంగత కేపీ ఈశ్వర్ మృతిపట్ల మౌనం పాటించారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఎస్.కుప్పూరావు, ప్రతినిధులు త్రినాథప్రసాద్, బసవమూర్తి, జగన్నాథరావు, గిడుతూరి పైడితల్లి, అధిక సంఖ్యలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
డ్రోన్ దెబ్బ.. పేకాటరాయుళ్ల అబ్బా..!
విజయనగరం క్రైమ్: జిల్లాలో డ్రోన్స్ సహాయంతో పేకాట, కోడి పందాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. విజయనగరంలోని హుకుంపేట శివారు, పూసపాటిరేగ మండలం వెంపడాం వద్ద మంగళవారం పోలీసులు డ్రోన్స్ ఉపయోగించి పేకాట ఆడుతున్న, కోడి పందాలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో విజయనగరం టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు సిబ్బంది హుకుంపేట శివారులో పార్కింగ్ చేసిన లారీలో పేకాట ఆడుతున్న వారిపైకి డ్రోన్ను వంపి, శివారు ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు నిర్ధారించుకుని, రైడ్ చేసి పారిపోతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12,600 నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాల శిబిరంపై దాడిఅలాగే జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు ఎస్బీ పోలీసులకు వచ్చిన సమాచారంతో వారిపైకి డ్రోన్ పంపి, సుదూర ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకుని భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, పూసపాటిరేగ ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్సిబ్బంది రైడ్ చేసి, కోడి పందాలు ఆడుతూ, పారిపోతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15,600 నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్బంగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. నేర నియంత్రణలోను, శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్స్ను వినియోగిస్తున్నామని, పట్టణ, గ్రామ శివారు ప్రాంతాలపై డ్రోన్స్ సహాయంతో నిఘా పెడుతున్నామని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. -
ఇరుగ్రామాల యాదవుల కొట్లాట
బాడంగి: గొర్రెల మేత విషయంలో ఇరుగ్రామాలకుచెందిన యాదవులు కొట్లాటకు దిగడంతో ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మండలంలో జరగ్గా గాయపడిన వారి బంధువులు తెలిపిన సమాచారం ఇలా ఉంది. మండలంలోని గొల్లాది, కామన్నవలస గ్రామాలకుచెందిన యాదవులు గొడవపడి కర్రలతో కొట్టుకోగా కామన్నవలసకు చెందిన పడాల లక్షుం, కామేశ్వరరావు, సింహాచలం, ఆదినారాయణలు, గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు, చప్పసత్యం గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురిని 108లో స్థానిక ఆస్పత్రికి తీసుకురాగా ప్రథమచికిత్స చేసిన డాక్టర్ హారిక వారిలో ఈపుఈశ్వరరావు, పడాల లక్షుంల పరిస్థితి విషమించడంతో విజయనగరం ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు క్షతగాత్రుల బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడిలో కొలువైన అమ్మవారికి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్లు శాస్త్రోక్తంగా పూజాధికాలు జరిపారు. రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అర్చకులు నేతేటి ప్రశాంత్ అమ్మవారిని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధనలు చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జి ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ పర్యవేక్షించారు. రాజీపేట పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపుజియ్యమ్మవలస: మండలంలోని చింతలబెలగాం పంచాయతీ రాజీపేట పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో ఏనుగులు మంగళవారం దర్శనమిచ్చాయి. ఉదయం వెంకటరాజపురంలోని వరిపంటను ధ్వంసం చేసి సాయంత్రానికి వెంకటరాజపురం, బాసంగి మీదుగా చింతలబెలగాం, రాజీపేట గ్రామంలోకి జారుకున్నాయి. రాత్రి సమయమంలో గ్రామంలోకి చొచ్చుకు రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వరిపంట, అరటి ఉండడంతో పంటలను ధ్వంసం చేస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థినికి డీఈఓ అభినందనలుపాచిపెంట: లక్నోలో ఇటీవల జరిగిన 1500 మీటర్లు, 3వేల మీటర్ల పరుగుపందెంలో పాచిపెంట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని జోత్స్న పాల్గొంది. అండర్ 17 విభాగంలో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థినిని డీఈఓ నాయుడు మంగళవారం అభినందించారు. విద్యార్థినికి పాఠశాల హెచ్ఎం ఈశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు అభినందనలు తెలిపారు. మహిళ మృతిపై కేసు నమోదురాజాం సిటీ: పట్టణ పరిధి మల్లికార్జునకాలనీ 7వ లైన్లో నివాసం ఉంటున్న కెల్ల లక్ష్మి (44) మృతిచెందడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. వీధిలో దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెవెన్యూ సిబ్బంది సహాయంతో ఇంటి తలుపులు తీయగా ఇంటిలోపల ఆమె మృతదేహం కనిపించిందని ఎస్సై తెలిపారు. మూడు రోజుల క్రితమే ఆమె మృతిచెంది ఉంటుందని, ఇంట్లో ఒక్కతే ఉండేదని, ఆమె కుమారుడు దుర్గాప్రసాద్ విశాఖపట్నంలో ఉంటున్నాడని చెప్పారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
కూటమి చిన్నచూపు
గూడులేని పేదలపై..● ఎన్నికల ముందు ప్రతిఒక్కరికీ ఇంటిస్థలం ఇస్తామని హామీ ● గత ప్రభుత్వంలో 27వేల మందికి ఇళ్లు మంజూరు ● జిల్లాలో 6,980 మంది ఇళ్లు లేనివారు ● గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలి ● టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలి ● గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలి ● కలెక్టరేట్ ఆవరణలో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాపోడుపట్టాలివ్వాలి మేము సాగు చేసుకుంటున్న భూములకు పోడు పట్టాలివ్వాలి. గతంలో ఎన్నికల ముందు టీడీపీ నాయకులు మా గ్రామానికి వచ్చి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారం చేపట్టిన తరువాత ఇప్పటి వరకు ఎటువంటి ప్రస్తావన లేదు. అధికారులు తక్షణమే మాకు పట్టాలు మంజూరు చేయాలి. – కొండగొర్రి లక్ష్మి, లిడికి వలస గ్రామంకాళ్లరిగేలా తిరుగుతున్నాం.. ఇంటిస్థలం మంజూరు చేయాలని గత ఆరు నెలలుగా కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ప్రభుత్వం నుంచి సైట్లు ఓపెన్ కావడం లేదని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. మంజూరు చేయడం అవకాశం లేదని ఎన్నికల ముందు చెబితే బాగుండేది. ఎన్నికల ముందు చెప్పేదొకటి, అధికారం చేపట్టిన తరువాత చేసేదొకటి. మాకు ఇంటి స్థలం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – పి. వెంకటస్వామి, దిగువమండ గ్రామం, గుమ్మలక్ష్మీపురంప్రభుత్వం స్పందించాలి ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయడంపై కూటమి ప్రభుత్వం స్పందించాలి. ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పోడు పట్టాలు, ఇళ్ల పట్టాలు అందజేయడంలేదు. – బి.కృష్ణ, బుట్టగూడ గ్రామం, గుమ్మలక్ష్మీపురం -
2వేల ఎకరాలు నిమ్మగడ్డి సాగుకు అనుకూలం●
● 4,240 హెక్టార్లలో అంతర పంటల సాగుకు ప్రణాళికలు ● సీఎం చంద్రబాబుకు వివరించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్పార్వతీపురంటౌన్: జిల్లాలో రెండు వేల ఎకరాలు నిమ్మగడ్డి సాగుకు అనుకూలంగా ఉన్నాయని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో భాగంగా రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం మాట్లాడుతూ ఈ ఏడాది 1000 ఎకరాల్లో నిమ్మగడ్డి సాగుకు ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. వచ్చేఏడాది నాటికి 2 వేల ఎకరాల్లో సాగుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఒడిశా రాష్ట్రంలోని రైతులు వేల ఎకరాల్లో నిమ్మగడ్డి సాగుతో పాటు అంతర పంటలను సాగుచేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారన్నారు. ఆ దిశగా జిల్లాలోని రైతులను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. 4,240 హెక్టార్లలో అంతర పంటల సాగుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇతర పంటలను సాగు చేసుకునేలా ప్రోత్సహించేందుకు రైతులను ఎక్స్పోజర్ విజిట్కు తీసుకెళ్లినట్టు వివరించారు.స్పందించిన అధికారులు జియ్యమ్మవలస రూరల్: జియ్యమ్మవలస మండల కేంద్రంలో తాగునీటి వెతలపై ఇటీవల ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మహిళలు ధర్నా చేశారు. జిల్లాలో తాగునీటి వెతలపై ఇటీవల ‘ప్ర‘జల’ పాట్లు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. తాగునీటి సరఫరాకు వీలుగా ఎంపీడీఓ ఎస్.రమేష్ స్థానిక హరిజనవాడ సమీపంలో రిగ్బోర్ తీయించారు. -
కళ్లకు గంతలు కట్టొద్దు
శృంగవరపుకోట: గిరిజనుల కళ్లకు గంతలు కట్టకుండా ప్రభుత్వం నిజాలు చెప్పాలని ఏపీ గిరిజన సంఘం సభ్యులు విజ్ఞప్తిచేశారు. గిరిజన బాలికల కోసం ఎస్.కోట పట్టణంలో బాలికల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని వేడుకున్నారు. ఎస్.కోట మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిధిలోని చిలకపాడు గ్రామంలో పలువురు గిరిజన విద్యార్థులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కలిసి సంఘ నాయకులు జె.గౌరీష్, జె.భీమయ్య, మంగళయ్యలు మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చిన్నా పెద్ద అంతా మోకాళ్లపై నిల్చొని కలెక్టర్, ప్రభుత్వ పెద్దలకు నమస్కారాలు చేస్తూ తమ గోడు వినిపించారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో 160 మందికి సరిపడే భవనంలో 260 మందికి అడ్మిషన్లు ఇచ్చారని, ఆపై చేరిన బాలికలను పార్వతీపురం, సాలూరులోని ఆశ్రమ పాఠశాలలకు పంపుతున్నారన్నారు. తమ పిల్లలు చదవాలని కొండలు, కోనలు దించి ఆడపిల్లలను పంపుతున్నారని, వారికి రోగమొచ్చినా, కష్టమొచ్చినా 50 నుంచి 70 కి.మీ మేర గిరిజన తల్లిదండ్రులు ప్రయాణాలు చేయాల్సి వస్తోందని చెప్పారు. మన్యానికి ముఖ ద్వారంగా ఉన్న ఎస్.కోటలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఏర్పాటుచేసి బాలికా విద్యను ప్రోత్సహించాలని కోరారు. బాలికల చదువు సమస్యలను నిజాయితీగా అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. నిజాలు చెప్పాలని గిరిజన సంఘం వినతి మోకాళ్లపై వేడుకోలు.. ‘కోట’ బాలికల ఆశ్రమ పాఠశాల కోసం ఆందోళన -
గిరిశిఖర గ్రామాల్లో ఆగని మరణాలు
శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల్లో మరణమృదంగం వినిపిస్తోంది. ఒక తల్లి గర్భశోకం మరిచిపోకముందే మరో తల్లికి గర్భశోకం కలుగుతోంది. ఎస్.కోట మండలం ధారపర్తి పంచాయతీ వరుస మరణాలతో వణుకుతోంది. స్పందించాల్సిన వైద్యారోగ్యశాఖ చేష్టలుడిగి చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరణాలు ఏకారణంతో జరుగుతున్నాయన్న కనీస విచారణ లేకుండా వైద్యులు చేతులు దులిపేసుకుంటున్నారని గిరిజనులు వాపోతున్నారు. ధారపర్తి గ్రామానికి చెందిన కురిన బోయిన గంగులు–సీతమ్మల ఐదు నెలల కుమారుడు మంగళవారం ఉదయం విజయనగరంలోని ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రెండు నెలల కిందట ఇదే పంచాయతీకి చెందిన జన్ని విజయ్ అనే చిన్నారి తనువుచాలించాడు. ఈ ఘటనపై ఆదివాసీ గిరిజన సంఘ సభ్యులు, చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబీకులు అంతా తమ ప్రాణాలకు సరైన గ్యారంటీ దక్కడం లేదని, చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసి పోతుంటే వైద్యసిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారంటూ ఆందోళనకు దిగారు. చిన్నారుల మరణానికి సకాలంలో వాక్సినేషన్ వేయకపోవడమే కారణమన్న వాదన వినిపిస్తోంది. పంచాయతీలోని చిన్నారులకు వాక్సినేషన్ లేకుండా చేసిన భారీ తప్పిదానికి వైద్యారోగ్యశాఖ అధికారులు ఇద్దరు ఉద్యోగులను బదిలీ చేసి చేతులు దులిపేసుకున్నా... చిన్నారుల మరణాలు అందరినీ కలచివేస్తున్నాయి. రిఫర్ చేశాం.. ధారపర్తికి చెందిన చిన్నారి మరణం పట్ల ఎస్.కోట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీల స్పందించారు. తొలుత చిన్నారి తక్కువ బరువుతో పుట్టాడని, జిల్లా కేంద్రంలో ఘోషా ఆస్పత్రిలో వైద్య సేవలు అందజేశారు. ఈ నెల 3వ తేదీన చిన్నారికి ఆయాసం రావడంతో ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారం రోజుల పాటు వైద్యసేవలు అందజేశాం. కోలుకున్నాక ఈ నెల 10న డిశ్చార్జ్ చేశాం. తిరిగి 23వ తేదీ రాత్రి 11.30కి చిన్నారి ఆరోగ్యం క్షీణించిందంటూ ఆస్పత్రికి తెచ్చారు. ఎలాంటి సమస్య లేకున్నా ఆయాసం తగ్గక పోవడంతో జీవక్రియలకు సంబందించి ఇబ్బంది ఉండొచ్చని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ పిడియాట్రిక్స్కు 24వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు రిఫర్ చేశాం. ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయినట్టు తెలిసిందని తెలిపారు. అనారోగ్యంతో మరో చిన్నారి మృతి అంతు చిక్కని కారణాలు ఆందోళనలో ధారపర్తి గిరిజనులు వ్యాక్సినేషన్ లేకపోవడమే కారణమా? -
ఊరిబడి రక్షణకు పోరుబాట
● ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులు తరలించవద్దు ● యూపీ పాఠశాలలను కొనసాగించాలి ● యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్కు భారీ ర్యాలీ ● అక్కడ ఆందోళనపార్వతీపురం టౌన్: ఊరిబడిని రక్షించాలని, ప్రాథమిక పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు రెడ్డి మోహన్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం నుంచి కల్టెరేట్ వరకు ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లు, విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఆర్వో హేమలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో ఒక మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని, ఏ ప్రాథమిక పాఠశాల నుంచి 3,4,5 తరగతులను తరలించ వద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూపీ పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని, తెలుగు, ఇంగ్లిష్, సమాంతర మీడియం కొనసాగించాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వర్యం చేయకుండా బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్.మురళీమోహన్రావు, కె.విజయగౌరి, జిల్లా నాయకులు టి.రమేష్, కె.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
అడ్డదారి..!
ఆయన దారి..సాక్షి, పార్వతీపురం మన్యం: అనగనగా ఓ నాయకుడు.. తాను ఎదగాలనుకున్న క్రమంలో అడ్డుగా ఉన్న వారందరినీ తొక్కుకుపోయాడు. చివరికి తాను అనుకున్న పీఠంపై ఆసీనులయ్యాడు. అక్కడితో ఆగలేదు.. మున్ముందు ముప్పు రాకుండా, తెలివిగా పావులు కదిపాడు. అప్పటికే ఉన్న సీనియర్లకు పొగపెట్టాడు. అధిష్టానం వద్ద ఉన్నవీలేనివీ నూరిపోశాడు. పార్టీ దరిదాపులకు కూడా వారిని రానీయకుండా చేయడంలో విజయం సాధించాడు. అక్కడితో ఆగిపోతే ‘రాజకీయం’ ఏముంటుందనుకున్నాడో.. లేక, సొంతంగా తన బలగాన్ని తయారు చేసుకోవాలనుకున్నాడో.. లేదంటే, అధిష్టానం వద్ద ‘సెహభాష్’ అనిపించుకోవాలని అనుకున్నాడో ఏమో... నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి పక్క పార్టీలో ఉన్న ‘చోటా’ నేతలను మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టాడు. వారిని కలుపుకొంటూ, తనను నమ్మి పెద్ద ఎత్తున పార్టీలోకి వస్తున్నారని ‘బిల్డప్’ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇదీ.. జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఒక నాయకుడు ఆడుతున్న ‘రాజకీయ’ జూదం. విజేత ఎవరైనా.. ‘విశ్వాసం’పైనే మచ్చ ఈ జూదంలో ఎవరు గెలుస్తారన్నది తర్వాత విషయం. వారి పన్నిన వ్యూహం ఫలిస్తుందో లేదో కాలం తేలుస్తుంది. ప్రజలు మాత్రం వెన్నుపోటు నాయకుల ‘విశ్వాసం’పైనే చర్చించుకుంటున్నారు. ఇంకా ఎన్నాళ్లూ లేని పదవి కోసం విలువలను ‘తాకట్టు’ పెట్టాలా? అని గుసగుసలాడుకుంటున్నారు. తమను గెలిపించిన ప్రజల మాటకు విలువిస్తారో.. లేకుంటే తమ రాజకీయ నాయకుల ప్రలోభాలే వారికి ముఖ్యమో చూడాలి. -
కొటియా వివాదాన్ని పరిష్కరించాలి
సాలూరు రూరల్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూపు గ్రామాల వివాదాన్ని పరిష్కరించాలని, గిరిజనులపై ఒడిశా ప్రభుత్వ దౌర్జన్యాలను ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోవాలంటూ సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎగువసెంబిలో గిరిజనులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మండల కమిటీ నాయకుడు మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ 21 కొటియా గ్రామా ల సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోందన్నారు. ఒడిశా–ఆంధ్రాలో ఒకే ప్రభుత్వం ఉన్నందున సమస్యకు చెక్ చెప్పాలన్నారు. ఎన్నో ఆశలతో మంత్రి సంధ్యారాణిని గెలిపించినా సమస్య పట్టించుకోవడం లేదన్నారు. సెంబిలో ఒడిశా అధికారులు కంచె వేసి గిరిజనుల భూములను ఆక్రమించడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు గెమ్మెల జానకిరావు, కోనేటి సుబ్బా, తాడంగి చరణ్, మర్రి మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ చైర్మన్కు వైఎస్సార్సీపీ నాయకుల పరామర్శ
విజయనగరం: జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం పరామర్శించారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ చిన్న కుమారుడు మృతిచెందిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆయనను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు మృతిచెందిన ప్రణీత్ బాబు చిత్రపటం వద్ద పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, తుని మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా, పాలకొండ మాజీ ఎమ్మెల్యే తలేభద్రయ్య, ప్రస్తుత కూటమి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు, మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ వెంకటేశ్వరరావు, మాజీ వుడా చైర్మన్ రవి రాజు, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు పరామర్శించిన వారిలో ఉన్నారు. -
క్షయ రహిత భారత్కు సహకరించండి
విజయనగరం ఫోర్ట్: క్షయ రహిత భారత్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ర్యాలీని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2025 నాటికి క్షయ వ్యాధిని అంతం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. క్షయ రోగులు అందరూ పూర్తి కాలం మందులు వాడితే వ్యాధి నయం అవుతుందని తెలిపారు. క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న కఫం పరీక్ష కేంద్రంలో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వైద్యసిబ్బందికి ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, ఎన్సీడీపీఓ డాక్టర్ సుబ్రమ్మణ్యం, డీఎంఓ మణి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి -
మధ్యవర్తిత్వం ద్వారా సులభంగా కేసుల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణచక్రవర్తి విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వంలోని మెలకువలను నేర్చుకోవడం ద్వారా కేసులను చాలా సులభంగా పరిష్కరించవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికల్యాణచక్రవర్తి అన్నారు. ఈ మేరకు సోమవారం 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నిర్వహించిన శిక్షణలో న్యాయవాదులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మధ్యవర్తిత్వంలో భాగంగా శిక్షణ ఇవ్వడానికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రత్నతార, కేరళ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ సిరాజ్ ఎంపికై న న్యాయవాదులకు శిక్షణ ఇస్తారన్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వ్యాజ్యాలను మానవతా దృక్పథంతో పరిశీలించి ఉభయ పార్టీల ద్వారానే పరిష్కారం రాబట్టాలని న్యాయవాదులకు సూచించారు. ఈ మధ్యవర్తిత్వం వల్ల ఉభయ పార్టీలకు సమయం డబ్బు వృథా కాకుండా ఉంటాయని, అదేవిధంగా కోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులకు పరిష్కారం చూపంవచ్చన్నారు. వ్యాజ్యాల పరిష్కారానికి రాజీ కూడా ఒక మార్గమేనని ఆయన స్పష్టం చేశారు. శిక్షణ పొందుతున్న ఉమ్మడి జిల్లాల న్యాయవాదులను శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. శిక్షణను అందిస్తున్న మాస్టర్ ట్రైనీస్తో మాట్లాడి శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి బీహెచ్వీ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 275 అర్జీలు
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 275 వినతులు అందాయి. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 117, దేవాదాయ శాఖకు 46, పోలీస్శాఖకు 31, డీఆర్డీఏకు 19, జిల్లా పంచాయతీ రాజ్ శాఖకు 10, విద్యుత్ పంపిణీ సంస్థకు 5, వైద్యారోగ్యశాఖకు ఐదు, పాఠశాల విద్యాశాఖకు 4 చొప్పున వినతులు అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవిగా నమోదయ్యాయి. వినతులను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీలా గాంధీ స్వీకరించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 42 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ఎస్పీ వకుల్ జిందల్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీవకుల్ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, వాటి పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ పీజీఆర్ఎస్లో మొత్తం 42 ఫిర్యాదులు ఆయన స్వీకరించారు. ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 15, కుటుంబ కలహాలకు సంబంధించి 4, మోసాలకు పాల్పడినట్లు 8, ఇతర అంశాలపై 15 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీ ఆర్బీ సీఐ శంకర్రావు, ఎస్బీ సీఐలు పాల్గొన్నారు. -
మూడు రిజిస్ట్రేషన్లు..ఆరు స్టాంపులు..!
● యథేచ్ఛగా స్టాంపు వెండర్ల దోపిడీ ● ఇ–స్టాంప్లపై అక్రమంగా వసూలు ● సబ్రిజిస్టార్ కార్యాలయంలో మాన్యువల్ స్టాంప్లకు బ్రేక్ ● సిండికేట్గా మారిన విక్రయదారులురూ.30లు అఽధికం రాజాంలో ఈ స్టాంప్ పత్రాల విక్రయంలో అధికంగా వసూలు జరుగుతోంది. ఇటీవల రూ.50లు స్టాంప్ పత్రం నిమిత్తం వెళ్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేదు. ఆ ఇ–స్ట్టాంప్ బయట వెండర్ వద్ద తీసుకుంటే రూ.30లు అదనంగా వసూలు చేశారు. – ఏవీ అర్జున్, డోలపేట, రాజాం -
కూటమి నాయకుల గలాటా
● మండల సమావేశంలో ఉద్రిక్తం ● ఎమ్మెల్సీని సమావేశానికి రానీయకుండా కూటమి ఎత్తులు ● సుమారు మూడు గంటల పాటు నాటకీయ పరిణామాలుపాలకొండ: కూటమి నాయకుల నక్కజిత్తుల ఎత్తులతో పాలకొండ మండల సర్వసభ్య సమావేశం సోమవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జీవోలను కాదని వారు చెప్పిన విధంగా సమావేశం నిర్వహించేలా అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో గందరళగోళంగా మారింది. పోలీసులు, అఽధికారులు కూటమి నాయకుల చేష్టలను చూస్తూ చేష్టలుడిగి ఉండాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు పరిశీలిస్తే..సోమవారం ఉదయం 10 గంటలకు మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్కు ఆహ్వానం పంపలేదు. అయినప్పటికీ జీవో నంబర్ 44 ప్రకారం తాను సమావేశానికి వెళ్లే హక్కు ఉందంటూ ఎమ్మెల్సీ విక్రాంత్, ఎంపీటీసీలు, సర్పంచ్లతో పాటు సమావేశ మందిరానికి ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని కింద ఎంపీపీ గదిలో కూర్చున్నారు. కూటమికి చెందిన సభ్యులు అక్కడే కూర్చుని ఎమ్మెల్సీ విక్రాంత్ను సమావేశ మందిరం నుంచి పంపిచేస్తేనే తాము ఆ సమావేశానికి వస్తామని ఎంపీడీవోకు తెలిపారు. దీంతో ఎంపీడీవో విజయరంగారావు ఎమ్మెల్సీ విక్రాంత్ను సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోవాలని కోరారు. దీనిపై విక్రాంత్ స్పందిస్తూ జీవో 44 ప్రకారం తాను సమావేశానికి రావడానికి హక్కు ఉందని తాను సమావేశంలో ఉంటానని పట్టుబట్టారు. ఎంపీడీవో పోలీసుల ద్వారా విక్రాంత్ను బయకు పంపించేందుకు ప్రయత్నించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. మండలంలోని ఇతర ప్రాంతాల నుంచి సమావేశ మందిరానికి చేరుకున్న కూటమి నాయకులు అరుపులు, కేకలు వేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. సీఐ చంద్రమౌళి, ఎస్సై ప్రయోగమూర్తిలు విక్రాంత్ను సమావేశం నుంచి వెళ్లిపోవాలని కోరారు. దీనిపై విక్రాంత్ మాట్లాడుతూ జీవో 44 చెల్లదని ఎంపీడీవో రాతపూర్వకంగా ఇస్తే వెళ్లిపోతానని స్పష్టం చేశారు. దీంతో ఎంపీడీవో పంచాయతీరాజ్ చట్టం మేరకు జీవో 44 చెల్లదని విక్రాంత్కు నోటీసు అందించారు. అనంతరం ఎమ్మెల్సీ విక్రాంత్, తమ సభ్యులతో పాటు 2.30 గంటలకు బయటకు వెళ్లిపోయారు. మండలిలో ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్సీ విక్రాంత్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశానికి తనను హాజరుకాకుండా అవమానపరిచిన సంఘటనపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తీవ్రంగా స్పందించారు. మండల అభివృద్ధి కోసం తగిన సూచనలు సలహాలు అందించాలని, ఈ ప్రాంత రైతుల సమస్యలపై చర్చించాలని తాను సమావేశానికి హాజరైనట్లు తెలిపారు. కూటమి నాయకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి జీవో44ను విస్మరించారని విమర్శించారు. దీనిపై తాను శాసన మండలి చైర్మన్కు ఫిర్యాదు చేస్తానని, న్యాయపరంగా పోరాటం చేస్తానని తెలిపారు. ఏక పక్షంగా సమావేశం.. మండల సమావేశం సోమవారం మధ్యాహ్నం నుంచి కూటమి నాయకులతో అధికారులు ఏకపక్షంగా కొనసాగించారు. వాస్తవానికి మండలంలో 12 మంది ఎంపీటీసీలు ఉంటే వారిలో 10మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలే. వారిలో నలుగురు ఎంపీటీసీలను ఇటీవల కూటమి నేతలు తమ పార్టీలో చేర్చుకున్నారు. అప్పటికీ ఇరుపార్టీలకు 6 చొప్పున ఎంపీటీసీలు ఉన్నారు. ఇక సర్పంచ్ల విషయంలో 33 పంచాయతీలకు 25 పంచాయతీల్లో వైఎస్సార్ మద్దతుదారులే సర్పంచ్లుగా ఉన్నారు. ఎమ్మెల్సీ విక్రాంత్తో పాటు వారంతా వెళ్లిపోవడంతో ఉన్న కూటమి మద్దతు దారులతోనే సమావేశం పూర్తిచేశారు. -
వర్షార్పణం
ఎం.రాజపురంలో ఈదురు గాలులకు నేలమట్టమైన అరటి పంట పంటలు పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాంతా ల్లో ఆదివారం అర్ధారాత్రి నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతా ల జలమయమయ్యాయి. అరటి, జీడిమామిడి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. నువ్వుపంట నేలమట్టమైంది. నూర్పిడిచేసి కళ్లాల్లో ఉంచిన ధాన్యం బస్తాలు తడిసిముద్దయ్యాయి. వీరఘ ట్టం మండలంలోని వీరఘట్టం, దశుమంతపురం, చలివేంద్రి, చిట్టపులివలస, కంబర, నడిమికెల్ల, విక్రమపురం, నడుకూరు గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో అరటి తోటలు, 250 ఎకరాల్లో జీడి మామిడి తోటలు ధ్వంసమయ్యాయని, సుమా రు రూ.50 లక్షల పంట నష్టం జరిగినట్టు రైతులు చెబుతున్నారు. పంటల నష్టం అంచనా వేస్తామ ని తహసీల్దార్ చందక సత్యనారాయణ తెలిపా రు. వేసవి దుక్కులకు వర్షం ఉపకరిస్తుందని పలువురు రైతులు పేర్కొన్నారు. – వీరఘట్టం/గుమ్మలక్ష్మీపురం/రేగిడి -
మన బడి.. మరింత దూరం
ఉద్యమం తీవ్రతరం ప్రభుత్వ నిర్ణయాన్ని తా ము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రుల తో కలసి పోరాటానికి సిద్ధమయ్యాం. యూపీ పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలి. ప్రాథమిక పాఠశాలల నుంచి విద్యార్థులను విలీనం చేయవద్దు. పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ పాఠశాల పెట్టాలి. ఎల్కేజీ, యూకేజీ పెడితే విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. సమాంతర మీడియం ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. – ఎస్.మురళీమోహనరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పోరాటానికి సిద్ధమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ విద్యను కాపాడుకునేందుకు యూటీఎఫ్ వంటి ఉపాధ్యాయ సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ‘మన ఊరి బడిని కాపాడుకుందాం’ నినాదంతో ఇప్పటికే ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఈ నెల 25న జిల్లా కేంద్రంలో డీఈవో కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని యూటీఎఫ్ నాయకులు చెబుతున్నారు. ● కొన్ని మూసివేత.. మరికొన్ని విలీనం ● విద్యార్థుల తరలింపునకు యోచన ● సర్కారు విద్య నిర్వీర్యానికి కూటమి ప్రభుత్వం కుట్ర ● ఆందోళనకు సిద్ధమవుతున్న యూటీఎఫ్ సాక్షి, పార్వతీపురం మన్యం/సీతానగరం: పేద విద్యార్థులకు చదువును దూరం చేసి, ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసేందుకు కూట మి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. సర్కా రు విద్యకు పెద్దపీట వేసి, నాడు–నాడుతో పాఠశాలల రూపురేఖలు మార్చి, విప్లవాత్మక విద్యా సంస్కరణలతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తే... ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని అనేక ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేసేందుకు, మరోచోట విలీనం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొద్దిరోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. విద్యాహక్కు చట్టాన్ని కాలరాస్తూ.. విద్యార్థులను ఊరికి దూరంగా ఉండే పాఠశాలలకు పంపించే ఏర్పాట్లను చేస్తోంది. పాఠశాలలను ఫౌండేషన్ (1, 2 తరగతులు), బేసిక్ ప్రైమరీ (1–5 తరగతులు), మోడల్ ప్రైమరీ (తరగతికి ఒక టీచర్ ఉంటారు. ఐదు తరగతులు ఉంటాయి), హైస్కూల్గా విభజిస్తున్నారు. మోడల్ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేస్తామంటూనే.. పక్కనున్న ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న నెపంతో 3, 4, 5 తరగతులను అందులోకి విలీనం చేస్తున్నారు. ఈ విధంగా మండలానికి 7 నుంచి 10 స్కూళ్ల వరకు ప్రభావితం అవుతున్నాయి. ఇక్కడ 1, 2 తరగతులు మాత్రమే ఉండగా.. భవిష్యత్తులో అక్కడికి కొత్తగా ఇంకెవరూ చేరరని, తద్వారా పూర్తిగా ఆయా పాఠశాలలను మూసివేయడమే దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. సీతానగరం మండలంలోని బల్ల కృష్ణాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాలను ఎత్తివేసి, గెడ్డలుప్పి యూపీ పాఠశాలలో విలీనం చేయనున్నారు. ఈ పాఠశాలకు వెళ్లాలంటే రాష్ట్రీయ రహదారి, సువర్ణముఖి నది దాటాల్సి ఉంటుంది. సుమారు కిలోమీటరు దూరం విద్యార్థులు నడిచి వెళ్లాలి. పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. సీతానగరం బగ్గందొరవలస ప్రాథమిక పాఠశాలలో 16 మంది విద్యార్థులు చదువుతుండగా.. ప్రభుత్వ విధానం వల్ల వీరు కూడా గెడ్డలుప్పి వెళ్లి చదువుకోవాల్సి ఉంటుంది. రామవరంలోని పాఠశాల ఆర్.వెంకంపేటలో విలీనం కానుంది. ఇక్కడికి వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల ప్రయాణం. మధ్యలో పెద్ద చెరువు ఉంది. శ్మశాన వాటికను దాటుకుని వెళ్లాలి. ఒక్క సీతానగరం మండలంలోనే 20 పాఠశాలలు విలీనం కానున్నాయి. వాస్తవానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నాడు పథకం కింద పాఠశాలల భవనాలను సుందరంగా తీర్చిదిద్దింది. ప్రహరీలు, మొక్కల పెంపకం, రంగురంగుల టేబుళ్లు, ఆహ్లాదకర వాతావరణంలో పాఠశాలలు నడుస్తున్నాయి. వాటిని నిరుపయోగంగా వదిలేయడంతో పాటు.. ఊరి బడి దూరం కానుందని తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల చదువు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మండలంలోని పెదమరికి, జమదల, పుట్టూరు, కృష్ణపల్లి, కోరి, అడ్డాపుశీల, కోటవానివలస, సంగంవలస.. ఇలా ఎనిమిది చోట్ల 6,7,8 తరగతులున్న యూపీ పాఠశాలు మరోచోట హైస్కూల్కు విలీనం కానున్నాయి. చినమరికి పాఠశాలలో 3, 4, 5 తరగతులను పెదమరికిలో కలుపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1, 2 తరగతులే ఉంచగా.. వచ్చే విద్యాసంవత్సరానికి ఈ పాఠశాలలో కొత్తగా విద్యార్థులను ఎవరు చేర్చుతారని.. తద్వారా పిల్లలు లేరన్న నెపంతో పాఠశాలను ఎత్తివేస్తారని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పిల్లలను ఎలా చదివించగలం? మా పాప వాసంతి బళ్ల కృష్ణాపురంలో ఐదో తరగతి చదువుతోంది. ఇప్పుడు దూరంలో ఉన్న మరో పాఠ శాలకు పంపాలంటున్నా రు. మా ఊరిలోని బడిని వదిలి, అంత దూరం పంపించాలంటే సాధ్యమేనా? చిన్న పిల్లలు రహదారులు, నదులు దాటి ఎలా వెళ్లగలరు. – పెద్దింటి సత్యవతి, బల్లకృష్ణాపురం, సీతానగరం మండలం ఊరికి దూరంగా బడి... ప్రైమరీ పాఠశాలలు.. కొన్ని గ్రామాలకు దూరం కానున్నాయి. చిన్నపిల్లలు చదువుకోసం రెండు, మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంత దూరం తమ పిల్లలను ఎలా పంపగలమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక.. యూపీ పాఠశాలలకు చరమగీతం పాడి, 6, 7, 8 తరగతులను సమీపంలోని హైస్కూల్లోకి విలీనం చేస్తున్నారు. జిల్లాలో ఈ విధంగా 110 వరకు పాఠశాలలు ప్రభావితం అవుతున్నాయి. కొన్నింటిని తరలించడం, మరికొన్నింటిని విలీనం చేయడం వల్ల తమ విద్యార్థులు చదువుకు దూరమవుతారని, ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే భామిని, పాలకొండ, పార్వతీపురం తదితర ప్రాంతాల నుంచి పిల్లల తల్లిదండ్రులు పలుమార్లు ధర్నాలు నిర్వహించారు. కలెక్టరేట్కు వచ్చి అధికారులకు అర్జీలిచ్చారు. అవన్నీ బుట్టదాఖలే అయ్యాయి. విలీనం దిశగానే విద్యాశాఖ అధికారులు ముందుకు వెళ్తున్నారు. -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం ఆమె పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్ఓ కె.హేమలత, కేఆర్ఆర్సీ ఎస్డీసీ పి.రామచంద్రారెడ్డిలతో కలిసి 98 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని సూచించారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎటువంటి అర్జీలు రీ ఓపెన్ కాకుండా చర్యలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగురాలైన పాలకొండ మండలానికి చెందిన సుందరగిరి శ్రీజా భవానీ తనకు టచ్ఫోన్ కావాలని ఇదివరకే వినతిపత్రాన్ని అందజేయడంతో ఆమెకు టచ్ఫోన్ అందజేశారు. పీజీఆర్ఎస్లో అందించిన కొన్ని అర్జీలు ● జియ్యమ్మవలస మండలం గడసింగుపురం నుంచి పి. తాతబాబు తదితరులు తమ గ్రామంలోని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ పనికిరానివారి పేర్లతో అక్రమాలకు పాల్పడడమే కాకుండా ఒక్కో వేతన దారు నుంచి రూ.200 చొప్పున అవినీతికి పాల్పడుతున్నారని, దానిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ● పార్వతీపురం మండలం డోకిశీల గ్రామంలో గల పొలాలకు ఆధారమైన పంటకాలువ పూర్తిగా కబ్జాకు గురైందని, ఆ కాలువ ద్వారా 200 ఎకరాల్లో సాగుభూములు, 15 చెరువులు ఆధారపడి ఉన్నాయన్నారు. కబ్జాతో రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని, కబ్జాదారులపై చర్యలు చేపట్టాలని కోరారు. ● కురుపాం మండలం రెల్లిగూడ గ్రామానికి గతంలో నిర్మించిన గ్రావెల్ రోడ్డు పూర్తిగా పాడైనందున తమ గ్రామాలకు అంబులెన్స్, రేషన్ వాహనం రావడం లేదని, రోడ్డు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ బి.అరుణ గ్రామస్తులతో కలిసి అర్జీ చేశారు. ● పాలకొండ మండలం బుక్కురుపేట గ్రామానికి చెందిన సంధ్యారాణి పెండింగ్లో ఉన్న తన ఇంటి బిల్లును మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. సమస్యలపై విచారణ చేసి న్యాయం పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి అలసత్వం చేయకుండా విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సోమవారం వచ్చిన 13 ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, వరకట్న వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీ వసూళ్లు, ప్రేమపేరుతో మోసం వంటి ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మేరకు వచ్చిన సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడి ఆయా సమస్యలను, వాటి పూర్వాపరాలను పరిశీలించి వాస్తవాలైతే చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. పీజీఆర్ఎస్కు 40 వినతులు సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 40 వినతులు వచ్చాయి. పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి వినతులు స్వీకరించారు. బర్నగ్రామానికి రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ఎ.చిన్నారావు, సీసీరహదారి మంజూరు చేయాలని ఈతమానుగూడకు చెందిన రాజేష్ అర్జీలు అందజేశారు. మంచినీటి సదుపాయం కల్పించాలని కుశిమి బంగారుగూడ గిరిజనులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, ఏపీడీ సన్యాసిరావు, డీఈ మధుసూదనరావు, సీడీపీఓ రంగ లక్ష్మి పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 98 వినతులు -
కూటమి బరి తెగింపు!
