Parvathipuram manyam District Latest News
-
ప్రశాంతంగా ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష
విజయనగరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన ఏపీఆర్జేసీ, ఏపీఆర్ఈఐ, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఏపీఆర్ఈఐ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశం కోసం జిల్లాలో నిర్వహించిన 6 కేంద్రాల్లో 1,288 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1,064 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పూట 10 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షను 1,891 మంది రాశారు. ఏపీఆర్డీసీ కోసం దరఖాస్తు చేసుకున్న 77 మంది అభ్యర్థుల్లో 65 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను ఆయన అకస్మికంగా తనిఖీచేశారు. ఆయన వెంట పరీక్షల సహాయ కమిషనర్ టి.సన్యాసిరాజు ఉన్నారు. -
పెళ్లిబృందంపై తేనెటీగల దాడి
● 50 మందికి గాయాలుగుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలం, శివ్వన్నపేటలో శుక్రవారం జరిగిన తేనెటీగల దాడిలో 50 మందికి పైబడి గాయపడ్డారు. క్షతగా త్రులంతా పెళ్లి వేడుకకు వచ్చిన వారుగా తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో డీజే సౌండ్కు ఆస్పత్రి దగ్గర చెట్టు పైనున్న తేనెటీగలు ఒక్కసారిగా అక్కడి వారిపైకి దూసుకొచ్చి, గాయపరిచాయి. స్థానికుల సహకారంతో గాయపడిన వారి ని చికిత్స నిమిత్తం కురుపాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నాగేశ్వరరావు అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
త్వరలో జిల్లాకు అదనపు జాగిలాలు
● నూతన కెన్నల్స్ నిర్మాణానికి చర్యలు ● పాత వాటిని పరిశీలించిన ఎస్పీ విజయనగరం క్రైమ్: నేరాలు జరిగినప్పుడు నిందితులను కనిపెట్టేందుకు సిబ్బందితో పాటు నేరం జరిగిన ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తులో ముఖ్యభూమిక పోషిస్తున్న జాగిలాలకు సరైన శాశ్వత విశ్రాంతి గదుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. ఈ మేరకు ఏఆర్ క్వార్టర్స్లో ఉన్న పాతభవనాలను ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం ఏఆర్ సిబ్బందితో కలిసి పరిశీలిచారు. పాతబడిన గదులను, జాగిలాలు ఉంటున్న స్థలాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందితో పాటు నేరం జరిగే ప్రదేశానికి వెళ్తున్న జాగిలాలకు శాశ్వతమైన గదులు లేవని, నేరాలను కనిపెట్టడంలో, కేసు ఛేదనలో సిబ్బంది కంటే ముందే గుర్తులు ఇవ్వడంలో కీలక పాత్రను జాగిలాలు పోషిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న జాగిలాలకు అదనంగా మరికొన్ని నార్కొటెక్స్, స్నిప్పర్, ట్రాకింగ్ జాగిలాల అవసరం జిల్లా పోలీస్ శాఖకు ఉందన్నారు. ప్రతిపాదనల మేరకు అదనపు జాగిలాలు జిల్లాకు రానున్నట్లు తెలిఆపరు. ప్రస్తుతం ఏఆర్క్వార్టర్స్లో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఆర్ సిబ్బందిని ఆదేశించారు. పరిశీలనలో ఎస్పీ వెంట ఎస్బీ సీఐ లీలారావు, సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు, జాగిలాల హ్యండ్లర్స్ పాల్గొన్నారు. -
16 అడుగుల గిరినాగు పట్టివేత
● ఊపిరి పీల్చుకున్న రైతులువేపాడ: మండలంలో చామలాపల్లి నుంచి వెంకయ్యపాలెం వెళ్లే రహాదారిలో అరిగివాని చెరువువద్ద 16 అడుగుల గిరినాగును స్థానికులు గుర్తించారు. శుక్రవారం రాత్రి అరిగివాని చెరువు కళ్లాలవద్ద బుస కొడుతుండగా అక్కడ ఉన్న రైతులు గమనించి చూసి గిరినాగుగా గుర్తించారు. తక్షణమే వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం ప్రతినిధి వరపుల కృష్ణకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్దలానికి చేరుకుని 16 అడుగుల గిరినాగును భద్రంగా పట్టుకుని గొనెసంచెలో భద్రపరిచారు. ఉదయాన్నే అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపారు. దీంతో స్దానిక రైతులు ఊపిరి పీల్చుకున్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
● ఉపాధి హామీ అధికారుల తీరుపై జెడ్పీ చైర్మన్ అగ్రహంగుర్ల: జాతీయ ఉపాధి హామీ అధికారుల తీరుపై జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుర్లలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పొట్నూరు ప్రమీల అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. గోషాడ, గరికివలసలలో ఉపాధి హమీ పనులు ఎందుకు ప్రారంభించలేదని ఏపీఓ రత్నమాలను ప్రశ్నించారు. వచ్చే వారం ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభిస్తామని ఆమె బదులు ఇచ్చారు. జమ్ములో ఫీల్డ్ అసిస్టెంట్కు తెలియకుండా ఉపాధి హమీ పనులు ఎలా చేపడతారని సర్పంచ్ గొర్లె నరసింహమూర్తి ప్రశ్నించారు. టీడీపీ నేతలు చెప్పినట్లు ఉపాధి పనులు చేపట్టడం సమంజసం కాదని ఏపీఓకు జెడ్పీ చైర్మన్ సూచించారు. గ్రామాల్లో ఇప్పటికే ఉన్న మేట్లను తొలగించకుండా కొత్త మేట్లను స్థానిక నేతలు సిఫార్సు చేసిన వారిని వేయాలని జెడ్పీ చైర్మన్ స్పష్టం చేశారు. ఆర్థిక ఆరోపణలు వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే తొలగించాలని ఏపీఓను ఆదేశించారు. కొండగండ్రేడులో టీడీపీ నేతలు చెప్పారని ఉపాధి హామీ పనులను ప్రారంభించలేదని సర్పంచ్ సారిక గోవింద్ జెడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధి హామీ వేతనదారులకు కనీస వేతనం రూ.307 ఉన్నప్పటికీ రోజుకు రూ.50 నుంచి రూ.100 వరకు వస్తుందని , కనీస వేతనం రూ.300లు వచ్చేలా పనులు చేపట్టేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉపాధి హామీ అధికారులకు జెడ్పీ చైర్మన్ సూచించారు. అధికారులు సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని , గ్రామాల్లో తరచూ పర్యటించకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీలు అంబళ్ల లక్ష్మి, తోట తిరుపతిరావు, ఎంపీడీఓ శేషుబాబు, డీటీ నారాయణమ్మ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. -
సమస్యలు చెప్పుకునే వేదిక వెల్ఫేర్ ‘డే‘
విజయనగరం క్రైమ్: వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది వారి సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి శుక్రవారం తన చాంబర్లో పోలీస్ వెల్ఫేర్డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్జిందల్ చెప్పారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఉత్తర్వులతో ప్రతివారం సంక్షేమ రోజును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లా అండ్ ఆర్డర్, ఏఆర్, ఫింగర్ప్రింట్స్, ఎస్టీఎఫ్, హోంగార్డ్స్, మినిస్టీరియల్ సిబ్బంది ఇలా ప్రతి ఒక్క ఉద్యోగి వారి పనుల్లో ఎదురయ్యే బదిలీలు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్, వ్యక్తిగత, వృత్తిపరమైన వినతులను ఈ వెల్ఫేర్ డే సందర్భంగా తెలియజేయగా పరిశీలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. -
పేద పిల్లలకు కార్పొరేట్ విద్య
● గత ప్రభుత్వం సంస్కరణల ఫలితమే ● ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద 25 శాతం ఉచితవిద్య ● 2022–23లో పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ● తాజాగా నోటిఫికేషన్ జారీచేసిన సమగ్ర శిక్ష అభియాన్రామభద్రపురం: పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా, తరతరాల వారి తలరాతలను మార్చాలని గడిచిన ఐదేళ్ల పాటు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో సంస్కరణల విప్లవం తీసుకువచ్చారు. ఒక చదువుతోనే పేదరికాన్ని అధిగమించడం సాధ్యమని బలంగా విశ్వసించి ప్రాథమిక విద్యావ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. మనబడి నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. పేద విద్యార్థులకు అమ్మఒడి, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, బైల్టులు, టై తదితర పథకాలు పకడ్బందీగా అమలు చేశారు. ఈ క్రమంలోనే అక్షరాన్ని కాసులు పెట్టి కొనుక్కునే స్థోమత లేని ఎంతోమంది పేద విద్యార్థుల చదువుకు అంతరాలు, అడ్డగోడలు ఉండకూడదని ఆలోచించి విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలనే నిబంధనను నాటి ప్రభుత్వం పక్కాగా అమలు చేసింది. దీనికి అనుగుణంగా ప్రైవేట్, అన్ఎయిడెడ్, పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఉచిత విద్యనందించేందుకు 2022–23 విద్య సంవత్సరంలోనే ఈ పఽథకానికి శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా 302 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా విద్యాహక్కు చట్టం–2009 ద్వారా గత ఏడాది 283 పాఠశాలల్లో 1326 మంది పేదవిద్యార్థులు ప్రవేశం పొందారు. వారిలో అధికశాతం విద్యార్థులు ఆయా విద్యాసంస్ధల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అదే ఉచిత విద్యావిధానాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించేలా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం విద్యాహక్కు చట్టం–2009 అమలులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ అమలవుతున్న పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 28 నుంచి మే 15వ తేదీ వరకూ వివిధ వర్గాల నుంచి ఉచిత విద్యకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హులైన విద్యార్థులు ఆధార్ ద్వారా ప్రాథమిక వివరాలతో హెచ్టీటీపీ://సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదే సమయంలో వారి నివాసానికి సమీపంలో ఉండే పాఠశాలలను ఎంపిక చేసుకునే వీలుంది. అర్హతలు.. ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ అమలవుతున్న పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశం కోసం 31.3.2025 నాటికి ఐదేళ్లు వయసు నిండి ఉండాలి.స్టేట్సిలబస్ పాఠశాలల్లో ప్రవేశానికి 1.6.2025 నాటికి ఐదేళ్లు నిండాలి. అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత సీట్లను ప్రభుత్వం కేటాయించగా అనాథలు, హెచ్ఐవీ ఎఫెక్టెడ్, డిజేబుల్డ్ వారికి 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు నాలుగు శాతం, బీసీలు, మైనార్టీలు, ఇతరులకు ఆరు శాతం సీట్లు మంజూరు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.2 లక్షలు, పట్టణ ప్రాంతాల వారు రూ.1.44 లక్షల ఆదాయానికి మించి ఉండరాదు.విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా పాటించాలి అందరికీ విద్య అందించేందుకు విద్యాహక్కు చట్టం మేరకు పేదలకు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.ఇది పేద విద్యార్థులకు వరం. నోటిఫికేషన్ ప్రకారం అర్హులు దరఖాస్తు చేసుకోవాలి.అలాగే విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు పక్కాగా పాటించాలి. ఈ నెల 28వ తేదీలోపు ప్రతి పాఠశాల రిజిస్టర్ కావాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చే విద్యా సంవత్సరం కోసం విడుదల చేశారు. యు.మాణిక్యంనాయుడు, డీఈవో, విజయనగరం -
కిసాన్ డ్రోన్లతో సాగు సులభం
పార్వతీపురం టౌన్: కిసాన్ డ్రోన్ వినియోగం, ఉపయోగాలపై రైతులకు అవగాహన అవసరమని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన కిసాన్ డ్రోన్ల అవగాహన కార్యక్రమంలో ఆయ న పాల్గొన్నారు. పురుగు మందు పిచికారీలో డ్రోన్లను వినియోగించే తీరును రైతులు, పైలెట్లతో కలిసి వీక్షించారు. జిల్లాకు ఆరు కిసాన్ డ్రోన్లు మంజూరయ్యాయని, రైతులు గ్రూపుగా ఏర్పడి వీటిని కొనుగోలు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఒక్కో యూనిట్ ధర రూ.10 లక్షలు కాగా రూ.8లక్షల వరకు సబ్సిడీ ఉంటుందని, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా పొందవచ్చన్నారు. సందేహాల ను కంపెనీల ప్రతినిధులు, బ్యాంకర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్పాల్ పాల్గొన్నారు. -
మలేరియా నివారణపై అవగాహన
పార్వతీపురంటౌన్: అవగాహనతోనే మలేరియాను నివారించవచ్చని, అందుకోసం ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు అన్నారు. ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా అవగాహన ర్యాలీని శుక్రవారం ఆరోగ్యశాఖ కార్యాలయం దగ్గర ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మలేరియా నివారణ నినాదాలతో ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎన్జీఓ హోం సమావేశ భవనంలో నిర్వహించిన అవగాహన సదస్సు డీఎంహెచ్ఓ మాట్లాడారు. మలేరియా వ్యాధి, నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని తద్వారా నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, దోమల నివారణ చర్యల్లో భాగంగా 915 గ్రామాల్లో వచ్చే నెల ఒకటవ తేదీనుంచి ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ను ఇంటింటికీ చేయించనున్నట్లు చెప్పారు. జూలై 1 నుంచి రెండవ విడత పిచికారీ చేయిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగాం అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు, పీఎల్.రఘుకుమార్, ఏఎంఓడీ సూర్యనారాయణ, వైద్యాధికారి డా. రవించద్ర, క్వాలిటీ కన్సల్టెంట్స్ డా.రమణ, డా.మణికంఠ, ఎన్జీఓ అధ్యక్షులు జీవీఆర్ఎస్. కిషోర్, డెమో సన్యాసిరావు, సబ్యూనిట్ అధికారి ధనుంజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బిత్రపాడులో ఏనుగుల గుంపు
జియ్యమ్మవలస: మండలంలోని బిత్రపాడు పంట పొలాల్లో ఏనుగులు శుక్రవారం దర్శనమిచ్చాయి. ఉదయం కొమరాడ మండలం దళాయిపేటలో ఉన్న ఏనుగులు సాయంత్రాని కి బిత్రపాడు పరిసర ప్రాంతాల్లోకి జారుకున్నా యి. రాత్రి సమయాన గ్రామంలోకి చొచ్చుకురావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కోత దశలో ఉన్న వరి పంటను ధ్వంసంచేస్తాయని బెంగపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.కొత్త బాధ్యతలు● వైఎస్సార్సీపీ జిల్లా ఆర్టీఐ విభాగ అధ్యక్షునిగా సింగారపు ఈశ్వరరావుపార్వతీపురంటౌన్: వైఎస్సార్సీపీ జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షునిగా సాలూరు నియోజకవర్గా నికి చెందిన సింగారపు ఈశ్వరరావు నియామకమయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేసింది.జిల్లా జడ్జికి ఎస్పీ శుభాకాంక్షలుపార్వతీపురం రూరల్: విజయనగరం జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.బబితను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి ఆమె చాంబర్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధి త ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు న్యాయ, పోలీస్ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతాయని తెలిపారు.నేడు వివిధ పథకాలు, ప్రాజెక్టులపై సమీక్షపార్వతీపురంటౌన్: జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాలు, ప్రాజెక్టులపై శనివారం ట్వంటీ పాయింట్ ప్రొగ్రాం చైర్మన్ లండా దినకర్ సమీక్షించనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ శు క్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పై అధికారులందరూ పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు.కొత్త సిలబస్పై అవగాహన తరగతులుపార్వతీపురంటౌన్: ఇంటర్లో కొత్త సిలబస్పై పార్వతీపురం జూనియర్ కళాశాలలో ఆన్లైన్ ఓరియంటేషన్ తరగతులను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి మంజులా వీణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు లాంగ్వేజీలతో పాటూ 14 విభాగాల సిలబస్, పాఠ్యపుస్తకాల ను నూతన సిలబస్తో ప్రారంభించనుందన్నా రు. ఈ మేరకు అధ్యాపకులకు ఆన్లైన్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలి పారు. కార్యక్రమం మే 6 వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని జూనియర్ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు. -
బైక్ల దొంగ అరెస్ట్
ఎంవీపీకాలనీ (విశాఖ): నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న పాత నేరస్తుడిని ఎంవీపీ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగర క్రైం ఏడీసీపీ మోహనరావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. మార్చి 17న పెదవాల్తేర్ రిలయన్స్ మార్ట్ ఎదుట దాసరి శంకరరావు అనే వ్యక్తికి చెందిన హోండా యాక్టివా బైక్ దొంగతనానికి గురైంది. మార్ట్ ఎదుట వాహనాన్ని పార్క్ చేసిన శంకరావు పక్కనే ఉన్న చికెన్ షాపునకు వెళ్లి వచ్చేసరికి వాహనం కనిపించలేదు. దీనిపై ఎంవీపీ క్రైం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ద్వారకా క్రైం సీఐ చక్రధర్రావు నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. మార్ట్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు చివరిగా సంచరించిన ప్రాంతాన్ని గుర్తించి, సెల్ఫోన్ నంబర్ కనుగొన్నారు. సెల్ఫోన్ ఆధారంగా నిందితుడిని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం, కోట సీతారామపురం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు కోట శివగా గుర్తించారు. ఈ నెల 24న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. నగరంలోని ఎంవీపీ కాలనీ, వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్, ద్వారకా పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 17 వాహనాలను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. 2024 నుంచి శివ విశాఖలో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. అలాగే అతనిపై 31 పాత కేసులతో పాటు జీఆర్పీలో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి దగ్గర సేకరించిన వివరాలతో 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం శివను కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన ద్వారకా క్రైం సీఐ చక్రధర్రావుతో పాటు ఎస్సై అప్పలరాజు, ఏఎస్సై కిశోర్బాబు, పీసీలు జగత్ కిరణ్, హరిప్రసాద్, సాయి, అప్పలరాజు, అగస్టీన్లను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
కోర్టు వాయిదాకు వెళ్లి వస్తూ నిందితుడి మృతి