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025–8లోపార్టీ మారకపోతే వార్డుల్లో ఏ పనీ చేయనీయబోమని పలువురిని కూటమి నాయకులు బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారన్న కారణంతో పలువురు చిరుద్యోగులను విధుల నుంచి తప్పించారు. ఇతర పనులేవీ మంజూరు చేయనీయమంటూ పలువురు కౌన్సిలర్లకు హెచ్చరి కలు జారీ చేశారు. దీంతోపాటు... పలువురికి ఇంటి స్థలం, రూ. 10 లక్షలు ఇస్తామన్న ఆశ చూపి టీడీపీలోకి చేర్చుకున్నారన్న ప్రచారం పట్టణంలో జోరుగా సాగుతోంది. భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో పార్వతీపురం పురపాలక సంఘ పరిధిలో గానీ.. నియోజకవర్గంలో గానీ చేసిన అభివృద్ధి అంటూ ఏదీ లేదు. ఉన్న ఉద్యోగాలను తీసివేయడమే గానీ.. కొత్తగా ఒకరిని నియమించింది లేదు. నియోజకవర్గంలో అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టేసి.. ఫిరాయింపులపైనే స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించారన్న విమర్శ లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఫిరా యింపుల నేపథ్యంలో టీడీపీ అవిశ్వాస తీర్మా నం నోటీసు అందజేసింది. ఫలితంగా వైఎస్సార్సీపీకి కోరం తక్కువవుతుంది. సంఖ్యాబలం చూసుకుని, చైర్ పర్సన్ సీటు కోసం కూటమి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఇదే కూటమి ప్రభుత్వం ఎత్తుగడగా కనిపిస్తోంది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుస్తున్న కౌన్సిలర్లపై స్థానిక ఓటర్లు ఇప్పటికే మండిపడుతున్నారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలో కలిసి వెన్నుపోటు రాజకీయాలకు తెరతీయడంపై గుర్రుమంటున్నారు. తిరిగి మాతృపార్టీకి వస్తారా.. లేదంటే విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగా ముందుకు సాగుతారా అన్న చర్చ పట్టణవాసుల్లో సాగుతోంది. 26న ఇ–అడ్వాన్స్ టెండర్లు సీతంపేట:ఇ–అడ్వాన్స్ టెండర్లను ఈనెల 26న నిర్వహించనున్నట్టు ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపా రు. 5వేల కొండచీపుర్లు, 100 క్వింటాళ్ల కుంకు డు, 100 క్వింటాళ్ల పసుపు కొమ్ముల విక్రయానికి టెండర్లు ఆహ్వానిస్తున్నామన్నారు. వివరాలకు జీసీసీ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. గవరమ్మపేటలో ఏనుగుల గుంపు జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపే ట, వెంకటరాజపురం పంట పొలాల్లో సోమవా రం ఏనుగులు దర్శనమిచ్చాయి. వెంకటరాజపురంలోని బంటు అప్పలనాయుడు, దత్తి వెంకటనాయుడు, బంటు గౌరునాయుడుకు చెంది న జొన్న, అరటి తోటలు ధ్వంసం చేశాయి. ప్రభుత్వం స్పందించి తక్షణమే నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు విజయనగరం అర్బన్: జిల్లాలో మంగళ, బుధవారాల్లో జరగనున్న ఏపీపీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై తన చాంబర్లో సంబంఽధిత అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, 25, 26వ తేదీల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్–2 ఉద్యోగాలకు, 26న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీ సర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్ ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఎంవీజీఆర్ కళాశాల, అయాన్ డిజిటల్, లెండి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ట్రాన్స్కో ఎస్ఈ లక్ష్మణరావు, పరీక్షల సూపరింటెండెంట్ భాస్క రరావు, ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ ఎం.బాలరాజు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కె.అనిల్కుమార్ పాల్గొన్నారు. వెబ్సైట్లో మ్రెరిట్ జాబితా విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్య కళాశాల్లో స్పీచ్ థెరపిస్టు, ఓటీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా వెబ్ సైట్లో పెట్టామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మలీల సోమవారం తెలిపారు. అభ్యంతరాలుంటే వైద్య కళాశాలలో ఏప్రిల్ ఒకటో తేదిలోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి నాయకులు బరి తెగించారు. అధికా ర దర్పంతో అడ్డదారులు తొక్కారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్వతీపురం మున్సిపాలిటీ లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లే లక్ష్యంగా ప్రలోభాల పర్వానికి దిగి.. నయానో భయానో తమ దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు సాగించారు. సంఖ్యాబలం లేకపోయినప్పటికీ, మున్సిపల్ చైర్పర్స న్ కుర్చీపై కన్నేసిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ... దానిపై తమవారిని కూర్చోబెట్టేందుకు అన్ని దా రులూ వెతికారు. ఒక్కొక్కరినీ తమ పార్టీల్లోకి లా క్కొన్నారు. చివరిగా సోమవారం ఉదయం మరో ఇద్దరిని కలిపేసుకుని, సాయంత్రం ఆగమేఘాలపై జేసీ ఎస్.ఎస్.శోభికను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. కొద్దిరోజుల కిందట పాలకొ ండ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అస్త్రశ స్త్రాలన్నీ ఉపయోగించారు. స్వయంగా కూటమి పార్టీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బరిలో దిగారు. అయినప్పటికీ..పాలకొండ నగర పంచాయతీకి చెందిన కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ పట్ల తమ విశ్వాసాన్ని చూపుకొన్నారు. ఎన్ని ప్రలోభాలకు పాల్పడినా వెరవలేదు. దీంతో కూటమి ఎత్తులు చిత్తయ్యాయి. విశ్వాసంపై నీళ్లు చల్లి.. అవిశ్వాసం పార్వతీపురం పురపాలక సంఘ పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. మున్సిపల్ చైర్పర్సన్గా 18వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్ బోను గౌరీశ్వరి కొనసాగుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులను ఓటర్లు గెలిపించారు. బీజేపీ ఒక స్థానం, ఇద్దరు స్వతంత్రులు ఎన్నికల బరిలో గెలవగా.. 22 స్థానా ల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇందులో 10, 19, 26వ వార్డులను అప్పటి ఎమ్మె ల్యే అలజంగి జోగారావు ఏకగ్రీవం చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లే లక్ష్యంగా.. ప్రలోభాలకు తెర తీశారు. అధికారంలో వచ్చిన తర్వాత ఇద్దరు స్వతంత్రులు, ఒక బీజేపీ కౌన్సిలర్, పదిమంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకున్నారు. తాజాగా ఒకటో వార్డు స్వతంత్ర కౌన్సిలర్ ఆర్.శివకుమార్ (బంగారునాయుడు), వైఎస్సార్సీపీకి చెందిన 30వ వార్డు కౌన్సిలర్ రణభేరి చిన్నంనాయుడును టీడీపీలో చేర్చుకున్నారు. వాస్తవానికి ఒకటో వార్డు కౌన్సిలరు శివకుమార్ గెలిచిన వెంటనే బీజేపీలోకి జంప్ అయ్యారు. తర్వాత వైఎస్సార్సీపీలోకి, అనంతరం టీడీపీలోకి గోడ దూకారు. మరలా కొద్దిరోజుల తర్వాత వైఎస్సార్సీపీలో చేరగా.. తాజాగా మరోసారి పార్టీ మారి, టీడీపీ కండువా కప్పుకున్నారు. కూటమిది అడ్డదారి! తమ దారి అడ్డదారి అని కూటమి నాయకులు మరోసారి నిరూపించుకున్నారు. ఓటర్లు, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బీజేపీ, స్వతంత్రులు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీలో కలుపుకున్నారు. దీంతో కూటమి బలం 18కి చేరింది. ఎప్పటి నుంచో చైర్పర్సన్ కుర్చీపై తమ వారిని కూర్చోబెట్టేందుకు తహతహలాడుతున్న ఎమ్మెల్యే విజయచంద్ర.. నిమిషమైనా ఆలస్యం చేయకుండా సోమవారం సాయంత్రమే జేసీ శోభికను కలసి అవిశ్వాస తీర్మానం నోటీసు దగ్గరుండి అందజేశారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ బీఫారంతో గెలిచిన పలువురు కౌన్సిలర్లు.. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నేపథ్యంలో పలువురిపై వైఎస్సార్సీపీ సస్పెన్షన్ వేటు కూడా వేసింది. పార్వతీపురం రూరల్: క్రికెట్ బెట్టింగ్స్కు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని, బెట్టింగ్లకు పాల్పడిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి హెచ్చరించారు. తన కార్యాలయంలో విలేకరులతో సోమవారం మాట్లాడారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్, ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాల వలలో చిక్కుకు ని జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు హితవుపలికారు. బెట్టింగ్స్ పెను భూతం వంటివని, ఆశచూపి అథఃపాతాళానికి నెట్టివేస్తాయన్నారు. డబ్బులు పోగొట్టు కున్న అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటను ఉదహరించారు. క్రికెట్ వినోదం కోసమే చూడాలే తప్ప బెట్టింగ్ల వైపు మొగ్గు చూపకూడదన్నారు. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. బెట్టింగ్లకు పాల్పడితే వారికి నచ్చజెప్పి ఆ ఊబిలోనుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. అనుమానితులపై నిఘా పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా గతంలో బెట్టింగ్లకు పాల్పడిన వారు, అనుమానితులపై పోలీస్ నిఘా ఉంచామన్నారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే 112/100కు డయల్ చేయాలని లేదా సమీపంలో ఉన్న పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. న్యూస్రీల్ప్రలోభాలు.. బెదిరింపులు పార్వతీపురం మున్సిపల్ చైర్ పర్సన్ పీఠంపై ఎమ్మెల్యే కన్ను భయపెట్టి.. ప్రలోభపెట్టి కౌన్సిలర్లకు ఎర ఇంటి స్థలం, రూ.10 లక్షలకు బేరమంటూ ప్రచారం అధికార దర్పంతో అడ్డదారులు జేసీ శోభికకు అవిశ్వాస తీర్మానం నోటీసు -
గురుకులాలు, కళాశాలల్లో సీసీ కెమెరాలు
● సజావుగా పదోతరగతి పరీక్షలు ● గురుకుకాల రాష్ట్ర కార్యదర్శి వీఎన్ మస్తానయ్యబొబ్బిలి: రాష్ట్రంలోని 50 గురుకులాలు, మరో పది కళాశాలల్లో సీసీ కెమెరాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు గురుకులాల రాష్ట్ర కార్యదర్శి వీఎన్ మస్తానయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన బొబ్బిలిలోని గురుకులాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో గురుకులానికీ 8 చొప్పున మొత్తం 480 కెమెరాలను అమర్చేందుకు సంబంధిత వ్యక్తులతో మాట్లాడామని, త్వరలోనే కెమెరాలను అమర్చనున్నట్లు చెప్పారు. గురుకులాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల పర్యవేక్షణ సులువవుతుందన్నారు. అన్ని విభాగాలను అనుసంధానం చేస్తూ సీసీ కెమెరాల ద్వారా ప్రిన్సిపాల్స్, పీఈటీ, పీడీలు విద్యార్థులకు క్రమశిక్షణను మరింత మెరుగుపర్చేందుకు వీలవుతుందన్నారు. బొబ్బిలి గురుకులానికి ప్రహరీ, కంచెల నిర్మాణం ఒక కొలిక్కి వచ్చిందన్నారు. ఇప్పటికే ప్రహరీ దాదాపు పూర్తి కావచ్చిందని, త్వరలో మిగిలిన కొద్దిపాటి భాగం కూడా దాతల సాయంతో నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. మన బడి నాడు–నేడులో భాగంగా కొన్ని భవనాలు నిర్మించగా మిగిలిన పాత భవనాలను తొలగించాల్సి ఉందన్నారు. అలాగే గురుకులాల్లో రెసిడెన్షియల్ అనే పదానికి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా స్థానికంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకోసం ఇక్కడ సిబ్బంది నివాస గృహాల నిర్మాణం కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నిధుల సమస్య ఉన్న కారణంగా పాత డార్మిటరీలను ఆధునికీకరించి కొద్దిమంది సిబ్బందినైనా స్థానికంగా ఉండేందుకు వీలుగా నిర్మాణాలు చేయనున్నామని తెలిపారు. దీనిపై అక్కడికక్కడే సంబంధిత ఈఈతో ఫోన్లో మాట్లాడారు. కళాశాలగా ఎచ్చెర్ల గురుకులం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలోని ఎస్ఎం పురంలో ఉన్న గురుకులాన్ని కళాశాలగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదించామని చెప్పారు. బొబ్బిలి గురుకులాన్ని కూడా చాలా సంవత్సరాలుగా కళాశాలగా మార్చాలన్న డిమాండ్, ప్రతిపాదనలు ఉన్నందున, ఇక్కడి కమిటీలు, స్థానికులు మంత్రి, ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఎం పురం వద్ద ఉన్న గురుకులానికి చెందిన ప్రభుత్వ భూమి ఇప్పుడు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామన్నారు. మరో 11 ఎకరాలు మిగిలి ఉన్నందున దానిని సంరక్షించుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. గురుకులాల్లో సిబ్బంది కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం గురుకులాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు తాను పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నానని, పరీక్షలు ప్రశాంతంగానే జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్వతీపురం మన్యం జిల్లాలో 1451 క్షయ కేసులు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో 20 పంచాయతీలను క్షయ రహిత పంచాయతీలుగా ఎంపిక చేసి జిల్లాలో 49 డిజిగ్నేటేడ్ మైక్రోస్కోప్ సెంటర్లు, 7 టీబీ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 1451 మందికి క్షయ పాజిటివ్గా గుర్తించారు. వారిలో 1117 మందికి చికిత్స పూర్తి చేశారు. జనవరి 2025 నుంచి ఇప్పటివరకు 507 మందిని గుర్తించి వారికి చికిత్స అందించారు. 700 మంది పౌష్టికాహారం కిట్లుప్రస్తుతం జిల్లాలో ఏడు వందల మంది పౌష్టికాహారం కిట్లు పొందుతున్నారని జిల్లా క్షయ నియంత్ర అధికారి డాక్టర్ ఎం.వినోద్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారిలో కనీసం 10 నుంచి 15 శాతం మందికి కఫం పరీక్షలు చేయాలని ఆదేశించామని చెప్పారు. ఏఎన్ఎం, అశ కార్యకర్తలు క్షయరోగులను పరామర్శించి, మందులు వేసుకుంటున్నారో లేదో గమనించడమే కాకుండా ప్రతి రెండు నెలలకు ఒకసారి ‘కఫం’ పరీక్షకు పంపించాలని సూచించినట్లు చెప్పారు. -
లారీ ఢీకొని భార్యాభర్తల మృతి
సాలూరు: మండలంలోని నెలిపర్తి పంచాయతీ వంగర గుడ్డివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు సాలూరు పట్టణంలో లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వంగరగుడ్డివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు మజ్జి రాము(51), గురిబారి(47)లు సాలూరు పట్టణానికి వచ్చి సొంత పనులు ముగించుకుని ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో పట్టణంలో బైపాస్ రోడ్డు వై జంక్షన్ వద్ద వారి బైక్ను ఒడిశా నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.కాగా ఆ భార్యాభర్తలు విజయవాడలో వలస పనులకు వెళ్లి ఇటీవలే తమ స్వగ్రామానికి వచ్చినట్లు తెలియవస్తోంది. -
వానర సైన్యం!
వామ్మో..టెక్కలి : గూడేం.. టెక్కలి మండలంలోని ఈ గ్రామం పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది కార్గిల్ పోరాట యోధులే. పలువురు సైనికులు అప్పటి యుద్ధంలో పాల్గొని గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఇదే గ్రామం మామిడి పంటకు సైతం ప్రసిద్ధి. ఇక్కడి మామిడిపండ్లకు ఇతర రాష్ట్రాల్లో ఎంతో గిరాకీ. అటువంటి గూడేం గ్రామస్తులకు ఇప్పుడు వానరాల గుంపు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు గానీ గుంపులుగా సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. మామిడి పంటలు, మునగ, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఇళ్లల్లో చొరబడి అకస్మాత్తుగా దాడులకు తెగబడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏటా మామిడి పంటతో లాభాలను చవిచూస్తున్న తమకు ఈ ఏడాది ఈ కోతుల బెడద వల్ల ఇప్పటికే తీవ్రమైన నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖాధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అటవీ శాఖాధికారులు స్పందించి గ్రామంలో కోతుల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు. బెంబేలెత్తిపోతున్న గూడేం గ్రామస్తులు గుంపులుగా తిరుగుతున్న కోతులు మామిడి, మునగ, మొక్కజొన్న పంటలు నాశనం -
ఘనంగా ద్విగళ అష్టావధానం
పాలకొండ: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం శ్రీ సూర్యచంద్ర కళాసాహితి ఆధ్వర్యంలో ద్విగళ అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విక్రాంత్ పాల్గొని అవధాని బంకుపల్లి రమేష్ శర్మ, అవధాన చంద్రమస శతావధాని చంద్రశేఖర శర్మ, అవధాన చంద్రమస శతావధాని సాయికుమార్ శర్మలను సన్మానించారు. విశ్వావసు నామసంవత్సర ఉగాధి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కణపాక చౌదరినాయుడు, సింహచలాచార్య, బౌరోతు శంకరరావు, దిలీప్కుమార్, సాహితి శ్రీనివాసరావు, వెలమల మన్మథరావు, కడగల రమణ, గారాల సూర్యం తదితరులు పాల్గొన్నారు. ఖేలో ఇండియా పారా గేమ్స్లో రజతంవిజయనగరం: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన కిల్లక లలిత సిల్వర్ మెడల్ కై వసం చేసుకుని జిల్లా పేరు మరోసారి మారు మోగించిందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 1200 మంది వరకు పారా క్రీడాకారులు పాల్గొన్నారని, టి–11 కేటగిరికి సంబంధించి 400 మీటర్ల పరుగు పందెంలో గట్టి పోటీ నెలకొన్నప్పటికీ లలిత అసామాన్య ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించడం అభినందనీయమని, ఇది జాతీయస్థాయిలో జిల్లాకు దక్కిన గౌరవమన్నారు. లలిత ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రా ష్ట్రకార్యదర్శి వి. రామస్వామి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, కలెక్టర్ డాక్టర్. బీఆర్. అంబేడ్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావులు అభినందించారని తెలియజేశారు. సీనియార్టీ జాబితా తయారీకి ఏకీకృత విధానం తప్పనిసరిపార్వతీపురంటౌన్: వివిధ జిల్లాలకు చెందిన విద్యాశాఖాధికారులు సీనియార్టీని రూపొందించడంతో ఒకే నిర్దిష్ట నియమాలు అనుసరించకపోవడం వల్ల అనేక పొరపాట్లు జరుగుతున్నాయని ఏపీటీఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి ఎన్. బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల ప్రకారం రూపొందించారని, బదిలీలకు రిజర్వేషన్లు వర్తించవు కాబట్టి బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బదిలీల్లో వ్యక్తిగతంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ, పనిచేసే పాఠశాల హెచ్ఆర్ఏ, పూర్తి సర్వీసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పాయింట్లు కేటాయిస్తారన్నారు. బదిలీల పాయింట్లు సమానంగా వస్తే వయస్సును బట్టి సీనియార్టీ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు సీనియార్టీ రూపొందించడంలో ఒకే నిర్దిష్ట నియమాలు అనుసరించకపోవడం వల్ల పొరపాట్లు జరుగుతున్నాయని, వాటిని సవరించే విధంగా స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంగీత, సాహిత్యాలతో పైడితల్లికి ఘనంగా నీరాజనం విజయనగరం టౌన్: శ్రీ పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 27వ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 22న గురజాడ కళాభారతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సంస్థ వ్యవస్ధాపకుడు ఆర్.సూర్యపాత్రో పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక సంఘం కార్యాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగీత, సాహిత్య కార్యక్రమాలతో పైడితల్లి అమ్మవారికి ఘనంగా నీరాజనాలర్పిస్తూ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదే రోజు అమ్మవారి భక్తిగీతాలపపై భజన సీడీలను ఆవిష్కరిస్తామన్నారు. సంస్థ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త నాలుగెస్సుల రాజు మాట్లాడుతూ పైడిమాంబ కళానికేతన్ సంస్ధ 27వ వార్షికోత్సవానికి ప్రముఖులతో పాటు, పలువురు పెద్దలు హాజరుకానున్నారన్నారు. ఆ రోజు వేకువజామునుంచి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించే సభా కార్యక్రమంలో పలువురిని సముచితరీతిలో సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు తాడిరాజు, తదితరులు పాల్గొన్నారు. శ్రీపైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం వ్యవస్ధాపకుడు పాత్రో -
అప్రమత్తంగా లేకుంటే అక్షయం
● క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే కఫం పరీక్ష చేయించాలి ● 60 ఏళ్లు దాటిన వారు, పొగ తాగేవారికి పరీక్ష అవసరం ● 100 రోజుల క్షయ కార్యక్రమంలో 861 కొత్త కేసులు గుర్తింపు ● నేడు ప్రపంచ క్షయ దినోత్సవంవిజయనగరం ఫోర్ట్: ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందే అంటువ్యాధి క్షయ. క్షయ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. దీని వల్ల వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సోమవారం ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. క్షయ వ్యాధిని గుర్తించి 6 నెలల పాటు మందులు వాడడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. అయితే వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అటువంటి వారికి ప్రాణాలు మీదికి వస్తుంది. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. వ్యాధి లక్షణాలు: రెండు వారాలకు మించి దగ్గు, రెండు వారాలకు మించిన జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతీలో నొప్పి, కఫంలో రక్తపు జీరలు రావడం, రాత్రి పూట చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆలసటగా ఉండటం, మెడ వద్ద వాపులు క్షయ వ్యాధి లక్షణాలు. మైక్రో బాక్టీరియా చుబర్క్యూలోసిస్ అనే బాక్టీరియా వల్ల గాలి ద్వారా ఈ వ్యాప్తి చెందుతుంది. రోగి దగ్గినప్పుడు ఉమ్మి తుంపర్ల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: క్షయ వ్యాధి రాకుండా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, సురక్షతం కాని లైంగిక సంబంధాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. క్షయ వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే మందులను పూర్తి కాలం పాటు వాడాలి. సాధారణ క్షయ వ్యాధికి 6 నెలల పాటు, మధ్యలో మానివేసి తిరిగి ప్రారంభిస్తే 8 నెలల పాటు, మొండి క్షయ వ్యాధికి రెండేళ్ల పాటు మందులు వాడాలి. అలా కాకుండా మందులను మధ్యలో మానివేస్తే రోగ నిరోధక శక్తి క్షీణించి మృత్యవాత పడే ప్రమాదం ఉంది.క్షయ పరీక్ష చేసుకోవాల్సిన వారు: 60 ఏళ్లు దాటిన వారు, సుగర్ వ్యాధి గ్రస్తులు, మద్యం, పొగతాగేవారు. గతంలో క్షయ వ్యాధి మందులు వాడిన వారు, క్షయ వ్యాధి మందులు వాడిన వారి కుటుంబసభ్యులు, ఎత్తుకు తగ్గ బరువు లేని వారు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. 861 కేసులు గుర్తింపు: జిల్లాలో 100 రోజుల టీబీ కార్యక్రమాన్ని 2024 డిసెంబర్ 7 నుంచి మార్చి 23 వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5,59,899 మందిని స్క్రీనింగ్ చేసి 43,413 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. 33, 637మందికి ఎక్స్రే తీయగా 861 క్షయ కేసులు నమోదయ్యాయి. -
వాగ్దేవి సమారాధనం సంస్థ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం
● సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి విజయనగరం టౌన్: విద్యలనగరం విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దివ్యాశీస్సులతో సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణకు వేద సంస్కృతాంధ్ర భాషలలో ఎవరైతే స్థానికంగా విశేష కృషిచేసి ఉంటారో అటువంటి పెద్దలను సముచిత రీతిలో సంస్థ వార్షికోత్సవం రోజున సత్కరించుకునేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు వాగ్దేవి సమారాధనం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ధర్మపురి రోడ్డులో ఉన్న సంస్థ ఆవరణలో ఆదివారం వివరాలు వెల్లడించారు. ఉగాది పర్వదినం, సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణకు వాగ్దేవి సాహిత్య స్రష్ట అనే పురస్కారంతో, డాక్టర్ బొంతు గురవయ్యకు వాగ్దేవి వరపుత్ర పురస్కారంతో సత్కరించుకుంటున్నామని తెలిపా రు. సంస్ధ ప్రధానకార్యదర్శి డాక్టర్ నాగమల్లిక మా ట్లాడుతూ గురజాడ గ్రంథాలయంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజున ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాహిత్య పర్యవేక్షకులు సాహితి, రుగ్వేదాచార్యులు రాంభట్ల సన్యాసిరాజు, శంబర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఊరి బడిని కాపాడుకుందాం...
మన ఊరి బడిని మనమే కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టేందుకు.. బడిని కాపాడుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఏకమవ్వాలని పిలుపునిస్తున్నారు. వీరఘట్టం మండలం కిమ్మి, గడగమ్మ గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం.. అంటూ నినదించారు. దీనికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఆందోళనలో ఆ సంఘ నాయకులు ఎస్.మురళీమోహనరావు, మజ్జి పైడిరాజు, అరసాడ చంద్రమోహన్, కర్రి సింహాచలం, బి.వాసుదేవరావు, శీలా గణేష్తో పాటు కిమ్మి సర్పంచ్ గురాన రామ్మోహనరావు, ఎస్ఎంసీ చైర్మన్ వాన సంతోషమ్మ, గడగమ్మ సర్పంచ్ వి.సూర్యనారాయణ, ఎస్ఎంసీ వైస్ చైర్మన్ పి.దయానంద్, గ్రామస్తులు పాల్గొన్నారు. – వీరఘట్టం -
ఆలయంలో దేవుడి విగ్రహాల ధ్వంసం
● పునర్నిర్మాణ దశలో దుండగుల దుశ్చర్య ● బోడసింగిపేటలో ఘటన ● దుర్గాదేవి, గరుత్మంతుడు విగ్రహాల ధ్వంసం బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామంలో జాతీయ రహదారి 26కు ఆనుకోని పునర్నిర్మాణంలో ఉన్న సీతారామ ఆలయంలో దేవుడి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామంలో గతంలో ఉన్న ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని పునర్నిర్మించేందుకు గ్రామస్తులంతా ఐక్యంగా శ్రీకారం చుట్టారు. పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. పెద్దాపురానికి చెందిన శిల్ప కళాకారులు ఆలయ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇంతలోనే ఆలయం వెలుపల గోడకు ఆనుకోని నిర్మాణ తుది దశలో ఉన్న దుర్గాదేవి విగ్రహంతో పాటు గరుత్మంతుడు విగ్రహాల చేతులు, కాళ్లను దుండగలు ధ్వంసం చేశారు. రోజూలాగే ఆదివారం ఉదయం పనులకు వచ్చిన శిల్ప కళాకారులు విగ్రహాలు ధ్వంసం కావడం చూసి గ్రామ పెద్దలకు విష యం తెలిపారు. సర్పంచ్ కోరాడ జానకీరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ యు.మహేష్ ఆలయం వద్దకు చేరుకొని ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా గ్రామానికి ఆనుకొని రెండు మద్యం దుకాణాలు ఉండడంతో మందుబాబులే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా విగ్రహాల ధ్వంసం విషయం తెలుసుకున్న రాష్ట్ర చిన్న, మధ్య తరహ, ఎన్ఆర్ఐ వ్యవహరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆలయానికి వచ్చి పరిశీలించారు. -
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025
అన్నదాతకు కూటమి పాలనలో అన్నీ కష్టాలే.. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెంచాలని దానికి అనుగుణంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని కూటమి నేతలు కబుర్లు చెప్పారు. తీరా రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో వాణిజ్య పంటల్లో ఒకటైన కోకో సాగు చేశారు. తీరా దిగుబడులు వచ్చేసరికి తనకేమీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తోంది. ఫలితంగా కోకో గింజల కొనుగోలులో కంపెనీలు సిండికేట్గా ఏర్పడి రైతులను నష్టాల నట్టేట ముంచేస్తున్నాయి. అయినా కూటమి పాలకులకు చీమ కుట్టినట్టైన లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. పార్వతీపురం టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక వాణిజ్య పంటల సాగును పెంచండి.. ఆర్థికంగా ఎదగండి అంటూ పిలుపునిచ్చింది. తీరా వాణిజ్య పంటలను సాగు చేస్తున్న రైతులకు ఇప్పుడు అన్యాయం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వాణిజ్య పంటల్లో ఒకటైన కోకో రైతుల్లో ప్రభుత్వ తీరు ఆందోళన కలిగిస్తోంది. కోకో సాగు తరువాత వచ్చిన గింజలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైఖరితో కోకో గింజలను రైతుల వద్దే నిల్వ ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కంపెనీలు వీటిని సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో గింజల నాణ్యత దెబ్బతింటుంది. దీంతో రైతులు తీవ్రంగా కలత చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి ప్రభుత్వం, అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని కోకో రైతులకు న్యాయం చేయకపోతే కంపెనీల మోసాలకు గురై పెద్ద ఎత్తున నష్టపోయి అప్పులు పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఉద్యాన శాఖాధికారులు, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రైతుల వద్ద ఉన్న కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రూ.900 ధర ఇచ్చి కంపెనీలు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంలో మరింత ఆలస్యం అయితే కోకో రైతులు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 600 హెక్టార్లలో.. జిల్లాలో ఎక్కువగా గిరిజన, మైదాన ప్రాంతాల్లో కోకో పంటను పండిస్తున్నారు. మొత్తంగా జిల్లాలో 600 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో దళారుల హవా నడుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ.900 ధర పలుకుతుండగా దళారులు రూ.500 నుంచి 550కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మరీ డిమాండ్ చేస్తే రూ.600 దాటడం లేదు. ఓ వైపు ప్రభుత్వం వాణిజ్య పంటలు పండించాలంటూ ప్రకటనలు చేస్తుందని, పంటలు పండించిన తరువాత గిట్టుబాటు ధర లేకుండా దళారుల పాలవ్వడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్నాణ్యత ప్రమాణాలు పాటించాలి ధర లేక దిగాలు..! పడిపోయిన ధర అంతర్రాష్ట్ర మార్కెట్లో కిలో రూ.900 స్థానిక మార్కెట్లో రూ.600లే.. జిల్లాలో 600 హెక్టార్లలో పంట సాగు రైతులను నష్టపరిచే చర్యలను అరికట్టాలి కంపెనీలు సిండికేట్గా మారి రైతులను నష్టపరుస్తున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని అరికట్టాలి. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న కోకో గింజలను కొనుగోలు చేయాలి. రూ.900లకు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. జిల్లాలో ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోవాలి. – ఎస్.సత్యనారాయణ, సుంకి గ్రామం, గరుగుబిల్లి మండలం ప్రభుత్వం కొనుగోలు చేయాలి కోకో గింజలను కంపెనీలు కొనుగోలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే గింజలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. కోకో గింజల కొనుగోలు కంపెనీలతో అధికారుల సమక్షంలో కోకో రైతులు, రైతు సంఘాలతో సమావేశాలు నిర్వహించి సమస్యను పరిష్కరించాలి. దళారుల చేతికి పంట వెళ్లకుండా ప్రభుత్వం రూ.900లకే కొనుగోలు చేయాలి. – ఎం.సత్యంనాయుడు, పార్వతీపురం కోకో పంట దిగుమతులు వచ్చే సమయంలో రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. జిల్లాలో 600 హెక్టార్లలో ప్రస్తుతం పంట సాగవుతుంది. ధర హెచ్చతగ్గుల విషయంలో అధికారులు కమిటీ వేశారు. కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా ధర ఉంటుంది. రైతులకు మేలు చేకూరేలా పంట కొనుగోలు చేసేలా చర్యలు చేపడతాం. – శ్యామల, జిల్లా ఉద్యాన శాఖాధికారిని, పార్వతీపురం మన్యం -
ఉపశమనం ఇచ్చిన చిరు జల్లులు
భామిని: మండలంలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన చిరు జల్లులతో వాతావరణం కాస్త చల్లబడింది. రోజంతా మబ్బులు పట్టి సాయంకాలానికి చిరు జల్లులు కురువడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో కురిసిన వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది. యువతకు పీఎం ఇంటర్న్షిప్ : కలెక్టర్ పార్వతీపురం టౌన్: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకొవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువుందని తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, డిప్లమో, బీటెక్ ఉత్తీర్ణులైన వారు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 500కు పైగా ప్రముఖ పరిశ్రమలలో ఇంటర్న్షిప్ పొందవచ్చని సూచించారు. వయస్సు 21 నుంచి 24 మధ్య ఉండాలని, ఏడాదికి కుటుంబ ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉండాలని తెలిపారు. ఏడాది పాటూ జరిగే ఈ శిక్షణకు ఎంపికై న వారికి నెలకు రూ.5000 స్టైఫండ్ లభిస్తుందని, అలాగే ఒకే మొత్తంగా రూ.6000 ప్రొత్సాహకాన్ని కూడా అందజేయడం జరుగుతుందని వివరించారు. ఎంపికై న వారికి ప్రధానమంత్రి జ్ఞానజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల కింద బీమా రక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు. వివరాలకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చనని సూచించారు. మే 1 నుంచి సాలూరు – విశాఖ పాసింజర్ రైలు! బొబ్బిలి: సాలూరు – విశాఖ పాసింజర్ రైలు మే 1 నుంచి నడపనున్నట్టు రైల్వే వర్గాల ద్వారా తెలిసింది. ఈ రైలు రోజుకు రెండు సార్లు విశాఖ, సాలూరు మధ్య బొబ్బిలి జంక్షన్ మీదుగా నడవనుంది. చాలా ఏళ్లుగా ఇక్కడ ఉన్న బొబ్బిలి రైల్ బస్సు కొన్ని ట్రిప్పులను బొబ్బిలి – సాలూరు మధ్య నడిపేవారు. నిత్యం కిక్కిరిసే ప్రయాణికులతో నడుస్తున్న ఈ రైల్బస్ కరోనా కారణంగా రైల్వే అధికారులు నిలిపివేశారు. అనంతరం సాధారణ రైళ్లు, ఎక్స్ప్రెస్లు, గూడ్స్ రైళ్లు పట్టాలెక్కినా రైల్బస్ను రైల్వే వర్గాలు నడపలేదు. కొన్నాళ్ల కిందట రైల్వే వర్గాలు విశాఖ, సాలూరు మధ్య బొబ్బిలి మీదుగా రైలును నడపనున్నట్టు ప్రకటించాయి. దీనికోసం రైలు ట్రాక్ను పటిష్టపరిచారు కూడా! చివరకి మళ్లీ వాయిదా పడింది. అయితే ఈ రైలును ఈ ఏడాది మే 1 నుంచి నడపనున్నట్టు తెలుస్తోంది. రైల్వే సాంకేతికాఽధికారులు సాలూరు లైన్ వద్ద ఆదివారం గేటును అమర్చారు. బొబ్బిలి నుంచి రైలు బయలుదేరిన వెంటనే రాజ్మహల్ వద్ద లెవెల్ క్రాసింగ్ ఉంది. ఇక్కడ క్యాబిన్ను కూడా నిర్మించి ఇప్పుడు గేటు కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయమై రైల్వే సాంకేతికాధికారులు మే 1 నుంచి విశాఖ, సాలూరు రైలును నడపనున్నట్టు వెల్లడించారు. ఘనంగా నృత్య కళాభారతి వార్షికోత్సవం విజయనగరం టౌన్: భారతీయ విద్యాకేంద్ర నిర్వహణలోని నృత్య కళాభారతి ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాన్ని నిర్వహించారు. నృత్య కళాభారతి నుంచి గుమ్చీ, శంకరమఠం, కోట మీదుగా బీవీకే పాఠశాల వరకూ తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పాఠశాలలో త్యాగరాజ స్వామి పూజాకార్యక్రమం, పంచరత్న సేవ అనంతరం త్యాగరాజ విరచిత పంచరత్న కీర్తనలను కళాకారులు ఆలపించారు. కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ఎం.ఏడుకొండలు ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో మహారాజా సంగీత, నృత్య కళాశాల అధ్యక్షులు కెఎవిఎల్ఎన్. శాస్త్రి పట్టణానికి చెందిన కళాకారులు ఎం.నీలాద్రిరావు, రాంచరణ్, పద్మావతి, రామచంద్ర శేఖర్, పద్మప్రియ, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు. -
బోడసింగిపేటలో చోరీ
బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామంలో గిట్టుపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో శనివారం వేకువజామున ఒక దుకాణంలో చోరీ జరిగింది. దుకాణంలో కొంత నగదుతో పాటు విలువైన కిరాణా సామగ్రి అపహరించుకుపోయారు. కనిమెరక గ్రామానికి చెందిన జి.శ్రీనివాస్ గుప్తా బోడసింగిపేటలో కిరాణా దుకాణాన్ని కొన్నాళ్లుగా నడుపుతున్నాడు. రోజూలాగే శుక్రవారం రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం వచ్చి చూడగా దుకాణం షట్టర్లు పగులకొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ యు.మహేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారారాలను సేకరించారు. దుకాణంలో ఉంచిన రూ.12వేల నగదుతో పాటు రూ.13 వేల విలువ చేసే కిరాణా వస్తువులు అపహరించుకుపోయినట్టు బాధితుడు గుప్తా తెలిపాడు. బెల్లం ఊట ధ్వంసం సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని కుశిమిగూడ పరిధిలో మూడు వేల లీటర్ల పులిసిన బెల్లం ఊటలు శనివారం ధ్వంసం చేసినట్టు ఎస్ఐ వై.అమ్మన్నరావు శనివారం తెలిపారు. సారా వంటకాలు చేస్తున్నారనే సమాచారం అందడంతో దాడులు జరిపినట్టు తెలిపారు. భూమిలో డ్రమ్ములతో పాతి ఉంచిన బెల్లం ఊటలు వెలికి తీసి పారబోసి, డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాసంగిలో గజరాజుల గుంపు జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి పంట పొలాల్లో గజరాజుల గుంపు శనివారం సాయంత్రం కనిపించాయి. ఉదయం వెంకటరాజపురం, బాసంగి, గదబవలసలో వరి పంటలను ధ్వంసం చేసిన గజరాజులు సాయంత్రానికి బాసంగి పరిసర ప్రాంతాల్లోకి చేరాయి. రాత్రికి మళ్లీ వెంకటరాజపురం, గవరమ్మపేట గ్రామాల్లోకి చొచ్చుకు రావడంతో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. రబీ వరి పంట ఉభాలు వేసి నెల రోజులు కావడంతో పంటలను ధ్వంసం చేస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 258 కేజీల గంజాయి స్వాధీనం పాచిపెంట: మండలంలో రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్ వద్ద పట్టుబడిన గంజాయిని చూపించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం మండలంలో కొటికిపెంట పంచాయతీ గోగాడవలస సమీపంలో హరిత రహదారిపై అనుమానాస్పదంగా రెండు కార్లు ఉన్నాయని మాతుమూరు ఇంచార్జ్ వీఆర్ఓ తమకు సమాచారం ఇచ్చారని తెలిపాడు. ఈ మేరకు పాచిపెంట ఎస్ఐ వెంకటసురేష్ సిబ్బందితో ఆ ప్రదేశానికి వెళ్లి కార్లలో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
డయేరియా బాధితులకు ఆర్థిక సాయం
సాక్షి ప్రతినిధి, విజయనగరం/గుర్ల: డయేరియా ప్రబలి గత ఏడాది అక్టోబరులో 13 మంది ప్రాణాలు కోల్పోతే వారిలో పది మంది తాలూకు కుటుంబసభ్యులకు మాత్రమే జనసేన పార్టీ ఆర్థిక సాయం అందింది. ఐదు నెలల కిందట గుర్లలో పర్యటన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్ల డయేరియా మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గుర్లలో శనివారం నెల్లిమర్ల ఎమ్మెల్యే (జనసేన) లోకం నాగమాధవి, ఆమె భర్త లోకం ప్రసాద్ ఆధ్వర్యంలో చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ఎంఎస్ఎంఈ చైర్మన్ టి.శివశంకర్ పాల్గొన్నారు. గుర్ల అంటే గుర్లలో వారికి మాత్రమే... గత ఏడాది అక్టోబరులో గుర్ల మండల కేంద్రంతో పాటు సమీపంలోని కోటగండ్రేడు, నాగళ్లవలస గ్రామాల్లోనూ డయేరియా విజృంభించింది. దీంతో గుర్లలో పది మంది, కోటగండ్రేడులో ఒకరు, నాగళ్లవలసలో ఇద్దరు చనిపోయారు. కానీ కూటమి ప్రభుత్వం కోటగండ్రేడుకు చెందిన మరడాన అప్పలనర్సమ్మ ఒక్కరే డయేరియా కారణంగా చనిపోయారని ప్రకటించి చేతులు దులుపుకుంది. వైఎస్సార్సీపీ తరఫున రూ.2 లక్షల చొప్పున 13 మంది కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం చేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది నవంబరు 26న శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడైన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చెక్కులు అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జనసేన తరఫున కేవలం పది మంది కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన డయేరియా మృతురాలు అప్పలనర్సమ్మ కుటుంబాన్ని జనసేన విస్మరించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ గుర్ల అన్నారని, ఆ గ్రామంలోని పది మంది కుటుంబాలకు మాత్రమే చెక్కులిచ్చి సరిపెట్టడం చర్చనీయాంశమైంది. పది మంది మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందజేత -
పట్టుమని 20 నిమిషాలు వస్తే ఒట్టు...
తాగునీరా.. మురుగునీరా? సాలూరు రూరల్: సాలూరు పట్టణంలో రెండు దశాబ్దాల క్రితం వేసిన పైప్లైన్లు కావడంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. ఫలితంగా కుళాయిల ద్వారా వస్తున్న తాగునీటిలో బురద, నలకలు ఉంటున్నాయి. పట్టణ వాసులకు స్వచ్ఛమైన నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు. సాలూరులో సరఫరా అవుతున్న కలుషిత నీరు సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో వేసవి ఆరంభంలోనే దాహం కేకలు వినిపిస్తున్నాయి. ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందజేస్తామంటూ ప్రభుత్వ యంత్రాంగం చెబుతున్న మాటలు ఆచరణ దూరంగా ఉంటున్నాయి. తాగునీరు అందక ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. పార్వతీపురం పురపాలక సంఘంలో నాలుగు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్న పరిస్థితి నెలకొంది. సాలూరు పురపాలక సంఘంలో నీటిలో కాలువ వ్యర్థాలు వస్తుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాలు సైతం గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు వెచ్చించి.. ఇంటింటికీ కుళాయిలు వేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ట్యాంకుల్లో నీటి సరఫరా చేయక, నిరుపయోగంగా వదిలేశాయి. జిల్లాలో నీటి సమస్యను అరికట్టేందుకు వాటర్ గ్రిడ్కు సన్నాహాలు చేస్తున్నారు. 15 మండలాలకు నీటిని అందించడానికి తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్ జలాశయాలను గుర్తించారు. భామిని, సీతంపేట మండలాలకు హిరమండలం బ్యారేజీ నుంచి ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.2వేల కోట్లకుపైగా వ్యయమవుతోందని అంచనా వేస్తున్నారు. ఇది ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో చూడాలి. ప్రకటనలకే పరిమితం వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తుందే తప్ప.. ఆచరణలో సాధ్యం కావడం లేదు. క్రాస్ ప్రొగ్రాం అంటూ అన్ని మండల కేంద్రాల్లో యంత్రాంగం చేసిన హడావిడి కొద్దిరోజులకే పరిమితమైంది. వేసవి ప్రారంభంలోనే తాగునీటికి ఇంత ఇబ్బంది ఉంటే రానున్న రెండు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని గిరిజన, పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో జల్జీవన్ మిషన్ పథకం పనులు ప్రారంభిస్తే.. అందులో చాలా వరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలుపు చేసింది. జిల్లాలో మొత్తం 3,302 వరకు పనులు మంజూరు కాగా.. దాదాపు రూ.526 కోట్లు కేటాయింపులు చేశారు. ఇందులో వివిధ కారణాలను చూపి 2,013 పనులను కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు చేయడం గమనార్హం. ఫలితంగా ఈ వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. పాలకొండలో దాహం కేకలు పాలకొండ: పాలకొండ నగర పంచాయతీలో సుమారు 38 వేల మంది జనాభా ఉంటే.. తాగునీటి సరఫరా రోజుకు 6 లక్షల లీటర్ల దాటి జరగడం లేదు. వాస్తవానికి రోజుకు 20 లక్షల లీటర్ల వరకు తాగునీటిని జనాభా ప్రాతిపదికన అందించాల్సి ఉంది. వేసవి వస్తే పట్టణంలోని కొత్తగా ఏర్పడిన కాలనీలకు నీటి సరఫరా జరగడం లేదు. ఒక్కొక్క రోజు ఒక్కో ప్రాంతానికి నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. వేసవిలో పైపులైన్ మరమ్మతులు జరిగితే రెండుమూడు రోజులపాటు పూర్తిగా బంద్ కావాల్సిందే. 50 ఏళ్ల నాటి పైపులైన్లు కావడంతో కాలువల్లో ఉన్న పైపులు శిథిలమై కుళాయిల ద్వారా మురుగు, బురదనీరు వస్తోంది. గారమ్మకాలనీ, బుట్టిమటం కాలనీలకు కనీసం పైపులైన్లు వేయని దుస్థితి నెలకొంది. నాన్అమృత్ పథకం ద్వారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.57లక్షలు మంజూరు చేసి పైపులైన్ సిద్ధం చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పైపులైన్లను గాలికి వదిలేసింది. గుమ్మలక్ష్మీపురం: కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండల కేంద్రంలో గల ఎస్సీ, ఎస్టీ వీధులకు సక్రమంగా తాగునీటి సరఫరా జరగక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రెండురోజులకోసారి కుళాయిల ద్వారా తాగునీరు కేవలం 20 నిమిషాలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. రోజూ తాగునీటి సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో రెండురోజులకోసారి నీటి సరఫరా అవుతోంది. వేసవి దృష్ట్యా ప్రతిరోజూ కనీసం ట్యాంకుల ద్వారా అయినా సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
యథేచ్ఛగా విక్రయాలు..!
ఇదీ పరిస్థితి పాలకొండ పట్టణంలో కొన్నాళ్ల వరకు ప్లాస్టిక్పై నిషేధం విధించినా.. తర్వాత అధికారులు పట్టు సడలించటంతో మళ్లీ మొదటికి వచ్చింది. గతంలో 50 కేసులు నమోదు చేసి సుమారు రూ.40 వేలు అపరాధ రుసుము వసూలు చేశారు. తర్వాత ఈ అంశంపై పటిష్ట చర్యలు చేపట్టకపోవడంతో పాలకొండలో పాలథీన్ నిషేధం అటకెక్కింది. పార్వతీపురం పట్టణంలో వీటి వినియోగం భారీగా ఉంటోంది. మొత్తం చెత్త ఉత్పత్తిలో 30–40 శాతం భాగం దీనిదే. ఇప్పటి వరకు కేవలం 45 కేసులు నమోదు చేసి రూ.85 వేలు మాత్రమే అపరాధ రుసుం విధించటం దీనికి తార్కాణం. అయినా ప్లాక్టిక్ వినియోగం తగ్గలేదు. కురుపాం నియోజకవర్గానికి ఒడిశా నుంచి భారీగా పాలథీన్ సంచులు, తదితరాలు చేరుకుంటున్నాయి. పాలథీన్ నిషేధంలో సాలూరు నగర పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్లాస్టిక్ అమ్మకాలపై కఠిన చర్యలు చేపడితే, వినియోగం క్రమేపీ తగ్గుతుందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. -
20.16 లక్షల మొక్కల పెంపకం
వీరఘట్టం: జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ఈ ఏడాది 18 నర్సరీల్లో 20.16 లక్షల మొక్కలు పెంచాలన్నది లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా అటవీశాఖ అధికారి జి.ఎ.పి. ప్రసూన అన్నారు. వీరఘట్టం మండలం రేగులపాడులో కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీను ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మొక్కల పెంపకం బాధ్యతను అటవీ సెక్షన్, బీట్ ఆఫీసర్లకు అప్పగించామన్నారు. ప్రస్తుతం పాలకొండ రేంజ్ పరిధిలో 20,507 హెక్టార్లు, కురుపాం రేంజ్ పరిధిలో 32,681 హెక్టార్లు, పార్వతీపురం రేంజ్లో 26,301 హెక్టార్లు, సాలూరు రేంజ్లో 28,230 హెక్టార్లు కలిపి జిల్లా మొత్తం 1,07,719 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయన్నారు. వన నర్సరీల్లో పెంచే మొక్కలను ఈ ఏడాది జిల్లాలోని పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, సీతానగరం, వీరఘట్టం, సీతంపేట, భామిని, పాలకొండ అటవీ ప్రాంతాల్లో నాటించి అటవీ విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. త్వరలో కుంకీ ఏనుగులను తెప్పించి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న 11 ఏనుగుల గుంపును సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ఏర్పాటుచేస్తున్న తాత్కాలిక ఎలిఫెంట్ జోన్కు తరలించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆమె వెంట పాలకొండ రేంజర్ కె.రామారావు, వీరఘట్టం సెక్షన్ ఆఫీసర్ పి.రవిబాబు, సోషల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సోమేశ్వరరావు, తదితరులు ఉన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన -
పది మూల్యాంకనం నుంచి మినహాయింపు ఇవ్వాలి
విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం విధుల్లో మినహాయింపు కోరిన ఉపాధ్యాయులకు అనుమతి ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కమిటీ సభ్యులు ఈ మేరకు శనివారం డీఈఓ యు.మాణిక్యంనాయుడుని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పదో తరగతి సబ్జెక్టు టీచర్లను మూల్యాంకనం విధుల్లో వేసినపుడు తొలిత ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేయాలని కోరారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అనుమతి ఇస్తూ ఇంకా అవసరం ఉన్న పరిస్థితులను గుర్తించిన తరువాతే తప్పనిసరి విధులుగా కేటాయించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో చేపడుతున్న సీనియారిటీ అభ్యంతరాలను సమర్పించడానికి గడువు పెంచాలని కోరారు. డీఈఓని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు డి.శ్రీనివాస్, ఉత్తరాంధ్ర మీడియా ఇన్చార్జ్ బంకపల్లి శివప్రసాద్, పట్టణ కమిటీ అధ్యక్షుడు చిట్టి రామునాయుడు, రావాడ రామకృష్టణ, రెడ్డి శంకరరావు, లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. డీఈఓకి పీఆర్టీయూ జిల్లా కమిటీ వినతి -
ఆరోగ్యశ్రీ రోగికి డబ్బుల చెల్లింపు
విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం వర్తించినప్పటకీ రోగుల నుంచి ఇంప్లాట్స్ పేరిట అదనపు వసూళ్లకు పాల్పడుతున్న వైనంపై ఈ నెల 17న సాక్షిలో ‘ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అదనపు వసూళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు. పట్టణంలోని గాయత్రి ఆస్పత్రిలో వెన్నుపూస శస్త్రచికిత్స చేసుకున్న రోగి గోవింద నుంచి సిబ్బంది రూ. 25 వేలు వసూలు చేశారు. ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ జనార్దనరావు, ఆరోగ్యమిత్ర మురళీధర్ ఆస్పత్రి ప్రతినిధుల నుంచి రూ. 25 వేలు వసూలు చేసి బాధిత వ్యక్తికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. -
ఫారంపాండ్స్తో భూగర్భజలాల పెంపు
గరుగుబిల్లి: ఫారంపాండ్ల నిర్మాణంతో వాననీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా గరుగుబిల్లి మండలం కొంకడివరం గ్రామంలో ఉపాధిహామీ నిధులతో నిర్మించిన సామూహిక ఫారంపాండ్స్ పనులను ఆయన శనివారం పరిశీలించారు. గ్రామంలో కొత్తగా ఫారంపాండ్ నిర్మాణం పనులను ఆయన గునపాంతో తవ్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్త ప్రాణకోటికి జలమే జీవనాధారమని, జలాల ఆవశ్యకతను తెలుసుకొని వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. భూగర్భ జలాలను పెంపొందించుకోకుంటే భవిష్యత్లో నీటి కష్టాలు తప్పవన్నారు. భావితరాలకు నీటి కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. గ్రామంలో ఫారంపాండ్ పను లు ప్రారంభించిన రైతు అల్లు తిరుపతినాయుడును కలెక్టర్ దుశ్శాలువతో సత్కరించారు. ఆయిల్ పామ్ సాగును పెంచాలి ఆయిల్పామ్ సాగును పెంపొందించేందుకు రైతు లు ముందుకు రావాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ రైతులకు పిలుపునిచ్చారు. మండలంలోని కొంకడి వరంలో సర్పంచ్ అల్లు అప్పలనాయుడు సాగుచేస్తున్న ఐదెకరాల ఆయిల్ పామ్ పంటను పరిశీలించి అభినందించారు. రైతులు వాణిజ్య పంటలపై ఆసక్తి చూపాలన్నారు. ఉద్యానవన పంటలను సాగుచేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె. రామచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఓ.ప్రభాకరరావు, తహసీల్దార్ పి.బాల, ఎంపీడీఓ జి.పైడితల్లి, సర్పంచ్ అల్లు అప్పలనాయుడు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ -
పీఎం ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకోవాలి
విజయనగరం అర్బన్: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కార్యక్రమానికి నిరుద్యోగ యువత ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. దీనికి సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పది ఆపై తరగతులు ఉత్తీర్ణులైన వారంతా ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 550 పరిశ్రమల్లో వీరికి శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టరేట్ చాంబర్లో శనివారం జరిగింది. ముందుగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ యువత నైపుణ్యాన్ని పెంచేందుకు, ఉపాధి కల్పించేందుకు జిల్లాలో తీసుకున్న చర్యలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యువత నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎ.కళ్యాణ చక్రవర్తి, సీపీఓ పి.బాలాజీ, మెప్మా పీడీ చిట్టిరాజు, జిల్లా ఉపాధి అధికారి అరుణ తదితర అధికారులు పాల్గొన్నారు. పనస చెట్లను విరివిగా పెంచాలి బొబ్బిలి వీణల తయారీకి ఉపయోగించే పనస కలప కొరత ఉందని, దీనిని నివారించేందుకు విస్తృతంగా పనస చెట్లను పెంచాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. పనస నర్సరీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే అటవీ శాఖకు ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఉపాధి హామీ, కన్వర్జెన్నీ పనులు, పల్లె పండగ, ఉల్లాస్ పరీక్ష తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఏపీఓలు, పీఆర్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫారమ్ పాండ్స్ తవ్వడానికి జిల్లాలో శనివారం నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి డ్వా మా పీడీ ఎస్.శారదాదేవి, పంచాయితీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
ఒడిశా ఆగడాలపై తహసీల్దార్కు ఫిర్యాదు
సాలూరు రూరల్: ఒడిశా ప్రభుత్వం కొటియా గ్రామాల గిరిజనులపై చేస్తున్న దౌర్జన్యాన్ని నిలువరించాలని తహసీల్దార్ రమణమూర్తికి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కమిటీ సభ్యుడు తాడంగి సన్నం, బాధిత గిరిజనుడు తాడంగి భీమ మాట్లాడుతూ కొటియా గిరిజన గ్రామాల గిరిజనుల భూములను ఆక్రమించి కంచె వేస్తున్న ఒడిశా అధికారులను ఆంధ్రా అధికారులు అడ్డుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పొడు పట్టా భూముల్లో దౌర్జన్యంగా కంచె వేస్తుంటే అడ్డుకున్న గిరిజనులపై ఒడిశా అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. తమపై ఒడిశా అధికారులు దౌర్జన్యం చేస్తుంటే ఆంధ్రా అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోయారు. కొటియా గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.ఉగాది కాదు.. ఇది కూటమి దగా! శృంగవరపుకోట : రానున్న ఉగాది వలంటీర్లకు కూటమి ప్రభుత్వం చేసే దగా.. అని ఏపీ గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దేవరాజు అన్నారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ వలంటీర్ల వ్యవస్థను పటిష్టం చేస్తామని, రూ.10వేల వేతనం ఇస్తామని ఇప్పుడు మాట తప్పారన్నారు. ఎన్నికల్లో గెలుపొందాక వలంటీర్ల వ్యవస్థకు చట్టబద్దత లేదని మాట మార్చారన్నారు. కూటమి సర్కారును నిలదీసేందుకు ఈ నెల 30వ తేదీన ఆందోళన కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. బాబు అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థపై గొడ్డలి వేటు వేశారన్నారు. -
ప్రజలు సహకరించాలి
ప్లాస్టిక్ చేతి సంచులు, కవ ర్లు నగరంలో నిషేధించాం. ప్రజలు తమ వంతు సహకారం అందించాలి. వ్యాపా రులు పర్యావరణానికి హాని చేకూరని చేతి సంచులను విక్రయించాలి. ప్రజలు గుడ్డ చేతి సంచుల వినియోగించి ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్టేందుకు సహకరించాలి. – శ్యామ్ ప్రసాద్, కలెక్టర్, పార్వతీపురం మన్యం కఠిన చర్యలు తప్పవు ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గించాలి. వాడిన వాటిని చెత్త కుప్పల్లో, కాలువల్లోకి వదిలేస్తున్నారు. నిషేధం పక్కాగా అమలు చేస్తాం. స్వర్ణాంధ్రా–స్వచ్ఛాంధ్రా కార్యాక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పక్కాగా చర్యలు చేపడతాం. – టి.జయరాం, నగర పంచాయతీ కమిషనర్,పాలకొండ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.. నిషేధిత ప్లాస్టిక్ సంచుల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై తరచూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్లాస్టిక్ సంచులు విక్రయించే వ్యాపారులతో కూడా మాట్లాడాం. నిషేధిత ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. – బి.వెంకటరమణ, ఎంపీడీఓ, వీరఘట్టం -
బాడీ బిల్డింగ్ పోటీలకు సిద్ధం
పార్వతీపురం టౌన్: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుల గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం జరగనున్న 31వ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఆర్నాల్డ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. రెండోసారి మన్యం జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించనుండడంతో పోటీదారుల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి 200 మంది బాడీ బిల్డర్లు పోటీ పడనున్నట్టు నిర్వాహకులు హరిశంకర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31వ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించేందుకు అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. పోటీలకు సంబంధించి 16 మంది న్యాయ నిర్ణేతల నిర్ణయం తుది తీర్పుగా భావించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోటీదారులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. -
నాలుగు రోజులకోసారి నీటి సరఫరా..
పార్వతీపురం టౌన్/రూరల్/బలిజిపేట: పార్వతీపురం పట్టణంలో నాలుగురోజులకోసారి కుళాయిల ద్వారా నీటి సరఫరా అవుతోంది. అది కూడా 20 నిమిషాల్లోపే. అరకొర నీరు ఎలా సరిపోతుందంటూ పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్కు ఆనుకుని ఉన్న వీధుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కొద్దిరోజుల క్రితం పీజీఆర్ఎస్ కార్యక్రమంలోనూ ఇదే సమస్యపై మహిళలు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ ఆవరణలో ధర్నాలు సైతం చేశారు. దీనికితోడు పలు వీధుల్లో కుళాయిల ద్వారా బురదనీరు వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని డోకిశీల, గోచెక్క తదితర గిరిజన గ్రామాల్లో తాగునీరు సమయానికి సరఫరా చేయకపోవడంతో నూతులు, వాగులకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బలిజిపేట మండలం తుమరాడ, బర్లి గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. మహిళలు ఖాళీ బిందెలతో నిరసనలు తెలిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పార్వతీపురం మండలంలో డోకిశీల గ్రామంలో తాగునీటి ఎద్దడి కారణంగా మహిళలు సమీపంలోఉన్న ఆశ్రమ పాఠశాలకు వెళ్లి ప్రతి రోజూ తాగునీరు తెచ్చుకునే పరిస్థితి ఉంది. -
27న విజ్ఞాన యాత్ర
పార్వతీపురంటౌన్: విజ్ఞాన యాత్రలో భాగంగా ఈ నెల 27న ఒడిశా రాష్ట్రం రాయగడలోని ఆరు ప్రాంతాలను విద్యార్థులు సందర్శించనున్నారు. ఈ మేరకు సైన్స్ ఎక్స్పోజర్ విజిట్ వాల్పోస్టర్ను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్తో పాటు విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు శనివారం ఆవిష్కరించారు. రాయగడ పరిసర ప్రాంతాల్లోని మినరల్ వాటర్ ప్లాంట్ అండ్ బేవరేజ్ లిమిటెడ్, జె.కె.పేపర్ మిల్లు, నాగావళి ప్లాంటోరియం అండ్ సైన్స్ మ్యాజియం, పీమాకేం లైమ్స్టోన్ ఇండస్ట్రీ, ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో ఎల్లాయిస్ లిమిటెడ్, ఫారంపాత్ సందర్శన కోసం జిల్లా నుంచి 130 మంది విద్యార్థులతో పాటు 30 మంది ఉపాధ్యాయులు వెళ్లనున్నారు. కార్యక్రమంలో డీఈఓ ఎన్.తిరుపతినాయుడు, జిల్లా సైన్స్ అధికారి లక్ష్మణ్, సమగ్ర శిక్ష ఏసీపీ ఆర్.శంకర్, తదితరులు పాల్గొన్నారు. 25 వరకు గడువు పెంపు పార్వతీపురం: బీసీ వర్గాలకు మంజూరు చేసే స్వయం ఉపాధి యూనిట్ల దరఖాస్తు గడువును ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.గడ్డెమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని బీసీ, ఈబీసీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల వారు హెచ్టీటీ పీఎస్://ఏపీఓబీఎంఎంఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులను సమర్పించాలన్నారు. సమర్పించిన దరఖాస్తులను ఆయా మండలాల్లోని ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్కు అందజేయాలని పేర్కొన్నారు. ఏనుగుల జోన్ వద్దు సీతానగరం: మండలంలోని అమ్మాదేవి కొండ చుట్టూ ఉన్న ప్రజల ప్రాణాలకు ముప్పుతేచ్చే ఏనుగుల జోన్ ఏర్పాటుకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏనుగుల జోన్ ఏర్పాటుచేసి వ్యవసాయం చేయకుండా చేయొద్దన్నారు. రైతుల పొట్టకొట్టొద్దంటూ నినదించారు. జోన్ ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బి.అప్పా రావు, రెడ్డి వేణు, ఈశ్వరరావు, రమణమూర్తి, వెంకటరమణ, రాంబాబు, పి.సింహాచలం, తవుడన్న, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. క్షయ నిర్మూలనలో భాగస్వాములు కావాలి పార్వతీపురంటౌన్: క్షయ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ కోరారు. ఈ నెల 24న ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో శనివారం పోస్టర్ విడుదల చేశారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేసి క్షయ వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో కఫం పరీక్షలు, ఎక్స్రే యంత్రాలు, సిబినాట్, 19 ఆర్టీపీసీఆర్ టీబీ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయ న్నారు. వ్యాధిగ్రస్తులకు 6 నెలలకు సరిపడా మందులు ఇవ్వడంతో పాటు ప్రతినెల రూ. 1000 చొప్పున ఖాతాలో జమచేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్రావు, జిల్లా క్షయ నియంత్రణ అధికారి వినోద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు స్థానిక ఎస్సై పి.రమేష్ నాయుడు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. తోటపల్లి ప్రాజెక్టు నాల్గవ గేటు వద్ద యువకుడి మృతదేహం తేలియాడుతూ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని బయటకు తీసిన తరువాత మృతుడిని పార్వతీపురం పట్టణంలో గల జగన్నాథపురం ప్రాంతానికి చెందిన ఆలవెల్లి రాజా(26)గా గుర్తించారు. ఈనెల 19 బుధవారం ఉదయం నుంచి కుమారుడు ఆలవెల్లి రాజా ఆచూకీ లేకపోవడంతో తండ్రి శ్రీనివాసరావు పార్వతీపురం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా శుక్రవారం తోటపల్లి జలాశయం వద్ద రాజా మృతదేహం లభ్యమైంది. మృతికి గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
టూరిజం ఛాయా చిత్ర పోటీలు
పార్వతీపురంటౌన్: ఉత్తమ పర్యాటక ఛాయాచిత్రాలను పర్యాటకశాఖ ఆహ్వానిస్తోందని టూరిజం అధికారి ఎన్.నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫొటోగ్రాఫర్లు, కథకులు, ప్రభావశీలురు, పౌరులు భారతదేశ సాంస్కృతిక, సహజవారసత్వ సారాంశాన్ని సంగ్రహించే ఉత్తమ ఛాయా చిత్రాలను సమర్పించాలని కోరారు. పర్యాటక మంత్రిత్వశాఖ దేఖో అపనా దేశ్– పీపుల్ చాయిస్ –2024 నినాదం కింద మార్చి 7న దేఖో అపనా దేశ్ ఫోటో కాంటెస్ట్ను ప్రారంభించిందని దేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన పర్యాటక ప్రాంతాల గొప్పతనాన్ని చాటండం, ప్రవర్శించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అన్ని రాష్ట్రాలు తమ చురుకై న భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందని, పర్యాటక గమ్యస్థానాలు, తమ పర్యాటక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు, సందర్శకులను ఆకర్షించడానికి ఇది ఒక విలువైన వేదిక కానుందని తెలిపారు. ఎంట్రీల సమర్పణకు చివరితేది ఏప్రిల్ 7 అని తెలిపారు. స్థానిక ఫొటోగ్రాఫర్లు, పౌరులు, టూరిజం బోర్డుల ఇతర సంబంధిత భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి మంచి అవకాశఽమని తెలియజేశారు. -
శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
పార్వతీపురం రూరల్: పోలీస్ సిబ్బంది విధుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను విజ్ఞాపనల ద్వారా స్వీకరించి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం తన కార్యాలయంలో పోలీస్శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది విన్నవించిన సమస్యల్లో సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని తక్షణమే పరిష్కరిస్తామని వెంటనే పరిష్కారం కాని సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామన్నారు. అలాగే సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ సిబ్బందికి వృత్తి, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సిబ్బందికి ప్రత్యేకంగా గ్రీవెన్స్డేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వచ్చిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీసీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి, పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని చెప్పారు. ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శనవేపాడ: మండలంలోని బానాది గ్రామంలో అభయాంజనేయస్వామి తీర్థం సందర్భంగా నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ పరుగు ప్రదర్శనలో 12 గుర్రాలు పాల్గొన్నాయి. వాటిలో రామన్న పాలెంకు చెందిన విక్రమ్ గుర్రం ప్రథమస్థానంలో నిలిచి రూ.12 వేలు, రెండోస్థానంలో చేనుల అగ్రహారానికి చెందిన మణి జెర్సీ నిలిచి రూ. పదివేలు సాధించాయి. మూడో స్థానంలో రామన్నపాలెంకు చెందిన చోడమాంబిక గుర్రం, నాల్గో స్థానంలో ఎల్.కోటకు చెందిన సింగపూర్ సత్యనారాయణ గుర్రం నిలిచి నగదు బహుమతులు సాధించాయి. విజేతలకు ఆలయ ధర్మకర్తలు, పెద్దలు కమిటీ సభ్యులు నగదు బహమతులు అందజేశారు. ‘గేట్’ లో కార్తికేయ కుశల్ కుమార్కు 79వ ర్యాంక్విజయనగరం అర్బన్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్–2025) ఫలితాల్లో పట్టణ విద్యార్థి గంట కార్తికేయ కుశల్ కుమార్ జాతీయ ర్యాంక్ 79 సాధించాడు. గేట్లోని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ఈసీఈ) సబ్జెక్టులో 842 స్కోర్తో 79వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. కార్తికేయ బీటెక్ కాలికట్ ఎన్ఐటీలో చదివాడు. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించిన కార్తికేయ తండ్రి జి.సునీల్ కుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి శోభ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని. పోక్సో కేసులో 12 ఏళ్ల జైలుశిక్షభామిని: మండలంలోని బిల్లుమడకు చెందిన మండల శివ అనే ముద్దాయికి పోక్సో కేసులో విచారణ అనంతరం శుక్రవారం 12 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించినట్లు బత్తిలి ఎస్సై డి.అనిల్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2021లో బిల్లుమడ గ్రామంలో ఓ చిన్నారిపై మండల శివ అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా జిల్లా న్యాయమూర్తి విచారణ అనంతరంనేరారోపణ నిర్ధారించి శిక్ష విధించినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుసీతంపేట: మండలంలోని మాసడుగూడ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీకొట్టుకోవడంతో ఎస్.గణపతి, మనోజ్లకు గాయాలు కాగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించడంతో మెరుగైన వైద్యం కోసం గణపతిని రిమ్స్కు రాఫర్ చేసినట్లు ఏరియా ఆస్పత్రి ప్రధానవైద్యాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదని ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. అదృశ్యం కేసు నమోదుపార్వతీపురం రూరల్: మండలంలోని అడ్డాపుశీల గ్రామానికి చెందిన నీలయ్య జనవరి 20 నుంచి ఆచూకీ లేకపోవడంతో ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై బి.సంతోషి తెలిపారు. బంధువులు, పరిచయస్తుల ఇళ్ల వద్ద భర్త ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందంటూ భార్య ఫిర్యాదు చేసిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఫెన్సింగ్ పోటీల్లో కానిస్టేబుల్కు కాంస్యం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్శాఖలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో జరిగిన 1వ ఆలిండియా పోలీస్ క్లస్టర్ పోటీల్లో కాంస్యపతకం సాధించిన పీసీ బీఎస్ ఎన్ మూర్తికి ఎస్పీ వకుల్ జిందల్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని ట్రాఫిక్ సీఐ సూరినాయుడుతో పాటు కానిస్టేబుల్ మూర్తి శుక్రవారం కలిశారు. జిల్లాకు చెందిన బీఎస్ఎన్ మూర్తి పోలీస్ శాఖ నిర్వహించిన జాతీయపోటీల్లో ఫెన్సింగ్ విభాగంలో రాష్ట్ర పోలీసు జట్టు తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతకం సాధించిన కానిస్టేబుల్ మూర్తిని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారని ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా తెలిపారు. పతకాలు సాధించిన పోలీస్సిబ్బందికి త్వరలో ప్రోత్సాహక నగదు బహుమతిని, అదనంగా వార్షిక ఇంక్రిమెంట్ అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొన్నారు. అభినందించిన ఎస్పీ వకుల్ జిందల్ -
ప్రశాంతంగా పది పరీక్షలు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 10,363 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 10,314 మంది హాజరయ్యరని, 49 మంది గైర్హాజరయ్యరని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుంగా పరీక్ష సజావుగా నిర్వహించామన్నారు. 61 పరీక్షా కేంద్రాల్లో వర్యవేక్షక బృందం 6 కేంద్రాల్లో తాను సందర్శించినట్లు తెలిపారు. డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు -
రైల్వే ఉద్యోగుల నిరసన
విజయనగరం టౌన్: ఈస్ట్కోస్ట్ రైల్వేశ్రామిక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో ఉద్యోగులు, యూనియన్ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజనల్ కోఆర్డినేటర్ పీవీ.మౌళీశ్వరరావు మాట్లాడుతూ పెరిగిన ట్రాఫిక్ కారణంగా అన్ని ఎల్సీ గేట్లకు 8 గంటల రోస్టర్ను అమలుచేయాలన్నారు. ట్రాక్ మెయింటైనర్లకు సైకిల్ అలవెన్స్చెల్లింపును నిర్ధారించాలని, రన్ఓవర్ కేసుల్లో స్టేషన్ మాస్టర్లకు మెమోలు ఇచ్చే ట్రాక్ మెయింటైనర్లను నివారించాలని బదులుగా సీయూజీ ఫోన్ల ద్వారా సంబంధిత కీమాన్, ట్రాక్ మాన్ల నుంచి వివరాలను పొందడంపై పీడబ్ల్యూవే సూపర్ వైజర్ల ద్వారా మెమోలను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆక్యుపెన్సీని పెంచేందుకు క్వార్టర్స్ మెరుగైన నిర్వహణ చేపట్టాలని కోరారు. సేఫ్టీ కేటగిరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రిస్క్, హార్ట్షిప్ అలవెన్స్ అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శ్రామిక్ కాంగ్రెస్ విజయనగరం బ్రాంచ్ కార్యదర్శి బి.సత్యనారాయణ, శ్రీకాకుళం బ్రాంచ్ కార్యదర్శి ఎస్.దంతేశ్వరరావు, సెంట్రల్ ఆఫీస్ బేరర్ ఎం.అనిల్ కుమార్, బి.శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
పాము కాటుతో వ్యక్తి మృతి
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని రావాడ రామభద్రపురం గ్రామానికి చెందిన బిడ్డిక వెంకటి (55) పాముకాటుతో శుక్రవారం మృతిచెందాడు. సాయంత్రం 6 గంటల సమయంలో పొలం పనులు ముగించుకుని వస్తుండగా మార్గమధ్యంలో నాగుపాము కాటువేసింది. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలియజేసి, రావాడ రామభద్రపురం పీహెచ్సీలో చేరాడు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యసేవలు అందించి మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ మేరకు 108లో పార్వతీపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో వెంకటి మృతిచెందాడు. అయినప్పటికీ కుటుంబసభ్యులు సమీపంలోని చినమేరంగి సీహెచ్సీకి తీసుకెళ్లగా వెంకటి మృతిచెందినట్లు అక్కడి వైద్యురాలు పూర్ణ చంద్రిక ధ్రువీకరించారు. -
నెలాఖరుకు పథకాల మంజూరు
విజయనగరం అర్బన్: బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలను మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. వివిధ పథకాలు, వాటి మంజూరులో బ్యాంకుల పరిస్థితిని ఎల్డీఎం వీవీరామణమూర్తి వివరించారు. నాబార్డ్ డీడీఎం నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్సీపీ)ను వివరించారు. సుమారు రూ.10,650.32 కోట్ల అంచనాతో ఈ రుణ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. దీని ఆధారంగానే జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, వ్యవసాయ శాఖ జేడీ వీటీరామారావు, పశుసంవర్ధకశాఖ డాక్టర్ వైవీరమణ, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, మెప్మా పీడీ చిట్టిరాజు, ఉద్యాన, మత్సశాఖల డీడీలు జమదగ్ని, నిర్మలాకుమారి, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు వెంకటేశ్వరరావు, పెంటోజీరావు, వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ -
వేతనదారులకు నిలువనీడ కరువు
సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలం ఎంఎన్ఆర్ఈజీఎస్ పనులు చేయడంలో ముందంజలో గత కొన్నేళ్లుగా ఉంది. ఈ మండలంలో ఎక్కువ పనులు జరుగుతాయి. అటువంటి ఈ మండలంలో ఉపాధి వేతనదారులకు నిలువ నీడ లేదు. మండుటెండలో విలవిల్లాడుతున్నారు. వేసవి వచ్చినా కనీసం టెంట్లు కూడా లేకపోవడంతో వేతనదారులకు అవస్థలు తప్పడం లేదు. అసలే వేసవి కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపాధి పనులు చేస్తుంటారు. ఆ సమయంలో అత్యధికంగా ఎండ కాస్తోంది. ఉదయం 8 గంటలైతే భానుడు భగభగ మంటున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎండలు మండుతున్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి కనీసం నీడ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని వేతనదారులు వాపోతున్నారు. అలాగే పని సమయంలో వడదెబ్బ వంటివి, చిన్నచిన్నదెబ్బలు తగులుతుంటాయి. ఈ సమయంలో ప్రాథమిక చికిత్స చేయడానికి మెడికల్ కిట్లు పని ప్రదేశం వద్ద ఉండాలి. వాటిని కూడా ప్రభుత్వం ఇంతవరకు సప్లై చేయకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు వాపోతున్నారు. వేతనదారులు డీహైడ్రేషన్కు గురైతే ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా లేని పరిస్థితి ఉంది. బకాయిలు రూ.5 కోట్లకు పైనే.. వేతనదారులకు చెల్లించాల్సిన వేతనాల బకాయిలు రూ.కోటి వరకు ఉండవచ్చని అంచనా. మెటీరియల్ కాంపొనెంట్లో వేసిన రహదారులు, హార్టీకల్చర్, ఇతర పనులు దాదాపు 200 వరకు జరగడంతో వాటికి చెల్లించాల్సిన బకాయిలు రూ.4 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. వేతనదారులు చేసిన భూ అభివృద్ధి పనులు వంటి వాటికి ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లించాల్సి ఉంది. దాదాపు ఉపాధి వేతనదారులు జాబ్కార్డులు ఉన్నవారు 18 వేల మంది ఉన్నారు. వారిలో వందరోజుల పనులు పూర్తి చేసిన వారు 80 శాతం వరకు ఉండడంతో ప్రస్తుతం పనులు చేస్తున్న వేతనదారులు 3 వేలమంది ఉన్నారు. భూ అభివృద్ధి, టెర్రాసింగ్, ఫార్మ్పౌండ్ పనులు వేతనదారులు చేస్తున్నారు. ఇలా 150 వరకు పనులు చేశారు. సరాసరి ఒక్కో వేతనదారుకు రోజుకు రూ.270 వరకు వేతనం గిట్టుబాటవుతుంది. రెండు నెలలుగా బకాయి వేతనాలు చెల్లించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని వేతనదారులు ఆవేదన చెందుతున్నారు. కొలతలకు టేప్ సప్లై లేదు.. ఉపాధి పనులు చేసిన వేతనదారుల పనులు ఎంత పూర్తి చేశారనేది సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఇతర సిబ్బంది కొలతలు వేయడానికి వీలుగా టేపులు సప్లై చేయాల్సి ఉన్నప్పటికీ అవికూడా సరఫరా చేయని పరిస్థితి ఉంది. కేవలం ఎవరి సామగ్రి వారు తెచ్చుకునే పనుల కొలతలు వేస్తున్నారు. పనిప్రదేశంలో మెడికల్ కిట్లు లేవు మండుటెండలోనే పనులు 8 వారాలుగా వేతనాలు అందక విలవిలటెంట్లు తాత్కాలికంగా వేసుకోమన్నాం వేతనదారులు పనిచేసిన చోట టెంట్లు తాత్కాలికంగా వేసుకుంటున్నారు. ఎండ తీవ్రత లేని సమయంలో ఉదయం 7 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు పనులు చేసుకుంటున్నారు. బకాయి నిధులు మంజూరైన వెంటనే వేతనదారులకు వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటాం. శ్రీహరి, ఏపీడీ, ఎంఎన్ఆర్ఈజీఎస్ -
ప్రాజెక్టుల నిధులకు ప్రతిపాదనలు