● బస్సులో వస్తుండగా మార్గమధ్యంలో అస్వస్థత కొత్తవలస: జిల్లా కేంద్రంలో గల కోర్టు వాయిదాకు వెళ్లి వస్తుండగా లక్కవరపుకోట మండలం రేగ గ్రామానికి చెందిన గొల్ల అప్పారావు(40) మార్గమధ్యంలో అస్వస్థతకు గురై మృతిచెందాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అప్పారావు 2021వ సంవత్సరంలో జరిగిన ఒక హత్య కేసులో నిందితుడు. ఈ మేరకు శుక్రవారం విజయనగరం జిల్లా కోర్టుకు కేసు వాయిదాకు తల్లిదండ్రులు, భార్యతో కలిసి వెళ్లాడు. వాయిదా ముగిసిన తరువాత భార్య మందుల కొనుగోలు కోసం విజయనగరంలో ఉండిపోగా తల్లిదండ్రులతో కలిసి విజయనగరం–అనకాపల్లి బస్సులో కొత్తవలస వచ్చేందుకు బస్సు ఎక్కాడు. భీమసింగి జంక్షన్కు వచ్చేసరికి అప్పారావు తీవ్ర అస్వస్థతకు గురికాగా కొత్తవలస తహసీల్దార్ గేటువద్దకు వచ్చేసరికి ఆర్టీసీ బస్సు నుంచి అప్పారావును, తల్లిదండ్రులను సిబ్బంది దించేసిన అనంతరం బస్సు వెళ్లిపోయింది. స్పందించని 108 సిబ్బంది తీవ్ర ఆస్వస్థతకు గురైన అప్పారావును స్థానికులు గుర్తించి వెంటనే 108 కాల్ సెంటర్కు ఫోన్ చేయగా కొత్తవలస, ఎల్.కోట, జామి మండలాల వాహనాలు అందుబాటులో లేవని వేరే మండలం నుంచి వాహనం రప్పించేందుకు గంటకు పైగా పడుతుందని అంతవరకు ఉంటే ఉండండి లేదంటే మీఇష్టమని సిబ్బంది బదులిచ్చారు. దీంతో కాసేపు వేచి ఉండి చెంతనే గల పీహెచ్సీ వైద్యులకు సమాచారం అందించగా డాక్టర్ వచ్చి పరిశీలించి పల్స్ పడిపోయిందని మృతిచెందినట్లు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న వృద్ధ తల్లిదండ్రులు భోరుమంటూ విలపించారు. స్థానికులు చందాలు వేసుకుని మృతదేహాన్ని స్వగ్రామం రేగకు ఆటోలో తరలించారు. కాగా మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. -
గిరిజన గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు
● నోటిఫికేషన్ విడుదల చేసిన గురుకులం సొసైటీ ● ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ● పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో 1200 సీట్ల భర్తీ ● నేటి నుంచి వచ్చేనెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ● మే 24న కౌన్సెలింగ్ సీతంపేట: గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గిరిజన గురుకుల సొసైటీ ఆన్లైన్లో శనివారం నుంచి దర ఖాస్తులు స్వీకరిస్తోంది. గిరిజన గురుకులాల్లో చేరే విద్యార్థులకు అధికారులు ఉచిత, భోజన వసతి, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, వైద్య సదుపాయాలు సమకూరుస్తారు. కళాశాలల్లో సీటు లభించిందంటే కార్పొరేట్ కళాశాలల్లో సీటు లభించినట్టేనన్నది విద్యావేత్తల మాట. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలో 8 కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీలతో పాటు ఒకేషనల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, సీజీఏ గ్రూపులు బోధిస్తున్నారు. మొత్తం అన్ని గ్రూ పులు కలిపి 1270 సీట్లు ఉన్నాయి. వీటికోసం ఏటా 2 వేల మంది విద్యార్థులు పోటి పడుతున్నారు. మెరిట్ ఆధారంగానే... ఈ దఫా పదో తరగతిలో వచ్చే మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రతి గ్రూపునకు 40 సీట్లు కేటాయించారు. దీనిలో ఎస్టీలకు 36 సీట్లు, ఎస్సీ, బీసీ, ఓసీ, ఏఈలకు ఒక్కో సీటు చొప్పున కేటాయిస్తారు. ఒకేషన ల్ ఏఅండ్టీ–20, సీజీఏ గ్రూపు లో 30 చొప్పున సీట్లు పూర్తిస్థాయిలో ఎస్టీలకు కేటాయించా రు. విద్యార్థులు ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటీడబ్ల్యూఆర్.గవ్.ఇన్లో దరఖాస్తు చేసుకోవాలి. షెడ్యూల్ ఇలా.. దరఖాస్తులు ఆన్లైన్ చేయాల్సిన తేదీ ప్రారంభం: 26.04.2025 దరఖాస్తు చేసుకునే చివరి తేదీ: 18.05.2025 మెరిట్జాబితా ప్రకటన: 20.05.2025 మొదటి కౌన్సెలింగ్: 24.05.2025 రెండో విడత కౌన్సెలింగ్: 30.05.2025 తరగతులు ప్రారంభం: 02.06.2025 -
అదానీని అడ్డుకుందాం
● ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్వేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీ గిరిశిఖరంపై ఉన్న మారిక గిరిజన గ్రామంలో భూములను, కొండను దోచుకునేందుకు వస్తున్న ఆదానీకి చెందిన గుజరాత్ కంపెనీ మారిక రాకుండా అడ్డుకుందామని సీపీఎం నేత, ఏపీ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మారిక గిరిజనులతో కలిసి ఆయన మాట్లాడుతూ మారిక గ్రామ రెవెన్యూలో 35 సర్వే నంబర్లు ఉన్నాయని అందులో 32 సర్వే నంబర్లలో ఉన్న భూములు, ఇళ్లు, బడి, గుడి ఆదాని కంపెనీకి చెందిన హైడ్రో పవర్ప్లాంట్కు అప్పగిస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదానిపై ఉన్న శ్రద్ధ గిరిజనులపై లేకపోవడం బాధాకరమన్నారు. మారిక గిరిజన గ్రామాన్ని ఆదానీ గ్రూప్కు అప్పగించడాన్ని వెనక్కి తీసుకోకపోతే జిల్లాలో ఉన్న గిరిజనులంతా ఏకమై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదానీ గ్రూప్ మారికలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బాబూరావు, ఆనంద్ రామకృష్ణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నిప్పుల వర్షం
● జిల్లాలో తీవ్ర వడగాడ్పులు ● అవస్థలు పడుతున్న జనం సాక్షి, పార్వతీపురం మన్యం: భానుడు నిప్పులు చిమ్ముతున్నాడు. వడగాల్పులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. శుక్రవారం జిల్లాలోని గరుగుబిల్లి, వీరఘట్టం, పాలకొండ, సీతంపేట, సీతానగరం తదితర మండలాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం కూడా బలిజిపేట, గరుగుబిల్లి, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని విపత్తుల శాఖ అంచనా. తొమ్మిది మండలాల్లో వేడి గాలులు, రెండు మండలాల్లో తీవ్ర వేడిగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడ దెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు అవసరమని, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించింది. -
ఉగ్రదాడి క్షమించరానిది
–10లోసమస్యల పరిష్కారానికి కృషి చేయాలిజాతీయ ఉపాధి హామీ అధికారుల తీరుపై జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురంటౌన్: జమ్ముకశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి క్షమించరానిదని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జోగారావు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న భారతదేశంపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య గా అభివర్ణించారు. రానున్న రోజుల్లో ఉగ్రవాదుల కు భారత్ తగిన గుణపాఠం చెబుతుందన్నారు. భారత జాతీయ సమగ్రతను, ఐక్యతను కాపాడు కుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, జెడ్పీటీసీ సభ్యులు అలజంగి రవికుమార్, మామిడి బాబ్జి, బలగ నాగేశ్వరరావు, పార్టీ మండలాధ్యక్షుడు బొంగు చిట్టిరా జు, బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, పార్టీ ఉపాధ్యక్షుడు బలగ శ్రీరాములునాయుడు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచు లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతిచేకూరాలి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ -
అటవీ శాఖ పనులపై విజిలెన్స్ తనిఖీలు
● పరిశీలించిన శ్రీకాకుళం విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు వీరఘట్టం: పాలకొండ అటవీశాఖ రేంజ్ పరిధి లో పదేళ్ల క్రితం అటవీ ప్రాంతాల్లో జరిగిన పనులను శ్రీకాకుళం విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు తన బృందంతో కలిసి గురువారం పరి శీలించారు. ఈ మేరకు వీరఘట్టం మండలంలోని అచ్చెపువలస, చిన్నగోర వద్ద తవ్విన ట్రెంచ్లు, రామాపురం వద్ద మొక్కలు పెంచుతున్న సర్సరీని పరిశీలించారు. అప్పట్లో పాలకొండ రేంజ్లో 20 పనులను సుమారు రూ.1 కోటి నిధులతో చేపట్టారు.ప్రస్తుతం ఆ పనులు ఏవిధంగా ఉన్నయో తనిఖీ చేశారు. తవ్విన ట్రెంచ్లకు కొలతలు వేశారు. అలాగే వన నర్సరీల్లో మొక్కల సంఖ్య సరిగ్గా ఉందో? లేదోనని పరిశీలించారు. ఈ తనిఖీల నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని ఎస్పీ చెప్పారు. తనిఖీ ల్లో విజిలెన్స్ డీఈ సత్యనారాయణ, ఏఈ గణేష్, పాలకొండ అటవీశాఖ రేంజ్ అధికారులు పాల్గొన్నారు. పలువురు సీఐలకు బదిలీ విజయనగరం క్రైమ్: విశాఖపట్నం పోలీస్ రేంజ్ పరిధిలో తొమ్మిది మంది సీఐలకు స్థానచలనం కల్పిస్తూ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా డీఎస్బీ–11 సీఐగా పనిచేస్తున్న ఊయక రమేషన్ను శ్రీకాకుళం జిల్లా బారువ సీపీఎస్కు, అక్కడ పనిచేస్తున్న రమేష్కుమార్ను ఇక్కడకు బదిలీ చేశారు. విశాఖపట్నం రేంజ్లో వీఆర్లో ఉన్న బొడ్డేపల్లి సుధాకర్ను విజయనగరం డీసీఆర్బీ సీఐగా, కె.దుర్గాప్రసాద్ను భోగాపురం సీఐగా బదిలీ చేశారు. మే 10న జాతీయ లోక్అదాలత్ విజయనగరం లీగల్: జిల్లాలో వచ్చేనెల 10వ తేదీన జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్టు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు బబిత పేర్కొన్నారు. కేసు రాజీ వల్ల కక్షిదారులకు వ్యయప్రయాసలు తప్పుతాయన్నారు. మోటార్ వాహన ప్రమాద కేసులు అధిక సంఖ్యలో రాజీ చేయడంలో భాగంగా మోటార్ వాహన సంస్థ ప్రతినిధులు, ఆ సంస్థ స్టాండింగ్ న్యాయవాదులతో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీ పడదగిన కేసులన్నింటినీ పరిష్కరించేందుకు ఇన్సూరెన్స్ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి బీహెచ్వీ లక్ష్మీకుమారి, ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాథమిక రంగంలోనే అభివృద్ధి అవకాశాలు బొబ్బిలి: ప్రాథమిక రంగంలోనే అభివృద్ధి అవకాశాలు ఎక్కువని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నా రు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో విజన్ ప్లాన్పై అవగాహన, నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. జిల్లాలో తలసరి ఆదాయాన్ని 15 శాతం పెంచేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కేవ లం ప్రణాళిక రూపకల్పనే కాకుండా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ, లక్ష్య సాధన ఉండాలన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమి 3 లక్షల ఎకరాల వరకు ఉండగా, సాగు మాత్రం కేవలం లక్ష ఎకరాల్లోనే ఉందన్నారు. మిగిలిన భూమిని దశల వారీగా సాగులోకి తీసుకురావాల ని సూచించారు. ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేయాలని చెప్పారు. గుడ్లు, పాలు, మాంసం ఉత్పత్తిని పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న చెరువుల్లో చేపలు పెంచాలన్నారు. సేవారంగం విస్తరణకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ ని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటైతే ఈ రంగాల్లో అభివృద్ధి మరింత కనిపిస్తుందని చెప్పారు. గ్రామస్థాయి అధికారులంతా తమ సొంత ప్రాంతంగా భావించి ఆ స్థాయిలోనే ప్రణా ళికలు రూపొందించాలన్నారు. దీనికోసం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీపీఓ పి.బాలాజీ, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ వై.వి. రమణ, ఉద్యానవన శాఖ డీడీ ఏవీఎస్వీ జమదగ్ని, ఏపీఎంఐపీ పీ డీ లక్ష్మీనారాయణ, మత్స్యశాఖ ఇన్చార్జి డీడీ విజయకృష్ణ, బొబ్బిలి ప్రత్యేకాధికారి నూకరాజు, ఆర్డీ ఓ జేవీవీఎస్ రామమోహనరావు పాల్గొన్నారు. -
సినిమా ప్రభావమో..దుష్ట వ్యక్తులతో సాంగత్యమో కానీ యువత మత్తు బారిన పడుతున్నారు. పట్టణాల్లో ప్యాషన్గా మారిన మత్తు పదార్థాల వినియోగం క్రమేణా పల్లెలకూ పాకింది. ఈ క్రమంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా యథేచ్ఛగా జిల్లా మీదుగా సాగుతోంది. జిల్లా కేంద్రమైన పార్వతీపుర
● జిల్లా మీదుగా యథేచ్ఛగా గంజాయి తరలింపు ● సరిహద్దులు దాటి తరలివస్తున్న మత్తు పదార్థాలు ● వృథా అయిపోతున్న అధికారుల నిఘా.. నవోదయం కార్యక్రమాలునమోదైన కేసులు.. గంజాయి రవాణాకు సంబంధించి 2023లో 14 కేసులు నమోదు కాగా 205 కేజీలను స్వాధీనం చేసుకుని, 28 మందిని అరెస్టు చేశారు. ఐదు వాహనాలను సీజ్ చేశారు. ●2024లో 39 కేసులు నమోదయ్యాయి. 736 కేజీల గంజాయి లభ్యమైంది. పది వాహనాలను సీజ్ చేశారు. ●అక్రమ మద్యానికి సంబంధించి 2023లో 684 కేసులు నమోదు కాగా.. 794 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 895.56 లీటర్ల మద్యం, 16,268 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. 2024లో 1,043 కేసుల్లో 1,030 మందిని అరెస్టు చేసి 3,399 లీటర్ల మద్యం, 17,603.5 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: ఓ వైపు గంజాయి..మరోవైపు సారాకు జిల్లా సరిహద్దు ప్రాంతం స్థావరంగా మారింది. ఒడిశా నుంచి గంజాయి పెద్ద ఎత్తున అక్రమంగా జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా నవోదయం పేరిట ఎకై ్సజ్ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో.. ముఖ్యంగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్దఎత్తున సారాను, బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్నారు. అక్రమ రవాణాకు ‘రాచమార్గం’ ఒడిశా నుంచి పెద్ద ఎత్తున గంజాయి జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్తోంది. ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ రహదారి తరలింపునకు సులువైన మార్గంగా మారింది. పాచిపెంట మండలం పి.కోనవలస చెక్పోస్టు వద్ద కళ్లుగప్పి, విశాఖ–రాయిపూర్ నూతన హైవే మీదుగా జోరుగా రవాణా చేస్తున్నారు. సాలూరు మీదుగా విశాఖ వరకు అక్రమ రవాణా సాగుతోంది. గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తూ యువతను చైతన్యవంతులను చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అయినప్పటికీ పెద్దగా మార్పు కనిపించడం లేదు. రవాణా, వినియోగం కేసుల్లో ఎక్కువగా యువతే పట్టుబడుతుండడం గమనార్హం. సాలూరు, పార్వతీపురం పట్టణాల్లో విచ్చలవిడిగా గంజాయి లభ్యమవుతోంది. ఒడిశా, అరకు, అనంతగిరి తదితర ప్రాంతాల నుంచి గంజాయి అక్రమంగా తరలివస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల పరిధిలో 42 కేసులు నమోదు కాగా.. 422 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఒక్క పాచిపెంట మండలంలోనే జనవరిలో 670 కిలోలు, ఫిబ్రవరిలో 157 కిలోలు, మార్చిలో 288 కిలోలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. 11 మందిని అరెస్టు చేసి ఆరు వాహనాలను సీజ్ చేశారు. యథేచ్ఛగా సారా తయారీ మరోవైపు సరిహద్దుల్లో సారా విరివిగా తయారవుతోంది. అక్కడి నుంచి ప్యాకెట్ల ద్వారా తరలిపోతోంది. ఇటీవల ఎకై ్సజ్ అధికారులు ఒడిశా సరిహద్దు గ్రామాలైన సందుబడి, తుంబాలిరాయ్, పనుసత్ర గ్రామాల్లో విస్తృత దాడులు చేసి 7,700 లీటర్ల బెల్లం ఊట, 360 లీటర్ల సారాను గుర్తించి ధ్వంసం చేశారు. 3 వేల కిలోల విప్పపువ్వు, 2,400 కేజీల నల్లబెల్లం, 3,900 కేజీల అమోనియాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి, ఎకై ్సజ్ అధికారులు సారా తయారీ కేంద్రాలపై దాడులు పెంచారు. మరింత నిఘా అవసరం.. గంజాయి రవాణా కట్టడికి జిల్లాలో చెక్పోస్టులను పెంచి, నిఘాను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని పాచిపెంట మండలంలో పి.కోనవలస, కొమరాడ మండలం కూనేరు, భామిని మండలం బత్తిలి, గుమ్మలక్ష్మీపురంలలో చెక్పోస్టులు ఉన్నాయి. రవాణా అవుతున్న మార్గాల్లో వాటి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. -
పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకం
విజయనగరం: మహాత్మా గాంధీ కలలు కన్న గ్వామస్వరాజ్య స్థాపన, పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థది కీలకపాత్ర అని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగస్వాములైన అధికారులు గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మూడు గ్రామాల సర్పంచ్లు, ఇద్దరు ఎంపీడీఓలను సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్, జెడ్పీటీసీ సభ్యులు కెల్ల శ్రీనివాసరావు, ఎం.శశికళ, వైస్ ఎంపీపీ, జెడ్పీ ఉద్యోగులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్లో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం -
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్కో ఇన్చార్జి ఏఈ
● వ్యవసాయ బోరు కనెక్షన్ కోసం లంచం డిమాండ్ ● ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు నరసింహరాజు ● రూ.17వేలు లంచం తీసుకుంటుండంగా పట్టుబడిన ఇన్చార్జి ఏఈ జోగినాయుడు ● కేసు నమోదు మక్కువ: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం విద్యుత్ సబ్ స్టేషన్లో ఇన్చార్జి ఏఈగా విధులు నిర్వహిస్తున్న గొర్లె జోగినాయుడు గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. విజయనగరం ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరానికి చెందిన రైతు బి.నరసింహరాజుకు మక్కువ మండలం సరాయివలస గ్రామం వద్ద కొంత భూమి ఉంది. ఆ భూములో వ్యవసాయ బోరుబోవి ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ కనెక్షన్ కోసం గత కొద్ది రోజుల కిందట విద్యుత్ సబ్ స్టేషన్లో దరఖాస్తు చేశారు. బోరుబావికి కనెక్షన్ ఇవ్వాలంటే మూడు విద్యుత్ స్తంభాలు, వైరింగ్, విద్యుత్ తీగలు ఏర్పాటు చేయాల్సి ఉందని, రూ.17వేలు లంచం ఇవ్వాలని ఇన్చార్జి ఏఈ జోగినాయుడు రైతును డిమాండ్ చేశారు. లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని రైతు ఈనెల 22వ తేదీన ఏసీబీ అధికారులను సంప్రదించారు. దీంతో వలపన్నారు. మక్కువ విద్యుత్ సబ్స్టేషన్లో గురువారం సాయంత్రం రైతు నుంచి రూ.17వేలు లంచం తీసుకుంటున్న జోగినాయుడును ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. విశాఖపట్నం ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడిలో విజయనగరం, శ్రీకాకుళం ఏసీబీ సీఐలు మహేష్, భాస్కరరావు, ఎస్ఐ వాసునారాయణ పాల్గొన్నారు. 2023లో మక్కువ విద్యుత్ సబ్స్టేషన్లో ట్రాన్స్కో ఏఈగా విధులు నిర్వహించిన పి.శాంతారావు కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. తరచూ దాడులు జరుగుతున్నా ట్రాన్స్కో అధికారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. -
జిల్లా క్రీడాకారిణులకు చోటేది?