విజయనగరం అర్బన్: జిల్లా వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు సాధించాలంటే తోటపల్లి కుడి ప్రధాన కాలువ, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టులు పూర్తి కావాలి... దీనికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఆయా ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, పునరావాసం పూర్తి చేసేందుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయో జలవనరుల శాఖ అధికారులు నివేదిక అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం మాట్లాడారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువ, తారకరామ సాగరం ప్రాజెక్టులను పూర్తిచేస్తే సుమారు 50 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. వ్యవసాయ రంగంలో అదనపు ఉత్పత్తిని, ఆదాయాన్ని సాధించే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు నగరానికి మంచినీటి సరఫరా, భోగాపురం ఎయిర్పోర్టుకు నీటి సరఫరా జరిగే అవకాశం ఉన్నందున ఈ ప్రాజె క్టు త్వరగా పూర్తిచేయాల్సిన అవసరాన్ని వివరిస్తా మని చెప్పారు. కలెక్టర్ల సదస్సు మార్చి 25, 26 తేదీల్లో అమరావతిలో జరగనుందని, జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వివిధ శాఖల అధికారులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంతమేరకు లక్ష్యాలు సాధించగలమో పేర్కొంటూ వాస్తవిక అంచనాలను మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. -
ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం
● నిర్వాసితులను మోసం చేయడం అన్యాయం ● ఎంపీ మాట మార్చడం బాధాకరం ● 27, 28వ తేదీల్లో నిరాహార దీక్షలు ● మూడవ రైల్వే లైన్ నిర్వాసితుల కమిటీ నాయకుడు శ్రీనివాస్ గజపతినగరం: టిట్లాగర్ నుంచి విజయనగరం వరకు సుమారు 4 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న మూడవ రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అన్యాయం చేయడం ప్రభుత్వానికి తగదని, సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధిచెబుతామని రైల్వే లైన్ నిర్వాసితుల కమిటీ నాయకుడు జి.శ్రీనివాస్ తెలిపారు. గజపతినగరం మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో మూడో రైల్వే లైన్ నిర్మాణంలో ముందుగా 14 ఇళ్లకు అరకొర డబ్బులు చెల్లించి వాటిని కూల్చివేశారని, తరువాత మరో 28 కుటుంబాలకు చెందిన వారి ఇళ్లను కూల్చి వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. నిర్వాసితులకు నిలువునీడ చూపకుండా ఇళ్లు కూల్చివేయడం దుర్మార్గమన్నారు. ఫిబ్రవరి 9వ తేదీన బాధితులకు న్యాయం చేస్తామంటూ మాట ఇచ్చిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇప్పుడు మాటమార్చారని విమర్శించారు. నిర్వాసితుల పక్షాన కాకుండా ఇళ్లను కూల్చే కాంట్రాక్టర్ తరఫున కొమ్ముకాయడం దారుణమన్నారు. తక్షణమే నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు, పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మార్చి 27, 28 తేదీల్లో మానాపురం బ్రిడ్జి సమీపంలో రెండు రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ సమస్య పరిష్కరించకుంటే ఏప్రిల్ 2వ తేదీన చలో తహసీల్దార్ ఆఫీస్ కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో నిర్వాసితుల కమిటీ నాయకులు చిల్లా గోవింద్, బోర మహేష్, నగిరెడ్ల రాము, తదితరులు పాల్గొన్నారు. -
23న ఉల్లాస్ అర్హత పరీక్ష
పార్వతీపురం టౌన్: ఉల్లాస్ అక్షరాస్యత అర్హత పరీక్షను ఈ నెల 23న నిర్వహిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కలెక్టరేట్లో శుక్రవారం ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జిల్లాలో 2024 నవంబర్ 15వ తేదీ నుంచి 22,944 మంది వయోజనులకు 2,294 మంది వలంటీర్లతో చదవడం, రాయడం, చిన్నచిన్న లెక్కలు చేయగలగడం నేర్పించామని, వారి అభ్యసనా సామర్థ్యాలను తెలుసుకునేందుకు పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించడమే ‘ఉల్లాస్’ ఉద్దేశంగా పేర్కొన్నారు. చదివేందుకు 50, రాయడానికి 50, గణితానికి 50 మార్కుల చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంద న్నారు. ఇందులో 33 శాతం మార్కులు పొంది న వారిని ఉత్తీర్ణులుగా గుర్తించి ఎన్ఐఔస్ ధ్రువపత్రాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు. బిత్రపాడులో ఏనుగులు జియ్యమ్మవలస: మండలంలోని నిమ్మలపా డు, బిత్రపాడు పంట పొలాల్లో శుక్రవారం సాయంత్రం ఏనుగులు దర్శనమిచ్చాయి. నిమ్మలపాడు దగ్గర నాగావళి నదిలో ఉన్న ఏనుగులు సాయంత్రానికి బిత్రపాడు పొలిమేరకు చేరడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వరి, అరటిపంటలు ధ్వంసం చేస్తుండడంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగులు తరలించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఫారం పాండ్స్ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ పార్వతీపురంటౌన్: జిల్లాలో ఫారంపాండ్స్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మండల అధికారులను ఆదేశించారు. పల్లె పండగ కార్యక్రమంపై డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ జిల్లా కలెక్టర్లు, డ్వామా పీడీలతో శుక్రవారం సమీక్షించారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్తో పాటు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కె.రామచంద్రరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు పాల్గొన్నారు. వీడియోకాన్ఫరెన్స్ అనంతరం మండల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. పల్లె పండుగ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. పనులను వేగవంతం చేయాలని సూచించారు. రక్తహీనత కేసులు తగ్గుముఖం విజయనగరం ఫోర్ట్: కేంద్ర ప్రభుత్వం రక్తహీనతను నివారించేందుకు ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్ర స్థాయిలో సమర్ధంగా అమలుచేస్తుండడంతో రక్తహీనత కేసులు తగ్గుముఖంపట్టాయని కేంద్ర బృందం ప్రతినిధులు డాక్టర్ దృష్టిశర్మ, డాక్టర్ జాస్మిన్ అభిప్రాయపడ్డారు. గత రెండు రోజులుగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రక్తహీనత తగ్గడానికి గల కారణాలపై ఆధ్యయనం చేశారు. సంబంధిత అంశాలను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ను కలిసి వివరించారు. ఎనిమీయా ముక్త్ భారత్, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకం, ప్రజాపంపిణీ వ్యవస్థ, జాతీయగ్రామీణ జీవనోపాదుల కార్యక్రమాలు రక్తహీనత తగ్గించేందుకు దోహదపడుతున్నాయన్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాంలోని 12 జిల్లాల్లో రక్తహీనత తగ్గుదలకు గల కారణాలపై ఆధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన రాణి పాల్గొన్నారు. -
తాడి ప్రకాష్కు పతంజలి పురస్కారం
విజయనగరం గంటస్తంభం: ప్రముఖ పాత్రికేయుడు, సినీ మాటల రచయిత కె.ఎన్.వై.పతంజలి 73వ జయంతి సందర్భంగా హైదరాబాద్కు చెందిన పాత్రికేయుడు, పతంజలితో పాతికేళ్ల పాటు కలిసి పనిచేసిన రచయిత తాడి ప్రకాష్కు పతంజలి పురస్కారం అందజేయను న్నట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షు డు భీశెట్టి బాబ్జి తెలిపారు. గురజాడ అప్పారా వు గృహంలో వేదిక ప్రతినిధులతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏటా పతంజలి జయంతి సందర్భంగా ప్రముఖులకు పురస్కారం అందజేస్తున్నామన్నారు. 2025 సంవత్సరానికి గాను తాడి ప్రకాష్కు ఈ నెల 29 తేదీన గురుజాడ గ్రంథాలయంలో పురస్కారం ప్రదానం చేస్తామని చెప్పారు. సాహిత్య అభిమానులు, రచయితలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వేదిక కార్యదర్శి బాబు, లక్ష్మణరావు, పౌరవేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ
● మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి పార్వతీపురం: జిల్లాలో ఖాళీగా ఉన్న 17 అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి డాక్టర్ టి.కనకదుర్గ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం డివిజన్ పరిధిలో పార్వతీపురం మున్సిపాల్టీ పరిధిలో రెండు సహాయక పోస్టులు, సాలూరు పరిధిలో మూడు సహాయక పోస్టులు, బలిజిపేట ప్రాజెక్టు పరిధిలో ఒక అంగన్వాడీ కార్యకర్త పోస్టు, మూడు సహాయక పోస్టులు, సీతానగరంలో రెండు సహాయక పోస్టులు, పాలకొండ డివిజన్లోని పాలకొండలో మూడు సహాయక పోస్టులు, భామిని ప్రాజెక్టు పరిధిలో రెండు సహాయక పోస్టులు, వీరఘట్టంలో ఒక సహాయక పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన వివాహిత మహిళా అభ్యర్థినులు ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. అంగన్వాడీ సహాయకులకు జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. ఎస్టీ కేంద్రాలకు ఎస్టీ కేటగిరీకి రోస్టర్లో రిజిస్టర్ కాబడిన పోస్టులకు 21ఏళ్లు నిండిన అభ్యర్థులు అర్హులని, లేదంటే 18 ఏళ్లు నిండిన వారిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. -
‘బంగారు కొండ’పై ఒడిశా కన్ను
సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా పల్లెల్లో ఒడిశా ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఇటీవల జల్జీవన్ మిషన్ పనులకు వెళ్లిన ఆంధ్రా సిబ్బందిని అడ్డుకుంది. సామగ్రిని సీజ్చేసి పోలీసులతో భయపెట్టింది. తాజాగా ఆంధ్రాప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేసిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములను లాక్కునేందుకు పూనుకుంది. గిరిజనుల పోడు సాగుకు ఆధారమైన గంజాయిభద్ర పంచాయతీ ఎగువశెంబి వద్ద ఉన్న బంగారు కొండ దురాక్రమణకు ఒడిగట్టింది. ఒడిశా అధికారులు పోలీస్ బలగాలతో శుక్రవారం వచ్చి భూమి పూజచేసి, కొండచుట్టూ సిమెంట్ పోల్స్ను పాతారు. దీనిని అడ్డుకున్న గిరిజనులపై దౌర్జన్యానికి దిగారు. ఇక్కడ ఏమీ చేయడానికి లేదని, ఈ భూముల్లోకి ఇకపై ఎవరూ రాకూడదని హెచ్చరికలు జారీచేశారు. ఒడిశా అధికారులు దౌర్జాన్యాన్ని వీడియోలు, ఫొటోలు తీయకుండా గిరిజనుల నుంచి సెల్ఫోన్లు లాక్కున్నారు. తొలి రోజు కొండచుట్టూ కొంత మేర పోల్స్ను పాతారు. మిగిలిన ప్రాంతంలో పాతేందుకు వీలుగా పోల్స్ను సిద్ధం చేశారు. పవర్స్టేషన్ నిర్మాణం కోసమని ఒడిశా అధికారులు చెబుతున్నా, ఇదంతా ఇక్కడ ఉన్న విలువైన ఖనిజ నిక్షేపాలు కొల్లగొట్టేందుకేనని గిరిజనులు ఆరోపిస్తున్నారు. మైనింగ్కు సన్నాహాలు? వివాదాస్పద కొటియా గ్రూపు గ్రామాలు ఉండే కొండల్లో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ ప్రాంతాలను సొంతం చేసుకునేందుకు గతంలో ఒడిశా ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఆంధ్రా అధికారులను అప్రమత్తం చేసి అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొటియా పల్లెలపై ఆంధ్రా ప్రభావం సన్నగిల్లుతోంది. దీంతో ఒడిశా అధికారుల దౌర్జన్యం పెరిగిందని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. స్పందించని మంత్రి? వివాదాస్పద కొటియా పల్లెల్లో ఒడిశా దుందుడుకు గిరిజనులకు పోలీసులతో బెదిరింపు కొండచుట్టూ స్తంభాల ఏర్పాటు సాగుభూములు లాక్కోవడంతో ఆందోళన గతంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందజేసిన ఆంధ్రా ప్రభుత్వం పవర్ స్టేషన్ నిర్మాణం కోసమంటూ బుకాయింపు... మైనింగ్ తవ్వకాలకే కొండ ఆక్రమణ అంటున్న గిరిజనం మౌనం దాల్చిన గిరిజన సంక్షేమశాఖ మంత్రి! కొటియా పల్లెల్లో ఒడిశా దురాక్రమణలకు పాల్పడుతున్నా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కిమ్మనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. మంత్రి మౌనం వెనుక ఆంత్యర్యమేమిటో అర్థం కావడం లేదంటూ గిరిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు చోట్ల బీజేపీ పాలిత ప్రభుత్వాలే ఉన్నాయని, సమస్యను పరిష్కరించాల్సిన పాలకు లు మిన్నకుండడాన్ని గిరిజనులు తప్పుబడుతున్నా రు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొటియా గ్రామాల అంశంపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒడిశా సీఎమ్ నవీన్పట్నాయక్తో చర్చించిన అంశాన్ని గుర్తుచేస్తున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉంటూ విమర్శలు చేసిన నేటి మంత్రి గుమ్మి డి సంధ్యారాణి... ప్రత్యేక చొరవ చూపాలని, దశాబ్దాల కొటియా గ్రూప్ గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని గిరిజనులు కోరుతున్నారు. -
జీరో చూసుకోండి!
● పెట్రోల్ బంకుల్లో యథేచ్ఛగా మోసాలు ● అధికారుల తనిఖీలు నామమాత్రం ● జిల్లాలో పర్యవేక్షించే శాఖ కరువు ● ఏడాదిలో ఏడు కేసులే నమోదు కొలతల్లోనూ తేడా... అధికారుల తనిఖీలు లేకపోవడం.. ఎక్కువగా నిరక్షరాస్యులున్న ఏజెన్సీ ప్రాంతం కావడంతో పెట్రోల్ కొలతల్లోనూ తేడా కనిపిస్తోంది. బాటిల్ పట్టుకుని, లీటరు చొప్పున కొనుగోలు చేస్తే బాగానే ఇస్తున్నారని.. అదే నేరుగా బండిలో ఇంధనం పోయించుకుని, కిలోమీటర్లు లెక్క గడితే... 10–15 కిలోమీటర్లకు ముందుగానే రిజర్వ్కు వచ్చేస్తోందని పార్వతీపురం పట్టణానికి చెందిన సురేష్ అనే వాహనదారుడు వాపోయాడు. పార్వతీపురం పట్టణంలోని ఓ బంకులో ‘సాక్షి’ శుక్రవారం పరిశీలించగా.. 500 ఎంఎల్కు 2 ఎంఎల్ పెట్రోల్ తక్కువగా వచ్చింది. సాలూరులోని ఓ బంకులో కొంత కాలంగా పెట్రోల్ కల్తీ జరుగుతోందన్న ప్రచారం జోరుగా ఉంది. కల్తీతోపాటు కొలతల్లో కూడా తేడా ఉందని వాహనదారులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనులు పెట్రోల్ పోయించేటప్పుడు కొలతల్లో తేడా చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు. జిల్లా విభజన తర్వాత పార్వతీపురం మన్యానికి తూనికలు, కొలతలు విభాగ కార్యకలాపాలు పెద్దగా కనిపించడం లేదు. గత ఏడాది కాలంలో బంకుల్లో జరుగుతున్న మోసాలపై కేవలం ఏడు కేసులే నమోదు చేయడం గమనార్హం. రూ.లక్షా పది వేలను అపరాధ రుసుంగా విధించినట్లు తూనికలు కొలతలు శాఖల అధికారులు చెబుతున్నారు. వినియోగదారుల్లో ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల కూడా అధికారుల తనిఖీలు శూన్యమవుతున్నాయి. సాక్షి, పార్వతీపురం మన్యం: సాధారణంగా వాహనదారులు పెట్రోల్ బంకుకు వెళ్లి.. ఇంధనం పోయాలని అక్కడికి సిబ్బందికి అడిగిన వెంటనే... వారు ‘జీరో చూసుకోండి’ అని ఎంతో వినయంగా చెబుతారు. మన దృష్టి కూడా ఆ ‘సున్నా’పైనే ఉంటుంది. జీరో ఉన్నంత మాత్రాన మనం మోసపోం అనుకుంటే పొరపాటే. బంకుల్లో ఎప్పటికప్పుడు నయా మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వినియోగదారులు నష్టపోతూనే ఉన్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు తనిఖీలు లేకపోవడం.. వినియోగదారులు సైతం దీనిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో జిల్లాలో పెట్రో ల్ బంకుల నిర్వాహకులు యథేచ్ఛగా దోపిడీకి తెరతీస్తున్నారు. ఇదో ‘జంప్ ట్రిక్’ మోసం జిల్లాలో 48 వరకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. కొన్ని బంకుల్లో ‘జంప్ ట్రిక్’ మోసానికి పాల్పడుతున్నారు. పెట్రోల్ కొట్టేటప్పుడు అక్కడ సిబ్బంది ‘జీరో చూసుకోండి’ అని చెబుతుంటారు. పెట్రోల్ పోయడం మొదలుపెట్టగానే మీటరు నెమ్మదిగా పెరగకుండా ఒక్కసారిగా 10–20 పాయింట్లు పెరుగుతుంది. దీనివల్ల మనకు తక్కువ పెట్రోల్ పోసినా, మీటరులో ఎక్కువ చూపిస్తుంది. సాధారణంగా మీటరు నాలుగైదు పాయింట్లు మాత్రమే జంప్ అవ్వాలి. జిల్లాలోని అనేక బంకుల్లో ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇది గమనించి అడిగినా.. పెట్రోల్ బంకు సిబ్బంది నుంచి మౌనమే సమాధానంగా వస్తోందని వాహనచోదకులు చెబుతున్నారు. కనీస సౌకర్యాలు కరువు పెట్రోల్బంకుల వద్ద ఎక్కడా కనీస సౌకర్యాలు ఉండటం లేదు. ప్రతి బంకు వద్ద మరుగుదొడ్లు, గాలి పంపులు, తాగునీరు వంటి సదుపా యాలు కల్పించాల్సి ఉంది. అవి ఎక్కడా ఉన్న దాఖలాలు లేవు. కనీసం జాతీయ రహదారి వెంబడి ఉన్న బంకుల్లోనూ ఈ తరహా సౌకర్యాలు శూన్య మని వాహనదారులు చెబుతున్నారు. పెట్రోల్ బంకుల్లో మోసాలపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. కనీసం ఇప్పటికైనా తనిఖీలు ముమ్మరం చేస్తే వాహన చోదకులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పొజిషన్ ఉంటేనే నిధుల మంజూరు..!
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, అర్బన్ ప్రాంతంలో రెండున్నర సెంట్లు చొప్పున ఇంటి స్థలాలు కేటాయించనుంది. హౌసింగ్లో వచ్చే నిధులను ఒక్కో లబ్ధిదారుకు రూ.2.50లక్షలకు పెంచినట్లు పక్క ప్రభుత్వం, మరోపక్క అధికారులు చెబుతున్నారు. వాటికి తోడు బీసీ, ఎస్సీ కులాల లబ్ధిదారులకు అదనంగా రూ.50వేలు, ఎస్టీ కులాలకు చెందిన లబ్ధిదారులకు అదనంగా రూ.70వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ క్రమంలో హౌసింగ్ పథకం అమలు వేగం పుంజుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతా ఒక ఎత్తయితే హౌసింగ్ పథకంలో బీసీ, ఎస్సీ,ఎస్టీ కులాల ధ్రువీకరణ పత్రాలు, వారి అనుభవంలో ఉన్న స్థలాలకు రెవెన్యూ అధికారులతో పొజిషన్ సర్టిఫికెట్లు జతచేయాలన్న నిబంధన పెట్టారు. దీంతో లబ్ధిదారులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు స్థలాల పొజిషన్ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో లబ్ధిదారులకు ఇబ్బందులు రావడం లేదు కానీ పొజిషన్ సర్టిఫికెట్ మంజూరులో రెవెన్యూ అధికారులు పలు ప్రశ్నలు వేస్తున్నారు. స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్, అగ్రిమెంట్లు ఉండాలని, డీకేటీ, గ్రామకంఠం భూములకు ఇవ్వమని చెబుతున్నారు. గ్రామాల్లో పేద రైతులకు వారి పొలాల వద్ద హౌసింగ్ ఇంటి నిర్మాణానికి స్థలాలు ఉన్న భూములకు వన్బీ ఉండడంతో మూడు సెంట్ల స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తామని రెవెన్యూ అధికారులు మెలిక పెడుతున్నారు. దీంతో లబ్ధిదారులు తమ గోడు ఎవరికీ చెప్పుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గందరగోళంలో హౌసింగ్ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లాలో హౌసింగ్ పథకంలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి. ప్రతి వారం రోజులకు ఈ పథకంలో సాధించిన నివేదికలు ఇవ్వండి అంటూ హౌసింగ్ ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారుల వెంట పడుతున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే ఈ పాటికే హౌసింగ్ నిర్మాణాలు పునాదులు దాటి గోడస్థాయికి వచ్చి ఉండేవి. కానీ లబ్ధిదారుల సొంత స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్ ఉంటేనే నిధులు మంజూరు చేయాలనే నిబంధన ఉండడంతో ఇక్కడే ఈ పథకం ముందుకు కదలకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయింది. దీంతో ఉన్నతాధికారులకు సమాధానాలు చెప్పలేక, రెవెన్యూ అధికారులను ప్రాథేయపడలేక హౌసింగ్ అధికారుల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో 18,056 మంది లబ్ధిదారుల గుర్తింపు పార్వతీపురం మన్యం జిల్లాలో 18,056 మంది హౌసింగ్ పథకంలో లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు సర్వే చేశారు. సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు హౌసింగ్ పథకంలో ఇంటి నిర్మాణం మంజూరు చేసేందకు ఆ స్థలాల్లో పొజిషన్ సర్టిఫికెట్ల మెలిక పెట్టడంతో అవి నిలిచిపోతున్నాయి. జిల్లాలో గల 15 మండలాల్లో అధికారులు విస్తృతంగా సర్వే నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. సుమారు 13వేల మందికి పైగా లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు లేవన్న కారణంగా హౌసింగ్ బిల్లులు అందుతాయో? లేదోనన్న ఆందోళన నెలకొంది. హౌసింగ్ నిధులు ఒక్కో లబ్ధిదారుకు రూ.2.50లక్షలకు పెంపు కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు పొజిషన్ సర్టిఫికెట్ తప్పనిసరి తలలు పట్టుకుంటున్న ఇళ్ల లబ్ధిదారులుఅన్ని ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి హౌసింగ్ పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. సొంత స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేస్తున్నారు. ఆధాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తేనే లబ్ధిదారులకు హౌసింగ్ నిధులు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టేలా చూస్తున్నాం. – పి.ధర్మ చంద్రారెడ్డి, ఇన్చార్జ్ హౌసింగ్ పీడీ, పార్వతీపురం మన్యం జిల్లా -
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణాపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోందని విశాఖ రేంజ్ పోలీసు డీఐజీ గోపీనాథ్ జెట్టి స్పష్టం చేశారు. ఈ మేరకు గడిచిన ఎనిమిది నెలల్లో మూడు దశల్లో పట్టుబడిన 7 వేల 378 కేజీల గంజాయిని ధ్వంసం చేశామని డీఐజీ తెలిపారు. విశాఖ పోలీస్ రేంజ్ పరిధి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాత కుంకాంలో గురువారం మూడు జిల్లాల్లో పలు కేసుల్లో సీజ్ చేసిన గంజాయి నిర్మూలన కార్యక్రమం జరిగింది. 226 కేసులలో సీజ్ చేసిన 7378 కిలోల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, ,శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి -
వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు
● తగ్గుతున్న జలాశయాల నీటి మట్టాలు బొబ్బిలి: అన్నదాతకు, అటు మూగజీవులు, ప్రజానీకానికి దాహార్తిని తీర్చే జలాశయాలు నీటి నిల్వలను మార్చి నెలలోనే కోల్పోవడం కనిపిస్తోంది. జిల్లాలోని ప్రధాన జలాశయాల నీటి మట్టాలు తగ్గుముఖం పట్టే ఛాయలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని నీటి మట్టాలు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రబీకి సాగునీరు ఇచ్చే పరిస్థితి లేకపోయినా చాలా చోట్ల పశువుల దాహార్తిని తీర్చేందుకు, ఆరుతడి పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందా.. అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి వనరుల్లో ఒక భారీ తరహా నీటి పారుదల ప్రాజెక్టు ఉండగా మిగతావి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులున్నాయి. వీటి ద్వారా ఏటా ఖరీఫ్లోనే సాగునీటిని విడుదల చేస్తున్నారు. రబీలో ఆరుతడి పంటలకు సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉంటోంది. వీటిని ఏటా జలవనరుల శాఖ అధికారులు పరిశీలించి రబీకి సాగునీటిని విడుదల చేయాలా.. వద్దా.. అనేది నిర్ణయిస్తారు. దీని ప్రకారం రైతులు తమ పంటలను సాగు చేసుకుంటుంటారు. అయితే ఈ ఏడాది సాగునీటి నిల్వలు తగ్గే పరిస్థితి నెలకొంది. మార్చి నెలలోనే సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు మీటర్ల మేర తగ్గుతూ కనిపిస్తోంది. వేసవిలో అకాల వర్షాలు, తుఫాన్ల వంటివి సంభవిస్తే తప్ప మే నెలాఖరుకు మరింత నీరు ఇంకిపోయే పరిస్థితులున్నాయి. ఇది అందరినీ కలవరపరుస్తోంది. వీఆర్ఎస్లో కొద్ది రోజుల కిందటి నీటి నిల్వలు -
నిర్దిష్ట ప్రమాణాల మేరకు పెసర, మినుము కొనుగోళ్లు
బొబ్బిలి: పట్టణంలోని పీఏసీఎస్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు పండించిన పెసలు, మినుము కొనుగోళ్లు చేపట్టి సకాలంలో చెల్లింపులు చేస్తామని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని పీఏసీఎస్ కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మినుములు క్వింటా రూ.7,400లు, పెసలు క్వింటా రూ.8,682లకు కొనుగోలు చేస్తామన్నారు. అయితే నాఫెడ్ విధించిన నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాల నిబంధనల ప్రకారం పెసలు, మినుములను పై మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామన్నారు. ఇందులో మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా తన విధులను నిర్వర్తిస్తోందన్నారు. జిల్లాలో జామి మండలం విజినిగిరి, గంట్యాడ, గజపతినగరం, సంతకవిటి, బొబ్బిలి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. గోదాముల నిర్మాణానికి భూమి కొనుగోలు మార్క్ఫెడ్ ద్వారా గోదాములను నిర్మించేందుకు బొబ్బిలి గ్రోత్ సెంటర్ సమీపంలోని జగనన్న కాలనీ వద్ద 5.19 ఎకరాల భూమిని గతంలో కొనుగోలు చేసినట్టు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గొల్లపల్లి సర్వే నెంబర్ 509–2లో గల ఈ భూమికి సంబంధించిన రూ.33,73,500 లను రెవెన్యూ శాఖకు చెల్లించామన్నారు. ఇప్పుడు మరోసారి దానిని గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు తహసీల్దార్ ఎం.శ్రీనుతో కలసి సర్వే చేసినట్టు చెప్పారు. పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. జిల్లాలో ఐదు మండలాల్లో కేంద్రాలు ప్రారంభించిన మార్క్ఫెడ్ మేనేజర్ -
నిందితులకు రిమాండ్
గజపతినగరం: మెంటాడ మండలం రెల్లిపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు రాళ్లపూడి అంకమ్మను(75) హతమార్చిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం గజపతినగరం పోలీస్స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మెంటాడ మండలం రెల్లిపేటలో తన నివాస గృహంలో 16.3,2025న వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామన్నారు. శవపంచనామా అనంతరం వృద్ధురాలిని గొంతునులిమి చంపినట్లు వైద్యుల రిపోర్టు రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు నిందితులను గాలించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గురువారం ఉదయం 11గంటలకు నలుగురు నిందితులైన దానాలరాము, దానాల దుర్గారావు, దానాల రాములమ్మ, పాల్తేటి రామప్పడు అలియాస్ బొడ్డులు పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓల సమక్షంలో లొంగిపోయినట్లు చెప్పారు. మృతురాలు అంకమ్మ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి నగదు అప్పుగా ఇస్తూ ఉంటుందని అందులో భాగంగా దానాల రాములమ్మ అప్పుఅడగ్గా ఆమె తిరస్కరించింది. దీంతో రాములమ్మతో పాటు మరో ముగ్గురు తోడై వృద్ధురాలి వద్ద ఉన్న బంగారం ముక్కుపుడక, రూ.740లు దోచుకుని ఆమెను హతమార్చినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన స్థానిక సీఐ జీఏవీ రమణ, ఆండ్ర ఎస్సై కె.సీతారామ్, గజపతినగరం ఎస్సై కె.లక్ష్మణరావులతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్తో పాటు తాను అభినందిస్తున్నట్లు చెప్పారు. వృద్ధురాలిని హతమార్చిన కేసులో నలుగురి అరెస్ట్ -
ఆధునిక పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
విజయనగరం అర్బన్: పరిశ్రమ రంగానికి అవసరమైన ఆధునిక పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవాలని జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు స్థానిక జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా స్టూడెంట్ చాప్టర్ సంయుక్త నిర్వహణలో ‘మెక్ అనో ఎంఎంఎక్స్ఎక్స్వీ 2025’ అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి టెక్నికల్ సింపోజియాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరికరాలు అవి పని చేస్తున్న తీరు తదితర అంశాలపై పరిజ్ఞానాన్ని పెంచడానికి ఇలాంటి సదస్సులు విద్యార్థులకు దోహదపడతాయన్నారు. అనంతరం సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెకా నికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీనివాస్ ప్రసాద్, వి.మణికుమార్, డాక్టర్ సి.నీలిమదేవి ఫ్యాకల్టీ సమన్వయకర్తలుగా,, స్టూడెంట్ కో ఆర్డినేటర్స్గా కె.కౌశిక్, పి.ప్రగతి వ్యవహరించారు. జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేశ్వరరావు వర్సిటీలో మెక్అనో జాతీయ సదస్సు ప్రారంభం -
భారతసైన్యంలో యువతకు అవకాశం
పార్వతీపురం టౌన్: భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన సర్వీసుల శాఖాధికారి ఎ.సోమేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 10 వరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. జాయిన్ ఇండియన్ ఆర్మీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వారి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఆర్మీ ర్యాలీ తేదీ సమయం పొందగలరని తెలిపారు. ఆన్లైన్ పరీక్ష పాసైన వారికి ఆర్మీర్యాలీ నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఆసక్తిగల జిల్లా యువత ఇండియన్ ఆర్మీలో చేరేందుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయం పనివేళల్లో సెట్విజ్ మేనేజర్ కె.వెంకటరమణ, మొబైల్ 9849913080 నంబర్ను సంప్రదించాలని కోరారు. అర్హతలు.. అగ్నివీర్ జనరల్ బ్యూటీ, ట్రేడ్మెన్ అభ్యర్థులు 166 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. అగ్నివీర్ టెక్నికల్ అభ్యర్థులు 165 సెంటీమీటర్ల ఎత్తు, టెక్నికల్ అభ్యర్థులు 162 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. చాతీ 77 సెంటీమీటర్లు, ఊపిరి పీల్చినప్పుడు 5సెంటీమీటర్ల విస్తీర్ణం పెరగాలి. ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండాలి. ● అగ్నివీర్లో జనరల్ ఉద్యోగానికి పదోతరగతి 45శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ● అగ్నివీర్ టెక్నికల్ ఉద్యోగానికి ఇంటర్మీయట్ ఉత్తీర్ణతతోపాటు ప్రతి సబ్జెక్టులో కనీసం 40శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో కనీసం 50శాతం మార్కులు ఉండాలి. ● అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్లో టెక్నికల్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సబ్జెక్టులతో కనీసం 60శాతం మార్కులు, ప్రతి సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ● అగ్నివీర్ ట్రేడ్స్మేన్ ఉద్యోగాలకు 8,10 తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు అక్టోబర్ 2004 నుంచి ఏప్రిల్ 2008 మధ్య జన్మించి ఉండాఅని జిల్లా యువజన సర్వీసుల శాఖాధికారి ఎ.సోమేశ్వరరావు సూచించారు. అగ్నివీర్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం జిల్లా యోజన సర్వీసుల శాఖాధికారి ఎ.సోమేశ్వరరావు -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ107 శ్రీ184 శ్రీ194గేట్లో ఆలిండియా 451వ ర్యాంక్ ● అర్తమూరు యువకుడి ప్రతిభచీపురుపల్లి రూరల్ (గరివిడి): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన గేట్–2025 (గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)ఎంట్రన్స్ టెస్ట్లో గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన యువకు డు సుంకరి నరసింహనాయుడు ప్రతిభ చాటా డు. మెకానికల్ విబాగంలో ఆలిండియా స్థా యిలో 451వ ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న గేట్ ఎంట్రన్ పరీక్ష జరగ్గా బుధవారం ఫలితాలు విడుదలయ్యాయి. తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలుడుగరుగుబిల్లి: మండలంలోని రావివలస ఎస్సీ వసతి గృహంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి పత్తిగూల శివసాయిని స్థానిక ఎస్సై పి.రమేష్నాయుడు గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శివసాయి ఫిబ్రవరి 17న రావివలస ఎస్సీ వసతి గృహంనుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు తండ్రి పోలయ్య ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివసాయి కోసం గాలింపు చేపట్టగా సీతానగరం మండలం అంటిపేటవద్ద ఆచూకీ లభించడంతో పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి, తల్లిదండ్రులకు ఎస్సై అప్పగించారు. ఈ సందర్భింగా తల్లిదండ్రులు ఎస్సైకి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈహెచ్ఎస్ సేవలందించడంలో అలసత్వం తగదు● ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ డి.రాంబాబు విజయనగరం ఫోర్ట్: ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)కు సంబంధించి ప్రతి రోగికి వైద్యసేవలు అందించాలి. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) జిల్లా మేనేజర్ డి.రాంబాబు అన్నారు. ఈ మేరకు పట్టణంలోని శ్రీసాయి సూపర్ స్పెషాలిటీ నెట్వర్క్ ఆస్పత్రిని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్యసేవల గురించి ఆరా తీశారు. చికిత్స సకాలంలో అందిస్తున్నారా? నాణ్యమైన భోజనం పెడుతున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదనంగా డబ్బులు ఏమైనా అడుతున్నారా అని రోగులను ఆరా తీశారు. ఆస్పత్రిలో ఏ సమస్య ఉన్నా వెంటనే ఆరోగ్య మిత్రను కలవాలని రోగులకు చెప్పారు. కార్యక్రమంలో టీమ్ లీడర్ ఎ.భానుప్రసాద్ పాల్గొన్నారు. అట్రాసిటి కేసుపై విచారణవేపాడ: మండలంలోని గుడివాడ గ్రామానికి సంబంధించి నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుపై విజయనగరం డీఎస్పీ మీరాకుమార్ నేతృత్వంలో గురువారం విచారణ చేపట్టారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. మార్చి 11న గుడివాడలో వేణుగోపాలస్వామి తీర్థం సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్బేబీ డ్యాన్స్ వద్ద జరిగిన గొడవలో తన కుమారుడిని కులం పేరుతో వల్లంపూడి ఎస్సై బి.దేవి దూషించి గాయపర్చినట్లు గ్రామానికి చెందిన గుడివాడ కృష్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ పి.మీరాకుమార్, రూరల్ సీఐ అప్పలనాయుడు గ్రామంలో గురువారం విచారణ నిమిత్తం గ్రామసభ నిర్వహించారు. గ్రామసభ వద్దకు ఫిర్యాదుదారు కృష్ణమ్మ హాజరుకాకపోవడంతో డీఎస్పీ మీరాకుమార్ ఫిర్యాదు దారు ఇంటికి వెళ్లి ఆరా తీయగా కుటుంబసభ్యులు ఉన్నారు కానీ ఫిర్యాదుదారు లేకపోవడంతో గ్రామసభకు చేరుకున్నారు. గ్రామసభలో వేచి ఉన్నప్పటికీ సాక్షులు హాజరుకాకపోవడంతో సర్పంచ్ మిడతాన గోపి, ఏపీ దళితకూలీ రైతు సంఘం నాయకుడు గాలి ఈశ్వర్రావు తదితరులతో మాట్లాడిన అనంతరం డీఎస్పీ, సీఐ వెనుదిరిగారు. -
ఆదుకోకోంటే ఉద్యమమే
పెదవేగి: కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోకో రైతుల రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. బొల్లు రామకృష్ణ, బోళ్ల సుబ్బారావు, ఈడ్పుగంటి శ్రీనివాసరావు అధ్యక్షులుగా వ్యవహరించిన ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కోకో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కంపెనీల సిండికేట్తో దోపిడీ కోకో గింజల కొనుగోలు కంపెనీలు సిండికేట్గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకొని కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 75 వేల ఎకరాల్లో కోకో తోటల సాగు ఉందని, ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో కోకో అంతర పంటగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కోకో రైతులు సంఘటితం కావాలి కోకో రైతులంతా సంఘటితంగా లేకపోవడం వల్లే కంపెనీలు సిండికేట్ అయి ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. 24న ధర్నాలు, రాస్తారోకోలు కోకో రైతుల సమస్యలపై ఈ నెల 24, 25 తేదీల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని, ఎంపీలు ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని, సమస్యను పరిష్కరించకపోతే కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీల గొడౌన్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోకో రైతుల రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. తేల్చిచెప్పిన కోకో రైతులు కొనుగోలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ విజయరాయిలో రాష్ట్ర సదస్సుకు పెద్దసంఖ్యలో రైతుల హాజరు -
బాలికల ఉన్నత పాఠశాలలో ‘సునీత’ విజయోత్సవాలు
విజయనగరం అర్బన్: అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ క్షేమంగా చేరుకున్న సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత పాఠశాల ప్రాంగణంలో బాలికలు సామూహిక ప్రదర్శన చేసి బాణసంచా కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం పి.రమణమ్మ మాట్లాడుతూ యువత సునీత విలియమ్స్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాలికల్లో స్ఫూర్తిని పెంచే విధంగా ఆమె చూపిన పట్టుదల, దృఢ సంకల్పం నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.వెంకట్రావు, ఈ.రామునాయుడు, పి.ఉమారాణి, ఎంవీ లక్ష్మీనరసమ్మ, సీహెచ్రత్నం, యూవీఏఎన్ రాజు, శ్రీరంగాచార్యులు, విద్యార్ధినులు పాల్గొన్నారు. 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసంవేపాడ: మండలంలోని కుమ్మపల్లి సమీపంలో సారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం ఊటను వల్లంపూడి పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం సాయంత్రం అందిన సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన దాడుల్లో గ్రామసమీపంలోని తోటల్లో 500 లీటర్ల బెల్లం ఊట పట్టుబడింది. దీంతో బెల్లం ఊటను ధ్వంసం చేశారు. -
మేం చూస్తాం.. మీరు తవ్వుకోండి!