విజయనగరం: పోటీలు జిల్లా స్థాయివి.. పాల్గొనేది మాత్రం పొరుగు జిల్లా క్రీడాకారిణులు. జిల్లా క్రీడాధికారుల తీరుపై జిల్లా క్రీడా సంఘాలు భగ్గుమంటున్నాయి. అధికారుల తీరును దుమ్మెత్తిపోస్తున్నాయి. క్రీడా రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా పథకంలో భాగంగా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అస్మిత సిటీ లీగ్ పోటీలు నిర్వహణకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు విజయనగరంలో బాక్సింగ్ పోటీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పోటీల నిర్వహణకోసం కొంత నగదును కేటాయించారు. ఇందులో భాగంగా స్థానిక విజ్జీ స్టేడియంలో గురువారం బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. వీటిలో జిల్లా స్థాయి క్రీడాకారిణులు మాత్రమే పాల్గొనాలి. అధికారిక సమచారం ప్రకారం ఈ పోటీల్లో 100 మంది క్రీడాకారిణులు పాల్గొనగా... అందులో విజయనగరం జిల్లాకు చెందిన క్రీడాకారిణులు కేవలం 15 మంది మాత్రమే. మిగిలిన 80 మందికి పైగా క్రీడాకారిణిలు విశాఖ జిల్లాలోని ఓ శిక్షణ కేంద్రానికి చెందినవారు కావడం గమనార్హం. స్థానిక అధికారులు శాప్ ఆదేశాలను తుంగలోతొక్కి తూతూ మంత్రంగా పోటీలు నిర్వహించి చేతులుదులుపుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోటీలు నిర్వహించిన జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారుల తీరుపై క్రీడా సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. శాప్ ఆదేశాలను పట్టించుకోని అధికారులు పొరుగు జిల్లా క్రీడాకారిణులతో జిల్లాస్థాయి పోటీలు అస్మిత సిటీలీగ్ బాక్సింగ్ పోటీల నిర్వహణపై విమర్శల వెల్లువ భగ్గుమంటున్న క్రీడా సంఘాలు -
కౌమార దశ పిల్లలకు సన్మార్గం చూపాలి
విజయనగరం ఫోర్ట్: కౌమారదశ పిల్లల్లో మానసిక, శారీరక ఆలోచనలు విభిన్నంగా ఉంటాయని, తల్లిదండ్రులు, సంరక్షకులు వారితో మేమేకమై సన్మార్గం చూపాలని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆర్జేడీ చిన్మయిదేవి పిలుపునిచ్చారు. స్థానిక కన్వెన్షన్ సెంటర్లో సీడీపీఓలకు గురువారం నిర్వహించిన వర్క్షాపును ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించా రు. అనంతరం ఆమె మాట్లాడుతూ కిశోర బాలికల అలోచనలు ప్రమాదకర పరిస్థితుల నుంచి దూరం చేయాలన్నారు. బాల, బాలికలను డిజిటల్ మాధ్యమాలు ప్రభావితం చేస్తున్నాయని, కౌమారదశలో ఉన్న బాలబాలికలతో చర్చించి వారి అవసరాలు తీర్చాలని తెలిపారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, లేదంటే డిజిటల్ మాధ్యమాల ప్రభావంతో చెడుదారిన పడే ప్రమాదం ఉందన్నారు. గత 7, 8 సంవత్సరాలుగా జరుగుతున్న అధ్యయనాల్లో కౌమారదశలో ఉన్న పిల్లలు మద్యం, గంజాయి వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నట్టు తేలిందన్నారు. జిల్లాలో ఉన్న సఖి, యువ గ్రూప్ పరిధిలో కిశోర బాలబాలికలు, వారి తల్లిదండ్రులకు ఫోక్సో చట్టం గురించి వివరించాలని చెప్పారు. బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ నిరోధించాలన్నారు. సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించాలన్నారు. పిల్లల్లో వివిధ వృత్తివిద్యాకోర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రుక్సానా సుల్తానా బేగం, పార్వతీపురం మన్యం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కనకదుర్గ, జిల్లా నోడల్ ఆఫీసర్ టి.జగన్, తదితరులు పాల్గొన్నారు. సెల్ఫోన్లకు పిల్లలను దూరం చేయాలి సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆర్జేడీ చిన్మయిదేవి -
ఎస్టీ నకిలీ సర్టిఫికెట్ల వ్వవస్థను అరికట్టాలి
● కమిషన్ చైర్మన్కు ఆదివాసీ జేఏసీ వినతి విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్రలో ఉన్న నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల వ్యవస్థను అరికట్టాలని ఆదివాసీ జాయింట్ ఏక్షన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభ్యులు గురువారం ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావును ఆయన కాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. షెడ్యూల్ ప్రాంత భూములపై హక్కులు గిరిజనులకే దక్కేలా చూడాలని, ఇతర దీర్ఘకాల సమస్యలపై ప్రభుత్వ స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్టీల అభ్యున్నతికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కమిషన్ చైర్మన్ను కలిసిన వారిలో జేఏసీ నాయకులు నిమ్మక జయరాజు, ఆరిక నీలకంఠం, అమర్నాథ్ తదితరులు ఉన్నారు. మద్యం విక్రయదారు అరెస్ట్మెరకముడిదాం: మండలంలోని ఎం.రావివలస గ్రామంలో అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వుణ్నా కిరణ్కుమార్ అనే వ్యక్తిని బుదరాయవలస ఎస్సై జె.లోకేష్కుమార్ అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం పక్కా సమాచారంతో ఎస్సై జె.లోకేష్కుమార్ సిబ్బందితో కలిసి వెళ్లి ఎం.రావివలస గ్రామంలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్న వుణ్నా కిరణ్కుమార్ ఇంటిపై దాడులు నిర్వహించగా ఇంట్లో 10 మద్యం బాటిల్స్ దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. కిరణ్కుమార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురం: ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏపీ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆంగ్లమాధ్యమంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఓ మురళీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీటీడబ్ల్యూఆర్జేసీ పి.కోనవలస, కురుపాం, భద్రగిరి, ఏపీటీడబ్ల్యూఆర్జేసీ (బాలికలు), భద్రగిరిలో ఎంపీసీ–40, బైపీసీ–40, హెచ్ఈసీ–40 సీట్లు చొప్పున ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మే 7వ తేదీలోగా హెచ్టీటీపీఎస్:టీడబ్ల్యూఆర్ఈఐఎస్ సెట్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సమీపంలో గల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ను సంప్రదించాలన్నారు. పత్తి మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నంపార్వతీపురం టౌన్: పట్టణంలోన వైకేఎం కాలనీకి చెందిన ఓ వ్యక్తి పత్తి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వైకేఎం కాలనీకి చెందిన వెలగాల శ్రీనివాసరెడ్డి అప్పులు చేసి ఎప్పటికప్పుడు తాగుతుండడంతో భార్య సావిత్రి మందలిస్తూ ఉండేది. బుధవారం రాత్రి కూడా తాగి ఇంటికి రావడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపం చెంది గురువారం తెల్లవారు జామున పత్తి మందు తాగేశాడు. కొత్తసమయం తరువాత వాంతులు చేసుకోవడంతో పత్తిమందు వాసన రాగా భార్య సావిత్రి గమనించి 108 ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తీసుకొ రావడంతో వైద్యులు చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం స్థానిక కర్షక మహర్షి ఆస్పత్రికి తరలించారు. నేడు ఏపీఆర్జేసీ గురుకుల ప్రవేశ పరీక్షవిజయనగరం అర్బన్: ఏపీఆర్జేసీ, ఏపీఆర్ఈఐ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు డీఆర్ఓ శ్రీనివాస్ మూర్తి తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులతో గురువారం ఆయన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీఆర్ఈఐ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతులలో ప్రవేశం కోసం ఈ నెల 25న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జిల్లాలోని 6 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష కోసం 1,287 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీల్లో ప్రవేశం కోసం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీఆర్జేసీ కోసం 10 కేంద్రాల్లో 2104 మంది అభ్యర్ధులు, ఏపీఆర్డీసీ కోసం 77 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారన్నారు. సమావేశంలో డీఈఓ యూ.మాణిక్యం నాయుడు, పరీక్షల సహాయ కమిషనర్ టి.సన్యాసిరాజు, ఏపీఆర్ఐఈ జిల్లా కోఆర్డినేటర్ శంబాన రూపవతి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సీతానగరం: మండలంలోని జాతీయరహదారిలో లచ్చయ్యపేట సుగర్ ఫ్యాక్టరీ సమీపంలో గురువారం స్కూటీని వెనుక నుంచి వస్తున్న బొలెరో వ్యాన్ ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.బొబ్బిలి పట్టణానికి చెందిన పట్నాయకుని అనిల్కుమార్, భార్య శ్రీదేవి స్కూటీపై సీతానగరంలోని లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ముడుపుల పూజకు వస్తున్నారు. లచ్చయ్యపేట వచ్చే సమయానికి వెనుకనుంచి వస్తున్న బొలెరో వాహనం స్కూటీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై పడిపోవడంతో శ్రీదేవి తలకు బలమైన గాయం కాగా ఇద్దరినీ 108 వాహనంలో చికిత్స నిమిత్తం బొబ్బిలి సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో శ్రీదేవి మృతి చెందింది. ఈ మేరకు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. బైక్ను ఢీ కొట్టిన బొలెరో: వ్యక్తికి గాయాలు మండలంలోని జాతీయరహదారిపై లచ్చయ్యపేట– కింతలివానిపేట గ్రామాల మధ్య ఉన్న హనుమాన్ గుడివద్ద మోటార్ సైకిల్ను ఎదురుగా వస్తున్న బొలెరో ఢీకొట్టడంతో ఒకరికి గాయాలయ్యాయి. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలికి చెందిన ఆదిమూలం కిరణ్కుమార్ బొబ్బిలి నుంచి పార్వతీపురం బైక్పై వస్తున్న సమయంలో పార్వతీపురం నుంచి బొబ్బిలి వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టడంతో బైక్పై వస్తున్న కిరణ్ కుమార్ రోడ్డుపై పడిపోగా బలమైన గాయాలయ్యాయి. దీంతో బాధితుడిని బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. క్షతగాత్రుడి తండ్రి కృష్ణారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.రాజేష్ తెలియజేశారు. చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతిచీపురుపల్లి రూరల్: గరివిడి మండలంలోని శివరాం గ్రామానికి చెందిన కోరాడ రామస్వామి(51) అనే వ్యక్తి కొబ్బరిచెట్టు నుంచి కిందికి పడి మృతిచెందాడు.ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల మేరకు రామస్వామి కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ కొబ్బరి బొండాల కోసం చెట్లు ఎక్కి తీసుకువచ్చి వ్యాపారం చేస్తుంటాడు. ఎప్పటిలాగానే గురువారం ఉదయం కూడా చీపురుపల్లి మండలంలోని ఆర్ధివలస గ్రామంలో కొబ్బరి బొండాల కోసం చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో బొండాలు తీస్తుండగా కత్తి కాలుకు తగలడంతో చెట్టు నుంచి కిందికి జారి పడిపోయాడు. గాయాలతో ఉన్న రామస్వామిని హాస్పటల్కు తీసుకువెళ్లేందకు సమయాత్తమవుతుండగా మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై ఎల్.దామోదరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైక్లు ఢీకొని యువకుడు..రాజాం సిటీ: స్థానిక బొబ్బిలి రోడ్డులోని ఫైర్స్టేషన్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు బొబ్బిలి పట్టణంలోని సంగవీధికి చెందిన పిట్ట రమేష్ (30) ప్రయా ణిస్తున్న బైక్ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో రాజాం నుంచి వస్తున్న బైక్ను అదుపుచేసుకోలేక ఢీకొనడంతో రమేష్ రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయాలైన రమేష్ను స్థానికుల సహాయంతో రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందదించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వైద్యులు శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదిలా ఉండగా మరో వాహనదారుడికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సీఐ అశోక్కుమార్ వద్ద ప్రస్తావించగా ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. స్కూటీని ఢీకొట్టిన వ్యాన్ -
మలేరియా పట్ల అప్రమత్తం
నివారణ చర్యలు ● గతంలో గిరిజన ప్రాంతంలో ఎక్కువగా వ్యాధి వ్యాప్తి ● ప్రస్తుతం మైదాన ప్రాంతంలోనూ అధికంగా కేసుల నమోదు ● సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాల మీదికి ● నేడు ప్రపంచ మలేరియా నివారణ దినంవిజయనగరం ఫోర్ట్: మలేరియా పేరు వినగానే మన్యప్రాంత ప్రజలు వణికిపోతారు. మలేరియా బారిన పడి ఎంతోమంది ఇబ్బంది పడేవారు. మరికొంతమంది వ్యాధితో పోరాటం చేయ లేక మృత్యువాత పడేవారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతంలోనూ మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లాలో మలేరియా కేసులు కొంతకాలంగా పెరుగుతున్నాయి. మలేరియా వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు మీదికి వచ్చే ప్రమాదం ఉంది. అనాఫిలిస్ దోమ కుట్టడంతో వ్యాధి వ్యాప్తి మలేరియా వ్యాధి ప్లాస్మోడియం అనే ఏకకణ పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ పరాన్న జీవులు ఆడ అనాఫిలిస్ దోమకాటు వల్ల మనిషి నుంచి మరో మనిషికి వ్యాపిస్టుంది. మలేరియా వచ్చినతర్వాత చికిత్స పొందేకంటే దోమతెరలు వాడి దోమకాటును నివారించి, మలేరియా రాకుండా చేసుకోవడం ఉత్తమం. మలేరియాలో రెండు రకాలు మలేరియా వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. అవి వైవాక్స్ మలేరియా, పాల్సి ఫారమ్ మలేరియా. వ్యాధి లక్షణాలు: తీవ్రమైన చలి జ్వరం, రోజువిడిచి రోజు జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, మలేరియా లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికి 800 నుంచి 1000 వరకు కేసులు మలేరియా కేసులు ఏడాదికి 800 నుంచి 1000 వరకు నమోదవుతున్నాయి. 2023–24లో 439 మలేరియా కేసులు నమోదయ్యాయి. 2024–25లో 805 కేసులు నమోదయ్యాయి. 2025 –26లో ఇప్పటివరకు 157 కేసులు నమోదయ్యాయి.మలేరియా సోకిన పిల్లలు, గర్భిణులకు చికిత్స చేయించడంలో జాప్యం చేయకూడదు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకమవుతుంది. మలేరియా వ్యాధి నిర్ధారణ అయిన గర్భిణులు 3 వనెల నుంచి ప్రసవించే వరకు వారానికి రెండు క్లోరోక్విన్ మాత్రలు వాడడం ద్వారా మలేరియా వ్యాధిని నివారించవచ్చు. సింథటిక్ ఫైరిడ్రాయిడ్ క్రిమిసంహారక మందును ఇంటి లోపల అన్ని గదులలోను పైకప్పు లోపలి భాగంలో పిచికారీ చేసి తుడవడం గాని, గోడలను అలకడం గాని చేయకుండా చూడాలి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి సాయంత్రం వేళ వేపాకు పొగ రూపంలో దోమలను పారదోలవచ్చు జ్వరం వచ్చిన వారందరూ ఉచితంగా రక్త పరిక్ష చేయించుకుని ఒక రోజు క్లోరోక్విన్ మాత్రలు వేసుకోవాలి నీరు నిల్వ ఉండే గోలాలు, ఎయిర్ కూలర్లు, వారానికి ఒకసారి ఖాళీ చేసి బాగా తడి ఆరిన పిమ్మటనే మళ్లీ నీరు పెట్టాలి. వీధి కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రవహించేలా చూడాలి బావుల్లోను, పూడ్చ లేని కందకాలలోను దోమ లార్వాలను తినే గంబూషియా చేపపిల్లలను విడిచిపెట్టి దోమలు పెరగకుండా చేయవచ్చు. ప్రతి ఇంట్లోను దోమల మందు పిచికారీ చేయించుకోవాలి. దోమతెరలు వాడితే మంచిది. -
అన్నింటిలోనూ టాపరే..
ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కొండక వీర్రాజు స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో గల నడిపల్లి గ్రామం. కుటుంబ సభ్యులతో చిన్నతనం నుంచి విజయవాడ వలస వెళ్లి అక్కడే ఉండేవాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాడు. పదిలో పదికి పది, ఇంటర్లో 965 మార్కులు, డిగ్రీ రెండేళ్లలోనూ 90శాతం మార్కులు సాధించాడు. డిగ్రీ చివరి ఏడాదిలో బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు అప్పు చేసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో అన్నదమ్ములు నాలుగు నెలలు క్రితం స్వగ్రా మం నడిపిల్లి పంపించేశారు. తదుపరి నడిపిల్లి వచ్చిన అతను పైడిభీమవరంలోని ఒక హోటల్లో సర్వర్గా పనిలో జాయినయ్యాడు. అంత తెలివైన విద్యార్థి బెట్టింగ్ మానుకోలేక ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు. -
బాలికను కాపాడిన కానిస్టేబుల్
● ప్రశంసాపత్రం అందజేసిన ఎస్పీ విజయనగరం క్రైమ్: నగరంలో ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిన ఓ బాలికను టూటౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ ఆర్.జగదీష్ కాపాడినందుకు ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తన చాంబర్లో ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. డయల్ 112కు వచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్సార్ నగర్లోని ఓ ఆపార్టెమెంట్లో 17 ఏళ్ల బాలిక తలుపులేసుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్న సమాచారాన్ని కానిస్టేబుల్ జగదీష్ అందుకున్నారు.సీఐ శ్రీనివాస్ ఆదేశాలతో ఆ అడ్రస్కు వెళ్లి సదరు బాలికను ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడారు. విచారణలో బాలిక చదువును నిర్లక్ష్యం చేయడం, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నందున తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తేలింది. ఎస్పీ ఆదేశాలతో టూటౌన్ సీఐ శ్రీనివాస్ బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించారు.పాచిపెంటలో ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటనపాచిపెంట: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు పాచిపెంట మండలంలో బుధవారం పర్యటించారు. మండలంలోని పెద్దగెడ్డ నిర్వాసితుల సమస్య పరిష్కరించాలని కొటికిపెంట సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. అలాగే పెద్దగెడ్డ జలాశయం గిరిజన మత్స్యకారులకు లైఫ్ జాకెట్స్, వలలు, పడవలు ప్రభుత్వం నుంచి ఉచితంగా అందజేయాలని కోరారు. కుడుమూరు రెవెన్యూ సర్వేనంబర్ 48లో గిరిజనులు సాగుచేస్తున్న సుమారు ఎనిమిది వందల ఎకరాల భూమికి సంబంధించి గిరిజన రైతులకు పట్టాలు అందించాలని, గిరిజన రైతు సూకురు అప్పలస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంట స్థానిక తహసీల్దార్ డి.రవి, ఆర్ఐ రమణ ఉన్నారు.మహిళపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్జియ్యమ్మవలస: మహిళను బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడిన చినమేరంగి గ్రామానికి చెందిన సిరిపురపు నానిని చినమేరంగి ఎస్సై పి.అనీష్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు చినమేరంగి సీఐ టీవీ తిరుపతిరావు మాట్లాడుతూ గ్రామానికి చెందిన వివాహితను బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన సిరిపురపు నానిపై బాధితురాలు, ఆమె భర్త ఇటీవల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించి నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి కోర్డుముందు హాజరు పర్చామని తెలిపారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని సీఐ చెప్పారు. మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన, లైంగికదాడులకు పాల్ప డితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోక్సో కేసులో ముద్దాయికి పదేళ్ల జైలు శిక్షజియ్యమ్మవలస: మండలంలోని కన్నపుదొరవలస గ్రామానికి చెందిన సామల నవీన్ అనే వ్యక్తికి పోక్సోకేసులో పదేళ్ల జైలు శిక్ష పడిందని ఎస్సై అనీష్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముద్దాయి సామల నవీన్(26)పై 25.3.2021లో చినమేరంగి పోలీస్స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి కోర్టు విజయనగరం వాదోపవాదనల తరువాత నేరారోపణ రుజువు కావడంతో పదేళ్ల కారాగార శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నాగమణి బుధవారం తీర్పు వెల్లడించారు. ముద్దాయికి శిక్ష పడేవిధంగా దర్యాప్తు నిర్వహించిన సీఐ తిరుపతిరావు, ఎస్సై బి.శివప్రసాద్, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచిన ఎస్సై అనీష్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ మాధవరెడ్డి అభినందించారు. -
160లీటర్ల సారాతో వ్యక్తి అరెస్టు
పార్వతీపురంటౌన్: 160లీటర్ల సీరా కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై రాజశ్రీ తెలిపారు. ఈ మేరకు బుధవారం కృష్ణపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఆపి తనిఖీ చేయగా 160 లీటర్ల సారా దొరకడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి బైక్ సీజ్ చేసి కేసు నమెదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో హెచ్సీ నుదర్శన్, సిబ్బంది పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో పారిశుధ్య కార్మికుడి మృతి
భామిని: మండలంలోని తాలాడకు చెందిన పారిశుధ్య కార్మికుడు గొర్లె భీముడు(52) బుధవారం సీతంపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ మృత్యువాత పడ్డాడని బత్తిలి ఎస్సై డి.అనిల్కుమార్ తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ మంగళవారం రాత్రి గ్రామంలో జరిగిన తగాదాలో గాయపడి అపస్మారకస్థితిలో పడి ఉన్న గోర్లె భీముడు(52)ను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన భార్య రోదిస్తూ తెలిపిందని చెప్పారు. ఈ సంఘటనపై పాలకొండ సీఐ చంద్రమౌళి తాలాడ గ్రామాన్ని సందర్శించి సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్టీమ్కు వివరాలు అందివ్వాలని గ్రామస్తులను సూచించారు. గొర్లె బీముడు(52)మృతిపై భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పాలకొండ ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించినట్లు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు. -
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సహకరించండి
పార్వతీపురంటౌన్: జిల్లాలో అవసరమైన చోట్ల నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులను కోరారు. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో భాగంగా బీఎల్ఓలకు సంపూర్ణ సహకారం అందించాలని, బూత్స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం సూచించిన ప్రొఫార్మాలో ఏజెంట్ల నియామకానికి సంబంధించి వివరాలు పంపాలని ఆమె కోరారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఓటర్ల జాబితా స్వచ్చీకరణపై జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన చాంబర్లో బుధవారం డీఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 800–1200 మంది ఓటర్ల ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి విభజించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో ఓటర్లకు 2 కి.మీ లోపల పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో ఓటర్లకు అనువుగా ఉండే ప్రాంతాలను గుర్తించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆమె కోరారు. అదేవిధంగా ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో భాగంగా మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి వివరాలను అందజేస్తూ బీఎల్ఓలకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీఎల్ఎలను నియమించుకోవాలి రాజకీయ పక్షాల ప్రతినిధులను కోరిన డీఆర్ఓ -
రైల్వే ప్లాట్ఫాంపై గుర్తు తెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్లో గుర్తుతెలియని 45 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు బుధవారం కనుగొన్నారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ సిబ్బంది ఇచ్చిన వివరాల మేరకు విజయనగరం రైల్వేస్టేషన్లోని 4వ నంబర్ ఫ్లాట్ఫాం వద్ద నాలుగో రైల్వేలైన్ వద్ద సుమారు 5.6 అడుగుల మృతదేహం పడి ఉంది. చామనఛాయ రంగు, లేత నీలిరంగు దుస్తులు ధరించి ఆ వ్యక్తిని ఎవ్వరూ గుర్తించకపోవడంతో తామే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ అశోక్ తెలిపారు. మృతదేహం ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9490617089,6301365605 నంబర్లు, ల్యాండ్ లైన్ నంబర్ 0891–2883218 నంబర్కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. -
విద్యార్థి ఆత్మహత్య
రామభద్రపురం: చైన్నె వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటూ చదివిస్తున్న తల్లిదండ్రులకు ఓ బాలుడు తీరని శోకం మిగిల్చాడు. పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో రిజల్ట్స్’ రాకముందుగానే ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. రామభద్రపురం మండలంలోని కొట్టక్కిలో మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కొట్టక్కి గ్రామానికి చెందిన కర్రి దుర్గాప్రసాద్(15) తల్లిదండ్రులు పార్వతి, పార్వతీశం చైన్నె వలస వెళ్లడంతో కొట్టక్కిలోని అమ్మమ్మ పెంటమ్మ వద్ద ఉంటూ అక్కడే ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు రాశాడు. అయితే ఆ పరీక్ష ఫలితాలు 23న విడుదల కానున్నాయని ప్రకటన వెలువడడంతో ఫెయిలవుతానని భయంతో ఉరివేసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే సాలూరు సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. విద్యార్థి అనుమానించినట్లుగానే పదవ తరగతి పరీక్షల్లో ఫెయిలయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. అమ్మమ్మ పెంటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. పదవ తరగతిలో ఫెయిలవుతానని భయం -
వైభవంగా కోదండ రామస్వామి వార్షిక కల్యాణం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని నీలాచలం పర్వతంపై ఉన్న కోదండ రామాలయంలో శ్రీ కోదండ రాముడి వార్షిక కల్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. బహుళ దశమిని పురస్కరించుకుని ఏటా కొండపై ఆలయంలో కోదండుడి కల్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో స్వామికి వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత స్వామివారి ఉత్సవ మూర్తులను ఆస్థాన మంటపంలో వేంచేపు చేసి కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఏఓబీలో ఎకై ్సజ్ దాడులు
పార్వతీపురంటౌన్: ఒడిశా సరిహద్దు గ్రామాలైన సందుబడి, తుంబాలిభాయ్, పనుసత్ర గ్రామాల్లో విస్తృతంగా దాడులు జరిపి 7,700 లీటర్ల బెల్లపు ఊట, 360 లీటర్ల సారాను గుర్తించి ధ్వంసం చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ బి.శ్రీనాథుడు తెలిపారు. అలాగే 3వేల కేజీల విప్పపువ్వు, 2,400 కిలోల నల్ల బెల్లం, 3,900 కిలోల అమోనియం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎకై ్సజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రాహుల్ దేశ్ శర్మ ఆదేశాల మేరకు పార్వతీపురం జిల్లా ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో విజయనగరం–ఒడిశా రాష్ట్ర ఎకై ్సజ్ సిబ్బంది, కురుపాం, జీఎల్పురం పోలీస్ సిబ్బంది సహకారంతో విస్త్తృత దాడులు జరిపినట్లు తెలిపారు. బెల్లం ఊట, సారా, విప్పపువ్వు, నల్ల బెల్లం, అమోనియం స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు వ్యక్తులపై రెండు కేసులను నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. డ్రోన్ కెమెరాను ఉపయోగించి సారా తయారీ కేంద్రాలను గుర్తించి, దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో కురుపాం, సీతానగరం, సాలూరు, విజయనగరం, ఈఎస్టీఎఫ్ సాలూరు మొబైల్ పార్టీ, పార్వతీపురం మన్యం అధికారులు, సిబ్బంది, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బెల్లపు ఊట, సారా ధ్వంసం విప్పపువ్వు, నల్లబెల్లం, అమోనియ స్వాధీనం ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ -
జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న ‘తోషిని’
తెర్లాం: రాష్ట్రస్థాయిలో జరుగుతున్న దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 పోటీల్లో తెర్లాం హైస్కూల్కు చెందిన 8వ తరగతి విద్యార్థిని అడ్డా తోషిని ‘బోసి గేమ్’ వ్యక్తిగత హయ్యర్ ఎబిలిటీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ను కై వసం చేసుకోడంతోపాటు, దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 21–23వరకు నూజివీడులోని అగిరిపల్లి హిల్ పారడైజ్ స్కూల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ రాష్ట్ర స్పెషల్ ఒలింపిక్స్ భారత్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెర్లాం హైస్కూల్ నుంచి రాష్ట్రస్థాయి బోసి గేమ్ పోటీలకు హాజరైన తోషిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. అలాగే జూలై నెలలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపికై ంది. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచిన ఆమె సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకుంది. ఈ సందర్భంగా తోషినిని రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు, జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, తెర్లాం హైస్కూల్ హెచ్ఎం రమేష్, ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్, ఎస్కార్ట్ సునీల్ అభినందించారు. బ్యాడ్మింటన్లో కాంస్యపతకం దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 రాష్ట్రస్థాయి పోటీల్లో తెర్లాం హైస్కూల్కు చెందిన 10వ తరగతి విద్యార్థి కొప్పర విజయకుమార్ బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్రస్థాయిలో తృతీయస్థానాన్ని సాధించి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నాడు. విజయకుమార్కు రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ సంచాలకుడు శ్రీనివాసరావు పతకాన్ని అందజేసి అభినందించారు. రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని -
అప్రోచ్ రోడ్డు రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
పూసపాటిరేగ: విమానాశ్రయానికి వెళ్లే రహదారిలోని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు విమానాశ్రయానికి సంబంధించిన వివిధ సమస్యలపై అప్రోచ్ రోడ్లో గుడెపువలస, రావివలస అమటాం, సవరవిల్లి, దల్లిపేట,బైరెడ్డి పాలెం గ్రామాలకు చెందిన రహదారిలో బుధవారం ఆయన పర్యటించారు. ప్రధాన సమస్య అయిన విమానాశ్రయానికి వెళ్లే అప్రోచ్ రోడ్డులో పొలాల్లోకి రహదారి సౌకర్యం కల్పించాలని రైతులు, నాయకులు కోరారు. అప్రోచ్ రోడ్డుకు ఇరువైపులా భూమి ఎంత ఉందో కొలతలు వేయాలని అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే అప్రోచ్ రోడ్డు రహదారికి భూములు ఇచ్చినప్పటికీ కోర్టు వివాదంలో పరిహారం అందలేదని నాయకులు మట్ట అయ్యప్ప రెడ్డి, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, యర్ర అప్పల నారాయణ తదితరులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కూడా అధికారులతో మాట్లాడి పరిహారం వచ్చేలా చూస్తానని కలెక్టర్ చెప్పారు. గతంలో విమానాశ్రయ ఆర్అండ్ఆర్ కాలనీలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ 22ఏ లో ఉండడంతో బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. ప్రతిపాదనలు పంపండి అలాగే అప్రోచ్ రోడ్డు నుంచి అమకాం గ్రామానికి వెళ్లేందుకు రహదారి కావాలని ఆ గ్రామ నాయకులు కోరడంతో సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెంపాడపేట శ్మశాన వాటిక సమస్య ఆయన దృష్టికి రావడంతో స్థలాన్ని ఖరారు చేసి పంపితే అనుమతులు ఇస్తానని చెప్పారు. అమటాం రావివలస వద్ద అండర్ పాత్ కావాలని గ్రామస్తులు కోరగా అందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు. విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఎయిర్పోర్ట్ ప్రతినిధులు రామరాజు, సర్పంచ్ ఉప్పాడ విజయభాస్కర్ రెడ్డి, నాయకులు సూర్యనారాయణ మూర్తి రాజు, కోరాడ తాతారావు, కొత్తయ్య రెడ్డి, కొల్లి రామ్మూర్తి, రైతులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
కొత్తవలస: విజయనగరాన్ని సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఎకై ్సజ్ శాఖ సహాయ కమిషనర్ పైడి రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు కొత్తవలస మండల కేంద్రంలో గల ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను, నమోదవుతున్న కేసుల వివరాలను పరిశీలించి తగు సూచనలు సలహాలను అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవోదయం–2.0 కార్యక్రమాన్ని వచ్చేనెల 3వ వారంలోగా పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు.స్టేషన్ పరిధిలో గల వేపాడ, కొత్తవలస, లక్కవరపుకోట మండలా పరిధిలోని గ్రామాలను సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో బెల్లం అమ్మకాలు చేస్తున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. బెల్లం వ్యాపారస్తులు ప్రతి 15 రోజులకు ఒక పర్యాయం బెల్లం అమ్మకాలకు సంబంధించిన నివేదికలను స్థానిక పోలీస్స్టేషన్లో సమర్పించాలని స్పష్టం చేశారు. సిబ్బంది సారా తయారీ దారులతో కుమ్మకై నట్లు రుజువైతే వేటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ జీఎస్.రాజశేఖరనాయుడు, ఎస్సైలు వీఎన్.రాజు, ఎన్.రమశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు -
మొబైల్ ట్రాకింగ్ సేవలు సులభతరం
విజయనగరం క్రైమ్: గడిచిన ఆరునెలల్లో పోయిన మొబైల్ ఫోన్లను ఫిర్యాదుదారులకు ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పోలీస్కాన్ఫరెన్స్ హాలులో అందజేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.ఆరుకోట్ల విలువైన 3,300 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ మేరకు డీపీఓలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పోయిన మొబైల్ ఫోన్ కోసం ఫిర్యాదుకు ప్రత్యేకించి జిల్లా కేంద్రానికి రావనసరం లేదన్నారు. సైబర్సెల్ పోలీస్స్టేషన్కు కూడా వచ్చి ఫిర్యాదు చేయనవసరం లేదన్నారు. పోయిన సెల్ఫోన్లపై 8977945606 వాట్సాప్ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని, ముందుగా హాయ్ అని మెసేజ్ చేస్తే మా శాఖే ఓ యూఆర్ఎల్ను పంపుతుందని అందులో ఫిర్యాదు దారు వివరాలు, ఫోన్ నంబర్ ఐఎంఈఐ నంబర్ను ఎంటర్ చేస్తే మొబైల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఫోన్ ట్రేస్ అవుట్ చేస్తామని ఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా 264 ఫోన్లను మొబైల్ట్రాకింగ్ విధానం ద్వారా ట్రేసవుట్ చేశామని తెలిపారు. ఫిర్యాదుదారులు సైబర్సెల్ పోలీస్స్టేషన్కు వచ్చి ఐఎంఐఈ నంబర్ చెప్పి ఫోన్ పొందవచ్చని చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, నగర డీఎస్పీ శ్రీనివాస్, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ లీలారావు, సైబర్ సెల్ ఎస్సై నజీమాబేగం, సైబర్ సెల్ సిబ్బంది వాసుదేవ్, తిరుపతి నాయుడు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి రాకుండా ఫిర్యాదు ప్రత్యేకించి వాట్సాప్ నంబర్ విడుదల -
పుట్టుకలో.. మార్కుల్లో ట్విన్స్
బలిజిపేట: మండలంలోని వంతరాం గ్రామానికి చెందిన బెవర శరణ్ కార్తికేయ, బెవర సింధు శరణ్య కవల పిల్లలు. ఇద్దరి ఆలోచనలు, అభిరుచు లు ఒకేలా ఉంటాయి. చదువులోనూ ట్విన్స్గానే సాగుతున్నారు. అన్నాచెల్లి ఇద్దరూ వంతరాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుని మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదోతరగతి ఫలితా ల్లో ఇద్దరికీ 582 మార్కుల చొప్పున వచ్చాయి. ఒకేలా మార్కులు రావడం ఆందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకే రీతిన రాణిస్తున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు ఉమ(బాడంగి కేజీబీవీ టీచర్), రాము (న్యాయవాది) మురిసిపోతున్నారు. ఇద్దరికీ హెచ్ఎం చిన్నికృష్ణ, ఉపాధ్యాయులు స్వీట్లు తినిపించి అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరు కోవాలని ఆకాంక్షించారు. -
పహల్గాం దాడి పిరికిపంద చర్య
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ● సజావుగా స్థాయీ సంఘ సమావేశాలు విజయనగరం రూరల్: జమ్ముకశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రదాడి పిరికిపంద చర్య అని, ఈ దాడిని భారతీ యులంతా ఖండిస్తున్నారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. కాల్పులకు ప్రతిచర్యగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ప్రధాని మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ఎల్లవేళలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన బుధవారం స్థాయీసంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని సన్నద్ధంగా ఉండాలన్నారు. రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. విత్తనాలు తప్పుదారిన దళారుల చేతికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు సక్రమంగా పనిచేయాలని సూచించారు. కేజీబీవీ విద్యాలయాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఆయన మాట్లాడుతూ ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, జిల్లా పరిషత్ నుంచి తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పరీక్ష తప్పిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వ్యక్తిగతంగా వాళ్లకు సహాయం అందించాలని సూచించారు. అనంతరం పహల్గాం దాడిని ఖండిస్తూ, ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని కోరారు. ఈ ఘటనను ఖండిస్తూ జిల్లా పరిషత్లో తీర్మానం చేశారు. -
ఫలితం పదిలం
హ్యాట్రిక్ విజయం.. 2024–25 విద్యాసంవత్సరంలో జిల్లాలో మొత్తం 10,286 మంది పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా.. ఇందులో 9,659 మంది ఉత్తీర్ణత సాధించారు. 627 మంది తప్పారు. మొత్తంగా బాలురు 4,617 (92.1శాతం), బాలికలు 5,042(95.55 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సాలూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని పెద్దపూడి తేజస్వి 592/600 మార్కులతో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. పార్వతీపురంలోని టీఆర్ఎం ఎంపీల్(జి) హెచ్ఎస్ విద్యార్థి తుంబలి చికీర్ష 591, కురుపాం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి మర్రాపు రిషిత 591, భామిని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి గౌడు జగదీష్ 590 మార్కులు సాధించారు. మరో నలుగురు విద్యార్థులు 588 మార్కులు, మరో నలుగురు 587 మార్కులు సాధించారు. వీరంతా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కావడం గమనార్హం. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లోనూ పార్వతీపురం జిల్లాలకు చెందిన శంబంగి అనూష (596), ఎల్.జాహ్నవి (596), వి.సాయిభువనకృతి (594), పి.దేదీప్య(593), ఎం.నితన్య(593), తెంటు జాహ్నవి(592) మార్కులు సాధించారు.సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురంటౌన్: వెనుకబడిన జిల్లా.. ఎటుచూసినా కొండ కోనలే. మారుమూల పల్లెలు.. మట్టి మనుషులు. అరకొర వసతులు.. కష్టాల ‘నావ’లను దాటుకుంటూ, రాళ్లనే ‘దారులు’గా మలుచుకుంటూ సాగే ప్రయాణాలు.. అసౌకర్యాల నడుమే బడులు.. చెట్ల కింద చదువులు.. ఇటువంటి ప్రాంతం నుంచి విద్యారంగంలో అద్భుతాలు ఆశించగలమా..! అలాంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మన పిల్లలు. తమ విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పదో తరగతి ఫలితాల్లో మరోసారి ‘టాప్’ లేపుతూ హ్యాట్రిక్ కొట్టారు. మన్యం బిడ్డల విజయం ఎలా ఉందంటే.. వర్షం కురిసేటప్పుడు మట్టి నుంచి వెదజల్లే పరిమళమంత హాయిగా అనిపిస్తోంది! మన మన్యం పిల్లలు అద్భుతమే సృష్టించారు. వరుసగా మూడో ఏడాది పదో తరగతి ఫలితాల్లో అగ్రస్థానాన్ని కొట్టేశారు. సగర్వంగా నిలిచారు. ఇది అంత సులువుగా రాలేదు. విద్యార్థుల పట్టుదల, రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంకల్పం.. ప్రభుత్వ విద్యారంగంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు.. దీనికి తోడు, జిల్లా అధికార యంత్రాంగం కృషి.. వెరసి ఈ ఘనత. ఆ ఫలాలే.. నేటి వరుస ఫలితాలు. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసింది. 93.90 శాతంతో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. గత విద్యాసంవత్సరం(2024)లో 96.37 శాతం.. అంతకుముందు ఏడాది (2023)లో 87.47 శాతంతో పది ఫలితాల్లో రాష్ట్రంలోనే మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన విషయం విదితమే. గత రెండేళ్ల ఫలితాలను ఈసారి కూడా నిలబెట్టుకోవడం విశేషం.కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు సాధించాం.. కేజీబీవీల్లో మంచి ఫలితాలు వచ్చాయి. అందరి సహకారంతోనే విజయం సాధ్యమైంది. కేజీబీవీల్లో పంచతంత్ర, మై స్కూల్, మై ప్రైడ్ ప్లస్ వంటి కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు సాధించాం. మొత్తం 540 మందికి 498 మంది ఉత్తీర్ణులయ్యారు. 42 మంది ఫెయిలయ్యారు. వీరికి రెసిడెన్సియల్ విధానంలో శిక్షణఇచ్చి, సప్లిమెంటరీలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటాం. – ఆర్.తేజేశ్వరరావు, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, ఎస్ఎస్ఏనిరంతర పర్యవేక్షణ, కృషితోనే.. విజయానికి ప్రధాన కారణం కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్. విద్యాశాఖ తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మై స్కూల్, మై ప్రైడ్ ప్లస్ నూతన కార్యక్రమం ద్వారా 182 పాఠశాలలను జిల్లా, మండల అధికారులకు దత్తత ఇచ్చి, నిరంతర పర్యవేక్షించేలా చేశారు. మాక్ పరీక్షలు నిర్వహించి, ఎప్పటికప్పుడు విద్యార్థులను సన్నద్ధం చేసి పరీక్షలంటే భయం పోగొట్టేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు. – ఎం.రమాజ్యోతి, ఇన్చార్జి డీఈవోగత ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమీ ఫలితాలు రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చారు. పాఠశాల స్థాయిలోనే గట్టి పునాదులు పడేలా విద్యావ్యవస్థను బలోపేతం చేశారు. నాడు–నేడు ద్వారా బడులను సమూలంగా మార్పు చేసి విద్యార్థులు స్వేచ్ఛగా, ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా అవకాశం కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ విద్యను అమల్లోకి తెచ్చారు. 3,4,5 తరగతుల విద్యార్థులకు స్మార్ట్ టీవీల ద్వారా విద్యా బోధన చేపట్టారు. 8వ తరగతి దాటిన విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇచ్చారు. వీటన్నింటినీ ఉపయోగించి, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యార్థులు చదువులో పోటీ పడ్డారు. ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధమయ్యారు. అప్పటి ప్రభుత్వ సంకల్పం, ఇటు జిల్లా యంత్రాగం కృషి.. నేడు మూడేళ్లుగా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి దోహదపడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. మన్యంలో విద్యాచైతన్యం వెల్లివిరుస్తోందంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. -
ఫలితాల్లో మేటిగా..