ఈ చిత్రం చూశారా.. ఇసుకపై పెద్ద వాహనాలు వెళ్లినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గోపాలపురం వద్ద నాగావళి నదిలో భారీ వాహనాలతో ఇసుక తరలిపోతున్నా.. అటువంటిదేమీ లేదని, స్థానిక అవసరాలకు మాత్రమే చుట్టుపక్కల వారు తరలిస్తున్నారని అధికారులు సర్దిచెప్పుకోవడం గమనార్హం. సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్: క్షేత్ర స్థాయిలో నదీ తీరాల్లో జరుగుతున్న ఇసుక దోపిడీకి.. అధికారుల ప్రకటనలకు పొంతన లేకపోతోందనడానికి కొన్ని ఉదాహరణలే ఇవీ! ఆనవాళ్లు కనిపిస్తున్నా.. భారీ వాహనాల్లో ఇసుక తరలిపోతున్నా.. ‘అబ్బే ఏమీ లేదని’ అధికారుల నుంచి సమాధానాలు రావడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎండలు మండిపోతు న్నాయి. నదీజలాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే అదునుగా అక్రమార్కులు నిబంధనలకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా ఇసుకను వాహనాల్లో తరలించుకుపోతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క పాలకొండ నియోజకవర్గంలోనే ఇసుక వ్యాపారం రూ. కోట్లలో సాగుతోంది. ఓ వైపు కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితమంటున్నా.. అది ప్రకటనలకే పరిమితమవుతోంది. సామాన్యులకు ఇసుక బంగారంగా మారుతోంది. జిల్లాలో నాగావళి నదీతీరంలో లభిస్తున్న ఇసుక అక్రమార్కులకు అతి పెద్ద ఆర్థిక వనరుగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే మొదలు.. అధికార పార్టీ అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోవడం ప్రారంభించా రు. ఈ క్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యేపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. పాలకొండ నియోజక వర్గ పరిధిలోని భామిని మండలంలో సింగిడి, బిల్లు మడ తదితర ప్రాంతాలతో పాటు పాలకొండ మండలం అన్నవరం, అంపిలి, గోపాలపురం గొట్ట మంగళాపురం, వీరఘట్టం పరిధిలో కొన్ని గ్రామాల ద్వారా ఇసుక అక్రమ తరలింపులు చేపట్టారు. ఈ నేపఽథ్యంలో పలుచోట్ల గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. పత్రికల్లో కథనాలు రావ డం.. సోషల్ మీడియా వేదికగా ఈ అక్రమ రవాణా పై పలువురు ఎండగట్టడంతో కాస్త బ్రేక్ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం సబ్ కలెక్టర్ యశ్వంత్కుమార్ రెడ్డి సైతం ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. నదీ గర్భంలో ఇసుక సేకరణకు వినియోగిస్తున్న యంత్రాలను, పలు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ‘రూటు’ మార్చి! తమ ఆర్థిక వనరులకు అధికారులు అడ్డుపడటంతో అక్రమార్కులు కొత్త ఎత్తుగడ వేశారు. సచివాలయ అధికారుల ద్వారా గృహ, సొంత అవసరాలకు ఇసుక సేకరిస్తున్నట్లు ఓ అనుమతి పత్రం పొందుతున్నారు. దానిని ఆసరాగా చేసుకుని ట్రాక్టర్లతో ఇసుక దోపిడీకి తెర తీశారు. పగటి పూట మనుషు లతో వాహనాల్లోకి ఇసుక ఎత్తిస్తున్నట్లు కనిపిస్తున్నా ... రాత్రి సమయాల్లో భారీ యంత్రాల సాయంతో తరలించుకుపోతున్నారు. ఇటీవల ఇదే విషయమై అధికారులకు ఫిర్యాదులు అందాయి. పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై తనిఖీలు చేసిన జిల్లా గను లు, భూగర్భ శాఖ అధికారులు.. నాగావళి తీరంలో ఎక్కడా ఆక్రమంగా ఇసుక తరలింపులు, యంత్రా ల వాడకం జాడ లేదని, గతంలో అక్కడ ఏర్పాటు చేసిన రోడ్లు, అక్రమ ర్యాంపులు పూర్తిగా చెదిరిపోయినట్లు చెప్పుకొని రావడం గమనార్హం. సొంత అవసరాలకై నా నిబంధనల మేరకు నదీ గర్భంలో 5–6 వందల మీటర్ల దూరంలో ఇసుక సేకరించా ల్సి ఉంది. నాగావళి తీరంలో సొంత అవసరాల పేరిట అక్కడి వంతెన దిగువ భాగంలో పెద్ద ఎత్తున తవ్వుతున్నారు. రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక ఎత్తుకు పోవడంపై గొట్ట మంగళాపురం గ్రామస్తులు, సీఐటీయూ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల అండతో గ్రామంలో క్షేత్ర స్థాయి అధికారులు ఈ వ్యవహారానికి కొమ్ముకాస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు అక్కడి సచివాలయంలో కొద్దిరోజుల క్రితం లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. భామిని మండలం సింగిడి వద్ద పట్టపగలే జేసీ బీ సాయంతో ఇసుక నిల్వలు చేస్తున్నారు. గోపాల పురం వద్ద నదీ గర్భంలోకి భారీ వాహనాలు తిరుగుతున్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నా ఇక్కడ ఏమీ జరగడం లేదని జిల్లా అధికారులే నివేదికలు ఇవ్వడం విశేషం. మరోవైపు వరదల ధాటికి తీరం వెంబడి ఇసుక మేటలు వేసినట్లు పేర్కొంటూ.. వా టిని తరలించేందుకు అధికారికంగా అనుమతులు పొంది, ఈ పేరిట యంత్రాల సాయంతో భారీగా ఇసుక తరలింపునకు రాజమార్గం సిద్ధం చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నాగావళి తీరం నుంచి తరలిపోతున్న ఇసుక పేరుకే నిబంధనలు అధికార పార్టీ అండదండలపై తీవ్ర విమర్శలు నాడు హడావిడి.. నేడు సహకారం! పాలకొండ పరిధిలోని గోపాలపురం, అన్నవరం ప్రాంతాల్లో ఎటువంటి ఇసుక తవ్వకాలుగానీ.. అక్రమ రవాణాగానీ జరగడం లేదని జిల్లా గనులు, భూగర్భ శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ షేక్ నూర్ అహ్మద్ కొద్దిరోజుల క్రితం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గోపాలపురం ప్రాంతంలోని ఇసుక రీచ్ ప్రాంతాన్ని తనిఖీ చేశామని.. ఫిర్యాదు ప్రాంతంలో ఎటువంటి వ్యక్తులు, యంత్రాలు, వాహనాలూ కనిపించలేదని పేర్కొనడం గమనార్హం. ఫిర్యాదులు చేశాం.. మా గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక తరలింపులపై రెండు రోజుల క్రితం సచివాలయంలో ఫిర్యాదు చేశాం. అధికారులు కొలతలు వేసి జెండాలు పాతారు. రోజు గడవక ముందే యథావిధిగా ట్రాక్టర్లపై ఇసుక తరలింపులు జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల అండదండలతో ఇదంతా జరుగుతుందని లిఖిత పూర్వకంగా చెబుతున్నా స్పందన లేదు. వ్యవస్థలను భయపెట్టి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఆర్థికంగా బలపడేందుకు వంతెన దిగువన ఇసుక తవ్వి ముప్పును కొని తెచ్చుకుంటున్నారు. – మజ్జి వీరన్నాయుడు, సీఐటీయూ నాయకుడు, గొట్ట మంగళాపురం ఇసుక అక్రమ తరలింపుతో ఖజానాకు గండి పడుతోందని ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గత ప్రభుత్వ హయాంలో గోపాలపురం వద్ద హడావిడి చేశారు. నాటి ప్రజాప్రతినిధులపై నిందలు వేశారు. ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొనే దందా సాగుతోందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అడపాదడపా అధికారులు వాహనాలు పట్టుకుంటున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే మాత్రం ఈ అడ్డగోలు వ్యవహారం జరుగుతున్న చోటకు వచ్చిన నిజానిజాలను నిగ్గు తేల్చిన దాఖలాలు లేవు. ఇసుక అక్రమ వ్యవహారంలో అధికారుల తీరుపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
డీఎంసీఎస్గా రాజేశ్వరి బాధ్యతల స్వీకరణ
పార్వతీపురం టౌన్: పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్(డీఎంసీఎస్)గా ఐ.రాజేశ్వరి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్ శ్యామ్ప్రసాద్ను గురువారం మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఇప్పటివరకు జిల్లా మేనేజర్గా కొనసాగిన పి. శ్రీనివాసరావు స్థానంలో ఈమె పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. దర్బార్లో ఇఫ్తార్ విందువిజయనగరం టౌన్: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని బాబామెట్టలోని సూఫీ ఆధ్యాత్మిక చక్రవర్తి ఖాదర్బాబా సూఫీ క్షేత్రంలో ఆలయ ధర్మకర్త ఖలీల్బాబు సారథ్యంలో గురువారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. విశాఖ నుంచి హాజరైన రవిచంద్ర రవి, ఖలీల్బాబు తనయుడు అహ్మద్బాబుతో కలిసి ఉపవాస దీక్షాపరులకు ఆత్మీయతతో వడ్డన చేశారు. అనంతరం పరిసర ప్రాంత ప్రజలు, భక్తులకు ఖాదర్బాబా వారి అన్న సమారాధనను నిర్వహించారు. నూనె గింజల పంటల సాగు పెంచాలి విజయనగరం ఫోర్ట్: నూనె గింజల పంటలైన నువ్వు, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటల సాగు విస్తీర్ణం పెంచాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం సేద్య విభాగ అధిపతి డాక్టర్ ఎం.భరతలక్ష్మి అన్నారు. స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ అధికారులకు, విస్తరణ అధికారులకు, వీఏఏలకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నూనె గింజల పంటల్లో కలుపు నివారణకు మార్కెట్లో కలుపు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. వేరుశనగ పంటలో కదిరి లేపాక్షి, నిత్య వారిత వంటి రకాలను వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్, శాస్త్రవేత్తలు డాక్టర్ యు.త్రివేణి తదితరులు పాల్గొన్నారు. రెన్యువల్స్ సకాలంలో చేయించుకోవాలి విజయనగరం ఫోర్ట్: ఆస్పత్రులు, డయోగ్నోస్టిక్ సెంటర్లు, క్లినిక్స్ సకాలంలో రెన్యూవల్స్ చేయించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల వైద్యులకు కెపాసిటి బిల్డింగ్, జనరల్ బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ల రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ వెల్లడించకూడదన్నారు. -
దైవదర్శనానికి వెళ్తూ ఇద్దరు మహిళల మృతి
గుర్ల: మండలంలోని పెనుబర్తికి చెందిన 15 మంది, గరివిడి మండలంలోని కుమరాం గ్రామానికి చెందిన 30 మంది తమిళనాడులోని రామేశ్వరం దైవదర్శనానికి బస్సులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందా రు. తెలంగాణలోని మెదక్ జిల్లా శంకరంపేట వద్ద మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రయాణికుల బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి బస్సు వెనుక భాగంలో ఉన్న కూర్చున్న మహిళలు మృతిచెందారు. మృతిచెందిన వారిలో గుర్ల మండలంలోని పెనుబర్తికి చెందిన రౌతు సూరప్పమ్మ (60), గరివిడి మండలంలోని కుమరాం గ్రామానికి చెందిన మీసాల అప్పలనారాయణమ్మ (50) ఉన్నారు. అలాగే పెనుబర్తి గ్రామానికి చెందిన బెల్లాన జగన్నాథం, సుంకరి రామలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. బావిలో పడి ఒకరు...పార్వతీపురం రూరల్: రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి నేలబావిలో శవమై తేలా డు. ఈ మేరకు స్థానిక రూరల్ ఎస్సై బి.సంతో షి గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సారిక వీధికి చెందిన మజ్జి సత్యనారాయణ(54)ఈనెల 18న ఆస్పత్రికి అని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. తరువాత ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు పరిసర గ్రామాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు భార్య పార్వతి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం పార్వతీపురం రూరల్ పరిధిలో ఉన్న బ్యాంక్ఆఫ్ బరోడా సమీపంలో నేలబావిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మృతదేహాన్ని సత్యనారాయణగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నాలుగు నెలల క్రితం కుటుంబ సభ్యులలో ఒకరు మరణించడంతో మనస్తాపానికి గురై సత్యనారాయణ మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పల్లె పండగ పనులు శతశాతం పూర్తి కావాలి
● ఐదు రోజుల్లో బిల్లులు అప్లోడ్ చేయాలి : కలెక్టర్ పార్వతీపురం టౌన్: జిల్లాలో పల్లె పండగ కింద చేపట్టిన పనులన్నీ రానున్న ఐదు రోజుల్లో శత శాతం పూర్తి కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించా రు. కలెక్టర్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె పండగ పనుల ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ముఖ్యంగా ఫార్మ్ పాండ్స్, ప్రహరీలు, మినీ గోకులాలు, రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 25 నాటికి ఎన్ని పనులు చేయగలిగితే అన్ని పూర్తి చేయాలన్నారు. పనులు వేగవంతం చేసే ప్రక్రియలో ఎటువంటి తప్పులు చేయరాదని, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా పది రోజులు గడువు ఉన్నప్పటికీ బిల్లులు సమర్పించేందుకు ఐదు రోజులు మాత్రమే గడువు ఉందన్నారు. ఈ లోగా పనులు పూర్తి కావాలన్నారు. పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారుల అభీష్టం మేరకు లక్ష్యాలను నిర్దేశించామని, అయినప్పటికీ ఇప్పటి వరకు 40 శాతం పనులు పూర్తి చేసారని తెలిపారు. మిగిలిన 60శాతం పనులు పురోగతిలో ఉన్నందున ప్రతీ రోజూ ప్రగతి కనబరచాలని, నిర్లక్ష్యం వహించిన ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. డ్వామా పీడీ రామ చంద్రరావు, పీఆర్ ఇంజనీరింగ్ అధికారి బి.చంద్రశేఖర్, సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి పి.రమాదేవి, పీఆర్ సాంకేతిక సలహాదారు ఎంవీఆర్ కృష్ణాజీ, డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు. నాణ్యమైన జీడిపప్పును కొనుగోలు చేయాలి వీడీవీకే సభ్యులు జిల్లాలో నెలకొల్పే జీడి పరిశ్రమకు నాణ్యమైన జీడి పప్పును రైతుల నుంచి కొనుగోలు చేసుకొనేలా సహకారం అందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తన సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్లు, ఏపీఎంలు, ఉద్యాన శాఖ అధికారులతో గురువా రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే జీడిపప్పును ముందుగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది 300మెట్రిక్ టన్నుల జీడి పప్పు వీడీవీకేల లక్ష్యం కావాలన్నారు. వ్యాపార వేత్తలు రైతుల నుంచి నాణ్యమైన జీడిపప్పును ముందస్తుగానే కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున వీడీవీకే సభ్యులు త్వరితగతిన కొనుగోలు చేయాలన్నారు. జీడి పరిశ్రమకు అవసరమైన యంత్ర సామగ్రి, ప్రాసెసింగ్, క్రయ విక్రయాలు, బ్రాండింగ్, ప్యాకింగ్, రవాణా, మార్కెటింగ్ సదుపాయాలపై పూర్తిగా అవగాహన కల్పించి శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఏప్రిల్ 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, సీతంపేట ఐటీడీఏ పీఓ సి. యశ్వంత్కుమార్ రెడ్డి, వెలుగు ప్రాజెక్టు అధికారి వై.సత్యంనాయుడు, ఏపీఎంలు, ఉద్యాన శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు
పార్వతీపురంటౌన్: బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్ధానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు స్వయం ఉపాధికి సచివాలయాల వద్ద, మీసేవా కేంద్రాల వద్ద, నెట్సెంటర్ల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. జనరిక్ మెడికల్ స్టోర్ నిర్వహించాలనుకున్న వారు బి–ఫార్మశీ, డి–పార్మశీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. 21 నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు అభ్యర్థి కలిగి ఉండాలన్నారు. ఉచిత టైలరింగ్ శిక్షణకు 21 నుంచి 50ఏళ్ల వయస్సు మధ్య వయస్సు ఉండాలన్నారు. శిక్షణ పూర్తి చేసిన తరువాత కుట్టు మిషన్లు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. కుమ్మరి, మేదర కులాలకు చెందిన వారి కృలవృత్తి నిర్వహించేందుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22 లోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. -
పోక్సో చట్టంపై బాలబాలికలకు అవగాహన
విజయనగరం లీగల్: ప్రస్తుత రోజుల్లో బాలికలు చాలా జాగ్రత్తగా ఉండాలని వారి పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవ ర్తిస్తే ముందుగా తల్లిదండ్రులు, క్లాస్ టీచర్లకు తెలియజేయాలని జిల్లా జడ్జి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. పో క్సో చట్టంపై బాలబాలికలకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం అవగాహన కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ 2012లో ఏర్పడిన పోక్సో చట్టం గురించి వివరించారు. బాలబాలికలకు న్యా యవ్యవస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఏ సమయంలోనైనా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. బాలల హక్కుల ను కాపాడడానికి జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఎప్పు డూ ముందుంటుందన్నారు. బాలబాలికలపై ఎవరైనా అ నుచితంగా ప్రవర్తిస్తే వారి పట్ల కఠినమైన శిక్షలు ఉంటాయ ని హెచ్చరించారు. 18 సంవత్సరాల్లోపు విద్యార్థులకు బా ల్య దశనుంచే రాజ్యాంగం పట్ల సామాన్యమైన చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవంతో మెలగాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ కోర్టు జడ్జి బి.అప్పలస్వామి, జిల్లా న్యాయసేవా అధికా ర సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్ కుమార్, మండల విద్యాశాఖాధికారి పి.సత్యవతి, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.పర్వీన్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
75 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు లక్ష్యం
బాడంగి: రానున్న ఖరీఫ్లో జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు చేసేందుకు కృషి చేస్తున్నామని ఏపీజీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎం.ఆనందరావు వెల్లడించారు. మండల స్థాయి కన్వర్జెన్సీ సమావేశం స్థానిక వెలుగు మండల సమాఖ్య భవనంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 – 26లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళిక తయారీ చేసేందుకు వీఏఏలు, గ్రామైక్య సంఘాల సభ్యులతో కలసి సమీక్షించారు. గత ఏడాది 259 మంది రైతులకు చెందిన 58 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు చేయించినట్టు తెలిపారు. ఆయనతో పాటు ఏపీఎం రత్నాకరరావు, వీఏఏలు, వీఓఏలు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
పిచ్చుకపై.. బ్రహ్మాస్త్రాలు..!
తిండి గింజలు లేక ముగ్గు పిండిని తింటున్న ఊర పిచ్చుకలు● కిచకిచల మనుగడకు ముప్పు ● నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవంపర్యావరణ పరిరక్షకులైన, చిరుప్రాణులైన పిచ్చుకలను మానవత్వంతో ఆదరించాలి. బంగారు పిచ్చుకలను పెంచవలసిన బాధ్యత పెరిగింది.అరు బయట తిండి గింజలు వేయడం, చూరుపై చిన్న చిన్న కప్పులతో నీటిని పెట్టడం, ఇంటి సన్స్లేడ్లపై ఖాళీలలో పెట్టిన గూళ్లను కాపాడడం వంటి చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో సెల్టవర్స్ ఏర్పాటు లేకుండా రేడియేషన్కు దూరం చేయాలి. పిచ్చుకలు తినడంతో తిండి గింజలు నష్టపోతున్నామనే అపొహ విడనాడాలి. పంటపై పడిన కీటకాలు,పురుగులను పిచ్చుకలు తిని రైతుకు మేలు చేస్తాయి. డాక్టర్ జీఎన్నాయుడు, పీహెచ్డీ, జువాలజీ, భామిని పిచ్చుకలు అంతరించి పోకుండా కాపాడాలి ఒకప్పుడు పల్లెల్లో గుంపులు గుంపులుగా సందడి చేస్తూ కనిపించే పిచ్చుకలు క్రమేపీ అంతరించిపోతున్నాయి.పర్యావరణ సమతౌల్యం కాపాడడంలో పిచ్చుకలు ముఖ్య భూమిక వహిస్తాయి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలి. సెల్ టవర్స్ దూరంగా ఉండేలా చూడాలి. మనతో సహజీవనం చేసే పిచ్చుకలను స్నేహితులుగా భావించి రక్షించుకోవాలి. కేవీ రమణమూర్తి, సీఈఓ, గ్రీన్మెర్సీ సంస్థ, శ్రీకాకుళంభామిని: ఇంటి చూర్లు, లోగిళ్లలో నివాసంతో ఇంటిల్లిపాదికి పిచ్చుకలు ఆనందం పంచేవి. మనుషుల మధ్య మమేకమై సహజీవనం సాగించేలా మనముందే ఎగురుతూ అలరించేవి. నేలబావులపైన వాలిన చెట్లుపైన, పొదలు తుప్పలపైన, ఇంటి ముంగిళ్లలో ఊగిసలాడుతూ అందమైన పిచ్చుక గూళ్లు నిర్మించేవి. అపరూపమైన కళానైపుణ్యంతో నిర్మించిన పిచ్చుక గూళ్లు ఆధునిక ప్రపంచంలోనూ గృహనిర్మాణాలకు ఉదాహరణగా మారాయి. పూరింటి చూరుపై కట్టిన గూళ్లపై వాలుతూ ఊగుతూ, వేలాడుతూ కిచకిచ రావాలతో అలరించేవి. తల్లి ప్రేమకు రుజువు జంటకట్టిన పిచ్చుకల జత చెట్ల ఆకులనుంచి తెచ్చిన మొత్తని నార పీచుతో అల్లి నిర్మించిన పిచ్చుక గూళ్ల నిర్మాణం, రక్షణ వలగా మారిన గూళ్లలో గుడ్లు పెట్టి, పిల్లలు పుట్టే వరకు పొదగడం, దగ్గరుండి వాటిని సంరక్షించడంలో దిట్టగా కనిపించచేవి. ఏరి తెచ్చిన గింజలను పిల్లల నోటికి అందిస్తూ తల్లి ప్రేమకు రుజువుగా నిలిచేవి. పిల్లలు పెరిగి పెద్దవయ్యే వరకు సంరక్షించడం అన్యోన్యమైన జీవన విధానం ప్రతిబంబించేవి. ఆధునికత రూపంలో.. పర్యావరణ హితులైన పిచ్చుకల జీవనంపై ఆధునికత వేటు వేస్తోంది. విద్యుత్ రూపంలో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు గూళ్ల నిర్మాణాలకు అడ్డుకట్ట వేశాయి.సెల్ టవర్ల నుంచి ఉద్భవించే రేడియేషన్ పునరుత్పత్తి లేకుండా చేశాయి. వ్యవసాయ రంగంలో వచ్చిన యాంత్రీకరణతో కళ్లాల్లో తిండి గింజలు కరువై జీవనం కష్టమైంది. వరిచేను కుప్పలు, ధాన్యం రాశులు తగ్గిపోవడం పిచ్చుకల మనుగడకు కష్టంగా మారింది. కాంక్రీట్ భవనాలు పిచ్చుకల వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. ధాన్యం నిల్వలు లేకుండా పోవడం, పంటచేలపై క్రిమి సంహారక మందులు పిచ్చుకల మనుగడకు కష్టంగా మారుతున్నాయి. మానవత్వంతో ఆదరించాలి -
ఎవరికీ ఇబ్బంది లేకుండా చర్యలు
ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సంరక్షణ కేంద్రం 1,100 ఎకరాల్లో ని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నాం. అన్నీ పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కందకం తవ్వకాలు, సంరక్షణ వల్ల రైతులకు గానీ, స్థానికులకు గానీ ఎటువంటి ఇబ్బందులూ రావు. కొంత భూభాగంలోనే పనులు చేపడుతున్నాం. ఇది కేవలం ‘ఎలిఫెంట్ హోల్డింగ్ టెంపరరీ’ మాత్ర మే. కొద్దిరోజులపాటే ఏనుగులను ఇక్కడ ఉంచుతాం. ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. ఇదే విషయం రైతులకు చెప్పాం. – బిర్లంగి రామ్నరేష్, పార్వతీపురం రేంజ్ అటవీశాఖాధికారి -
బాలల సంక్షేమం కోసం కమిటీలు
● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ విజయనగరం ఫోర్ట్: మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద బాలల సంక్షేమం, పరిరక్షణ కోసం గ్రామస్థాయిలో సర్పంచ్ ఽ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో బుధవారం జిల్లా స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రామస్థాయి కమిటీలో మహిళా పోలీస్ కన్వీనర్గా ఉంటారని, పంచాయతీ సభ్యులు, ఉపాధ్యాయలు, ఎన్జీఓలు, ఆరోగ్యవర్కర్స్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. గ్రామస్థాయి సమావేశాల్లో అనాథ పిల్లల్ని, స్కూల్ డ్రాపౌట్స్ను గుర్తించాలని చెప్పారు. బాల్య వివాహాలు, ట్రాఫికింగ్, డ్రగ్స్ దోపిడీ తదితర అంశాలపై చర్చించాలని సూచించారు. బాలల హక్కుల సంరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి కమిటీలో చర్చించిన అంశాలను జిల్లాస్థాయి కమిటీకి పంపించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో టీనేజీ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాలపై చర్చ జరగాలని, బాల్యవివాహాలు చేయాలనే అలోచనే తల్లిదండ్రులకు రాకుండా చేయాలన్నారు. బాల్య వివాహ చట్టంపై అవగాహన కల్పించి చట్టంలో ఉన్న శిక్షలపై కూడా తెలిసేలా చూడాలని చెప్పారు. హోటల్స్, కర్మాగారాల్లో పనిచేసే బాలలను గుర్తించాలని కోరారు. సమావేశంలో ఇన్చార్జి ఐసీడీఎస్ పీడీ ప్రసన్న, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాల పట్ల పోలీస్ శాఖ అలెర్ట్
విజయనగరం క్రైమ్: సైబర్ నేరాలను అరికట్టేందుకు, కేసుల దర్యాప్తుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో వివిధ పోలీస్స్టేషన్లలో కంప్యూటర్ ఆపరేటర్లగా పని చేస్తున్న కానిస్టేబుల్స్కు ఒకరోజు శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది.రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు, మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ తరహా నేరాలను నియంత్రించేందుకు నమోదైన కేసుల్లో దర్యాప్తు చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి సిబ్బంది మెరుగుపర్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలను ఛేదించడంలో సమర్థవంతంగా ఎవరైతే విధులు నిర్వహిస్తారో వారికి తప్పనిసరిగా శాఖలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్నారు. బాధితులు వెంటనే ఫోన్ చేయాలిసైబర్ నేరం జరిగిన వెంటనే బాధితులు1930కు ఫిర్యాదు చేసే విధంగా చూడాలని ఫిర్యాదు అంశాలను ముందుగా పరిశీలించి, అది ఏ తరహా నేరమో గుర్తించాలని సిబ్బందికి సూచించారు. నేరం జరిగిన తీరును తెలుసుకుని, బాధితులను విచారణ చేసిన తరువాత, నేరానికి సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బాధితుడి బ్యాంకు స్టేట్మెంటును పరిశీలించి, నేరానికి పాల్పడిన మోసగాడి బ్యాంకు అకౌంటుకు నగదు ఏవిధంగా బదిలీ అయ్యింది, అక్కడి నుంచి ఇంకేమైనా అకౌంట్స్కు నగదు బదిలీ జరిగిందా? లేదా? అన్న విషయాలను గుర్తించాలని చెప్పారు. ఇలా గుర్తించిన బ్యాంకు లావాదేవీలను ఫ్రీజ్ చేసేందుకు సంబంధిత విభాగాలకు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని పేర్కొన్నారు. నేరం జరిగిన గోల్డెన్ అవర్స్లో ఫిర్యాదు దారు 1930కు రిపోర్టు చేస్తే, సైబర్ మోసగాడి బ్యాంకు లావాదేవీలను నియంత్రించేందుకు ఉత్తర. ప్రత్యుత్తరాలు సకాలంలో జరిపితే కోల్పోయిన నగదును తిరిగి బాధితుడికి ఇప్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శిక్షణలో సైబర్ అండ్ సోషల్ మీడియా సెల్ సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, కంప్యూటర్ నిపుణులు రామరాజు, కె.ప్రసాద్, జగదీష్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బాధితులు 1930కు ఫిర్యాదు చేయాలి నేరాలు ఛేదించేందుకు నైపుణ్యం మెరుగుపర్చుకోవాలి జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుల్స్కు ఒకరోజు శిక్షణ -
91,836 మందికి ఆరోగ్యశ్రీ సేవలు
రాజాం: జిల్లాలో 91,836 మంది 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) కింద సేవలు పొందారని పథకం జిల్లా మేనేజర్ దూబ రాంబాబు తెలిపారు. ఆయన రాజాం సామాజిక ఆస్పత్రిని బుధవారం పరిశీలించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందిస్తున్న మెనూపై ఆరా తీశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న మెనూను లబ్ధిదారులకు అందించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ లబ్ధిదారులతో మాట్లాడారు. ఆస్పత్రికి అవసరమైన సౌకర్యాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.హరిబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కింద రూ.195 కోట్ల విలువైన వైద్యసేవలు అందించినట్టు వెల్లడించారు. -
పాము కాటుతో విద్యార్థిని మృతి
గుర్ల: మండలంలోని బూర్లిపేటలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని పాముకాటుతో బుధవారం మృతిచెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బూర్లిపేటకు చెందిన ద్వారపూడి మౌనిక (16) మంగళవారం సాయంత్రం ఇంటి ఆరు బయట ఉన్న వరండాలో కుర్చీలో కుర్చుని సెల్ఫోన్ చూసుకుంటూ కుర్చీ కింద ఉన్న నాగుపామును గమనించలేదు. ఇంతలో మౌనిక కాలిపై పాము కాటువేసింది. పాము కాటువేసిన సంగతి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మా ర్గమధ్యంలో మృతిచెందింది. మౌనిక నెల్లిమర్ల సీకేఎంజీజే కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతోంది. కూతురు ఆకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. ఫిర్యాదు మేరకు గుర్ల ఎస్సై నారాయణ రావు బుధవారం కేసు నమోదు చేశారు. -
రసాయన శాస్త్రంలో నైపుణ్యంతో ఉద్యోగావకాశాలు
● గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ విజయనగరం అర్బన్: ఉన్నత విద్యలో రసాయన శాస్త్రంలో నైపుణ్యంతో ఉపాధి, ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ టి.శ్రీనివాసన్ అన్నారు. ఈ మేరకు స్థానిక గిరిజన యూనివర్సిటీ ప్రాంగణంలో ‘మాలిక్యుయల్స్ టు మెటీరియల్స్’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన ఒక రోజు సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిష్కరణ, విద్యానైపుణ్యాన్ని పెంపొందించడంలో యూనివర్సిటీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. మెటీరియల్ సైన్స్పైనే ప్రపంచం ఆధార పడి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీలతో కలిసి ప్రపంచాన్ని శాసించే విధంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సులో జర్నల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ చీఫ్ ఎడిటర్, బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్కి చెందిన ప్రొఫెసర్ ఎస్.నటరాజన్, ప్రొఫెసర్ బాలాజీ ఆర్ జాగీర్దార్, ప్రొఫెసర్ కేఆర్ప్రసాద్ మాట్లాడుతూ అధునాతన పద్ధతులలో తయారు చేసిన వివిధ పదార్థాలపై పరిశోధనాత్మక అంశాలను వివరించారు. కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ ముక్కామల శరత్చంద్రబాబు, కో ఆర్డినేటర్ డాక్టర్ సురేష్బాబు, డాక్టర్ పడాల కిషోర్ నిర్వహణలో జరిగిన సదస్సులో యూనివర్సిటీ అధ్యాపకులు, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నీలగిరి తోటలు దగ్ధం
వేపాడ: మండలంలోని వీలుపర్తి పంచాయతీ శివారు కొత్తూరు గ్రామం సమీపంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నీలగిరి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో ఫైర్స్టేషన్ అధికారి ఎస్.కె మదీనా నేతృత్వంలో సిబ్బంది శ్రీనివాసరావు, లక్ష్మణరావు, వెంకటరావులు సంఘటానా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొత్తూరు గ్రామానికి చెందిన బోజంకి ఎరుకునాయుడు, బోజంకి ఈశ్వర్రావు, జూరెడ్డి దేముడు తదితర 15 మందికి సంబంధించిన నీలగిరి, టేకు చెట్లు సుమారు పది ఎకరాల్లో కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. సుమారు రూ.నాలుగు లక్షల ఆస్తి నష్టం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. -
మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం
● డీఎంహెచ్ఓ భాస్కరరావు గుమ్మలక్ష్మీపురం: ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యమని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఎస్.భాస్కరరావు అన్నా రు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి సీహెచ్సీని బుధవారం సందర్శించారు. నూతన భవన నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం సీహెచ్సీలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రగి రి ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న 50 పడకల ఆస్ప త్రి భవనాన్ని మే నెలలో ప్రారంభిస్తామన్నారు. మలేరియా నిర్మూలనలో భాగంగా జిల్లాకు సుమా రు 4 లక్షల దోమ తెరలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. సినీ నటుడు సోనూసూద్ జిల్లాకు ఇచ్చిన అంబులెన్స్లలో ఒకటి భద్రగిరి సీహెచ్సీకి కేటాయించామన్నారు. అనంతరం మండలంలోని ఎస్.కె.పాడు గ్రామంలో నిర్వహించిన 104 వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కురుపాం మండలం మొండెంఖల్లు పీహెచ్సీని సందర్శించి మందుల నిల్వలు, రికార్డుల పరిశీలనతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట జిల్లా ప్రొగ్రాం ఆఫీసర్ జగన్మోహన్రావు, భద్రగిరి సీహెచ్సీ, తాడికొండ పీహెచ్సీ వైద్యులు ఉన్నారు. -
ఏనుగులను తరలించాలి
ఏనుగులు ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడికే వాటిని తిరిగి తరలించాలి. ఈ ప్రాంతంలో కందకాలు, ట్రెంచ్ కటింగ్ పను లు చేపట్టడం వల్ల గిరిజనులు, దళితులు, పేదలు దాదాపు 50 సంవత్సరాల నుంచి పెంచుక్కున్న తోటలు, భూములు నాశనమవుతాయి. ఇక్కడ కొందరికి పోడు పట్టాలు, లీజు పట్టాలు ఉన్నాయి. పంటలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి ఏం కావాలి? దీనికితోడు జనావాసాల మధ్య ఏనుగుల సంరక్షణ కేంద్రం సురక్షితం కాదు. – ఎం.కృష్ణమూర్తి, సీపీఎం రాష్ట్ర నాయకులు -
వంట గ్యాస్కు.. ఇదేం తంటా!