● మండలాలవారీగా సీతంపేట(99.59 శాతం), జీఎల్పురం(98.94), పాచిపెంట(96.20), సాలూరు(95.27), జియ్యమ్మవలస(95.03 శాతం) మొదటి అయిదు స్థానాల్లో ఫలితాలపరంగా నిలిచాయి. వీరఘట్టం(87.79 శాతం), సీతానగరం(86.85 శాతం) అట్టడుగున ఉన్నాయి. ● మొత్తం మొదటి డివిజన్లో 8,639 మంది, సెకెండ్ డివిజన్లో 775 మంది, థర్డ్ డివిజన్లో 245 మంది ఉత్తీర్ణులయ్యారు. ● సాలూరులోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల (బాలికలు)లో శతశాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 77 మంది పరీక్ష రాయగా.. అందరూ పాసయ్యారు. ఇందులో 47 మంది 500 మార్కులు దాటారు. జియ్యమ్మవలస మండలం పెదమేరంగి జడ్పీహెచ్ఎస్ వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 54 మందికి అందరూ పాసయ్యారు. ● కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో 540 మంది పరీక్ష రాయగా.. ఇందులో 498 మంది ఉత్తీర్ణత సాధించారు. ● జిల్లాలోని 57 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 2,218 మంది పరీక్షలు రాయగా 2,150 మంది (96.93 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● గురుకులాలకు సంబంధించి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 414 మంది విద్యార్థులకు 401 మంది (96.03)శాతం, సీతంపేట ఐటీడీఏ పరిధిలో 224 మందికి 223 మంది (99.50 శాతం) ఉత్తీర్ణులయ్యారు. -
ఐపీఎస్ టు ఐఏఎస్
గంట్యాడ: సివిల్స్ ఫలితాల్లో గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన పొటుపురెడ్డి భార్గవ్ సత్తాచూపాడు. హైదరాబాద్లో ఐపీఎస్లో శిక్షణ పొందుతూ సివిల్స్లో 455 ర్యాంక్ సాఽధించారు. ఆయన తల్లి పద్మ గృహణికాగా, తండ్రి విజయనగరం ఆర్టీసీ డిపోలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలన్నది భార్గవ్కు చిన్నప్పటి నుంచి కోరిక. ఐఏఎస్ అయితేనే అది నెరవేరుతుందని భావించారు. అందుకనుగుణంగా ప్రణాళికయుతంగా చదివారు. విజయనగరంలో 10వ తరగతి వరకు చదివి, పదోతరగతిలో 567 మార్కులు సాధించారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపు చదివి 928 మార్కులు సొంతం చేసుకున్నారు. అనంతరం ముంబయిలోని ఐఐటీలో మెటలార్జికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఏడాదికి రూ.16.5 లక్షల ప్యాకేజీతో టైమ్స్ ఆఫ్ ఇండియాలో 15 నెలలు పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశారు. సమాజంలో ఎక్కువ మందికి సేవచేయగలగాలంటే అది సివిల్స్తో సాధ్యమని నమ్మి పరీక్షకు సిద్ధమయ్యారు. రాత్రీపగలు శ్రమించి గతేడాది సివిల్స్లో 590 ర్యాంక్ సాధించారు. ఐపీఎస్లో చేరారు. ఈ సారి ఏలాగైనా ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సివిల్స్ పరీక్షకు సిద్ధమై 455 ర్యాంకును సాధించారు. ఐఏఎస్ వస్తుందని ఆశిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మా అబ్బాయికి సివిల్స్ ఫలితాల్లో 455 ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు. చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. దానికి అనుగుణంగా మా అబ్బాయిని ప్రోత్సహిస్తూ వస్తున్నాం. మా నమ్మాకాన్ని నిలబెట్టాడు. – పొటుపురెడ్డి పద్మ, సత్యం, భార్గవ్ తల్లిదండ్రులు -
మే నెలాఖరులోగా సారా రహిత జిల్లా
విజయనగరం అర్బన్: మే నెలాఖరు నాటికి సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ కోరారు. సారాకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసి టోల్ఫ్రీ నంబర్కు 14405కు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రొహిబిషన్, ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవోదయం 2.0 కార్యక్రమం అమలుపై వివిధ శాఖల అధికారులతో సారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని మంగళవారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా సారా తయారీ కానీ, వినియోగం కానీ జరగడం లేదని అన్ని పంచాయతీల నుంచి తీర్మానాలు తీసుకునే ప్రక్రియను మే 15లోగా పూర్తి చేయాలని కోరారు. అలాగే మండలాల నుంచి తీర్మానాలను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో నవోదయం 2.0 కార్యక్రమం అమలు, తీసుకున్న చర్యలను ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.శ్రీనాథుడు వవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఆర్డీఏ పీడీ కల్యాణ్చక్రవర్తి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు, డీఎస్పీ వీరకుమార్, అబ్కారీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 14405 జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ -
ఇళ్ల స్థలాల పంపిణీలో జాప్యం
విజయనగరం గంటస్తంభం: కార్పొరేట్లకు లక్షల ఎకరాలు ధారాదత్తం చేస్తున్న కూటమి పాలకులు పేదోడికి 2 సెంట్లు ఇంటి స్థలం అడిగితే లేదని చెప్పడం చంద్రబాబు మోసకారితనానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటివరకూ పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న ఆశ సామాన్య కుటుంబాలకు అందని ద్రాక్షగా మిగింలిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్మి వర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో 2సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్ధలాలు ఇచ్చి ఇంటి నిర్మాణనికి రూ.5 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. ప్రస్తుతం ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఉన్న చోటే పట్టాలు మంజూరు చేయాలి. అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ. సర్వేల పేరిట కాలక్షేపం సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందిస్తే ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. సర్వేల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సాయం పెంచడంతో ఇల్లు కట్టుకునేందుకు సొంత స్ధలం ఉన్నవారు చాలామంది ముందుకొస్తున్నారన్నారు. గ్రామాల్లో ఇంకా గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారు. 2014–19 టీడీపీ పాలనలోనే ఇదే పరిస్ధితి నెలకొంది. తొలుత మూడేళ్లపాటు ఇళ్ల నిర్మాణాలకు అవకాశం ఇవ్వకుండా తర్వాత ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి 2019 ఎన్నికలు దగ్గరపడ్డాయి. టీడీపీ ఓటమి పాలైంది. ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు.పేదలకు రెండు సెంట్లు, మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అని చెప్పి ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పూర్తిగా అప్పగించకుండా నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్మించారు. ఇళ్ళ స్థలాలు, ఇంటి పట్టాలు పేదలు నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, ఆనందరావు, ఎస్.రంగరాజు, కోట అప్పన్న, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్లకు లక్షల ఎకరాలు ధారబోత ఇంటిస్థలం ఇచ్చేవరకు పోరాటం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈశ్వరయ్య -
దళితుల సామాజిక బహిష్కరణ దారుణం
● జైభీమ్రావు భారత్ పార్టీ ప్రతినిధులు నెల్లిమర్ల రూరల్: సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను సామాజిక బహిష్కరణ చేయడం దారుణమని జై భీమ్రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టొంపల నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కనిగిరి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు మండలంలోని సతివాడ గ్రామంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాకినాడ జిల్లా మల్లాం గ్రామంలో దళితులను సామాజిక బహిష్కరణ చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో ఘటన జరగడం అగ్రకులాల దురహంకారానికి నిదర్శనమన్నారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని, దళిత వ్యక్తిని చంపినప్పటికీ ప్రభుత్వం, అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి గ్రామస్తులపై అట్రాసిటి కేసులు నమోదు చేసి, దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. -
–8లో
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025బంగారు కొండలు దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు రాణించారు. పతకాల పంట పండించారు. సాగుకు కూలీల కొరత వ్యవసాయ రంగాన్ని రోజురోజుకూ కూలీల కొరత వేధిస్తోంది. ఓ వైపు పెట్టుబడుల భారం, మరోవైపు కూలీలు దొరకకపోవడం రైతన్నకు సమస్యలుగా మారాయి. జూనియర్ సివిల్ జడ్జిలకు బదిలీవిజయనగరం లీగల్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలువురు జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎల్.దేవిరత్నకుమారిని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి బదిలీచేయగా, ఆమె స్థానంలో మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి (ఎకై ్సజ్ కోర్టు) ఎం.శ్రీనివాసరావును నియమించింది. విజయనగరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.రమ్య శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కోర్టుకు బదిలీకాగా ఆమె స్థానంలో టెక్కలిలో పనిచేస్తున్న తేజచక్రవర్తి నియామకమయ్యారు. గజపతినగరంలో పనిచేస్తున్న బి.కనకలక్ష్మి ఎస్.కోటకు బదిలీకాగా ఆమె స్థానంలో పాలకొండలో పనిచేస్తున్న విజయ్రాజ్ కుమార్ను, సాలూరులో పనిచేస్తున్న కె.రమేష్కు విశాఖ జిల్లా ఎలమంచిలికి బదిలీ చేయగా, ఆయన స్థానంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పనిచేస్తున్న జి. హర్షవర్దన్ను నియమించింది. శ్రీకాకుళం జిల్లా అదనపు జూనియర్ సివిల్ జడ్జి (ఎకై ్సజ్ కోర్టు) శ్రీవిద్యను విజయనగరం మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి (ఎకై ్సజ్ కోర్ట్)కు, చీపురుపల్లిలో పనిచేస్తున్న వై.ప్రేమలతకు విశాఖపట్నం బదిలీ అయింది. ఎస్.కోటలో పనిచేస్తున్న ఎస్ వాణికి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు బదిలీ అయ్యింది. కొంతకాలంగా ఖాళీగా బొబ్బిలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా కడపలో పనిచేస్తున్న హేమ స్రవంతి జానకీరామ్ను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు అయిన వారు వచ్చేనెల 2వతేదీలోగా వారివారి స్థానాల్లో చేరాలని ఉత్తర్వులలో పేర్కొంది. 30న పాలిసెట్ విజయనగరం అర్బన్: పాలిసెట్ ప్రవేశపరీక్ష ఈ నెల 30న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. పాలిసెట్ నిర్వహణపై తన చాంబర్లో అధికారులతో మంగళవారం సమీక్షించారు. జిల్లాలో 8,083 మంది అభ్యర్థులు 23 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నట్టు వెల్లడించారు. వీరికోసం విజయనగరంలో 9, బొబ్బిలిలో 6, గజపతినగరంలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు.సలహా మండలి ఉంటే.. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ఆర్టికల్ 244(1) ప్రకారం ఏజెన్సీ ప్రాంతాలున్న ప్రతి రాష్ట్రంలోనూ గిరిజన సలహా మండలిని విధిగా ఏర్పాటు చేయాల్సి ఉంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సలహా మండలి ఏర్పాటైతే.. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమంపై అందులో తగు నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. గతంలో జిల్లాకు సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర, అప్పటి ఎమ్మెల్సీ హోదాలో ప్రస్తుత మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, నిమ్మక జయరాజు, జనార్దన్ థాట్రాజ్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉండేవారు. కీలక అంశాలకు సంబంధించి చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోయింది. ● అడవిలో ఎలాంటి ఖనిజాన్ని తవ్వాలన్నా గిరిజన సలహా మండలి తీర్మానం తప్పనిసరి. ● గిరిజనులకు అవసరమైన అనేక విషయాలపై సలహా మండలిలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చర్చించి, అమలు చేయవచ్చు. ● ప్రస్తుతం ఆంధ్రా–ఒడిశా కొటియా వివాదాస్పద గ్రామాల సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ గనుల తవ్వకాల కోసం ఒడిశా ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఈ సమయంలో దీనిపై అధికార పక్షం నుంచి గిరిజనుల తరఫున మాట్లాడే వారు కరువయ్యారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర వంటివారు పోరాటం చేస్తున్నా.. అధికార పక్షం నుంచి సహకారం కొరవడుతోంది. ● పార్వతీపురం, సీతంపేటలాంటి ఐటీడీఏలకు రెగ్యులర్ పీవోలు లేరు. గిరి పుత్రులకు సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఇటువంటి సమయంలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన కీలకమైన సలహా మండలి కూడా లేకపోవడం గిరి పుత్రులను నిర్లక్ష్యం చేయడమే. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గిరిజన సలహా మండలి సమావేశంలో రాష్ట్రంలోని 554 గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించాలని తీర్మానం చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి 14 మండలాల్లో 182 గ్రామాలున్నాయి. ఆ తీర్మానం నేటికీ కేంద్రానికి చేరలేదు. కొత్తగా ఏర్పాటయ్యే గిరిజన సలహా మండలి దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు. ● ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏళ్ల తరబడి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న వారి పోస్టులనూ కలిపేసింది. దీనివల్ల వందలాది మంది సీఆర్టీలకు, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. వారి పోస్టులను మినహాయించి, మెగా డీఎస్సీ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. ● గిరి ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● కానరాని గిరిజన సలహా మండలి సమావేశాలు ● నిధులు లేక నీరసించిపోతున్న ఐటీడీఏలుసాక్షి, పార్వతీపురం మన్యం: ఏజెన్సీ ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గిరిజన శాఖ మంత్రిగా జిల్లాకు సంబంధించిన సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణి వ్యవహరిస్తున్నప్పటికీ.. ఈ ప్రాంతంలోని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలకు మోక్షం కలగడం లేదు. ఫలితంగా అడవి పుత్రుల ఆవేదన.. అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. కనీస మౌలిక సదుపాయాలు లేక గిరిజన గూడలు తల్లడిల్లుతున్నాయి. అడవి బిడ్డల సంక్షేమంలో కీలక భూమిక పోషించే గిరిజన సలహా మండలి ఏర్పాటుపై 11 నెలలవుతున్నా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. నిధులులేక ఐటీడీఏలు నీరసించిపోతున్నాయి. అభివృద్ధిపనులు తలపెట్టేందుకు వెనుకంజవేస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకంపై మంత్రి ఇచ్చిన హామీ ఎండమావిగానే మిగిలింది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కొరవడింది. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆస్పత్రులకు పరుగుతీయాల్సిన దుస్థితి నెలకుంది. పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం న్యూస్రీల్గిరిజన సలహా మండలి ఏర్పాటుతోనే సమస్యలకు పరిష్కారం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. గిరిజన భూరక్షణ చట్టం 1/70పై అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలు నేపథ్యంలో గిరిజన సలహా మండలిలో చట్టం పక్కాగా అమలు చేస్తామని తీర్మానం చేయాలి. అటవీ సంపద రక్షణ, జీవో నంబర్ 3 స్థానాల్లో అదే తరహా మరో జీవో కోసం తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదం తెలిపి, కొత్తగా జీవో తెచ్చి, గిరిజన డీఎస్సీ నిర్వహణ చేయడానికి చర్యలు తీసుకోవాలి. – పాలక రంజిత్కుమార్, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి -
గంజాయి కేసులో ఐదవ నిందితుడి అరెస్టు
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి పోలీస్ చెక్ పోస్టు వద్ద ఫిబ్రవరి 10వ తేదీన ఒడిశా నుంచి అక్రమ రవాణా జరుగుతున్న 147 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడగా కారు వదిలేసి అందులో ఉన్న నిందితులు పరారైన వారిలో నలుగురిని గత నెల 31న పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో సీఐ నారాయణరావు, ఎస్ వి ప్రసాదరావులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాపుచేయడంతో మండలకేంద్రంలోని బైసాస్ రోడ్డులో మంగళవారం ఐదవ నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అరకు మండలం తురాయిగూడ గ్రామానికి చెందిన కొర్రా కోగేశ్వరరావు ఇంటర్మీడియట్ పాసై అరుకులో శ్యామ్గణేష్ ఫంగి అనే మెడికల్ షాపులో యజమాని వద్ద కారు డ్రైవర్గా పనిచేసేవాడు. ఫంగి మెడికల్ షాపు నిర్వహిస్తూ కొర్రా కోగేశ్వరరావు ద్వారా ఒడిశా నుంచి కొద్దికొద్దిగా గంజాయి అక్రమరవాణా చేస్తూ పెందుర్తిలో ఉంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తులకు సరఫరాచేసేవాడు. 2024 ఫిబ్రవరిలో కారులో 150 కిలల గంజాయి అక్రమరవాణా చేస్తూ శ్యామ్గణేష్ పంగితో పాటు కారు డ్రైవర్ కొర్రా కోగేశ్వరరావులు పోలీసులకు పట్టుబడ్డారు.అప్పట్లో వారిపై కేసునమోదు చేసి వైజాగ్ సెంట్రజైల్కు తరలించారు.జైలులో ఉన్న సమయంలో కోగేశ్వరరావుకు మరో గంజాయి స్మగ్లర్ శెట్టి ఉమామహేశ్వరరావు పరిచయమయ్యాడు.వారిద్దరు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ గంజాయి అక్రమరవాణా ప్రారంభించారు. ఈ క్రమంలో పెదబయలు నుంచి ఈఏడాది ఫిబ్రవరి 10వ తేదీన కారులో గంజాయి తరలిస్తూ కొట్టక్కి వద్ద పోలీసులకు పట్టుపడడంతో కారు వదిలేసి పరారయ్యారు. మార్చి 31న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అప్పటి నుంచి పోలీసులు గాలించగా మంగళవారం కారు డ్రైవర్ కోగేశ్వరరావు పట్టుబడ్డాడు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. మిగిలిన మరి కొంతమంది నిదింతుల కోసం గాలిస్తున్నారు. -
గంజాయి నిందితుల ఆస్తులు జప్తు చేయాలి
పార్వతీపురం రూరల్: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే నిందితుల ఆస్తులను జప్తు చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం విశాఖలో పలు జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో డీఐజీ వెల్లడించినట్లు ఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు. అలాగే గంజాయి కేసుల్లో ఉన్న నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, ప్రజల సహకారంతో సమగ్ర సమాచారం సేకరించాల్సిన అవసరాన్ని డీఐజీ తెలియజేసినట్లు చెప్పారు. గంజాయి రవాణా నియంత్రణకు చెక్పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు ప్రారంభించాలని ఆదేశించారని, తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్టుచేసి వారిపై నాన్బెయిల్బుల్ వారెంట్లు తక్షణమే అమలు చేయాలని ఆదేశించారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం జోడించాలి నేరాల నిరోధంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చి సీసీటీవీలు, డ్రోన్ల సహాయంతో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసి దర్యాప్తు నిర్వహించాలని, సైబర్ క్రైం, అలాగే సోషల్ మీడియాలో వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని సైబర్ మోసాల పట్ల ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరించాలని, టోల్ఫ్రీ నంబర్ 1930 వినియోగం ప్రజలకు తెలియజేయాలని డీఐజీ ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో గంజాయికి అడ్డుకట్ట విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణాపై రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మంత్రి అనిత ఆదేశాలతో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తన కార్యాలయంలో ఐదు జిల్లాల ఎస్పీలతో మంళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాఽథ్ జెట్టి గంజాయి అక్రమరవాణా, వినియోగ నియంత్రణ, నిందితుల అరెస్ట్, వారి ఆస్తుల జప్తుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
రెండు కేజీల గంజాయి స్వాధీనం
విజయనగరం క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్లో జీఆర్పీ సిబ్బంది రెండు కేజీల గంజాయిని మంగళవారం పట్టుకున్నారు. జీఆర్పీ ఎస్పీ ఆదేశాల మేరకు విజయనగరం జీఆర్పీ ఇన్స్పెక్టర్ రవి కుమార్ సూచనలతో ఎస్సై బాలాజీ, హెచ్సీ కృష్టారావులు విజయనగరం రైల్వేస్టేషన్లో తనిఖీ చేసి ఒడిశాకు చెందిన వ్యక్తి రాయగడ ట్రైన్లో విశాఖకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని రెండు కేజీల గంజాయి, రూ.పదివేల నగదు స్వాధీనం చేసుకున్నామని జీఆర్పీ ఎస్సై బాలాజీ చెప్పారు. -
ప్రజలకు అండగా నిలవాలి
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు పడుతు న్న అన్ని వర్గాల ప్రజానీకానికి అండగా నిలిచి.. పోరాటాల ద్వారా వారి గొంతు కగా మారాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తెలిపారు. తాడేపల్లిలో మంగళవారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న రాజన్నదొర ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల వల్ల ప్రజలు, వివిధ వర్గాల వారు పడుతున్న ఇబ్బందులను జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సర్పంచ్ తీర్మానాలు లేకుండా పనులు చేయిస్తున్న విషయాన్ని తెలియజేశామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు.. ఏకపక్షంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నదీ.. వ్యవసాయం, ధాన్యం కొనుగోలు ఇబ్బందులు, మొక్కజొన్నకు ధర లేకపోవడం, ఆరోగ్యం, నీటి పారుదల, భూములు, పీడీఎస్ బియ్యం, పింఛన్ల కోత తదితర అంశాల్లో సమస్యలను, ప్రజా వ్యతిరేక విధానాలను వివరించామన్నారు. గొందివలసలో 37 మందికి మలేరియా లక్షణాలు సాలూరు రూరల్: మండలంలోని కొత్తవలస పంచాయతీ గొందివలస గ్రామంలో మలేరియా ప్రబలింది. మామిడిపల్లి పీహెచ్సీ డాక్టర్ శివకుమార్ తన వైద్య బృందంతో 86 మందికి రక్త పరీక్షలు చేయగా అందులో 37 మందికి మలేరియా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. వారందరీకి అవసరమైన మందులు ఉచితంగా అందజేసినట్టు వైద్యాధికారి తెలిపారు. గ్రామానికి ఆనుకొని జలపాతం నీరు ఒక ప్రాంతంలో నిల్వ ఉండడం, అందులో దోమలు వృద్ధి చెందడమే దీనికి కారణమన్నారు. ఈ విషయాన్ని గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే యువత స్పందించి నీటి నిల్వలను మళ్లించారన్నారు. వాట్సాప్లో ప్రభుత్వ సేవలు పార్వతీపురంటౌన్: ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వాట్సాప్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. వనమిత్ర కార్యక్రమం ద్వారా వాట్సాప్ గవర్నన్స్ తీసుకువచ్చిందని వివరించారు. ఫోన్ 95523 00009 నంబర్కు హాయ్ అని మెసేజ్ పెట్టగానే కావాల్సిన సేవలు అందుతాయన్నారు. పదోతరగతి ఫలితాలను హెచ్టీటీపీఎఫ్://బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్, హెచ్టీటీపీఎస్://ఏపీ ఓపెన్స్కూల్.ఏపీ.జీఓవీ.వెబ్సైట్లో చూడవచ్చన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఏ అనుమానం వచ్చినా వెంటనే సైబర్ క్రైం టోల్ఫ్రీ నంబర్ 1930కి కాల్చేయాలన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు శక్తియాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు తమ మొబైల్ ఫోన్లో శక్తియాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వాడపల్లి తిరుపతికి ఆర్టీసీ సర్వీసులు విజయనగరం అర్బన్: కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి ఆర్టీసీ సర్వీసులను ప్రతి శుక్రవారం నడుపుతామని విజయనగరం డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు విజయనగరం నుంచి బయలుదేరిన బస్సు శనివారం తెల్లవారు జామున 4 గంటలకు వాడపల్లి చేరుకుంటుందని, తిరిగి మరలా ఉదయం 9 గంటలకు వాడపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయనగరం చేరుకుంటుందని తెలిపారు. కొత్త సూపర్ లగ్జరీ బస్సుని వేశామని, టికెట్ ధర కేవలం రూ.1200 మాత్రమేనని తెలిపారు. టికెట్లను ఆర్టీసీ డిపోలో లేదంటే ‘ఏపీఎస్ఆర్టీసీఆన్లైన్.ఐఎన్’లో బుక్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం సెల్: 99592 25620, 94943 31213 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
సివిల్స్ లక్ష్యంగా...
రాజాం సిటీ: రాజాం పట్టణం ఈశ్వరనారాయణకాలనీలో నివసిస్తున్న సారథి గ్రామానికి చెందిన వావిలపల్లి భార్గవ చిన్నప్పటి నుంచి చదువులో చురుకై న విద్యార్థి. ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్న ఆయన ఆశయాన్ని తల్లిదండ్రులు ఈశ్వరమ్మ(గృహిణి), విష్ణు (జి.సిగడాం మండలం పాలఖండ్యాం యూపీ పాఠశాల హెచ్ఎం) ప్రోత్సహించారు. ఇంజినీరింగ్ అనంతరం ఉద్యోగాన్వేషణలో వచ్చిన ఉద్యోగాలు కూడా సంతృప్తినివ్వకపోవడం, అధికమందికి సేవచేయాలన్న సంకల్పంతో కఠోర దీక్షతో సివిల్స్ లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభించించారు. మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 830వ ర్యాంకు సాధించారు. ఆయన 1 నుంచి 10వ తరగతి వరకు రాజాంలోని శారదా కాన్వెంట్లో చదివి 557 మార్కులు సాధించారు. ఇంటర్మీడియట్ విద్యను స్థానిక వేదగాయత్రి కళాశాలలో పూర్తిచేసి ఎంపీసీలో 948 మార్కులతో ఉత్తీర్ణుడయ్యారు. జీఎంఆర్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. తొలిప్రయత్నంలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా పీఓగా ఎంపికై నా చేరలేదు. స్టేట్బ్యాంకు క్యాషియర్గా రెండున్నరేళ్లు పనిచేసినా ఆయన తన లక్ష్యాన్ని మరువలేదు. పుస్తకాలతో స్నేహం చేశారు. పట్టదలతో చదివి గ్రూప్–1 పరీక్షలను రాసి రెండో ప్రయత్నంలోనే స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. అనంతరం అంతిమ లక్ష్యం సివిల్స్పై దృష్టిసారించారు. లక్ష్యసాధనలో మూడు సార్లు యూపీఎస్సీ పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలు ఎదుర్కొని నాలుగో ప్రయత్నంలో ర్యాంకు సాధించారు. ఆయన ఎంపిక పట్ల కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆయనే ప్రేరణ.. పదో తరగతి చదువుతున్న సమయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రేవు ముత్యాలరాజు సివిల్స్కు ఎంపిక కావడంతో ఆయనను ప్రేరణగా తీసుకున్నా. ఎప్పటికై నా సివిల్స్ సాధించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. మూడు సార్లు ఇంటర్వ్యూకు హాజరై విఫలమైనా నిరుత్సాహపడలేదు. తండ్రి ప్రోత్సాహంతో ముందుకు సాగాను. చివరి ప్రయత్నంలో సివిల్స్లో విజేతగా నిలిచాను. – వావిలపల్లి భార్గవ, సివిల్స్ 830 ర్యాంకర్ -
మంత్రి ఇలాకాలో మట్టిమాఫియా
● స్థానిక టీడీపీనేత అండతో దందా ● యథేచ్ఛగా తరలింపు ● చోద్యం చూస్తున్న అదికారులుగజపతినగరం రూరల్: నియోజకవర్గంలోని మరుపల్లి గ్రామం మధ్యలో ఉన్న కోనేటిలోనుంచి గడిచిన కొన్ని రోజులుగా మట్టిమాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరులను దోచేస్తు అడ్డదిడ్డంగా టీడీపీ తమ్ముళ్లు సంపాదించుకుంటన్నారు. గ్రామం మధ్యలో ఉన్న కోనేటిలోని మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మట్టిమాఫియాకు కేరాఫ్ మరుపల్లి నియోజకవర్గంలోని మరుపల్లి గ్రామంలో గతంలో ఆదర్శపాఠశాలను ఆనుకుని ఉన్న కొండనుంచి మట్టిని అక్రమంగా తరలించి గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు సొమ్ముచేసుకున్నారు. పగటిపూట అయితే ఎవరి కంటైనా పడతామని రాత్రి సమయంలో జేసీబీలతో అక్రమంగా మట్టిని తరలించేవారు. ప్రస్తుతం కొండప్రాంతంలో మట్టి తరలింపునకు పుల్స్టాప్ పెట్టడంతో నేరుగా గ్రామంలో ఉన్న కోనేటి చెరువుపై పడ్డారు. అనుమతులు ఏవీ? గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్రాంతం నుంచైనా మట్టిని తీయాలంటే స్థానిక పంచాయతీ అనుమతులు, తీర్మానం ఉండాలి. అలాగే రెవెన్యూ శాఖకు చెందిన సిబ్బంది కూడా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండానే నేరుగా మట్టిని తరలించేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. పంచాయతీ అనుమతులు ఇవ్వాలి గ్రామంలోని చెరువుల్లోంచి మట్టిని తీసుకోవాలంటే స్ధానిక పంచాయతీ అనుమతులు తీసుకోవాలి. రెవెన్యూ నుంచి మట్టి తరలించేందుకు ఎవరీకి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. – రత్నకుమార్ తహసీల్దార్ సర్పంచ్ భర్త తోలుకోమన్నారు కోనేరులోని దెప్పులుగా ఉన్న మట్టిని స్థానిక సర్పంచ్ భర్త సత్యనారాయణ తీసుకెళ్లమన్నారు. ఆయన చెప్పారని మట్టిని ట్రాక్టర్తో తీసుకెళ్తున్నాం. – గౌరినాయుడు, మట్టి తరలింపుదారు కోనేరు లోతు అవుతుందని గ్రామంలో ఉన్న కోనేరులో మట్టి తరలిస్తే లోతు ఎక్కువవుతుందని చెప్పాం. మట్టి తరలింపునకు ఎటువంటి తీర్మానం చేయలేదు.డబ్బులు ఎవరి దగ్గరా తీసుకోలేదు. – లెంక సత్యనారాయణ, టీడీపీ నాయకుడు మరుపల్లి -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.24 నుంచి వేసవి సెలవులుపార్వతీపురంటౌన్: ఈనెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి రమాజ్యోతి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయన్నారు. జూన్ 5వ తేదీన స్కూల్ రెసిడెన్షియల్ కార్యక్రమాల కోసం ఉపాధ్యాయులు పాఠశాలల్లో రిపోర్టు చేయాలని ఆమె స్పష్టం చేశారు. నాణ్యమైన జీడి పిక్కలు కొనుగోలు చేయాలి● జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోభిక కొమరాడ: జీడి పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోభిక సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కొమరాడ మండలం చోళ్లపధం గ్రామంలోని జీడి పిక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా జీడి పిక్కలను పరిశీలించి రికార్డుల మేరకు సక్రమంగా ఉన్నదీ, లేనిది తనిఖీ చేశారు జిల్లాలో జీడి పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, నాణ్యమైన జీడిపిక్కలు కొనుగోలు చేసి రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. జీడి బస్తాలను గిడ్డింగిలో జాగ్రత పరచాలని, పరిశ్రమకు తరలించే వరకు పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే వీడీవీకే సభ్యులు, జీడి రైతులతో సంభాషించి సంబంధిత అధికారులు పలు మార్గదర్శకాలను జారీచేశారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం సురేష్, ఏఓ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి● ఇద్దరికి తీవ్ర గాయాలు గంట్యాడ: మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని రుషికొండ ప్రాంతానికి చెందిన గద్దెపల్లి దినేష్, గద్దెపల్లి సింహాద్రి, మంగమ్మపేటకు చెందిన గరికిన కార్తీక్లు అరకు వెళ్లి మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై విశాఖ వెళ్లిపోతుండగా కొండతామరపల్లి విద్యుత్ సబ్స్టేషన్ దాటిన తర్వాత జాతీయ రహదారిపై కానాను బలంగా ఢీకొట్టడంతో బైక్పై నుంచి ముగ్గురూ ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో దినేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సింహాద్రి, కార్తీక్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు 108 అంబులెన్సులో గాయపడిన వారిని చికిత్స కోసం, దినేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదేదీలేదు..
పార్వతీపురంటౌన్: కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదేదీలేదని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జేఈఈ మెయిన్స్లో జాతీయస్థాయిలో 137, 900, 2,864వ ర్యాంకులు సాధించిన జోగింపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎస్.నందవర్దన్ నిహాల్, ఎస్.అఖిల్, పి.జగదీశ్వరరావును దుశ్శాలువతో సోమవారం సత్కరించారు. జేడీఈ అడ్వాన్స్ పరీక్షలో మంచి ప్రతిభ చూపాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్ బి.ధర్మారావు మాట్లాడుతూ ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ విద్యార్థులకు రూ.40 వేలు ఖరీదుచేసే పుస్తకాలను ఉచితంగా అందించారన్నారు. పాఠశాల నుంచి 12 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడమే కాకుండా అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధించారన్నారు. దగా చేసిన కూటమి ప్రభుత్వం పార్వతీపురం: గిరిజన నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని గిరిజన సంఘ జేఏసీ నాయకులు డి.సీతారాం, ఎ.చంద్రశేఖర్, జె.బంగార్రాజు, మల్లయ్య, మధుసూదనరావు ఆరోపించారు. ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో వారు సోమవారం మాట్లాడారు. కురుపాం, పాలకొండ, పాడేరు నియోజకవర్గాల్లో జరిపిన ఎన్నికల ప్రచారంలో జీఓ నంబర్ 3ని పునరుద్ధరిస్తామని కూటమి నేతలు ప్రకటించారన్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారి పోస్టులను డీఎస్సీలో జనరల్ కేటగిరీలో కలపడంపై అభ్యంతరం తెలిపారు. జీఓ నంబర్ 3పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోతే ఆదివాసీ ఐక్య గిరిజన సంఘం తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మళ్లీ వచ్చిన ఏనుగులు భామిని: వంశధార నది ఆవల ఒడిశాలోని పురిటిగూడ, గౌరి గ్రామాలకు శుక్రవారం రాత్రి వెళ్లిన ఏనుగులు ఆదివారం రాత్రి భామిని మండలం బిల్లుమడ, జొన్నగుడ్డికి చేరుకున్నాయి. పంట పొలాల్లో సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పీఓ చొరవ.. కోలుకున్న బాలిక● ఆశ్రమ పాఠశాల బాలికకు మెరుగైన వైద్యం ● విశాఖ కేజీహెచ్లో 50 రోజుల పాటు చికిత్స ● క్షేమంగా పాఠశాలకు చేరుకున్న చిన్నారి సీతంపేట: ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి చొరవ ఫలించింది. సీతంపేట గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిలకల అవనికి మెరుగైన వైద్యసేవలు అందాయి. ఊపిరితిత్తులు, కాలేయ సమస్యకు 50 రోజుల పాటు కేజీహెచ్లో చికిత్స పొంది ప్రాణాపాయ స్థితి నుంచి బాలిక బయటపడింది. రేగిడి ఆమదాలవలస మండలం గదబపేట నుంచి పాఠశాలకు సోమవారం చేరుకుంది. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందేలా కృషిచేసిన పీఓకు బాలిక తల్లిదండ్రులు ఆయన కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొర, డిప్యూటీ డీఎంహెచ్వో విజయపార్వతి, హెచ్చ్డబ్ల్యూఓ పాలక అమల తదితరులు పాల్గొన్నారు. అభ్యంతరాల స్వీకరణ గడువు పెంపు విజయనగరం ఫోర్ట్: రాష్ట్రీయ బాలస్వస్థలో పోస్టులకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
అడ్డుకట్ట ఏదీ?