సాక్షి, పార్వతీపురం మన్యం: ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. మూడు వారాలుగా అక్కడ ‘నో గ్యాస్’! గ్యాస్ బండ లేకపోతే.. పొయ్యి వెలగని ఈ రోజుల్లో అన్ని వారాలు సిలిండర్ ఇచ్చే ఏజెన్సీ లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు చూసినా సంబంధిత ఏజెన్సీ కార్యాలయం మూతపడే ఉంటోంది. ఫోన్లు చేసినా తీసేవారు కరువు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. సదరు లబ్ధిదారులు బుధవారం ఏజెన్సీ కార్యాలయంతో పాటు.. పార్వతీపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. అంతటికీ కారణం అధికార పార్టీ రాజకీయాల కింద సంబంధిత గ్యాస్ ఏజెన్సీ నలిగిపోవడమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్వతీపురం పట్టణం సారికవీధిలో ఉన్న భారత్గ్యాస్ కార్యాలయం మూడు వారాలుగా తెరచుకోవడం లేదు. గ్యాస్ కోసం సదరు ఏజెన్సీ ఖాతాదారులు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. చాలా రోజులుగా ఇంట్లో గ్యాస్ నిండుకోవడంతో కొంతమంది తెలిసిన వారి దగ్గర తెచ్చుకుని వాడుకున్నారు. ఇరుగుపొరుగు వారిని బతిమలాడుకుని, కొద్దిరోజులు వాళ్ల దగ్గరే వండుకున్నారు. ఆ ప్రయత్నాలు కూడా అయిపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక, మరో దారి దొరక్క చివరికి.. బుధవారం సీఐటీయూ, పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీ కార్యాలయం వద్ద ఖాళీ సిలిండర్లతో నిరసనకు దిగారు. పార్వతీపురం పట్టణం, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 800 మంది వరకు ఖాతాదారులు మూడు వారాలుగా గ్యాస్లేక ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, అధ్యక్షుడు సంచాన ఉమ, నాయకులు బంకురు సూరిబాబు తదితరులు తెలిపారు. తహసీల్దార్ జయలక్ష్మితో పాటు, సీఎస్డీటీకి సమస్యను వివరించారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని వారు హామీ ఇచ్చారు. లబ్ధిదారులందరికీ రెండు రోజుల్లో గ్యాస్ రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. రాజకీయాలే కారణమా.. పట్టణంలోని 23వ వార్డుకు చెందిన ఓ టీడీపీ నాయకుని పేరిట ఏజెన్సీ ఉందని తెలుస్తోంది. ఏజెన్సీని స్వాధీనం చేసుకుని, తన కుటుంబ సభ్యుల పేరిట నడిపేందుకు ఓ ప్రజాప్రతినిధి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇది కాస్త వివాదాలకు దారి తీయడంతో ఏజెన్సీని కొన్నాళ్లుగా మూసివేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతో ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఇంటా నిత్యావసర వస్తువైన గ్యాస్ లేకపోతే ఎన్నాళ్లు ఉండగలమని అంటున్నారు. మూడు వారాలుగా నో సిలిండర్ రాజకీయాలతో నలిగిపోతున్న ఏజెన్సీ? -
మారిక రోడ్డుకు మోక్షం
● గిరిజనుల హర్షం ● కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులువేపాడ: గిరిశిఖర మారిక గ్రామ గిరిజనుల దశాబ్దాల పోరాటం సఫలీకృతం కావడంతో మారిక రోడ్డు నిర్మాణం చురుగ్గా సాగుతోందని సీపీఎం జిల్లా నాయకుడు చల్లా జగన్ అన్నారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మారిక తండాలో రెండురోజులు బస చేసిన నాయకులు బుధవారం మారిక సమీపంలో జరుగుతున్న రోడ్డు పనుల వద్దకు చేరుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మారిక గిరిజన గ్రామానికి రోడ్డు కావాలని, స్వాతంత్య్ర ఫలాలు గిరిజనులకు అందాలంటూ 2013, 2017, 2021,2025 సంవత్సరాల్లో రోడ్డుకోసం ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి, వంటావార్పు, కార్యాలయ నిర్బంధం లాంటి పోరాటాల్లో యువత, మహిళలు, పెద్దలు పోరాడి నందున ఆ ఫలితంగా నేడు రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ జాతీయ ఉపాధిహామీ పథంకం నిధులు రూ.7కోట్లు కేటాయించటమే కాకుండా రోడ్డు నిర్మాణంపై చొరవ చూపించారంటూ కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ సమస్య పరిష్కారంలో స్థానిక ప్రజాప్రతినిధులు కృషిచేయడంతో పాటు గతంలో ఆసంపూర్తిగా నిలిచిన రోడ్డుపనులు, కొత్తగా మంజూరైన రోడ్డు పనులు ఒకేసారి చేపట్టడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పాలకులు మరింత చొరవచూపి వర్షాకాలంనాటికి రోడ్డునిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు చలుమూరి శ్యామ్ మారిక పెద్దలు కిలోఆనంద్, గమ్మెల రామకృష్ణ, బాబారావు, అప్పలనాయుడు, అసు, ఆర్జున్, వెంకటరావు,లింగరాజు, కృష్ణ, శ్రీను మహిళలు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
ఎలిఫెంట్ జోన్..సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: కొన్నేళ్లుగా జిల్లాను వీడని ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపేందుకు అటవీ శాఖాధికారులు చర్యలకు ఉపక్రమించిన విషయం విదితమే. కుంకీ ఏనుగులను రప్పించే ప్రయత్నంతో పాటు.. సీతానగరం మండలంలోని గుచ్చిమి రిజర్వు ఫారెస్టు వద్ద సుమారు 1,100 ఎకరాల స్థలంలో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. సంరక్షణ కేంద్రం పనులు సైతం కొద్దిరోజులుగా జోరుగా సాగుతున్నాయి. సీతానగరం మండ లం అప్పయ్యపేట, రేపటి వలస, తామరకండి, జోగింపేట, గుచ్చిమి, తాన్న సీతారాంపురం చిన్నా రాయుడిపేట, పార్వతీపురం మండలం పులిగుమ్మి రెవెన్యూ ప్రాంతాల పరిధిలో విస్తరించి ఉన్న కొండ చుట్టూ దాదాపు పది కిలోమీటర్ల మేర కందకం తవ్వుతున్నారు. దీంతో పాటు.. సోలార్ ఫెన్సింగ్ పనులూ చేపడుతున్నారు. స్థాని క రైతులకు, ప్రజలకు కనీస సమాచారం ఇవ్వక.. గ్రామ సభలు నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే పనులు చేపడుతున్నారంటూ స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. పనులను నిలుపుదల చేయాలని కొద్దిరోజులుగా ఆందో ళనలు చేస్తున్నారు. ఏనుగుల జోన్ను పార్వతీపురం మన్యం జిల్లా నడిబొడ్డున ఉన్న సీతానగరం మండలంలో పెట్టడమంటే.. ఆ మండలాలు, జిల్లా ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడటమేనని చెబుతున్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దశాబ్దాలుగా ఏనుగుల సమస్య ఒడిశా నుంచి జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించిన ఏనుగులు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇప్పటికే 13 మంది ఏనుగుల దాడిలోమృతి చెందగా.. కోట్లాది రూపాయల పంట, ఆస్తి నష్టం సంభవించింది. జిల్లాలో రెండు గుంపులుగా తిరుగుతున్న గజరాజులు.. ప్రతిరోజూ ఏదో చోట నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో వివిధ ప్రమాదాల వల్ల ఏనుగులూ మృత్యువాత పడ్డాయి. ఈ నేపథ్యంలో కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుంకీ ఏనుగులను తెప్పించి, జిల్లాలో గజరాజుల సమస్యకు పరిష్కా రం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అది నెరవేరలేదు. త్వరలోనే రెండు కుంకీలు వస్తాయని ఎప్పటి నుంచో చెబుతున్నా ఆచరణలోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అటవీ శాఖాధికారులు ఉపక్రమించారు. కుంకీల ద్వారా వీటిని ఇక్కడకు తరలించి, మచ్చిక చేయించి, కొన్నాళ్ల తర్వాత తరలించాలన్నది అధికారుల ఆలోచన. జిల్లా ప్రజలకు ఇది ఉపయోగపడినదే అయినప్పటికీ.. సమస్యను తమ నెత్తి మీద పెట్టడమేమిటని, జనావాసాల మధ్య పెడితే తాము బతకగలమా? అని సీతానగరం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు, భూములను కోల్పోనున్న రైతులు ఈ ప్రాంతంలో పలువురు గిరిజనులు, దళితులు, పేదలు సుమారు 50 ఏళ్లుగా తోటలు, వివిధ పంట లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ కందకాలు, ట్రెంచ్ కటింగ్ తవ్వకాల వల్ల తోటలు, భూములు నాశనమవుతాయని వారంతా ఆందోళ న చెందుతున్నారు. కొంతమంది రైతుల పంటలకు వెళ్లేందుకు దారి లేకుండా అడ్డుగా తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో వారంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత సోమవారం కలెక్టరేట్కు చేరుకుని ధర్నా చేపట్టారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. మంగళవారం కూడా సంబంధిత తవ్వకం పనులను అడ్డుకున్నారు. బుధవారం పార్వతీపురంలోని అటవీ శాఖ కార్యాలయానికి చేరుకుని రేంజ్ అధికారి బిర్లంగి రామ్నరేష్ను కలిసి తమ ఆవేదన వినిపించారు. ఏనుగుల కోసం కందకాలు, చుట్టూ ఫెన్సింగ్తో పాటు, నీటి కోసం చెరువులను తవ్వించాలి. జనావాసాల మధ్య సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే.. తాము ఎలా బతకగలమని ఆయా గ్రామస్తులు, రైతులు వాపోతున్నారు. న్యూస్రీల్ సీతానగరం మండలం గుచ్చిమి రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో ఏనుగుల సంరక్షణ కేంద్రం అక్కడే కొన్నాళ్లపాటు గజరాజులను ఉంచేందుకు చర్యలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రైతులు, స్థానికులు -
బాసంగి గదబవలసలో ఏనుగుల గుంపు
జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి, బాసంగి గదబవలస, వెంకటరాజపురం పంట పొలాల్లో బుధవారం సాయంత్రం ఏనుగులు దర్శనమిచ్చాయి. సాయంత్రం వెంకటరాజపు రం గ్రామం పొలిమేరలోకి రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వరి, అరటి పంటలు ధ్వంసం చేస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగులు తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉపాధిహామీ పనుల్లో అలసత్వం వద్దు ● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురం టౌన్: ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనుల్లో అలసత్వం వద్దని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్ట ర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఉపాధిహామీ నిధులతో చేపట్టిన ప్రహరీలు, మినీ గోకులాలు, ఇంకుడు గుంత లు, ఫారంపాండ్లు, ఫిష్ పాండ్లు, రోడ్ల పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలో 334 ప్రహరీ నిర్మాణాలు మంజూరు చేయగా 67 మాత్రమే పూర్తయ్యాయన్నారు. భామిని, పాచిపెంట, సాలూరు, కురుపాం, పార్వతీపు రం, సీతానగరం మండలాల్లో ప్రగతి కనిపించాలన్నారు. 988 మినీ గోకులాలకు 113 పూర్తయ్యాయన్నారు. సాలూరు, పార్వతీపురం, భామిని, సీతంపేట, పాచిపెంట మండలాల్లో పురోగతి సాధించాల్సి ఉందన్నారు. ఉపాధి హామీ పనులను వేగవంతంగా పూర్తిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించా రు. సమావేశంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ. ప్రభాకరరావు, ఎంపీడీఓలు, ఇతర అధికారు లు పాల్గొన్నారు. కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు వీరఘట్టం: 2025–26 విద్యాసంవత్సరంలో ఆరో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం బాలికలకు కేజీబీవీలు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాయి. 7, 8, 9 తరగతుల్లో మిగులు సీట్లు భర్తీకి కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ప్రవేశాల్లో అనాథలు, బడిబయట ఉన్న చిన్నారులు, బడి మధ్యలో మానేసిన బాలికలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న బాలికలకు తొలి ప్రాధాన్యం కల్పిస్తారు. ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని, సంబంధిత ప్రింట్కు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం, ఆదాయ ధ్రువపత్రాలు, స్టడీ సర్టిఫికెట్ జిరాక్స్లు, పాస్ఫొటో జతచేసి సమీప కేజీబీవీల్లో అందజేయాలి. జిల్లాలోని వీరఘట్టం, సీతంపేట, భామిని, గరుగుబిల్లి, కురుపాం, జియ్యమ్మవలస, జి.ఎల్.పురం, పార్వతీపురం, సాలూరు, కొమరాడ, బలిజిపేట, మక్కువ, సీతానగరం, పాచిపెంట మండలాల్లోని 14 కేజీబీవీల్లో ఆరో తరగతిలో 560 సీట్లు, ఇంటర్మీడియట్ ఫస్టియర్లో వివిధ గ్రూపుల్లో 560 సీట్లు భర్తీ చేయనున్నారు. వచ్చిన దరఖాస్తులను ఏప్రిల్ 16 నుంచి 18 వరకు పరిశీలిస్తారు. అర్హులైన తొలి జాబితాను ఏప్రిల్ 21 ప్రకటిస్తారు. తర్వాత ఏప్రిల్ 25న ఎంపికై న బాలికల రెండవ జాబితా ప్రకటిస్తారు. కొన్ని కేజీబీవీలు ఉచితంగా ఆన్లైన్ దరఖాస్తుచేసే ఏర్పాట్లు చేస్తున్నాయి. మరిన్ని వివరాలకు సెల్ 70751 59996, 70750 39990 నంబర్లను సంప్రదించాలని జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు కోరారు. -
చిన్నశ్రీను ఇంట విషాదం
విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)కు పుత్ర వియోగం కలిగింది. ఆయన రెండవ కుమారుడు మజ్జి ప్రణీత్బాబు(20) విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. 2020 సంవత్సరం మే 14వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ నాలుగు సంవత్సరాల పదినెలల పాటు మృత్యువుతో పోరాడారు. కరోనా విపత్కర సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించి చికిత్స అందించారు. అనంతరం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని విశాఖ నుంచి విజయనగరంలోని ధర్మపురిలో గల మజ్జి శ్రీనివాసరావు ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ బంధువులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వైఎస్సార్సీపీ శ్రేణులు సందర్శన అనంతరం తోటపాలెంలోని రోటరీ స్వర్గధామంలో బంధువులు, అభిమానుల అశ్రునయనాల నడుమ సంప్రదాయబద్ధంగా మజ్జి శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రణీత్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నశ్రీనును మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు తమ అభిమాన నాయకుడు మజ్జి శ్రీనివాసరావు రెండవ కుమారుడు ప్రణీత్బాబు మరణవార్త తెలుసుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రముఖ నాయకులు, వైస్సార్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంతాపం తెలిపారు. వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, జెడ్పీటీసీ వర్రి నర్సింహమూర్తి, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రణీత్ భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీ చైర్మన్ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన కుమారుడు మృతి ఐదేళ్లపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన ప్రణీత్బాబు జెడ్పీ చైర్మన్ను పరామర్శించిన వైఎస్సార్సీపీ శ్రేణులు, జిల్లా ప్రజలు సంతాపం తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి -
● హామీల అమలుకు డిమాండ్
పట్టణాల్లో పేదలు నివసిస్తున్న చోటే జీవో నంబర్ 30 ప్రకారం స్థలాలను కేటాయించాలని, ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించాలని సీపీఎం జిల్లా నగర కార్యదర్మి శంకరరావు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పట్టణాల్లో నివసిస్తున్న పేదలకు 2 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి 9 నెలలు గడుస్తున్నా మంజూరు చేయకపోవడంపై మండిపడ్డారు. సీపీఎం ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా కోట కూడలి నుంచి విజయనగరం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బి.రమణ, పి.రమణమ్మ, జగన్మోహన్, ఆర్.శ్రీనివాసరావు, శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం -
గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్వతీపురంటౌన్: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులతో మంగళవారం మాట్లాడారు. 2029 నాటికి అందరికీ సొంతిల్లు ఉండాలన్నదే లక్ష్యమన్నారు. పీఎంఏవై 1.0లో మంజూరైన ఇళ్లు, వివిధ దశల్లో నిర్మాణం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్ విలువ ఆధారంగా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఎస్సీలు, బీసీలకు రూ. 50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలకు రూ.73.09 కోట్ల మేర అదనపు సాయం అందనుందన్నారు. 10,717 గృహాలు పూర్తి చేసేందుకు ఇది చక్కటి అవకాశంగా పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం గృహ నిర్మా ణ దినోత్సవంగా పాటించి ఇచ్చిన లక్ష్యాలు సాధించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడులు విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు ఇన్చార్జి ఐసీడీఎస్ పీడీ జి.ప్రసన్న తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఇల్లు చిన్నది... బిల్లు పెద్దది రాజాం: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన నక్క లక్ష్మీనారాయణ తన కుమారుడి ఇంటిపై చిన్న గదిలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఒక ఫ్యాను, రెండు లైట్లు, టీవీ మాత్రమే వినియోగిస్తున్నారు. కోడలు పద్మ పేరుతో ఉన్న విద్యుత్ కనెక్షన్కు ఫిబ్రవరి నెల విద్యుత్ బిల్లు రూ.1495.99 రావడంతో లబోదిబోమంటున్నారు. రూ.122 విలువ చేసే విద్యుత్ వినియోగిస్తే బిల్లు మాత్రం వేలల్లో వచ్చిందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదని, న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. హెచ్ఎంపై చర్యలు తీసుకోండి వేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీ శివారు మారిక గ్రామ ప్రాథమిక పాఠశాలకు వెళ్లకుండా జీతం తీసుకుంటున్న ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ డిమాండ్ చేశారు. నెలలో నాలుగురోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లి జీతం తీసుకుంటున్నారని, బోధించేవారు లేక మారికలో 28 మంది, పాతమారికలో 14, కొత్తమారికలో 14 మంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారన్నారు. హెచ్ఎం పనితీరుకు నిరసనగా పాఠశాల వద్ద విద్యార్థులతో కలిసి మంగళవారం ఆందోళన చేశారు. దీనిపై కలెక్టర్ స్పందించాలని కోరారు. కార్యక్రమంలో కె.ఆనంద్, బాబూరావు, అప్పలనాయుడు, రామకృష్ణ, ఆసు, తదితరులు పాల్గొన్నారు. విచారణ వేగవంతం చేయండి ● శాసనసభ కమిటీ చైర్మన్ నెహ్రూకు పాల రైతుల సంఘం నాయకుల వినతి విజయనగరం ఫోర్ట్: విశాఖ డెయిరీపై విచారణను వేగవంతం చేయాలని పాల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు డిమాండ్ చేశారు. కుంచనపల్లిలోని గెస్ట్ హౌస్లో శాసనసభ కమిటీ చైర్మన్ జ్యోతుల నోహ్రూను మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. తగ్గించిన పాల ధరను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో పాలరైతు సంఘం కార్యదర్శి కె.అజయ్కుమార్, డి సుబ్బారావు, తమటాపు పైడినాయుడు ఉన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ
పార్వతీపురం రూరల్: పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను పట్టుకోవాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి సూచించారు. జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్హాల్లో మంగళవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, వాహనాల దొంగతనం, సీఆర్పీసీ కేసులు, మిస్సింగ్, చీటింగ్, సైబర్ నేరాలు, తదితర కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. సీసీ టీఎంఎస్లో గ్రేవ్ కేసు, నాన్గ్రేవ్ కేసులో పార్ట్–1, పార్ట్–2 సీడీలు అప్డేట్గా ఉండేలా చూసుకోవాలన్నారు. హత్య కేసుల్లో అభియోగ పత్రాలను వీలైనంత తొందరగా కోర్టులో దాఖలు చేయాలన్నారు. ఈ కోప్స్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై నిఘా పెంచాలన్నారు. అవసరమైతే స్టేషన్కు పిలిపించి వారి పూర్తి వివరాలను సేకరించి గాంఢీవం కోర్టులో అప్లోడ్ చేస్తే నేర చరిత్ర తెలుస్తుందన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను ఎస్పీ అందజేశారు. నేర సమీక్ష సమావేశంలో ఏఎస్పీ అంకిత సురానా, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఎస్బీ సీఐ రంగనాథం, డీసీఆర్బీ సీఐ ఆదాం, సోషల్ మీడియా, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ అప్పారావు, ఏఆర్ ఆర్ఐ రాంబాబు, పలువురు సీఐలు, ఎస్ఐలు, ఐఆర్ఏడీ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి -
జీడి పిక్క.. బతుకు పక్కా అన్నారు...
పార్వతీపురంటౌన్: ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలకు గిట్టుబాటు ధర ఉండడం లేదు... ప్రభుత్వం నుంచి రైతులకు పెట్టుబడి సాయం అందని ద్రాక్షగా మారింది.. విద్య, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాల కల్పనపై కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోంది.. ప్రాజెక్టుల ఆధునికీకరణకు బడ్జెట్లో కనీస నిధులు కేటాయించలేదు.. వస్తున్న ఖరీఫ్కు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.. జీడి పంటకు మద్దతు ధర లేదు.. గిరిజన ప్రాంత అభివృద్ధి ఎండమావిగా కనిపిస్తోంది.. అత్యవసర వేళ డోలీ కష్టాలు వీడడంలేదు.. పల్లెపండగ అంటూ మొదలెట్టిన పనులు ‘ఎక్కడివేసిన గొంగలి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయి.. సంక్షేమ పథకాల హామీలన్నీ ఆచరణ శూన్యంగానే కనిపిస్తున్నాయంటూ గిరిజనులు ఆందోళన బాట పట్టారు. పార్వతీపురం కలెక్టరేట్ వద్ద సోమవారం చేపట్టిన 48 గంటల నిరసన దీక్షను మంగళవారం సాయంత్రం వరకు కొనసాగించారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినదించారు. ఇచ్చిన హామీలు అమలుచేయాలని కూటమి నేతలను డిమాండ్ చేశారు. వ్యయప్రయాసల కోర్చి ప్రతి సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికకు రాలేమని, గతంలో వలే సచివాలయ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. పలు డిమాండ్లను వినిపించారు. దీక్షల్లో గిరిజన సంఘాల నాయకులు ఎం.తిరుపతిరావు, లక్ష్మణరావు, కె.రామస్వామి, కె.సీతారాం, ఎస్.అప్పారావు, ఎస్.రామారావు, కె.ప్రసాద్, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. చదువుకునేలా చూడండి వైద్య కళాశాల ఏదీ? జిల్లాలోని రెండు ఐటీడీఏల గిరిజనులతో జీడి పిక్క.. బతుకు పక్కా అంటూ గతంలో టీడీపీ ప్రభుత్వమే మొక్కలు వేయించింది. కష్టపడి తోటలు పెంచిన గిరిజనుల నుంచి జీడి పిక్కలు కొనుగోలు చేసేవారే నేడు కరువయ్యారు. దళారులకు చౌకగా అమ్ముకోవాల్సి వస్తోందని గిరిజన రైతులు వాపోయారు. జీసీసీ పరిధిలో 80 కేజీల జీడిపిక్కల బస్తా రూ. 16 వేలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీతంపేట, కురుపాం, సాలూరు గిరిజన ప్రాంతాల్లో జీడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టరేట్ వద్ద 48 గంటల పాటు నిరసన దీక్ష పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని వినతి మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ నినాదాలు సంక్షేమ పథకాలు అందడంలేదంటూ ఆవేదన జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే నూటికి 95 మంది ఉన్నారు. వీరిలో చాలా మంది డబ్బులు ఖర్చుపెట్టి ప్రైవేటు కళాశాలల్లో చదువుకోలేని పరిస్థితి. ఎక్కువగా గిరిజనులు ఎంఏ, ఎమ్మెస్సీ, ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదవడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సకాలంలో ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక కష్టాలతో చదువుకు దూరమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి గిరిజనులకు విద్యావకాశాలను అందుబాటులోకి తేవాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలలను ఎత్తేసే ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. రూ.600 కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేసే వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం రద్దుచేయడాన్ని గిరిజన సంఘాల నాయకులు తప్పుబట్టారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాల లేని జిల్లాగా పార్వతీపురం మన్యం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో 100 పడకల ఆస్పత్రుల పనులను తక్షణమే పూర్తిచేసి మెరుగైన వైద్యసేవలందేలా చూడాలని కోరారు. -
రూ.60 లక్షలు కట్టించాను
శ్రీ సాయిలక్ష్మీ టౌన్ షిప్లో ఏజెంట్గా చేరాను. ఇంటి స్థలాల కోసం వీరఘట్టం ప్రాంతంలోని 41 మంది నుంచి సుమారు రూ.60లక్షలు కలెక్షన్ చేసి వారాడ రాజేంద్రనాయుడుకు ఇచ్చాను. నేను కట్టిన ప్రతిపైసాకు రసీదు ఉంది. నన్ను నమ్మి డబ్బులు కట్టిన వారికి నేను ఏం సమాధానం చెప్పాలి. ఇది ఘరానా మోసం. బాధితులకు న్యాయం చేసేలా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలి. – పిన్నింటి వెంకటరమణ, ఏజెంట్, వీరఘట్టం మోసంపై ప్రశ్నిస్తే కొడతారా? నేను మా ప్రాంతంలో నాకు తెలిసిన వారి నుంచి శ్రీ సాయి లక్ష్మీ టౌన్ షిప్లో ఇళ్ల స్థలాల కోసం రూ.కోటి50లక్షలు కట్టించాను. రాజేంద్రనాయుడును నమ్మి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కడితే ఇంటి స్థలాలు ఇవ్వకపోగా రాక్షసంగా స్తంభానికి కట్టి కొట్టారు. మోసంపై ప్రశ్నిస్తే ఇంత దారుణమా. పోలీసులు స్పందించి మోసం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూడాలి. బాధితులకు న్యాయం చేయాలి. – శేఖర్, ఏజెంట్, ఎల్.ఎల్.పురం, పాలకొండ మండలం ● -
చదువు లేదు.. ఉద్యోగాలూ లేవు..
గిరిజన ప్రాంత పాఠశాలలపై ఇటీవల కాలంలో పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వ విద్యపై చిన్నచూపు అలముకుంది. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే ఆర్థిక స్థోమత లేక గిరిజన యువత చదువుకు దూరమవుతున్నారు. జిల్లాలో రెండు ఐటీడీఏలు ఉన్నా విద్య, ఉద్యోగాల కల్పన చర్యలు శూన్యంగానే కనిపిస్తున్నాయి. గిరిజన యువతకు మేలుకలిగించే నిర్ణయాలు తీసుకోవాలి. – కొండగొర్రి ప్రసాద్, డోకుల గూడ గిరిజన గ్రామం, భామిని మండలం ● బోర్డు తిప్పేసిన శ్రీ సాయిలక్ష్మి టౌన్ షిప్ ● సుమారు రూ.7 కోట్ల వరకు దోపిడీ ● గగ్గోలు పెడుతున్న బాధితులు ● రియల్ ఎస్టేట్లో ఇంటి స్థలం కోసం ప్రతినెల రూ.3,999 చొప్పున వసూలు ● ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు ● వీరఘట్టం, పాలకొండ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు -
● పెన్షన్ కోసం ఆందోళన
అధికారంలోకి వస్తే ఈపీఎఫ్ కనీస పెన్షన్ను రూ.9వేలు చెల్లిస్తామని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చి ఏళ్లు తరబడుతున్నా పెన్షన్ మాత్రం పెంచలేదని పలువురు పెన్షన్దారులు ఆరోపించారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని పీఎఫ్ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. పెన్షన్ పెంచండి మహాప్రభో అంటూ చేతులెత్తి దండం పెట్టారు. రైల్వేలో రాయితీలు, ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.శంకరరావు, కార్యదర్శి ఓ.ఎస్.ఎన్.మూర్తి, ఉపాధ్యక్షుడు వి.శేషగిరి, కమిటీ సభ్యులు ఆదినారాయణ, అప్పలరాజు, కె.రామారావు, కె. పాపారావు, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం -
850కిలోల రేషన్ బియ్యం పట్టివేత
బలిజిపేట: మండలంలోని గలావల్లిలో 850కిలోల రేషన్ బియ్యాన్ని శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై రామారావు, బలిజిపేట సీఎస్డీటీ రమేష్బాబులు మంగళవారం పట్టుకున్నారు. వారికి అందిన సమాచారం ప్రకారం గలావల్లి గ్రామానికి చెందిన ఎం.రామారావు అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేసి ఇంటివద్ద ఉంచాడు. దీంతో అధికారులు దాడిచేసి రామారావు ఇంటి వద్ద ఉన్న 850కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వ్యాపారి రామారావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ నెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లి జంక్షన్ వద్ద బొలెరో వ్యాన్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ వాహన తనిఖీలు చేపడుతుండగా ఎటువంటి అనుమతులు లేకుండా వాహనంలో తరలిస్తున్న 60 భస్తాలను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని చెప్పారు. -
జూడో విజేతలకు జేసీ అభినందనలు
విజయనగరం: జూడో రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన నెల్లిమర్ల కేజీబీవీ విద్యార్థినులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ తన చాంబర్లో మంగళవారం అభినందించారు. ఈ నెల 9న స్థానిక విజ్జి స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నెల్లిమర్ల కేజీబీవీకి చెందిన 8 మంది విద్యార్థినులు విజయవాడలో ఈ నెల 15.16 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందారు. విజేతల్లో జిల్లాకు చెందిన వై.అనూష 52 కిలోల విభాగంలో రెండోస్థానం, పి.జ్యోత్స్నరాణి తృతీయస్థానంలో నిలిచారు. బి.భార్గవి 63 కిలోల విభాగంలో రెండో స్థానంలో నిలవగా 70 కిలోల విభాగంలో పి.సత్య కూడా ద్వితీయస్థానంలో నిలిచింది. అదేవిధంగా వై.అనూష జాతీయ పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా వారిని జేసీ సేతుమాధవన్ అభినందించి, మరిన్ని విజయాలను సాధించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు, జీసీడీఓ మాలతి, నెల్లిమర్ల కేజీబీవీ ప్రిన్సిపాల్ బి.ఉమ, పీడీ ఎస్.రమ తదిరులు పాల్గొన్నారు. -
శక్తి మొబైల్ యాప్పై అవగాహన
విజయనగరం క్రైమ్: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా రూపొందించిన శక్తి (ఎస్ఓఎస్) మొబైల్ యాప్ను ప్రతి మహిళ, యువత తన మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం పిలుపునిచ్చారు. మహిళల మొబైల్ ఫోన్లో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా ఒక కుటుంబసభ్యుడు మీకు తోడు ఉన్నట్లేనన్నారు. ఆపద సమయాల్లో : శక్తి యాప్లోని ఎస్ఓఎస్ బటన్ను ప్రెస్ చేస్తే క్షణాల్లో పోలీసు బృందం మీరున్న ప్రాంతానికి చేరుకుని రక్షణగా నిలుస్తారని చెప్పారు. రాత్రి సమయాల్లో మహిళలు నైట్ షెల్టర్లలో వేచి ఉండేందుకు దగ్గరలో ఉన్న నైట్ షెల్ట ర్ల వివరాలు, సమీపంలోని పోలీస్ స్టేషన్ల ఫోన్ నంబర్లు, హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మొబైల్ యాప్ పై ‘శక్తి‘ బృందాలు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్సులు, రైల్వేస్టేషన్లు, ముఖ్యకూడళ్ళు, కళాశాలలు సందర్శించి, మహిళలు, విద్యార్ధినులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. కళాశాలలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో కార్యక్రమం -
ఆక్రమణలపై రెవెన్యూ కొరడా
● బొండపల్లి, కొండశంభాం ప్రాంతాల్లో అధికారుల పరిశీలన ● ఆక్రమణలు జరిగినట్లు గుర్తింపు ● సర్వే చేసి తొలగించేందుకు చర్యలుచీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని బొండపల్లి, కొండశంభాం గ్రామాల్లో జరిగిన ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. బొండపల్లి పంచాయతీలో గల రాముల చెరువు ఆక్రమణకు గురైందని, ఆక్రమణదారులు చెరువును ఆక్రమించారని, చెరువులో నుంచి రహదారిని కూడా నిర్మించారని కొన్ని రోజుల క్రితం గరివిడి తహసీల్దార్ కార్యాలయంలో చెరువు ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు తహసీల్దార్ సీహెచ్.బంగార్రాజు, ఆర్ఐ అచ్యుతరావుతో పాటు సర్వేయర్,స్థానిక వీఆర్ఓలు చెరువులో ఉన్న ఆక్రమణకు గురైన స్థలాన్ని మంగళవారం గుర్తించి ఆక్రమణలను తొలగించారు. చెరువు హద్దు ఎంతవరకు ఉందో చూపించి సరిచేయించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన కొంతమంది రైతులు చెరువులో మరోవైపు కూడా ఆక్రమణలు ఉన్నాయని, పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించాలని కోరగా రాముల చెరువు మొత్తం విస్తీర్ణాన్ని కొలతలు వేసి నివేదిక సమర్పించాలని స్థానిక వీఆర్ఓ, సర్వేయర్ను తహసీల్దార్ ఆదేశించారు. ఇరిగేషన్శాఖ అధికారులకు లెటర్ రాసి ఆక్రమణలో ఉన్న చెరువుగర్భాన్ని ఉపాధి హామీ పనుల ద్వారా చెరువు పరిధిలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గెడ్డవాగులో పశువుల షెడ్డు నిర్మాణం అదేవిధంగా కొండశంభాం పరిధిలో గల బొడ్లపేట గ్రామంలో ప్రభుత్వ గెడ్డవాగును స్థానికులు ఆక్రమించుకున్నారని తెలిసిన సమాచారం మేరకు గెడ్డవాగు ప్రాంతాన్ని పరిశీలించి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. గెడ్డవాగును మట్టితో కప్పి ఆవుల షెడ్డు నిర్మించారు. ప్రభుత్వ గెడ్డవాగు ఎంత మేరలో ఉందో సర్వే చేయించి గెడ్డవాగును ఆక్రమించిన వారికి నోటీసులు అందించి ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ105 శ్రీ180 శ్రీ190జీడి, మామిడి తోటలు దగ్ధంవేపాడ: మండలకేంద్రం వేపాడ రెవెన్యూ పరిధి రాయుడుపేట రహదారిని ఆనుకుని ఉన్న జీడిమామిడి, మామిడి తోటలు మంగళవారం సాయంత్రం దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి ఎస్.కోట అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం సమాచారం తెలుసుకున్న ఎస్.కోట అగ్నిమాపకసిబ్బంది సంఘటనస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. గ్రామానికి చెందిన గుత్తి గుణవతి, సత్యవతి, మోహన్, శ్రీను, సింహచలం తదితరులకు సంబంధించిన జీడిమామిడి, మామిడి తోటలు సుమారు నాలుగున్నర ఎకరాలు కాలిపోయాయి. కార్యక్రమంలో ఎస్.కోట అగ్నిమాపక సిబ్బంది పైర్ ఆఫీసర్ ఎస్.కె.మదీనా, ఆర్వెంకటరావు, వై.నర్సింగరావులు పాల్గొన్నారు.బాంబ్ బ్లాస్టింగ్లో వ్యక్తి మృతిభోగాపురం: ఎయిర్పోర్టు నిర్మాణంలో భాగంగా జరిపిన బాంబ్ బ్లాస్టింగ్లో ఒక వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందిదాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామచంద్రపేట గ్రామానికి చెందిన బోర కొత్తయ్య(35) విమానాశ్రయం పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. ఎయిర్పోర్టు సిబ్బంది కవులవాడ సమీపంలో రోడ్డు నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించేందుకు బాంబులను ఏర్పాటు చేసి బ్లాస్టింగ్ చేశారు. ఈ బ్లాస్టింగ్లో కొత్తయ్య ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఎయిర్పోర్టు సిబ్బంది గాయపడిన కొత్తయ్యను తగరపువలస ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య ఎర్రమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలుపార్వతీపురంటౌన్: పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీనిపై జిల్లా ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దంగిడి వీధికి చెందిన గెంబలి కాంతారావు పనుల నిమిత్తం పార్వతీపురం పట్టణం పాతబస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా పార్వతీపురం నుంచి పాలకొండ రోడ్డుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో కాంతారావుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు జిల్లా అస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఐదు లీటర్ల సారా పట్టివేతవేపాడ: మండలంలోని కృష్ణారాయుడు పేట సమీపంలో దాడులు నిర్వహిస్తుండగా వావిలపాడు గ్రామానికి చెందిన వి.దేముడు ఐదు లీటర్ల సారాతో పట్టుబడినట్లు ఎకై ్సజ్ సబ్ఇన్స్పెక్టర్ వీఎన్ రాజు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి దగ్గర ఉన్న సారా క్యాన్ స్వాధీనం చేసుకునం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో ఎస్సైతో పాటు సిబ్బంది సచివాలయం కార్యదర్శి టి.వెంకటేష్ పాల్గొన్నారు. 18 మద్యం బాటిల్స్ స్వాధీనందత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం సంత వద్ద అక్రమంగా 18 మద్యం బాటిల్స్ తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుని మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పెదమానాపురం ఎస్సై జయంతి తెలిపారు. మద్యం షాపు నుంచి అనుమతులు లేకుండా మద్యం తరలిస్తున్నాడని సమాచారం రావడంతో నిఘా పెట్టి ఆ వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
డ్వామాలో వింత డ్రామా..!
విజయనగరం ఫోర్ట్: ఉపాధిహామీ పథకంలో పనిచేసే మేట్లకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తానని గుర్ల ఉపాధి హామీ పథకం ఏపీఓపై ఆరోపణలు వచ్చాయి. కలెక్టరేట్లోలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గార రామలక్ష్మి అనే మహిళ ఏపీఓపై ఇప్పటికే రెండుసార్లు ఫిర్యాదు చేసింది. అయినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● గంట్యాడ ఉపాధి హామీ పథకం ఏపీఓ లక్షలాది రుపాయల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై ఉపాధి పథకం రాష్ట్రస్థాయి అధికారులు విచారణ చేపట్టారు. మండలంలోని నరవ, లక్కిడాం, పెణసాం, మధుపాడ తదితర గ్రామాల్లో ఉపాధి హామీ వేతనదారుల నుంచి లక్షలాది రుపాయలు వసూలు చేసినట్లు ఏపీఓపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆ ఏపీఓపై ఎటువంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ● జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన సిబ్బంది అధికారులకు కొంత మొత్తం ముట్టజెప్పి మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది సైతం అక్రమాలకు పాల్పడడానికి సాహసిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో స్థాయిని బట్టి ఉపాధి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం మాటలు ప్రకటనలకే పరిమితమా..? నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నీటి యాజమాన్య శాఖలో అవినీతికి తావు ఉండదు. ఎవరైనా అక్రమాలకు, అవినీతికి పాల్పడితే వారి తాట తీస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు సందర్బాల్లో వాఖ్యనించారు. డ్వామా అధికారులు, సిబ్బందిపై పెద్ద ఎత్తున అవినీతి అరోపణలు వచ్చినప్పటికీ ఏమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని అక్రమాలే బయటకు నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో జిల్లాలో పలు చోట్ల అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలపై కొన్ని చోట్ల ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ధైర్యం చేసి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బంది అక్రమాల గురించి ప్రస్తావించేందుకు డ్వామా పీడీ ఎస్.శారదాదేవి వద్ద సాక్షి ప్రస్తావించడానికి ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. అక్రమార్కులకు అండగా అధికారులు అవినీతికి పాల్పడిన వారిపై చర్యలకు వెనుకడుగు గుర్ల, గంట్యాడ ఏపీఓలపై అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు శూన్యం ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్లు గుర్ల ఏపీఓపై ఆరోపణలు లక్షలాది రుపాయల అక్రమాలకు పాల్పడినట్లు గంట్యాడ ఏపీఓపై ఆరోపణలు -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్ల నేతృత్వంలో సహస్ర కుంకుమార్చన చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ పర్యవేక్షించారు. ఘనంగా చండీయాగం ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి చండీయాగం మంగళవారం చదురుగుడి, వనంగుడిలలో ఘనంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి, సాయికిరణ్, దూసిశివప్రసాద్, తాతా రాజేష్లు శాస్త్రోక్తంగా యాగప్రక్రియను నిర్వహించారు. యాగం అనంతరం భక్తులకు అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కబడ్డీలో కాంస్యంశృంగవరపుకోట: సీబీఎస్ఈ స్టేట్జోన్ కబడ్డీ పోటీల్లో స్థానిక డా.వరలక్ష్మి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కాంస్య పతకం సాధించారు. ఈ మేరకు స్కూల్లో జరిగిన వార్షికోత్సవంలో పాఠశాల వ్యవస్థాపకురాలు డాక్టర్ పి.వరలక్ష్మి కబడ్డీలో పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించి ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాబోధనలో వచ్చిన మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థను రూపొందించడంతో పాటు విద్యార్థులకు క్రీడల్లోనూ తర్ఫీదు ఇచ్చి తయారు చేయడంతో పాఠశాల అధ్యాపక బృందాన్ని ప్రశంసించారు. -
ఆకట్టుకున్న మోడల్ యూత్ పార్లమెంట్
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో విద్యార్థులు మంగళవారం నిర్వహించిన ‘యువ మంధన్ మోడల్ యూత్ పార్లమెంట్’ ప్రదర్శన ఆకట్టుకుంది. ‘వికసిత్ భారత్ : కెరియర్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎంప్లాయ్మెంట్ అనే అంశంపై విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఈ ప్రదర్శన చేపట్టారు. విద్యార్థులే ఎంపీలు, స్పీకర్, కార్యదర్శి వంటి భూమికలను పోషించి చర్చలను ఉత్సాహంగా, ప్రతిభావంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి, విమర్శనాత్మక ఆలోచనను ప్రేరేపించడం, పరిపాలనా వ్యవస్థపై అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ ప్రదర్శన సదస్సు నిర్వహించామని తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్, అవార్డులను రిజిస్ట్రార్ అందజేశారు. కార్యక్రమంలో హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ ఎం.శరత్ చంద్రబాబు, మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, డాక్టర్ కుసుమ్, మాన్సాస్ కరస్పాండెంట్ ప్రొఫెసర్ కేవీలక్ష్మీపతి రాజు, డాక్టర్ ప్రేమాఛటర్జీ, డాక్టర్ నగేష్, డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, డాక్టర్ దెబంజనా నాగ్, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
సంకల్ప మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోటలోని మహరాజా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన సంకల్ప మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా వివిధ విద్యార్హతలుగల 1,542 మంది అభ్యర్థులు ఈ మేళాకు హాజరుకాగా వివిధ స్థాయిల్లో నిర్వహించిన పరీక్షలలో ప్రతిభ చూపిన 546 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. మరో 72 మందిని తదుపరి రౌండ్కు ఎంపిక చేసినట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ మేనేజర్ జి.ప్రశాంత్కుమార్ తెలిపారు. దాదాపు 26 ప్రముఖ బహుళజాతి కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేశాయని, ఎంపికై న వారికి నెలకు రూ.13,000 నుంచి రూ.60,000 వరకు జీతాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఎ.అరుణ్, కళాశాల ప్రిన్సిపాల్ బీఎస్ఎస్రాజు, నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్లేస్మెంట్ అధికారి టి.భాస్కర్, ఎంప్లాయిమెంట్ యంగ్ ప్రొఫెషనల్ యశ్వంత్ సీడాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 546 మందికి లభించిన ఉద్యోగావకాశాలు -
బంకురువలసలో మాంగనీస్ అక్రమ తరలింపు..?
బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామ పంచాయతీ శివారు గ్రామం బంకురు వలస వద్ద అక్రమంగా మాంగనీస్ తవ్వకాలు చేస్తూ తరలిస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎటువంటి లైసెన్స్ లేకుండా తవ్వకాలు చేపడుతూ గ్రేడింగ్ చేసి తరలిస్తున్నారంటూ సోమవారం గ్రీవెన్స్సెల్లో ఆర్డీఓ రామ్మోహనరావుకు కొంతమంది వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరపాలని తాహసీల్దార్ ఎం శ్రీనును ఆర్డీఓ ఆర్ఐ రామకుమార్ ఆదేశించగా తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది క్వారీ ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. గతంలో ఇక్కడ మాంగనీసు ఓర్ తవ్వకాలకు అనుమతులున్నా తదనంతరం అక్కడి తవ్వకాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో తవ్వకాలు నిలిపివేసినట్లు యజమాని ఫారూఖ్ తెలియజేశారు. గతంలో తవ్వి ఉంచిన మాంగనీసు కుప్పల్లో గ్రేడింగ్ చేసి మాంగనీసును తరలించేందుకు తమకు అనుమతులున్నాయని, తవ్వకాలు చేపట్టడం లేదని వివరించారు. అలాగే ప్రతి ఏడాది రూ.10వేలు ప్రభుత్వానికి చలానా ద్వారా చెల్లించి గ్రేడింగ్ చేసుకుంటున్నట్లు చెప్పడంతో రెవెన్యూ సిబ్బంది నివేదికను తహసీల్దార్కు అందజేశారు. మంగళవారం విలేకరులు సంబంధిత ప్రదేశానికి వెళ్లి పరిశీలించగా మాంగనీసును గ్రేడింగ్ చేస్తున్న దాదాపు 50 మంది కూలీలు అక్కడ పనిచేస్తూ కనిపించారు. కేవలం గ్రేడింగ్కు అనుమతి మాంగనీసు గ్రేడింగ్ తరలింపుపై తహసీల్దార్ ఎం.శ్రీనును వివరణ కోరగా గతంలో అక్కడ ప్రభుత్వ అనుమతితో మైనింగ్ జరిగిందన్నారు. ప్రస్తుతం తవ్వకాలకు అనుమతి లేదని, కేవలం గ్రేడింగ్ చేసి తరలించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులున్నాయని తెలియజేశారు. -
ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 32 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఎస్పీ వకుల్ జిందల్ నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో 32 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ వకుల్ జిందల్ చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్కడికక్కడే బాధితుల ముందే సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ను ఆదేశించారు. ఎస్పీ వకుల్ జిందల్ అందుకున్న ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించినవి 10, కుటుంబ కలహాలకు సంబంధించినవి 7, మోసాలకు పాల్పడినవి 8, ఇతర అంశాలకు సంబంధించినవి 7 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ. లీలారావు, ఆర్వీఆర్ .చౌదరి, డీసీఆర్బీ ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. అలసత్వం లేకుండా ఫిర్యాదుల పరిష్కారం పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులను అలసత్వం లేకుండా పరిష్కారం దిశగా విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదుల్లో సైబర్మోసాలు, కుటుంబ కలహాలు, తల్లిదండ్రులను వేధింపులు, అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం తదితర సమస్యలపై ఫిర్యాదుదారులు ఎస్పీకి విన్నవించుకోగా వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్లో మాట్లాడి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి దర్యాప్తుచేసి వాస్తవాలైనట్లైతే చట్టపరిఽధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ, తదితర సిబ్బంది పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 54 వినతులు సీతంపేట: ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి సోమవారం ర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 54 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో భామిని మండలం బొడ్డగూడకు చెందిన బి.సింగన్న కిరాణా షాపు పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని కోరాడు. చేపల చెరువు మంజూరు చేయాలని నిమ్మలవలసకు చెందిన అప్పారావు కోరగా మండ గ్రామానికి చెందిన నిమ్మక పార్వతి, ఎన్టీఆర్ జలసిరిలో బోరు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. నౌగూడకు చెందిన ఆనందరావు ట్రాక్ట్ర్ సబ్సిడీపై ఇప్పించాలని వినతిపత్రం అందజేశాడు. మేకలలోన్ మంజూరు చేయాలని అప్పారావు కోరగా రోడ్డు సదుపాయం కల్పించాలని జజ్జువ గ్రామస్తులు అర్జీ అందజేశారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, డిప్యూటీఈవో ప్రసన్నకుమార్, సీడీపీఓలు రంగలక్ష్మి, విమలాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
69 మంది పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి
విజయనగరం అర్బన్: జిల్లాలోని 69 మంది పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి లభించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వర్రావు కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, ఉద్యోగోన్నతులు కల్పించారు. వారి అభీష్టానికి అనుగుణంగా పోస్టింగులు కేటాయించారు. గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు 57 మందికి గ్రేడ్–4 కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి కల్పించారు. అలాగే గ్రేడ్–4 కార్యదర్శులు వివిధ కారణాలతో ఉద్యోగోన్నతిని తిరస్కరించారు. మిగిలిన 8 మంది కొత్త స్థానాల్లో చేరారు. ఉద్యోగోన్నతి లభించిన పంచాయతీ కార్యదర్శులకు జిల్లా ఇన్చార్జ్ జేసీ ఎస్.శ్రీనివాసమూర్తి పత్రాలను పంపిణీ చేసి అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్షాక్తో కార్మికుడి మృతి
బాడంగి: మండలంలోని బొత్సవానివలస వద్ద చెరకు బెల్లంక్రషర్లో పని చేస్తున్న కార్మికుడు ఏడువాక రామ్కుమార్(25)విద్యుత్షాక్కు గురై సోమవారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలం డబ్బిరాజుపేటకు చెందిన రామ్కుమార్ పెద్దాపురం మండలం తాడిపత్రికి చెందిన బెల్లంక్రషర్ యజమానివద్ద పనిచేస్తున్నాడు. క్రషర్ ఆట ముగియడంతో క్రషర్కు సంబంధించిన సామగ్రిని రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఐషర్వ్యాన్లో లోడ్చేస్తుండగా వ్యాన్పై ఉన్న విద్యుత్ హైటెన్షన్వైర్లు కనిపించకపోవడంతో అవి రామ్కుమార్ చేతికి తగలగా షాక్కు గురయ్యాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక సీహెచ్సీకి తరలించగా డాక్టర్ ప్రత్యూష తనిఖీ చేసి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో భద్రపరిచినట్టు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. మృతుని కుటుంబానికి సమాచారం అందించామని వారు వచ్చాక కేసు నమోదుచేసి పోస్టుమార్టం మంగళవారం నిర్వహిస్తామని చెప్పారు. -
చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
పార్వతీపురటౌన్: వేసవి వేడిమి దృష్ట్యా పార్వతీపురం మన్యం జిల్లాలో చలివేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సూచించారు. వేసవి వేడిమి, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై మండల స్థాయి అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేడిమి పెరిగిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకురావాలని, తెల్లని వదులు దుస్తులు వేసుకోవడం మంచిదని చెప్పారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతాల్లో నీడ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేతనదారులకు నీరు అందుబాటులో ఉంచాలని, ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో పనివేళలో మార్పులు చేసుకోవాలని సూచించారు. రోజు రోజుకూ పెరుగుతున్న వేడిమి దృష్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. కొబ్బరి బొండాలు, పానీయాలు తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో డీఆర్ఓ హేమలత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
స్తంభానికి కట్టి కొట్టారు
● పోలీసులకు బాధితుడి ఫిర్యాదుపాలకొండ రూరల్: మండలంలోని ఎల్ఎల్పురం గ్రామానికి చెందిన రేజేటి శేఖర్ తనను అదే గ్రామానికి చెందిన కొందరు విద్యుత్ స్తంభానికి కట్టి కొట్టారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.ప్రయోగమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై అందించిన వివరాలిలా ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన వారాడ రాజేంద్రనాయుడు, ఆయన సోదరుడు సుమంత్ నిర్వహిస్తున్న శ్రీ సాయిలక్ష్మి టౌన్షిప్లో కొద్ది రోజులుగా ఏజెంట్గా శేఖర్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇళ్ల స్థలాల కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి రూ.కోటి వరకూ చెల్లించి వంద మందిని టౌన్షిప్లో సభ్యులుగా చేర్పించాడు. రోజులు గడుస్తున్నప్పటికీ నగదు చెల్లించిన వారికి ఇళ్ల స్థలాలను టౌన్షిప్ యాజమాన్యం కేటాయించకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వడం లేదు. దీంతో ఈనెల 16వ తేదీన ఎల్ఎల్.పురంలో గల టౌన్షిప్ నిర్వాహకుల ఇంటికి వద్దకు టౌన్షిప్ సభ్యులతో కలిసి శేఖర్ వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో నిర్వాహకులు లేరని వారి తల్లి తలియజేయగా చేసేది లేక తిరిగివెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈనెల 17వ తేదీ సోమవారం ఉదయం బాధితుడు శేఖర్ ఊరి శివారులో కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి ఇంటికి వస్తుండగా టౌన్షిప్ నిర్వాహకుల బంధువులు వియ్యపు మురళి, సోదరుడు బొజ్జంనాయుడులు శేఖర్ను అడ్డగించి, డబ్బు అడిగేందుకు ఇంటికి వస్తావా? అంటూ దూషించి విద్యుత్ స్తంభానికి కట్టి కొట్టినట్లు ఫిర్యాదు చేశాడని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
సర్వే అధికారులను అడ్డుకున్న గిరిజన రైతులు
సాలూరు రూరల్: మండలంలోని కూర్మరాజుపేట పంచాయతీ పునికినవలస గ్రామ భూములు గత 80 ఏళ్లుగా సాగుచేస్తున్న గిరిజనులపై కొంతకాలంగా సాలూరుకు చెందిన చిట్లు శశికళ, మన్మథలు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ భూములు పూర్వం తమవని గిరిజనులు, కూర్మరాజుపేటకు చెందిన బీసీ రైతులు ఆక్రమించుకున్నారని కేసులు పెడుతున్నారు. ఈ విషయంలో పలుమార్లు కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలకు గిరిజన రైతులను తిప్పించారు. ఈ భూములపై పూర్తి హక్కులు సాగుచేస్తున్న రైతులవేనని అధికారులు ఒక వైపు చెబుతూనే మరోవైపు వారు చేస్తున్న ఫిర్యాదులపై రైతులకు నోటీసులు జారీచేసున్నారు. అందులో భాగంగా సోమవారం స్థానిక రెవెన్యూ అధికారులు 50 మందికి పైగా గిరిజన, బీసీ రైతులకు నోటీసులు జారీచేసి వారి భూములు చూపించాలని గ్రామంలో సర్వే చేసేందుకు డీఆర్ఓ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతూ గ్రామంలోకి వచ్చిన సర్వే అధికారులను గిరిజన, బీసీ రైతులు అడ్డుకున్నారు. గత 80 ఏళ్లుగా తాము సాగుచేస్తున్నామని ఇప్పుడు వచ్చి ఎవడో పెట్టిన ఫిర్యాదుకు మాభూములు సర్వే చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారులకు అధికారులు సహకరిస్తే రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సి వస్తుందని గిరిజన రైతులు హెచ్చరించారు. అధికారులు ఇచ్చిన నివేదికలు సరిగా లేకపోవడంతో తమపై పదేపదే ఫిర్యాదులు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతోందని రైతులు ఆవేదన వెళ్లగక్కారు. 80 ఏళ్లుగా సాగు చేస్తున్నాం అధికారుల తప్పుడు నివేదికలతో ఫిర్యాదులు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తాం -
సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా చైతన్యయాత్ర
● సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా చైతన్యయాత్ర చేపడుతున్నట్లు సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు. కార్యక్రమంలో భాగంగా 46వ డివిజన్లో సోమవారం పర్యటించి, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని ఇళ్లు లేని పేదలకు రెండు సెంట్ల భూమి కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో చాలా మంది ఇళ్లు లేనివారు ఉన్నారని, అటువంటి వారందరికీ న్యాయం చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చలో తహసీల్దార్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పి.రమణమ్మ, బి.రమణ, సత్యం, తదితరులు పాల్గొన్నారు.700 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసంగుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలంలోని దురిబిల్లి గ్రామ పరిసరాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సారా స్థావరాలపై సోమవారం నిర్వహించిన దాడుల్లో సుమారు 700 లీటర్ల పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసినట్లు కురుపాం ఎస్సై పి.నారాయణరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి భారీగా ప్లాస్టిక్ టబ్బులను స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా అక్రమంగా సారా తయారు చేసినా, విక్రయించినా, తరలించినా చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. గంజాయితో ఐదుగురి అరెస్ట్గుర్ల: గంజాయి తరలిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ గుర్ల మండలంలోని సొలిపిసోమరాజు పేట చంపావతి నదీపరీవాహక ప్రాంతంలో 1200 గ్రాముల గంజాయి తరలిస్తున్న నిందితులను పోలీసులు సోమవారం పట్టుకుని ఆరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్ చేసిన వారిలో మండలంలోని సొలిపిసోమరాజు పేటకు చెందిన ఇద్దరు, దమరసింగికి చెందిన ఒకరు, నెల్లిమర్లకు చెందిన ఒకరు. జామి మండలం ఆలమండకు చెందిన ఒకరు ఉన్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి ద్విచక్ర వాహనం, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నారాయణరావు చెప్పారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతిబొబ్బిలి: రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ సీతానగరం స్టేషన్ సమీపంలో జారిపడి ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. జార్ఖండ్లోని సాలిబురు ప్రాంతానికి చెందిన ప్రధాన్ హెంబర్న్ (23) సోమవారం చక్రధర్ పూర్ వెళ్లేందుకు రైలెక్కి సీతానగరం మండలం జగ్గునాయుడి పేట వద్ద జారి పడి మృతి చెందినట్టు రైల్వే హెచ్సీ బి.ఈశ్వరరావు తెలిపారు. మృత దేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..గంట్యాడ: గంట్యాడ మండలంలోని బురదపాడు గ్రామానికి చెందిన చుక్క రాంబాబు (39) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల 9వతేదీన పొలంలో పనిచేస్తుండగా రాంబాబును పాము కాటు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో సర్వజన ఆస్పత్రి వైద్యులు కేజీహెచ్కు రిఫర్ చేయగా కేజీహెచ్లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. -
సందడి చేసిన కోర్ట్ చిత్రం యూనిట్
విజయనగరం టౌన్: నగరంలోని ఏసీవీసీ రంజని, శివరంజని సినిమా హాల్లో కోర్టు చిత్రం యూనిట్ సందడి చేసింది. చిత్రం యూనిట్కు థియేటర్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిత్రంలో మంగపతిగా నటించిన సీనియర్ నటుడు శివాజీ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. లాయర్గా నటించిన నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ పోక్సో చట్టం లోని లోటుపాట్లను ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించామని చెప్పారు. పోక్సో చట్టం గురించి తెలియని కోణాలను ఈ సినిమాలో చూపించినట్లు తెలిపారు. హీరో, హీరోయిన్ రోషన్, శ్రీదేవిలు మాట్లాడుతూ తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు రామ్ జగదీష్ మాట్లాడుతూ ఈ సినిమాలో చట్ట వ్యవస్థపై అవగాహన పెంచుతూ, నేటియువతకు సందేశాత్మక చిత్రంగా రూపొందించామన్నారు. కార్యక్రమంలో ఽథియేటర్ మేనేజర్ సాయి, ఇన్చార్జి రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
కాస్త పెరిగిన టమాటో ధర
వీరఘట్టం: కొద్ది రోజులుగా టమాటోకు గిరాకీ లేక రైతులు నానా అవస్థలు పడ్డారు. కనీసం కిలో రూ.5కు ఇద్దామన్నా కొనుగోలుచేసేవారే కరువయ్యారు. టమాటో ఉత్పత్తి తగ్గడంతో ధర కాస్త పెరిగింది. వీరఘట్టం మార్కెట్లో కిలో రూ.10లు ధర పలకడంతో రైతులు ఊరట చెందారు. 21న జాబ్మేళా సీతంపేట: ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ నెల 21న సీతంపేట వైటీసీలో జాబ్ మేళా నిర్వహిస్తామని ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, అసెంబ్లీ ట్రైనీ, ప్రొడక్షన్ ట్రైనీ, మిషన్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఉద్యోగమేళా ఉంటుందన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సుగల యువతీయువకులు అర్హులన్నారు. 6 కంపెనీలకు అవసరమైన 250 మంది ఉద్యోగులను ఎంపిక చేస్తాయన్నారు. నెలకు రూ.16వేల నుంచి రూ.20 వేలు వరకు వేతనం ఉంటుందన్నారు. వివరాలకు సెల్: 70320 60773కి నంబర్ను సంప్రదించాలని సూచించారు. ప్రతి శుక్రవారం గృహ నిర్మాణ దినోత్సవం పార్వతీపురంటౌన్: ప్రతి శుక్రవారం గృహ నిర్మాణ దినోత్సవంగా పాటిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. గృహనిర్మాణ శాఖ అధికారులతో ఆయన సోమవారం మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన 7వేల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని జూన్ నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని గ్రామ పంచాయితీ అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా ఎలాంటి భవన నిర్మాణాలు జరగరాదన్నారు. పింఛన్ల మంజూరుకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ హేమలత, హౌసింగ్ ఇన్చార్జి పీడీ పి. ధర్మచంద్రారెడ్డి పాల్గొన్నారు. గిజబ ప్రధాన రోడ్డులో ఏనుగుల గుంపు గరుగుబిల్లి: మండలంలోని గిజబ ప్రధాన రోడ్డులో సోమవారం ఏనుగులు సంచరించాయి. అరటి, పామాయిల్ పంటలు నాశనం చేయడంతో పాటు ఎప్పుడు ఎవరిపై దాడిచేస్తాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారిపై సంచరిస్తుండడంతో రాకపోకలకు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగులను తరలించి ప్రజల ప్రాణానికి రక్షణ కల్పించాలని కోరారు. 28న తపాలా అదాలత్ విజయనగరం టౌన్: విశాఖపట్టణం పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా వినియోగదారుల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విశాఖపట్నంలోని పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయంలో 117వ తపాలా అదాలత్ నిర్వహించనున్నట్టు తపాలాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.డి.సాగర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విజయనగం జిల్లా తపాల వినియోగదారులు తమ సమస్యలను ఈ 24వ తేదీలోగా ‘117వ తపాలా ఆదాలత్’, కె.వి.డి.సాగర్, అసిస్టెంట్ డైరెక్టర్, పోస్టుమాస్టర్ జనరల్ వారి కార్యాలయం, విశాఖపట్నం–530017 చిరునామాకు పంపించాలని కోరారు. గడువు తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించమని పేర్కొన్నారు. గురుకులాల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు నెల్లిమర్ల: మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు, కళాశాలల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష దరఖాస్తు గడువు ఈ నెల 25వ తేదీ వరకు పెంచినట్టు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ కేబీబీ రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష మే 4న జరుగుతుందన్నారు. -
కాళ్లు అరగాలే గానీ..!
తిరిగి తిరిగి..● అర్జీలకు లభించని మోక్షం ● మొక్కుబడిగా పీజీఆర్ఎస్ ● అవే సమస్యలపై మళ్లీమళ్లీ వస్తున్న అర్జీదారులు ● తప్పని వ్యయప్రయాసలు ● అయ్యా.. మా గోడు వినండి అంటూ కలెక్టర్కు వినతులు అందజేత వృద్ధాప్యంలో ఆగని గంగమ్మ పోరాటం.. ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు మిరియాల గంగమ్మ. గరుగుబిల్లి మండలం గిజబ గ్రామానికి చెందిన ఆమెకు.. 2011 సంవత్సరంలో ఆర్ఆర్ ప్యాకేజీని అప్పటి విజయనగరం కలెక్టర్ మంజూరు చేశారు. పార్వతీపురంలోని కొత్తవలస రెవెన్యూ పరిధి సర్వే నంబరు 155లో ఇంటి స్థలం పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి ఇంటి బిల్లు కోసం తిరుగుతూనే ఉంది. మరోసారి అధికారులను కలసి వేడుకుంది. ఇంటి నిర్మాణ బిల్లు ఇస్తారో, లేదోనని ఆమె ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నాళ్లు తిరగాలో..
ఈయన పేరు తప్పెట సాంబయ్య. బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామం. సర్వే నంబరు 313/5లో ఉన్న ఆయనకు సంబంధించిన ఎకరా 30 సెంట్ల భూమి సత్యవరపు వాసుదేవరావు అనే వ్యక్తి పేరిట తప్పుగా ఆన్లైన్ అయ్యింది. దానిని సరిచేసి, తనకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వినతిపత్రం అందజేశాడు. నిర్ధిష్ట సమయంలోగా వినతిని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.. నేటికి మూడు నెలలుగా తిరుగుతున్నా.. ఇప్పటికీ మోక్షం కలగలేదు. వృద్ధాప్యంలోనూ కాళ్లరిగేలా తిరుగుతున్నానని.. ఏ ఒక్కరూ కనికరించడం లేదని సాంబయ్య వాపోతున్నాడు. -
మూల్యాంకన ప్రక్రియను విజయవంతం చేయండి
గజపతినగరం: గజపతినగరంలోని సాయిసిద్ధార్థ డిగ్రీ కళాశాలలో నిర్వహించే వృత్తి విద్యాకోర్సు జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను విజయవంతం చేయాలని ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎం.ఆదినారాయణ కోరారు. స్పాట్ కేంద్రంలో అధ్యాపకులతో సోమవారం మాట్లాడారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో పాటించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలను తెలియజేశారు. కార్యక్రమంలో సీపీఓ వినోద్, కె.రమణ, వి.విజయలక్ష్మి, ఏసీఓలు వి.అప్పారావు, వై.శ్రీనివాసరావు, స్ట్రాంగ్ రూమ్ ఇన్చార్జి కాళ్ల గోవిందరావు, కాంట్రాక్ట్ లెక్చరర్ల రాష్ట్ర మీడియా ప్రతినిధి దుగ్గివలస రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎం.ఆదినారాయణ -
మా ఆశలన్నీ అడియాసలే..
బొబ్బిలి: ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేయలేని వయసు మాది.. ఎన్నికల ముందు, తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందనుకున్నాం.. మా ఆశలన్నీ అడియాసలయ్యాయి.. మోసపోయాం అంటూ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ఎస్ఎన్పీ శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలి పట్టణంలో సోమవారం నిర్వహించిన సంఘ రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అనంతరం తమ డిమాండ్లను వివరిస్తూ బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహనరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ కార్యవర్గ సభ్యులతో కలిసి అక్కడ విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఐఆర్ను ఏడు శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ జీఓ విడుదల చేశారన్నారు. బుడమేరు వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి ఈహెచ్ఎస్, క్వాంటమ్ పెన్షన్, పెండింగ్ ఐఆర్, డీఏలతో పాటు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు అంశాలను వివరించామని, అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అనంతరం పలుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించినా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రస్తావనే లేదన్నారు. కొంత మంది పెద్దలను కలిసి మేం మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న వారమని, మాకు న్యాయం చేయాలని అడిగితే మీరు మమ్మల్ని ఎన్నుకోవడమేంటి? ప్రజలెన్నుకున్నారన్నారని అంటున్నారని, మేమంతా ప్రజల్లో భాగం కాదా? మేము ఓట్లేయలేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో మరో రాష్ట్ర నాయకుడు రౌతు రామమూర్తినాయుడు తదితరులు షేమ్షేమ్ అంటూ నినదించారు. ప్రస్తుతం ఈహెచ్ఎస్పై వైద్యసేవలు అందజేసేందుకు ఆస్పత్రులు నిరాకరించే స్థాయికి ప్రభుత్వం మమ్మలను దిగజార్చిందంటూ జీఓ కాపీలను ఆయన సభా ముఖంగా ప్రదర్శించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రౌతు రామమూర్తినాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఎల్.జగన్నాథం, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి కృష్టమూర్తినాయుడు, కార్యదర్శి బొత్స సత్యనారాయణ, పలువురు సంఘ నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాస్త్రి -
ప్రశాంతంగా తొలిరోజు పరీక్ష
పార్వతీపురం టౌన్: జిల్లాలోని 67 పరీక్ష కేంద్రాల్లో తొలిరోజు సోమవారం ప్రారంభమైన తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయాన్నే ఇష్టదైవాలకు పూజలు చేసి గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. తొలిరోజు కావడంతో విద్యార్థుల వెంట తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలకు వచ్చారు. జాగ్రత్తలు చెప్పి సాగనంపారు. రెగ్యులర్ పరీక్షకు 10,366 మందికి 10,322 మంది హాజరయ్యారు. 44 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 17 మందికి 14 మంది హాజరయ్యారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుపతిరావు తనిఖీ చేశారు. -
వివక్ష చూపొద్దు.. న్యాయం చేయండి
చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపొద్దని..న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గరివిడి వెటర్నరీ కళాశాల విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష శిబిరంలో మైమ్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. వెటర్నరీ కళాశాలకు వీసీఐ గుర్తింపును తీసుకురావాలని, స్టైపెండ్ను రూ.25వేలకు పెంచాలనే డిమాండ్లతో కళాశాల ఆవరణలో వెటర్నరీ విద్యార్థులు చేస్తున్న నిరవధిక దీక్ష సోమవారానికి 42వ రోజుకు చేరుకుంది. ఈ పోరాటంలో భాగంగా విద్యార్థులు కొద్ది రోజులుగా తమకు న్యాయం చేయాలంటూ నిరవధిక దీక్షలతో పాటు రోడ్డెక్కి భారీ ర్యాలీలు, నలుపు వస్త్రాలు ధరించి నిరసనలు, వంటావార్పు లాంటి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా సోమవారం కూడా నిరవధిక దీక్షా శిబిరంలో ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపొద్దు..న్యాయం చేయాలంటూ వివిధ వేషధారణలతో వారి బాధను మైమ్ రూపంలో ప్రదర్శించారు. వెటర్నరీ విద్యార్థుల మైమ్ కార్యక్రమం 42వ రోజుకు చేరుకున్న నిరవధిక దీక్షలు -
పట్టాలిచ్చారు కానీ.. ఆన్లైన్ చేయరేం!
40–50 సంవత్సరాల నుంచి కొండ భూములను సాగు చేసుకుంటున్నాం. జీడి తోటలు వేసుకుని, ఆ ఫల సాయంతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నాం. గత ప్రభుత్వం మా మీద దయతలచి.. సాగు భూమి పత్రాలు మంజూరు చేసింది. వాటి మీద జగన బొమ్మ ఉందని ఆలోచిస్తున్నారో.. ఏమిటో అధికారులు? పట్టాలను ఆన్లైన్లోకి ఎక్కించడం లేదు. ఏడాది క్రితం ఇచ్చిన డీకేటీ పట్టా పత్రాలను ఇప్పటికీ ఆన్లైన్ చేయకపోవడం వల్ల అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయంటూ.. మక్కువ మండలం మూకవలస గ్రామానికి చెందిన మెల్లిక రాజారావు, సీతారాం, అంబటి వెంకటమ్మ, పావతి, సావిత్రి, అంబటి గోపాలం తదితర 15 కుటుంబాల వారు వాపోతున్నారు. రైతుభరోసా, ఇతర పథకాలేవీ అందడం లేదని.. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమాధానం చెప్పడం లేదని వాపోయారు. మరోమారు వారంతా కలెక్టర్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. -
‘ఉపాధి’పై రాజకీయ కక్ష
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు బొడబల్ల అప్పలనాయుడు. సాలూరు మండలం పెదపదం పంచాయతీలో ఉపాధిహామీ క్షేత్ర సహాయకునిగా 2006 నుంచి పని చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఇతనిని తొలగించేందుకు కుట్రలు మొదలయ్యాయి. రాజకీయ కక్షతో గతేడాది చివర్లో తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. దీంతో అతను అధికారులను ఆశ్రయించాడు. గత ఏడాది నవంబరులో పీజీఆర్ఎస్కు వచ్చి కలెక్టర్కు మొరపెట్టుకున్నాడు. ఓ వైపు అతని నుంచి వివరణ కోరుతూనే.. మరోవైపు ఈ ఏడాది జనవరి 22న టెర్మినేషన్ చేస్తూ ఉత్తర్వులు పంపించారు. దీంతో ఆయన న్యాయం కోసం హైకోర్టు మెట్లు ఎక్కాడు. ఎటువంటి విచారణ లేకుండానే ఏకపక్షంగా అతనిని తొలగించడం భావ్యం కాదని కోర్టు తీర్పునిచ్చింది. న్యాయస్థానం ఉత్తర్వులతో అతను అధికారులను కలుస్తున్నప్పటికీ.. న్యాయం జరగలేదు. మరోసారి కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చాడు. తమకు న్యాయస్థానం నుంచి ఎటువంటి ఉత్తర్వులూ రాలేదంటూ అధికారులు యథావిధిగా తప్పించుకుంటున్నారని అతను వాపోయాడు. తన స్థానంలో రాజకీయ ఒత్తిళ్లతో వేరేవారిని తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. -
పేదల వైద్యంపై కూటమి చిన్నచూపు
ఆటోవాలా డీలా..! ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వాలు తరచూ డీజిల్ ధరలు పెంచుతూపోవడంతో తిప్పలు తప్పడం లేదు. –8లోకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడచినా ఇంతవరకు పనులు చేపట్టకపోవడంతో ఇతరత్రా కార్యకలాపాలకు ఇవి వినియోగమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటిి వరకు భవన నిర్మాణాలు పూర్తి చేసిన వాటిల్లో ఎంఎల్హెచ్పీ, వైద్యాధికారులు పర్యవేక్షణలో నిరంతరం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పాటు సాధారణ వ్యాధిగ్రస్తులకు సకాలంలో వైద్యం అందించగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వైద్యసేవలు పొందుతున్న వారంతా మా గ్రామాల్లో కూడా విలేజ్ క్లినిక్ల భవనాలు నిర్మాణాలు పూర్తి చేసి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇంతలోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో విలేజ్ క్లినిక్లు పని సామర్థ్యం, భవన నిర్మాణాల వసతుల పేరుతో మంగళం పాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విలేజ్ క్లినిక్లకు పూర్తి స్థాయిలో మందులు సమకూర్చి ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలని సంకల్పించినప్పటికీ కూటమి ప్రభుత్వం దానికి తూట్లు పొడిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆయుష్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా విలేజ్ క్లినిక్లను ఆధునీకరించడానికి పరిశీలనలు చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని విలేజ్ క్లినిక్లను త్వరలో పరిశీలించనున్నట్లు తెలియవచ్చింది. పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయం పార్వతీపురం టౌన్: అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయమని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రధాన కారణం పొట్టి శ్రీరాములు అన్నారు. పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ జీకి ప్రియ శిష్యులని ఆయన పేర్కొన్నారు. సబర్మతి ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత కలిగిన మహానుభావుడు శ్రీరాములు అని కొనియాడారు. శ్రీరాములు స్ఫూర్తి, అంకితభావం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ఆయన అడుగుజాడల్లో నడవటం ఆవశ్యకమన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు. ఐటీడీఏ పరిధిలో 26 టెన్త్ పరీక్ష కేంద్రాలుసీతంపేట: సీతంపేట ఐటీడీఏ పరిధిలో 26 పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో 1791 మంది గిరిజన విద్యార్థులు సోమవారం నుంచి పరీక్షలు రాయనున్నట్టు ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర ఆదివారం తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. సీతంపేట మండలంలో 8 కేంద్రాల్లో పరీక్షలు విద్యార్థులు రాయనున్నారన్నారు. సీతంపేట బాలికలు, బాలురు గురుకుల పాఠశాలలు, గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, హడ్డుబంగి, చిన్నబగ్గ, దోనుబాయి, మల్లి కేంద్రాల్లో విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు. ఏపీ ట్రెజరీస్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీటీఏఎస్ఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యు లు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ కాంప్లెక్స్ (ఐఎఫ్సీ) భవనంలో కాన్ఫరెన్స్ హాల్లో సంఘం రాష్ట్ర కోశాధికారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్షులుగా ఎం.ఆదినారాయణ, కార్యదర్శిగా పి.శాంతి కిరణ్కుమార్, కోశాధికారిగా పి.వీరన్న దొర, సహాధ్యక్షులుగా ఎం.నూకరాజు, కార్యనిర్వాహక కార్యదర్శిగా వై.కృష్ణశ్రావణ్, ఉపాధ్యక్షులుగా పి.సురేష్బా బు, ఎస్.రామకృష్ణ, పి.వరలక్ష్మి, కార్యదర్శులు గా సీహెచ్ రమేష్బాబు, ఎం.దుర్గాప్రసాద్, వై.జయశ్రీ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి గా పీవీ నారాయణరావు నూతన కమిటీని ప్రకటించారు. కనకమహాలక్ష్మిని దర్శించుకున్న న్యాయమూర్తులుచీపురుపల్లి: పట్టణంలోని కనకమహాలక్ష్మి అమ్మవారిని పలువురు న్యాయమూర్తులు ఆది వారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన జిల్లా అడిషనల్ జడ్జి(ఫ్యామిలీ కోర్టు) కె.విజయ కల్యాణి, చీపురుపల్లి జూనియర్ సివిల్ జడ్జి వై.ప్రేమలతలకు దేవదాయ శాఖ ఈఓ బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మండపంలో ఆశీర్వాదాలు అందజేసిన అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. విజయనగరం ఫోర్ట్: పంటల సాగులో ఈ–క్రాప్ నమోదు చాలా ముఖ్యమైనది. పంటను విక్రయించుకోవాలన్నా, పంట నష్టం జరిగినప్పడు బీమా పొందాలన్నా ఈ క్రాప్ నమోదు తప్పనిసరి. ఈ– క్రాప్ నమోదు చేసుకున్న ప్రతీ రైతు ఈకేవైసీ చేయించుకోవాలి. ఈ–క్రాప్, ఈకేవైసీ చేయించుకుంటేనే రైతులకు రావాల్సిన పథకాలు, సౌకర్యా లు అందుతాయి. లేదంటే అందవు. రబీ సీజనల్లో వేలాది మంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదు. ఈ – క్రాప్ నమోదు చేయించుకున్నప్పటకీ ఈకేవైసీ మాత్రం చేసుకోలేదు. రబీలో ఇలా.. జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి 61,324 మంది ఈ–క్రాప్ నమోదు చేసుకున్నారు. 56,406 మంది రైతులు ఈౖకేవేసీ చేయించుకున్నారు. 4,918 మంది ఈకేవైసీ చేయించుకోలేదు. 1,02,760 ఎకరాల్లో అన్ని రకాల పంటలకు ఈ–క్రాప్ నమోదు అయింది. 96,097 ఎకరాలకు ఈకేవైసీ జరిగింది. 6,673 ఎకరాలకు ఈకేవైసీ జరగ లేదు. బీమా పంటలకు సంబంధించి ఈ–క్రాప్ ఇలా.. వరి, మినుము, పెసర, మొక్కజొన్న పంటలకు పంటల బీమా వర్తిస్తుంది. ఈ నాలుగు పంటలకు సంబంధించి 97,778 ఎకరాలకు ఈ–క్రాప్ నమోదు అయింది. ఇందులో ఈకేవైసీ 91,315 ఎకరాలకు అయింది. 6,463 ఎకరాలకు ఈకేవైసీ జరగలేదు. వరి పంటకు సంబంధించి 2279 ఎకరాలకు ఈ– క్రాప్ అయింది. ఈకేవైసీ 2052 ఎకరాలకు అయింది. 1594 మంది ఈ–క్రాప్ చేసుకోగా1452 మంది రైతులు ఈకేవైసీ చేయించుకున్నారు. మినుము పంటకు సంబంధించి 39,538 ఎకరాలకు ఈ–క్రాప్ నమోదు కాగా ఈకేవైసీ 37,073 ఎకరాలకు అయింది. 33,480 మంది రైతులు ఈ–క్రాప్ నమోదు చేసుకోగా ఈకేవైసీ 31082 మంది రైతులు చేసుకున్నారు. పెసర పంటలకు సంబంధించి 15,769 ఎకరాలకు ఈ–క్రాప్ నమోదు కాగా ఈకేవైసీ 14,813 ఎకరాలకు ఈకేవైసీ అయింది. 17,593 మంది రైతులకు ఈ–క్రాప్ నమోదు కాగా ఈకేవైసీ 16,319 మంది రైతులు చేసుకున్నారు. మొక్కజొన్న పంటకు సంబంధించి 40,191 ఎకరాలకు ఈ–క్రాప్ నమో దు కాగా ఈకేవైసీ 37,377 ఎకరాలకు ఈకేవైసీ అయింది. 23,398 మంది రైతులు ఈ–క్రాప్ నమో దు కాగా ఈకేవైసీ మాత్రం 21,527 మంది రైతులు చేసుకున్నారు. పార్వతీపురం టౌన్: ఎక్కడి వారికి అక్కడే వైద్యం అందించాలన్న గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యం నీరుగారింది. విలేజ్ హెల్త్ క్లినిక్కు దిక్కు లేకుండా పోయింది. నేటికీ చాలా కార్యాలయ భవన నిర్మాణాలు పునాదులు, గోడలకే పరిమితమయ్యాయి. ఒక్కో భవనాన్ని రూ.30 లక్షల వ్యయంతో పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వాటికి నిధులు విడుదల చేయకపోవడంతో విలేజ్ క్లినిక్ల నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 162 గ్రామ పంచాయతీల్లో విలేజ్ క్లినిక్లు నిర్మించడానికి అనుమతులిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 16 భవన నిర్మాణాలు పూర్తి చేయగా, 176 భవన నిర్మాణాలు వివిధ స్థాయిల్లో ఉండగా పలు కారణాలతో 16 భవన నిర్మాణాలు ప్రారంభించలేదు. నిర్మాణాలకు అనుమతులతో పాటు భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేయడంతో పనులు ప్రారంభించారు. కొన్ని చోట్ల అక్కడ ఉన్న ముడిసరుకు ఆధారంగా పనులు పూర్తి చేయగా మరికొన్ని చోట్ల పునాదులు, గోడలు, శ్లాబ్ల పనులు వచ్చేసరికి ఎన్నికల కోడ్ రావడం వల్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలతో పాటు విలేజ్ క్లినిక్ భవనాలు మూడు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తరువాత వాటి నిర్మాణ పనులు గాలికొదిలేసారు. ఆవేదన వ్యక్తం చేస్తున్న నిర్వాహకులు పనులు పూర్తి చేసిన సకాలంలో బిల్లులు అందుతాయన్న నమ్మకం లేక గత తొమ్మిది నెలలుగా పనులు ప్రారంభించకుండా వదిలేశారు. కొన్ని చోట్ల దాదాపు పూర్తి కావచ్చిన భవనాలకు నిధులు విడుదల చేస్తారా.. లేదా.. అన్న సందేహంతో నిర్మాణ పనులు వదిలేశారు. నిర్మాణం పూర్తి చేసిన కొన్ని భవనాల్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోవడంతో విలేజ్ క్లినిక్లకు తాళాలు వేసి ఉంచిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో రూ. 30లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించి రూ. 3.92కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి అప్పట్లోనే రూ.1.3కోట్లు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో కేవలం బిల్లులు అందవన్న నమ్మకంతోనే పనులను మధ్యలో వదిలేసినట్లు కొంతమంది నిర్వాహకులు తెలుపుతున్నారు. అందుబాటులోకి తీసుకువస్తాం పూర్తయిన విలేజ్ హెల్త్ క్లినిక్లను అందుబాటులోకి తీసుకువస్తాం. నిర్మాణ పనుల్లో ఉన్న భవనాల నివేదికలను అధికారులకు పంపించాం. నిధులు మంజూరు అయిన వెంటనే కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాం. హెల్త్ క్లినిక్ల నిర్మాణాలు పూర్తి చేసి త్వరలో ప్రజలకు చేరువ చేస్తాం. – చంద్రశేఖర్, పీఆర్ ఇంజనీరింగ్ అధికారిపార్వతీపురం: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 19న విజయవాడలో తలపెట్టిన అగ్నిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్రకు బాధితులు తరలి రావాలని అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ నాయుడు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ స్థానిక కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ ఆర్థిక మోసాలకు పాల్పడి పదేళ్ల తొమ్మిది నెలలు గడిచినా... గతంలో తెలుగుదేశం ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ఆస్తులను అటాచ్మెంట్ చేసినప్పటికీ చెల్లింపు విషయంలో విఫలమైందన్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా అలసత్వం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో కొట్లాదిగా అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టడంతో బాధితుల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్లో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఆయన వెంట మన్యం జిల్లా అధ్యక్షుడు ఆర్వీఎస్ కుమార్ ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వం అందించిన రూ.2 లక్షల చెక్కును అందజేస్తున్న కలెక్టర్ ‘సాక్షి’లో ‘ది గోట్ లైఫ్’ శీర్షికన ప్రచురితమైన కథనం... అప్పారావు ఆచూకీ కనుగొనేందుకు కలెక్టర్ శ్యామ్ప్రసాద్ తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు ‘సాక్షి’లోనూ ‘ది గోట్ లైఫ్’ శీర్షికన ఈ నెల 2న కథనం ప్రచురితమైంది. పలు ప్రసార మాధ్యమాల్లోనూ రావడంతో ఎట్టకేలకు ఈ నెల 11న అతని కుమార్తె దొంబుదొర సాయమ్మ, అల్లుడు చందు కలెక్టర్ను కలిశారు. తమది ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బంధుగాం బ్లాక్ పెద వల్లాడ పంచాయతీ చిన వల్లాడ గ్రామమని.. ప్రస్తుతం పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ మునక్కాయవలస గ్రామంలో నివసిస్తున్నట్లు వివరించారు. తండ్రి తప్పిపోయిన తర్వాత.. దిగాలుతో తల్లి కూడా మరణించిందని కుమార్తె వివరించింది. తన తండ్రిని ఇక్కడకు రప్పించాలని, తమ బిడ్డలా చూసుకుంటామని చెప్పింది. 19న అగ్రిగోల్డ్ బాధితుల పాదయాత్ర విజయవాడకు తరలిరండి అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు ఈకేవైసీతో ప్రయోజనాలు పంటల బీమా వర్తిస్తుంది. పంట రుణాలు తీసుకోవచ్చు. ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం అందుకోవచ్చు. పండించిన ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. 94 శాతం పూర్తి రబీ సీజన్లో అన్ని పంటలకు సంబంధించి ఈకేవైసీ 94 శాతం పూర్తయింది. 4,918 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదు. ఈ–క్రాప్, ఈకేవైసీపై ఈ నెల 17వతేదిన సోషల్ ఆడిట్ ప్రారంభం అవుతుంది. అంతవరకు ఈకేవైసీ చేయించుకోవచ్చు. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
పోస్టల్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నెల్లిమర్ల: తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందే పాలసీలను తపాలా శాఖ ప్రవేశపెట్టిందని, పోస్టల్ పథకాలను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసరావు సూచించారు. నెల్లిమర్ల పోస్టాఫీసుని అప్గ్రేడ్ చేసిన నేపథ్యంలో ఆదివారం ఆ సేవలను ప్రారంభించారు. పోస్టల్ శాఖలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, ఆర్డీ, ఎఫ్డీ, సీనియర్ సిటిజన్, సుకన్య తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవా లని పిలుపునిచ్చారు. పోస్టాఫీసులో చిన్నమొత్తాలతో నెలనెల పొదుపు చేసుకోవాలని సూచించారు. ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి పథకం ఎంతగానో ప్రయోజనకరమన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరికి ఇన్సూరెన్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ పోస్టల్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో పోస్టుమాస్టర్ జి.ఎర్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు -
కనకమ్మ మృతికి నివాళులు అర్పించిన బొత్స
గుర్ల: దివంగత మాజీ ఎమ్మెల్యే (సతివాడ) పొట్నూరు సూర్యనారాయణ సతీమణి పాలవలస సర్పంచ్ పొట్నూరు కనకమ్మ ఇటీవల మృతి చెందారు. ఆమె కుటుంబసభ్యులైన గుర్ల ఎంపీపీ పొట్నూరు ప్రమీల, వైఎస్సార్సీపీ గుర్ల మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడులను మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కనకమ్మ చిత్ర పటానికి నివాళులు ఆర్పించారు. వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. కనకమ్మకు నివాళులు ఆర్పించిన వారిలో వైఎస్సార్సీపీ నాయకులు బొత్స సందీప్. కేవీ సూర్యనారాయణ రాజు, జమ్ము స్వామి నాయుడు, కెంగువ పధుసూదనరావు, తోట తిరుపతిరావు, నియోజక వర్గం నాయకులు ఉన్నారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ90 శ్రీ150 శ్రీ160రామతీర్థంలో వైభవంగా పారాయణంనెల్లిమర్ల రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో తిరువాయుముజీ పాశురముల పారాయణాలను భక్తులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. అనకాపల్లికి చెందిన ఆచార్య గోష్ఠి బృంద సభ్యులు నాలాయర దివ్య ప్రబంధంలో తిరువాయుముజీ వెయ్యి పాశురాలను స్వామి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, పవన్, తదితరులు పాల్గొన్నారు. బాక్సింగ్లో ప్రతిభబొబ్బిలి: పట్టణంలోని యాదవ వీధికి చెందిన డీసరి భాను ప్రసాద్ ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ 200 కిలోల విభాగంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈనెల 1,2 తేదీల్లో విశాఖలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన భాను ప్రసాద్ జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యే అవకాశాలున్నాయని కోచ్లు కేతిరెడ్డి సాయి వరుణ్, శంబంగి పురుషోత్తంలు తెలిపారు. భానుప్రసాద్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ సాధించడంతో ఎమ్మెల్యే బేబీ నాయన రూ.20వేలను పోటీల ఖర్చుల నిమిత్తం అందజేశారు. మేడపై నుంచి జారిపడి వ్యక్తి మృతిపార్వతీపురం రూరల్: ఇంటి మేడపై నుంచి ప్రమాద వశాత్తు జారిపడిన వ్యక్తి మృతిచెందినట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెదబొండపల్లి గ్రామంలో పాత పోస్టాఫీసు వీధికి చెందిన పైలా తిరుపతిరావు(31) ఈనెల 7వ తేదీన తన ఇంటిమేడపై రాత్రి నిద్రిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి పడిపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కుటుంబసభ్యులు కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అక్రమ కట్టడాలపై హెచ్చరిక గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎల్విన్పేట గ్రామంలో సర్వే నంబర్ 60(గ్రామకంఠం) సర్వే నంబర్ 58, 61లకు చెందిన స్థలంలో నేతేటి ఈశ్వరరావు అనే గిరిజనేతర వ్యక్తి చేపడుతున్న కట్టడాలు అక్రమమైనవంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 1/70 చట్టానికి వ్యతిరేకంగా గిరిజనేతరుడు ఎల్విన్పేట వద్ద (గుణుపూర్ జంక్షన్) ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదంటూ గిరిజనాభ్యుదయ సంఘం నాయకుడు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు పై చర్యలకు ఉపక్రమించారు. ఆ నిర్మాణాలు అక్రమ కట్టడాలుగా గుర్తించామని, నిర్మాణాలు తక్షణమే తొలగించాలని హెచ్చరించారు. తాము జారీ చేసిన హెచ్చరికలను అతిక్రమిస్తే సీసీఎల్ఏ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులో పొందుపరిచారు. -
వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో పశువులపాక, గడ్డివాములు దగ్ధం
వేపాడ: మండలంలోని రామస్వామిపేట, బొద్దాం గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో పశువులపాక, గడ్డివాములు, నీలగిరి తోట అగ్నికి ఆహూతయ్యాయి. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామస్వామిపేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన ప్రమాదంలో పాత్రునాయుడు, ఎ.విజయలక్ష్మి, టి.నాగేష్, జి.తాత, గొలగాని కృష్ణమూర్తికి సంబంధించిన ఐదు గడ్డివాములు పక్కనే ఉన్న నీలగిరి తోట దగ్ధమయ్యాయి. సుమారు రూ.20 వేల నష్టం వాటిల్లింది. అలాగే బొద్దాం రామాలయం సమీపంలో మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన నీలంశెట్టి దేముడమ్మ పశువుల పాక దగ్ధమైంది. కళ్లంలో ఉన్న టేకుదుంగలు, సపోటా చెట్లు కాలిపోయాయి. ప్రమాదం సమయంలో పశువులు మేతకు వెళ్లడం వల్ల వాటికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సుమారు రూ.30వేల ఆస్తినష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదాలపై వీఆర్ఓలకు సమాచారం అందించినట్లు బాధితులు తెలిపారు. -
ఒక పూరిల్లు, మూడు పాకలు దగ్ధం
సీతంపేట: మండలంలోని రేగులగూడ కాలనీలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక పూరిల్లు మూడు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలియరావడం లేదని గిరిజనులు తెలిపారు. గ్రామంలో అందరూ కొండపోడు పనులకు వెళ్లిపోయారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో సవరలక్ష్మణ్కు చెందిన రూ.లక్షా 50 వేల నగదు. రెండు తులాల బంగారం, సామగ్రి కాలిపోయాయి. ఇంట్లో బంధువుల వివాహం ఇటీవల జరగడంతో సారె సామగ్రి, బట్టలు మొత్తం కాలిపోవడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. గ్యాస్, టీవీ, మంచం, 14 బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది.సవర రామారావు, సవర లక్కాయి, సవర బెన్నయ్యలకు చెందిన మూడు పశువుల శాలలు, ఒక సైకిల్, ఐటీడీఏ గతంలో ఇచ్చిన పవర్వీడర్ దగ్ధమయ్యాయి. స్థానికులతో పాటు కొత్తూరు అగ్నిమాపకశకటం వచ్చి మంటలను అదుపుచేసింది. విషయం తెలుసుకున్న ఆర్ఐ విజయ్గణేష్తో పాటు సిబ్బంది గ్రామాన్ని సందర్శించి నష్టం దాదాపు రూ.3లక్షలు ఉంటుందని అంచనా వేశారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
మెంటాడ: మండలంలోని రెల్లిపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు మృతురాలి మనుమరాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఆండ్ర ఎస్సై కె.సీతారాం తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వృద్ధురాలు రాళ్లపూడి అంకమ్మ(74) ఒంటరిగా పూరిపాకలో నివసిస్తోంది. వృద్ధురాలు మృతి చెందినట్లు స్దానికులు గమనించి విశాఖపట్నంలో నివాసం ఉంటున్న మనుమరాలు పైల దుర్గకు సమాచారం ఇవ్వడంతో ఆమె వచ్చి మృతిచెందిన వృద్ధురాలి ముక్కు నుంచి రక్తం కారిన మరకలు ఉండడంతో పాటు ముక్కుకు ఉండాల్సిన బంగారు వస్తువులు, ఇంట్లో ఉండాల్సిన కొంత నగదు లేనట్లు గుర్తించి అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సంఘటనా స్దలాన్ని డాగ్స్కాడ్తో పాటు వేలిముద్రలు నిపుణులతో పరిశీలించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. -
తాటిపూడిలో 200 ఎకరాల్లో భూమాత వెంచర్
● ఉడా అనుమతులతో 5ఫేజ్లలో 1650 ప్లాట్స్ ● ‘భూమాతాస్ ఎస్ఎన్ స్వప్నలోక్’ బ్రోచర్ రిలీజ్ శృంగవరపు కోట: రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎవరూ ఇవ్వని సౌకర్యాలు క్లబ్హౌస్, స్విమ్మింగ్పూల్ సదుపాయాలతో ‘భూమాతాస్ ఎస్ఎన్ స్వప్నలోక్’ నూతన వెంచర్ను వేసినట్లు భూమాత మేనేజింగ్ డైరెక్టర్ తాళ్లూరి పూర్ణచంద్రరావు, ఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. భూమాత గ్రూప్, ఎస్బీఎన్ గ్రూప్ సంయుక్తంగా ఆదివారం విశాఖపట్నంలోని సాయిప్రియ రిసార్ట్స్లో ‘భూమాతాస్ ఎస్ఎన్ స్వప్నలోక్‘ బ్రోచరిను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వెంచర్ విజయనగరం జిల్లాలోని తాటిపూడి వద్ద సుమారు 200 ఎకరాలలో 5 ఫేజ్లలో 1650 ప్లాట్స్ ఉడా అనుమతులతో అందరికీ అందుబాటు ధరలతో విడుదల చేశామని తెలిపారు. ఈ వెంచర్ పూర్తిగా ఒక థీమ్డ్ ప్రీమియం రెసిడెన్షియల్ మెగా ప్రాజెక్ట్ను కస్టమర్స్కు విశ్రాంతి, వినోదం ఇచ్చే ఇలాంటి భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో మొదటిదని చెప్పారు. ఈ వెంచర్కు ఇప్పటికే విశేష స్పందన వచ్చిందన్నారు. ఈ వెంచర్లో ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోని 7 వండర్స్ తాలూకా కళాకృతులు కస్టమర్స్ సందర్శన కోసం రిసార్ట్ సౌకర్యాలతో పాటు పెట్టడం వల్ల విశేష ఆదరణ ఈ స్వప్నలోక్ ప్రాజెక్టుకు వస్తుందన్నారు. ఈ స్వప్నలోక్ వెంచర్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తాటిపూడి రిజర్వాయర్ను టూరిజం స్పాట్గా చేసి అక్కడ బోట్ షికారు పెట్టిందన్నారు. టూరిజం అభివృద్ధి త్వరలో 200 ఎకరాల్లో హెలికాప్టర్ ద్వారా హెలిటూరిజం ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ వెంచర్ సమీపంలో 500 ఎకరాల్లో జిందాల్ కంపెనీ వారు టూరిస్ట్ స్పాట్గా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. స్వప్నలోక్ వెంచర్ సమీపంలో భవిష్యత్లో టూరిజంగా అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయన్నారు. ఈ వెంచర్ మీదుగా 4 లైన్ల హైవే పనులు త్వరలో ప్రారంభంకానున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది మార్కెటింగ్ సభ్యులు, డైరెక్టర్ తాల్లూరి శివాజీ, కిరణ్ శంకర్, గోపాల్ హాజరయ్యారు. విజయనగరంలో మార్కెటింగ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా మార్చి 23న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నెలలో మెగా కస్టమర్ మేళా తాటిపూడి వద్ద స్వప్నలోక్ వెంచర్లో ఏర్పాటు చేస్తున్నట్లు తాళ్లూరి పూర్ణచంద్రరావు తెలిపారు. -
ప్రభుత్వం హామీలు అమలు చేయాలి..
రోజంతా కష్టపడి ఆటో తోలితే నాలుగు డబ్బులు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు.నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో వాటిని కొనుగోలు చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నాం.అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి వాటి ఫైనాన్స్, పెరిగిన బీమా, రోడ్డు ట్యాక్స్లు కట్టుకోలేక ఆటోలు నడపలేకపోతున్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ.15 వేలు చొప్పున చంద్రబాబు ఇచ్చి ఆదుకోవాలి. – సీహెచ్ లోకేష్, బొబ్బిలి రూట్ యూనియన్ అధ్యక్షుడు, రామభద్రపురం● -
నేటి నుంచి పదోతరగతి పరీక్షలు
● పార్వతీపురం మన్యం జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలు ● పర్యవేక్షణకు 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు ● అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ● హాల్టికెట్ ఉంటే బస్సులో ఉచిత ప్రయాణంపార్వతీపురంటౌన్: పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన చీఫ్ సూపరింటెండెంట్లతో స్థానిక డీఈఒ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కేంద్రం వద్ద తాగునీరు, విద్యుత్, టాయిలెట్లు, డెస్క్లు సమకూర్చడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. మాస్కాపీయింగ్కు పాల్పడకుండా పర్యవేక్షణ అధికారులను నియమించామని తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇప్పటికే సంబంధిత సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని, మండలాల వారీగా విద్యాశాఖ అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేసి పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు చేపట్టామన్నారు. ’తనిఖీ బృందాల ఎంపిక.. జిల్లాలో 15 మండలాల పరిధిలో 220 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిలో 10,367 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 5,055 మంది బాలురు, 5,312 మంది బాలికలున్నారు. గత ఏడాది పరీక్ష తప్పిన 88 మంది మొత్తం 10,455 విద్యార్ధులు పరీక్షలు రాసేందుకు 67 కేంద్రాలను సిద్దం చేశారు. రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల పర్యవేక్షణకు 67 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, ఇద్దరు ఏడీఓలు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఎంపిక చేశారు. ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనునన్నారు. సి కేటగిరీలో 22 కేంద్రాలు జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్నట్లు 22 కేంద్రాలను గుర్తించారు. వాటిలో గతంలో చూచిరాతలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. ఈసారి అక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు చెప్పారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో సరిపడా బల్లలు లేకపోతే పక్కనున్న పాఠశాలల నుంచి తీసుకొచ్చామన్నారు. తాగునీరు, వైద్య శిబిరాలు అందుబాటులో ఉంటాయని చెబుతూ పరీక్షల నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తిచేసి, ప్రశ్నపత్రాలు పోలీసు స్టేషన్లలో భద్రపరిచామని వివరించారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. జిల్లాలో నేటి నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొకూడదనే ఉద్దేశంతో కంట్రోల్ రూమ్ను జిల్లా విద్యాశాఖాదికారి వారి కార్యాలయంలో నంబర్ 9063768050 ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం, పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు, ఇన్విజిలేటర్ల పనితీరు వంటి వాటిలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు సమాచారమివ్వచ్చని డీఈఓ పేర్కొన్నారు. హాల్ టికెట్ ఉంటే బస్సులో ఉచితం పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు పూర్తి చర్యలు చేపట్టారు. గ్రామాల నుంచి పరీక్షా కేంద్రానికి వేళ్లేందుకు హాల్టికెట్ ఉంటే బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే వేసులబాటు కల్పించారు. బస్సు సౌకర్యం అందుబాటులో ఉండే గ్రామాల నుంచి ఉదయం 8 గంటలకు బస్సులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు. -
● సీఎంఆర్ జ్యువెలరీ షోరూం ప్రారంభం
● మీనాక్షి చౌదరి సామాజిక చైతన్యం రాజాం: ప్రముఖ సినీ నటి, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ మీనాక్షి చౌదరి రాజాంలో శనివారం సందడి చేశారు. సీఎంఆర్ 18వ జ్యువెలరీ షోరూంను జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. షోరూంలో వెండి, బంగారు నగలను పరిశీలించారు. వాటిని అలంకరించుకుని మురిసిపోయారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎంఆర్ యాజమాన్యంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. ప్రజలకు నాణ్యతతో కూడిన జ్యువెలరీతో పాటు నూతన వస్త్రాలను సరసమైన ధరలకే అందిస్తూ సీఎంఆర్ ప్రజల ఆదరణ పొందుతోందన్నారు. రాజాంలో కొత్తగా ఏర్పాటుచేసిన షోరూంను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఎంఆర్ డైరెక్టర్లు మావూరి వెంకటరమణ, మావూరి సత్యవీరసంతోష్మోహన్బాలాజీ, హారిక, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, సీతారామ గ్రూప్ ఎండీ సి.వి.జగన్నాథస్వామి, వైద్యుడు ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు అంటే ఇష్టం తెలుగు భాష అంటే చాలా ఇష్టమని, తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు ఎక్కువగా రావడం అదృష్టమని మీనాక్షి చౌదరి అన్నారు. ఆమెను చూసేందుకు వచ్చిన రాజాం ప్రజలతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటివరకు తెలుగుభాషలో 8 సినిమాల్లో నటించానన్నారు. వీటిలో లక్కీభాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మంచి గుర్తింపునిచ్చాయన్నారు. త్వరలో నాగచైతన్యతో సినిమా తీస్తున్నట్టు వెల్లడించారు. డెంటల్ విభాగంలో వైద్యవిద్యను అభ్యసించానని, స్విమ్మింగ్, బ్యాండింటన్ క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉందని, ఆ క్రీడా పాత్రల్లో నటించాలని ఉందన్నారు. రాజాంలో సీఎంఆర్ జ్యువెలరీ షాపింగ్మాల్ను ప్రారంభించిన అనంతరం మీనాక్షి చౌదరి తన సామాజిక సేవాభావాన్ని చాటుకున్నారు. చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, పోలీసులతో కలిసి డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించారు. వాల్పోస్టర్లను ఆవిష్కరించి మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాలు వల్ల కలిగే అనర్థాలను వివరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర, ఎస్ఐ రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించే వాల్పోస్టర్ను ప్రదర్శిస్తున్న మీనాక్షి చౌదరి -
కూల్చేసి.. కబ్జాచేసి..
చిత్రంలో ఉన్న శిథిల భవనం, ఆ పక్కనే వేసిన లే అవుట్ను చూశారా... ఇవి వీరఘట్టం మండలం తలవరం గ్రామంలో ఓ టీడీపీ నాయకుడి రియల్ ఆక్రమణల పర్వానికి నిలువెత్తు సాక్ష్యాలు. గ్రామస్తులకు వైద్యసేవలందించేందుకు 25 ఏళ్ల కిందట రూ.5లక్షల ఖర్చుతో హెల్త్సెంటర్ భవనాన్ని నిర్మించారు. కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరింది. ఆరేళ్ల కిందటే ఆ భవనాన్ని ఖాళీ చేసి హెల్త్సెంటర్ను ఓ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇదే అదునుగా స్థానిక టీడీపీ నాయకుడు ఆ భవనంపై కన్నేశాడు. అధికార బలంలో కూల్చేసి పక్కనే నిబంధనలకు విరుద్ధంగా వేసిన తన లే అవుట్లో కలిపేశాడు. ‘రియల్’ దందాకు పూనుకున్నాడు. విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని తహసీల్దార్ చందక సత్యనారాయణ వద్ద ప్రస్తావింగా తలవరం గ్రామంలో ఉన్న పాత హెల్త్ సెంటర్ భవనాన్ని కూల్చేసి ఆక్రమించినట్టు ఫిర్యాదు అందిందన్నారు. స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. – వీరఘట్టం -
స్వచ్ఛసుందర పార్వతీపురమే లక్ష్యం
పార్వతీపురంటౌన్: స్వచ్ఛసుందర పార్వతీపురం మన్యం జిల్లాయే అందరి లక్ష్యం కావాలని జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ నారాయణ భరత్ గుప్త అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మున్సిపల్ మార్కెట్ యార్డు వద్ద కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరితో కలిసి ప్లాస్టిక్ నిషేధంపై శనివారం అవగాహన కల్పించారు. వాతావరణ కాలుష్యానికి, ప్రజల ఆరోగ్యానికి ప్లాస్టిక్ సంచుల వినియోగమే కారణమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా నుంచి ప్లాస్టిక్ భూతాన్ని పూర్తిస్థాయిలో తరిమేద్దామన్నారు. 70 మైక్రాన్ కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వినియోగం ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివారావు, కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొట్టాపు వెంకటనాయుడు, తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని డీఆర్వో హేమలత అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో శనివారం వివిధ రకాల పండ్ల మొక్కలు నాటారు. మొక్కల పెంపకంతో కాలుష్య నియంత్రణ సాధ్యమన్నారు. కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకుడు రాధాకృష్ణ, ఉప తహసీల్దార్లు చంద్రమౌళి, రమణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం పార్వతీపురం రూరల్: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎస్పీ క్యాంపు కార్యాలయం, రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిసరాలను పోలీస్ సిబ్బందితో కలిసి శనివారం పరిశుభ్రం చేశారు. పిచ్చిమొక్కలు తొలగించారు. చెత్తాచెదారాన్ని దూరంగా తరలించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురాన, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఏఆర్ ఆర్ఐ రాంబాబు, ఆర్ఎస్ఐలు, ఇతర అధికార సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాప్రత్యేకాధికారి డాక్టర్ నారాయణభరత్ గుప్త ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం: కలెక్టర్ జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం పార్వతీపురంటౌన్: జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం కావాలని జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ నారాయణభరత్ గుప్త పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. 2047 నాటికి వికసిత రాష్ట్రం కావాలన్నారు. విజన్ డాక్యుమెంట్ మేరకు కనీసం 15 ఽశాతం అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ, సబ్కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, పాలకొండ సబ్కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.రామచంద్రారెడ్డి, తదితర శాఖాధికారులు పాల్గొన్నారు. -
బొండపల్లిలో ఒకేషనల్ జవాబు పత్రాల మూల్యాంకనం
సీతంపేట: ఉత్తరాంధ్రంలోని ఇంటర్మీడియట్ వృత్తివిద్యా కోర్సు విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం విజయనగరం జిల్లా బొండపల్లిలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 17 నుంచి మూల్యాంకనం జరగనుంది. గతంలో విశాఖపట్నం జైలు రోడ్డులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించేవారు. జనరల్ సబ్జెక్టుల మూల్యాంకనం యథావిధిగా పార్వతీపురం మన్యం జిల్లాలోని బెలగాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 14న మెరిట్ జాబితా విడుదల విజయనగరం ఫోర్ట్: వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో 91 పోస్టులకు సంబంధించిన తుది మెరిట్ జాబితాను ఏప్రిల్ 14న ప్రకటిస్తామని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న ప్రకటించిన ప్రొవి జినల్ జాబితాలో అభ్యంతరాలుంటే వారం రోజుల్లో తెలియజేయాలన్నారు. ఎంపికై న అబ్యర్థులకు ఏప్రిల్ 20వ తేదీన కౌన్సెలింగ్ చేసి నియామకపత్రం అందజేస్తామని పేర్కొ న్నారు. రోడ్డెక్కిన పశువైద్య విద్యార్థులు చీపురుపల్లిరూరల్ (గరివిడి): తమ సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించా లని గరివిడి వెంకటేశ్వర వెటర్నరీ కళాశాల విద్యార్థులు కోరారు. కళాశాలకు వీసీఐ గుర్తింపు, స్టైఫండ్ రూ.25వేలకు పెంచాలని 41 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి పట్టకపోవడంపై మండిపడ్డారు. దీనికి నిరసనగా గరివిడి–విజయనగరం ప్రధాన రోడ్డు పై శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద కాసేపు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. నేడు ఎఫ్ఆర్ఓ ఉద్యోగాలకు రాతపరీక్ష ● పకడ్బందీగా ఏర్పాట్లు: డీఆర్ఓ విజయనగరం అర్బన్: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే రాతపరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. అలాగే, ఈ నెల 17న జరగనున్న ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తన చాంబర్లో పరీక్ష ఏర్పాట్లపై శనివారం సమీక్షించారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. జిల్లాలోని చింతలవలస వద్ద ఉన్న ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, గాజులరేగలోని అయాన్ డిజిటల్ సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో కలెక్టరేట్ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ భాస్కరరావు, వివిధ శాఖల ప్రతినిధులు, ఏపీపీఎస్సీ అధికారులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025
ధ్యాస.. ‘ధ్యానం’ ముఖ్యమే.. ● పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రొటీన్స్, మినరల్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు ఎక్కువ తింటే మంచిది. నీరు ఎక్కువగా తాగాలి. మాంసాహారం, కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్లకు దూరంగా ఉండటం మంచిది. ● ప్రతి రోజూ కనీసం 7 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ● ఒత్తిడి తగ్గడం కోసం చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ధ్యానం, ప్రాణామాయం వంటివి చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ● చదివేటప్పుడు ఒకేచోట గంటలకొద్దీ కూర్చొండిపోకుండా, మధ్యలో కాస్త విరామం ఇవ్వాలి. కొద్దిగా అటూఇటూ నడవాలి. కట్టుదిట్టంగా.. ● కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి లేదు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరి మొబైల్నూ అనుమతించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చినా, పరీక్ష కేంద్రాల ప్రధాన గేటు వద్ద వాటిని భద్రపర్చుకోవాలి. ● పరీక్షలు జరిగే సమయంలో కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ● పరీక్షా కేంద్రాల పరిధిలోని జిరాక్స్, నెట్ సెంటర్లన్నీ మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ● పరీక్షలు జరిగే సమయంలో వివిధ సోషల్ మీడియా సహా ఇతర ప్రసార మాధ్యమాల్లో పేపరు లీకు వంటి వదంతులు, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ● పరీక్షల నిర్వహణకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. వీటిని అన్ని మండలాల స్టేషన్ హౌస్ల్లో భద్రపరిచారు. ● ప్రతి కేంద్రంలోనూ తాగునీరు, ప్రథమ చికిత్సకు సంబంధించి ఒక ఏఎన్ఎంను అందుబాటులో ఉంచుతున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: విద్యార్థి దశలో కీలకం.. పదో తరగతి. భవిష్యత్తుకు సరైన పునాది పడేది ఈ సమయమే. ఇక్కడ వేసిన అడుగే.. మేలి మలుపు. అందుకే ప్రతి విద్యార్థికీ పదో తరగతి పరీక్షలు ముఖ్యమైనవి. చక్కని ప్రణాళికతో చదివితే.. ఒత్తిడి లేకుండా పరీక్షలు రాస్తే విజయం సిద్ధించడమే కాదు.. మంచి మార్కులూ సాధించగలమని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా విద్యాశాఖాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గడిచిన రెండు విద్యాసంవత్సరాల్లో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. సగర్వంగా జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాదు.. మరింత మెరుగుపర్చేలా కొద్ది రోజుల నుంచి అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకువెళ్లింది. ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విద్యార్థులను విభజించడమే కాదు.. వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేకంగా దత్తత తీసుకుని, వారిని కనీసం ఉత్తీర్ణత సాధించేలా సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు (ప్రభుత్వ, ప్రైవేట్) 220 ఉండగా.. మొత్తం 10,455 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాయనున్నారు. ఇందులో రెగ్యులర్ 10,367 మంది, ప్రైవేట్ విద్యార్థులు 88 మంది ఉన్నారు. మాస్ కాపీయింగ్కు తావులేకుండా చర్యలు పరీక్షల్లో మాస్కాపీయింగ్, ఇతర ఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేశారు. మొత్తం 67 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇందులో అర్బన్ ప్రాంతాల్లో 19, రూరల్ ప్రాంతాల్లో 48 ఉన్నాయి. ప్రతి కేంద్రానికీ ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి పర్యవేక్షించేలా.. మొత్తం 67 కేంద్రాలకూ నియమించారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఆరు సిట్టింగ్ స్క్వాడ్లను, 22 కస్టోడియన్–సిట్టింగ్ స్క్వాడ్(సి సెంటర్)లను నియమించారు. సెల్ఫోన్లకు విరామమిద్దాం... ● పరీక్షల సమయంలో సెల్ఫోన్లకు విద్యార్థులు విరామమివ్వాలి. భావోద్వేగాలను ప్రభావితం చేసే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. అధిక సమయంలో వాటితో గడిపి, విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ● వినోదం కోసం టీవీలు, సినిమాలు, విందులు, వేడుకలు వంటివాటిని పరీక్షా కాలంలో పూర్తిగా పక్కనపెట్టాలి. ప్రత్యేక కంట్రోల్రూం ఏర్పాటు జిల్లాస్థాయిలో 90637 68050 నంబరుతో ప్రత్యేక కంట్రోల్రూం ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఎటువంటి సమస్యలు తలెత్తినా ఈ నంబర్కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే తెలియజేసేందుకు డీఈవో కార్యాలయంలో కంట్రోల్రూం ఏర్పాటు చేశాం. తాగునీరు అందుబాటులో ఉంచుతున్నాం. వేసవి దృష్ట్యా నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నాం. –ఎన్.తిరుపతినాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి న్యూస్రీల్ పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధం రేపటి నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు నిర్వహణ -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ90 శ్రీ150 శ్రీ160కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలు సాలూరు: పట్టణంలోని 18వ వార్డు పరిధి దుర్గానవీధిలో నలుగురు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. శనివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై కుక్కలను తరిమేశారు. చిన్నారులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఖేలో ఇండియా పోటీలకు ముగ్గురు..విజయనగరం: ఢిల్లీలో ఈ నెల 20 నుంచి 23 వరకు జరగనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ముగ్గురు పారా క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ మేరకు ఎంపికై న క్రీడాకారులను శనివారం స్థానిక క్రీడాభివృద్ధి కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెలలో జరిగిన పారా ఒలింపిక్ చాంపియన్షిప్ పోటీల్లో కిల్లక లలిత, దొగ్గా దేముడు నాయుడు, సుంకరి దినేష్ అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఖేలో ఇండియా పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరిలో కిల్లక లలిత ఇప్పటికే ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో ఆడేందుకు వెళ్లగా.. మిగిలిన ఇద్దరు త్వరలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారని తెలిపారు. ఖేలో ఇండియా పోటీలలోనూ బాగా రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. 27న స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరేడ్లో ఈ నెల 27న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం.రాజేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు అర్హులని పేర్కొన్నారు. పురుషులకు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషన్ (75 రోజులు), సెల్ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ (30 రోజులు), జెంట్స్ టైలరింగ్ (30 రోజులు), హౌస్ వైరింగ్ (30 రోజులు).. అలాగే మహిళలకు టైలరింగ్ (30 రోజులు), కంప్యూటర్ డీటీపీ కోర్సు (45 రోజులు), మగ్గం అండ్ శారీ పెయింటింగ్ వర్క్స్ (30 రోజుల పాటు)లలో శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్కార్డు తీసుకురావాలని సూచించారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయాలుంటాయన్నారు. మరిన్ని వివరాలకు 90147 16255, 94917 41129, 98669 13371, 998 99 53145 నంబర్లను సంప్రదించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పాల పౌడర్ ● సీ్త్ర సంక్షేమశాఖ ఆర్జేడీ చిన్మయిదేవి రామభద్రపురం: అంగన్వాడీ కేంద్రాలకు ప్రస్తుతం సరఫరా చేస్తున్న పాల ప్యాకెట్ల స్థానంలో పాల పౌడర్ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నట్టు సీ్త్ర సంక్షేమ శాఖ ఆర్జేడీ చిన్మయిదేవి తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే ఏజెన్సీకి చెందిన రామభద్రపురంలో ఉన్న గోదాంను ఆమె శనివారం సందర్శించారు. సరుకుల సరఫరా, నిల్వలను ఏజెన్సీ నిర్వాహకుడు బండారు నాగరాజును అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద మన్యం, భద్రగిరి, కురుపాంలలోని అంగన్వాడీ కేంద్రాలకు పాలపౌడర్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతంలో భాగంగా 3,173 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా చేస్తామని తెలిపారు. -
పైసలిస్తేనే.. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు
ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.. ● నగదు అందిస్తేనే కొనసాగింపు ● ఉపాధి హమీ వేతనదారుల వద్ద నుంచి రూ. వంద వసూలు చేయాలని అల్టిమేటం ● ఏపీఓ ఆదేశాల ప్రకారం నగదు వసూలు చేస్తున్న ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు మణ్యపురిపేట సీనియర్ మేట్గా పనిచేసిన గార రామలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు కోసం రూ. 50 వేల నగదును రెండు నెలలు కిందట మండల ఉపాధి హమీ అధికారి కామేశ్వరరావుకు ఇచ్చింది. అయితే మరో రూ. 10 వేలు ఇవ్వాలని అతను డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన నగదు ఇవ్వకపోవడంతో గ్రామానికి చెందిన మరో మహిళకు ఫీల్డ్ అసిస్టెంట్గా నియామకపత్రం అందజేశారు. ఆమె వద్ద నుంచి రూ. 30 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నగదు తీసుకున్న విషయం ఎంపీడీఓ, ఉపాధి హమీ పీడీలకు బాధితురాలు రామలక్ష్మి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి విచారణ చేపట్టలేదు. జిల్లా అధికారి నుంచి మండల అధికారి వరకు వసూలు చేసిన నగదు సర్దుబాటు అవుతుందని సమాచారం. అందుకే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గత సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్సెల్లో బాధితురాలు రామలక్ష్మి ఫిర్యాదు చేయడంతో ఈఓపీఆర్డీ అన్నపూర్ణాదేవి మన్యపురిపేట పంచాయతీ కార్యాలయంలో శనివారం విచారణ చేపట్టారు. గుర్ల: గ్రామాల్లో పేదలందరికీ వంద రోజుల పని కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హమీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వంద రోజుల పని నుంచి వారానికి రూ. వంద వసూలు చేసే సరికొత్త పథకాన్ని గుర్ల మండల ఉపాధి హమీ అధికారులు ప్రవేశ పెట్టడం విమర్శలకు దారితీస్తోంది. మండలంలోని 42 గ్రామ పంచాయతీలలో ఉపాధి హమీ పనులు జరుగుతున్నాయి. ఈ గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు వేతనదారుల నుంచి నగదు వసూలు చేస్తున్నారు. వేతనదారులు సక్రమంగా పని చేయడం లేదని బెదిరిస్తూ వారిని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. వారానికి రూ. వంద నగదు ఇస్తే తక్కువ పని చేసినప్పటికీ టెక్నికల్ అసిస్టెంట్ సహాయంతో కొలతలను అధికంగా వేసి ప్రభుత్వం ప్రకటించిన గరిష్ట వేతనాన్ని మీఖాతాలో జమ అయ్యేలా ఆన్లైన్ చేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్లు వారికి చెబుతున్నారు. నగదు ఇస్తున్నట్లు స్థానిక నేతలకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగదు వసూలుపై ఎవరైనా వేతనదారులు ప్రశ్నిస్తే సాంకేతిక కారణాలు చూపి ఉపాధి హమీ పనులకు వెళ్లకుండా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.