–8లోఒడిశా కవ్వింపు చర్యలకు..మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సాలూరు నియోజకవర్గ పరిధి వివాదాస్పద కొటియా గ్రామాల గిరిజన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు రక్షణ కల్పించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర కోరారు. సాలూరులో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొటియాలో ఉన్న 21 గ్రామాల సమస్య స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అలానే ఉందని గుర్తు చేశారు. తాను పుట్టకముందు నుంచే ఈ సమస్య ఉందని.. నానాటికీ పెరుగుతోందే తప్ప, తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అక్కడ జన్మభూమి కార్యక్రమం చేపట్టిందని.. అప్పటి నుంచే ఒడిశా ప్రభుత్వం, అక్కడి అధికారుల కవ్వింపు, దూకుడు చర్యలు మరింతగా ఎక్కువయ్యాయని.. గిరిజనులను ఇబ్బందులు పెట్టడం అధికం చేశారని చెప్పారు. మన ప్రభుత్వ భవనాలు, ఇతర ఆస్తులను కూలుస్తూ, కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని తెలిపారు. అనేకమార్లు గ్రామాల్లో కాలినడకన పర్యటించా.. తాను రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు దాటుతోందని.. ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి ధూళిభద్ర మీదుగా కొటియాకు 2018లో నడిచి వెళ్లానని తెలిపారు. పలుమార్లు కొటియా గ్రామాల్లో పర్యటించి, అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు వారంతా ఆంధ్రాలోనే ఉండేందుకు మొగ్గు చూపారని చెప్పారు. ఎగువ కొటియా, దిగువ కొటియా వంటి కొన్ని గ్రామాలు మినహా.. మిగిలిన చాలా వరకు గ్రామాల ప్రజలంతా ఇదే స్పష్టం చేశారని గుర్తు చేశారు. వారి కోసం మన రాష్ట్రం నుంచి ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ల వద్దకు వెళ్లి మొర వినిపించుకున్నా.. అండగా నిలవలేకపోతున్నారని తెలిపారు. 2021లో తాను, అప్పటి ఐటీడీఏ పీవో కూర్మనాథ్ ఆ గ్రామాల పర్యటనకు వెళ్తే.. అక్కడి వారు దండయాత్ర చేశారని గుర్తు చేశారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఒడిశా ముఖ్యమంత్రిన్యూస్రీల్గనుల కోసమని అప్పుడు విమర్శించారు.. ఇప్పుడు తవ్వుకుంటే ఏం చేస్తున్నారు? నవంబరు 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లో కలిసి చర్చిస్తే... ఇప్పుడున్న మంత్రి విమర్శలు చేశారని, గనుల బేరాలంటూ లేనిపోని ఆరోపణలకు దిగారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఒడిశా వారు.. అక్కడున్న గనులను మనవైపు నుంచి తవ్వుకుంటూ పోతోంటే, మన మంత్రి, కూటమి నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘మన పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనాలు పడగొడుతున్నారు. తాగునీటి పైప్లైను పనులను అడ్డుకుంటున్నారు.. పోలీస్స్టేషన్లకు తీసుకెళ్తున్నారు. గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా, గిరిజన శాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదు? అని మంత్రి సంధ్యారాణిని ఉద్దేశించి ప్రశ్నించారు. అప్పట్లో గోబ్యాక్ ఆంధ్రా అంటూ కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ స్వయంగా అన్నారని.. తాము గట్టిగా వ్యతిరేకించామని... అదే మంత్రి గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనకు వస్తే గౌరవంగానే స్వాగతిస్తే టీడీపీ వారు విమర్శలకు దిగారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు.. ఎందుకు కూటమి నాయకులు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రాలోనే ఉంటామని కొటియా గిరిజనులు అంటున్నారు.. అక్కడి ప్రభుత్వ పథకాల లబ్ధిని తిరస్కరించేందుకు వారంతా సిద్ధమే.. గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్, ఎస్పీ, కూటమి ప్రభుత్వానిదే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ చూపుతారని ఆశిస్తున్నా... మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర -
యశ్వంత్కి బంగారు పతకం
విజయనగరం అర్బన్: విద్యా శాఖ, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ రాష్ట్ర స్పెషల్ ఒలింపిక్ భారత్ కమిటీ సంయుక్త నిర్వహణలో సోమవారం నూజివీడు హీల్ పారడైజ్ స్కూల్ అగిరిపల్లిలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి స్పెషల్ ఒలింపిక్ భారత్–2025 క్రీడా పోటీలలో తొలి రోజున జిల్లాకు చెందిన ఇనుముల యశ్వంత్ 50 మీటర్ల క్రిపుల్డ్ వాక్ క్రీడాంశంలో బంగారు పతకాన్ని సాధించాడు. ప్రజ్ఞా వైకల్యం, ఆటిజం, డౌన్ సిండ్రోమ్, మస్తిష్క పక్షవాతం వైకల్యాలున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఈ నెల 23 వరకు జరిగే ఈ పోటీలలో జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు పాల్గొంటున్నారని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు తెలిపారు. తొలి రోజు బంగారు పతకం సాధించిన యశ్వంత్ తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి అని తెలిపారు. విజేతను డీఈఓ యు.మాణిక్యం నాయుడు, సెక్టోరియల్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోధన సిబ్బంది అభినందించారు. -
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
బొబ్బిలి రూరల్: మండలంలోని మెట్టవలస గ్రామానికి చెందిన కొండపల్లి శ్రీహరి(22) సోమవారం సాయంత్రం గున్నతోటవలస గ్రామం వద్ద బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు శ్రీహరి తండ్రి శ్రీను డ్రైవర్ కాగా శ్రీహరి టాటా మేజిక్ వాహనాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. శ్రీహరికి సోదరుడు తేజ విద్యాభ్యాసం చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్సీకి తరలించారు. ఉరి వేసుకొని వ్యక్తి మృతి పూసపాటిరేగ : మండల కేంద్రమైన పూసపాటిరేగ వాటర్ ట్యాంకు సమీపంలో అప్పులు బాధ తట్టుకోలేక అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఉరి వేసుకొని సోమవారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... స్థానికులు బంధువులు అందించిన వివరాల మేరకు విజయవాడకు చెందిన కొమ్ముకూరి రాజేష్ (35) గత కొంత కాలంగా పూసపాటిరేగ పెట్రోల్ బంకు సమీపంలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఇటీవల కాలంలో హోటల్ నిర్వహణలో నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. భార్య నెలరోజులు క్రితం పుట్టింటికి వెళ్లిపోవడంతో రాజేష్ ఒక్కడే ఇంట్లో వుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందాడు. రాజేష్కు భార్య లక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలు వున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్ఐ ఐ.దుర్గాప్రసాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాల్య వివాహాలు అరికట్టాలి : కలెక్టర్
పార్వతీపురం టౌన్: బాల్య వివాహాలు అరికట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల పట్ల విస్తృత అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రుల నుంచి అంగీకారం పొందాలని అందుకు బాల్య వివాహాల వలన కలిగే దు ష్ప్రభావాల గూర్చి స్పష్టంగా వివరించాలన్నారు. వివిధ కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితుల రీత్యా బాల్య వివాహాలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సామాజిక స్థితిగతుల పట్ల వివరంగా చెప్పాలని ఆదేశించారు. చిన్న వయస్సులో వివాహం చేయడం వల్ల బాల్యం కొల్పోతారని, చదువు, ఆరోగ్యం కోల్పోతారని. వారికి ఉన్న ఆశలు, ఆశయాలు సాధించే అవకాశం కోల్పోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటుదన్నారు. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులకు వివరించాలన్నారు. తాగు నీటి సమస్య తలెత్తరాదు జిల్లాలో తాగు నీటి సమస్య తలెత్తరాదని కలెక్టర్ ఆదేశించారు. కొన్ని మండలాల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్నట్లు మీడియాలో వార్తులు వస్తున్నాయని, వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించారు. -
విశ్రాంత హోంగార్డుకు ‘చేయూత’
విజయనగరం క్రైమ్ : పోలీసు శాఖలో హోంగార్డుగా పని చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన కాజా రామారావుకు చేయూత కింద రూ.3లక్షలు సోమవారం అందజేశారు. డీపీఓలో ఎస్పీ వకుల్ జిందల్ తన చాంబర్లో హోంగార్డు సిబ్బంది ఒక్క రోజు కేటాయించిన డ్యూటీ అలవెన్స్ను రామారావుకు చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బందిలో ఐక్యమత్యానికి ఇలాంటి సాయాలు మరింత దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఏఏ శ్రీనివాలసరావు, హోంగార్డ్స్ ఇంచార్జ్ ఆర్ఐ రమేష్కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి విరాళం నెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లిలో జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణానికి బొత్స లక్ష్మణరావు తనయుడు బొత్స చైతన్య రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. సోమవారం విజయనగరంలోని తన నివాసంలో ఆలయ కమిటీ ప్రతినిధులకు తన వంతుగా నగదు అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చైతన్యకు కృతజ్నతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బెల్లం ఊట ధ్వంసం వీరఘట్టం: మండలంలోని చిన్నగోర శివారు ప్రాంతంలో సారా తయారు చేసేందుకు ఉంచిన 1200 లీటర్ల బెల్లం ఊటలను సోమవారం ధ్వంసం చేసినట్లు ఎస్.ఐ జి.కళాధర్ తెలిపారు. సారా తయారీ చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తమ సిబ్బందితో వెళ్లగా సారా తయారీదారులు పరారైనట్లు ఎస్.ఐ తెలిపారు. సారా తయారీకి ఉపయోగించిన ప్లాస్టిక్ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు పూసపాటిరేగ : భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో అనధికారంగా 12 మద్యం సీసాలు కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు భోగాపురం ఎకై ్సజ్ సీఐ రవికుమార్ తెలిపారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో నాలుగు నెలల కాలంలో 38 అనధికార మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి 355 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 918 లీటర్ల సారా ధ్వంసం పార్వతీపురం టౌన్: గతంలో పలు కేసుల్లో పట్టుబడిన సారా, మద్యం సోమవారం ధ్వంసం చేసినట్టు ఎకై ్సజ్ సీఐ సురేష్కుమార్ తెలిపారు. పట్టణ శివారుల్లో 918 లీటర్ల సారా, 17 లీటర్ల మద్యం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా రవాణా, తయారీ, అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. క్రమం తప్పకుండా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో సారా కేసులో పరారీలో ఉన్న పట్టణానికి చెందిన కోలా విజయ్, పాలకొండ కార్తీక్, కోలా పెంటయ్యలను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. పదే పదే సారా కేసుల్లో పట్టుబడుతున్న బోమ్మాలి శ్రీనివాసరావు బైండోవర్ ఉల్లఘంచిన కారణంగా తహసీల్దార్ ఆధ్వర్యంలో రూ.40 వేలు జరీమానా చెల్లించాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు యు.నాగేశ్వరరావు, రేవతమ్మ సిబ్బంది పాల్గొన్నారు. -
విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ
విజయనగరం అర్బన్: ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జాతీయ దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధులు సహాయ సంస్థ వారి ఆర్థిక సౌజన్యంతో రూ.63 లక్షల విలువ గల రుణాలను 18 మంది దివ్యాంగులకు కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ వారి ద్వారా డిగ్రీ ఆపై కోర్సులు రెగ్యులర్గా చదువుతున్న 29 మంది దివ్యాంగులకు రూ.11.60 లక్షలు (ఒక్కొక్కరికి రూ.40 వేలు) 29 ల్యాప్టాప్లు, మూగ, చెముడు అభ్యర్థులకు రూ.60 వేలు విలువ గల 6 టచ్ ఫోన్లు, మూడు చక్రాల సైకిళ్లు 2, వీల్చైర్లు 2, పంపిణీ చేశారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ● పీజీఆర్ఎస్కు 147 వినతులుపార్వతీపురం టౌన్: పీజీఆర్ఎస్కు వచ్చిన వినతులు సొంత సమస్యలుగా భావించి పరిష్కార దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 147 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. అర్జీల పరిష్కారాన్ని వేగవంతం చేసే ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలకు తావివ్వద్దన్నారు. పరిష్కారమయ్యే సమస్యలతో అర్జీదారులు సంతృప్తి చెందాలని పునఃప్రారంభం కారాదని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, డీఆర్ఓ హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీలలో కొన్ని ఇలా.. ● 25 కుటుంబాల నివాసం ఉండే గుమ్మలక్ష్మీపురం మండలం కొండబిన్నిడి గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక అత్యవసర పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఆ గ్రామానికి చెందిన గిరిజనులు వినతిని అందజేశారు. ● కురుపాం మండలం పెద్దగొత్తిలిలో సచివాలయం, రైతు భరోసా కేంద్ర నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రస్తుతం పాత పంచాయతీ భవనం పాడవ్వడంతో వర్షం నీరు కారుతుందని, పరిపాలనకు ఆటంకం కలుగుతుందని, నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామ సర్పంచ్ పి.టి.లోకనాధం వినతిని అందజేశారు. -
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు
విజయనగరంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో భూతగాదాలకు సంబంధించి 17, కుటుంబ కలహాలకు సంబంధించి రెండు, మోసాలకు పాల్పడినవి నాలుగు, ఇతర అంశాలకు సంబంధించి రెండు ఫిర్యాదులు అందాయి. వీటికి స్పందించిన ఎస్పీ వకుల్ జిందల్ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఏఎస్పీ సౌమ్యలత, ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, డీఎస్ఆర్పీ ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం క్రైం -
పరిశీలించి పరిష్కరించాలి
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులను, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఫిర్యాదులు వాస్తవాలైతే చట్టపరమైన చర్యలతో పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి సూచించారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కుటుంబ కలహాలు, భర్త అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూళ్లు, ప్రేమ పేరుతో మోసాలపై పలు అర్జీలు ఎస్పీ స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అనంతరం వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన స్టేషన్ సిబ్బందికి ఎస్పీ స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడి ఆ ఫిర్యాదులను వాటి పూర్వాపరాలను విచారణ చేసి వాస్తవాలు రుజువైనట్లైతే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం మొత్తం 14 ఫిర్యాదులు జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి అందాయి. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్ఐ ఫ్రకృద్ధీన్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి -
పేదల భూములు జోలికొస్తే ఊరుకోం
పార్వతీపురంటౌన్: పార్వతీపురంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తున్న వామపక్షనాయకుల భూములు, స్థలాలకు రక్షణ కరువైందని సీపీఎం నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో అనేక చెరువులు, గెడ్డలు, పోరంబోకు స్థలాలు కబ్జాకు గురయ్యాయని, వాటిని పట్టించుకోకుండా పేదలు, నిర్వాసితుల భూములను స్వాధీనం చేసుకోవడాన్ని ఖండించారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం పార్వతీపురం పాతబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర దౌర్జన్యాలను ఖండిస్తూ... ఖబద్దార్ ఎమ్మెల్యే అంటూ నినదించారు. కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించి ఎమ్మెల్యే తీరుపై నిరసన తెలిపారు. అనంతరం పేదల భూముల స్వాధీనాన్ని ఆపాలంటూ జాయింట్ కలెక్టర్ శోభికకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారీ రెడ్బుక్ తెరుస్తామని భయపెడుతోందని, నిర్వాసితులు, పేదలపై రెడ్బుక్ తెరిస్తే మాత్రం వందరెట్లు ఎర్ర జెండాలు ఎక్కుపెడతామని హెచ్చరించారు. పేదలకు న్యాయం చేస్తామని ఓట్లు అడిగి గెలిచి నేడు భూస్వాములకు, కార్పొరేట్లకు న్యాయం చేకూర్చడమే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్యే విజయచంద్ర తీరు మార్చుకోవాలన్నారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆదేశాలకు తలొగ్గి అధికారులు పనిచేయడం తగదన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు కొల్లి సాంబమూర్తి, వి.ఇందిర, కె.రామస్వామి, మర్రి శ్రీను, రెడ్డి ఈశ్వరరావు, కోరాట ఈశ్వరరావు, సీతారాం, బి.సూరిబాబు, ఎస్.ఉమ, పి.రాము, నిర్వాసితులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్యాయం పేదల భూములపై దౌర్జన్యాలకు పాల్పడడం అన్యాయం. వరహాలగెడ్డ, దేవునిబందను ఆక్రమించి పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తున్నా తహసీల్దార్, కలెక్టర్ ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే ఆదేశం లేకుండా బుల్డోజర్తో దాడి చేయకూడదని పాఠాల్లో చదువుకున్నారా?. ప్రజలకు సేవచేయని ఎమ్మెల్యేను అందరూ వ్యతిరేకించాలి. – ఎం. కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కబ్జాలు మానుకోవాలి అధికార హోదాలో ఉన్న ఎమ్మెల్యే, అధికారులు పేదల భూములు స్వాధీ నం చేసుకునేందుకు చేస్తు న్న ప్రయత్నాలు మానుకోవాలి. ఇప్పటికే రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అనేక దుర్మార్గమైన పనులకు అధికారులు పూనుకోవడం విచారకరం. ఇదే తీరు కొనసాగిస్తే భవిష్యత్లో ప్రజాగ్రహానికి గురికాకతప్పదు. – కె.గంగునాయుడు, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి ఉద్యమిస్తాం తోటపల్లి నిర్వాసితుల పోరాటం సమయంలో నాటి ప్రభుత్వం నిర్వాసితులకు ఆదుకునేందుకు భూములు ప్రకటించింది. వాటి ఆధారంగా అధికార రాజముద్రతో పొందిన భూ పట్టాలు ఉన్నప్పటికీ నేటి కార్పొరేట్ ఎమ్మెల్యేలు వాటిని తారుమారు చేస్తున్నారు. స్వలాభం కోసం ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. వీటిని సహించేది లేదు. రాజకీయ నాయకులు, అధికారులు ఎంతటి దౌర్జన్యాలకు ఒడిగట్టినా భూములు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మే 10వ తేదీలోగా జిల్లాలో ఉన్న భూ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. లేనట్లైతే ప్రజా సంఘాల నుంచి భారీ ఉద్యమం తప్పదు. – బంటు దాసు, నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి అన్యాక్రాంత పనులు మానుకోవాలని ఎమ్మెల్యేకు హితవు బంటువానివలస స్థల వివాదం పరిష్కరించాలని డిమాండ్ పట్టణంలో ర్యాలీ, కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన ప్రజాసంఘాల నాయకులు -
23న సాలూరులో జాబ్మేళా
పార్వతీపురంటౌన్: సాలూరు పట్టణంలోని సత్యసాయి డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఉదయం 9గంటలకు జాబ్ మేళా జరగనుందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువత జాబ్మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డీగ్రీ చదువుకుని 18 నిండి 28 ఏళ్లు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు జాబ్మేళాకు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 9గంటల నుంచి సత్యసాయి డిగ్రీ కళాశాల, సాలూరులో జరిగే జాబ్మేళాకు హాజరుకావచ్చని చెప్పారు. ఈ జాబ్ మేళాకు 11 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని వివరించారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులకు తమ వివరాలను హెచ్టీటీీపీఎస్://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్ సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకుని, రిఫరెన్స్ నంబర్తో పాటు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జిరాక్స్, ఒక పాస్పోర్ట్ పొటోతో హాజరు కావాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు ఫోన్ 94947 77553, 73825 59022 నంబర్లలో సంప్రదించవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు. జాతీయ స్థాయి పోటీలకు మన్యం విద్యార్థులు పార్వతీపురం టౌన్: జాతీయ స్థాయి అండర్–17ధాంగ్–టా పోటీలకు పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ఎంపికై నట్లు కోచ్ అనిల్ శర్మ తెలిపారు. జిల్లాకు చెందిన ఏడుగురు విద్యార్ధులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. డిల్లీలో ఈ నెల 22 నుంచి 27 వరకు జరగనున్న పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి జిల్లా పర్యటన రేపువిజయనగరం అర్బన్: రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల 22న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం నుంచి విజయనగరం చేరుకుని 3.30 గంటలకు నెల్లిమర్ల మండలంలోని తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు ప్రాజెక్టు పనులు, పునరావాసం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 6 గంటలకు బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. -
ఇవేం ఆంక్షలురా బాబూ..!
పూసపాటిరేగ: మత్స్యకారుల జీవనభృతిపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతూ మెమో జారీ చేయడంపై గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు. జీవనభృతి మంజూరైన మత్స్యకారులు సంక్షేమ పథకాలకు అనర్హులని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎంతో కాలంగా మత్స్యకారులకు వస్తున్న వేట నిషేధ భృతిపై ఇలా ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసమని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. మత్స్య సంపద వృద్ధి కోసం ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమలు చేయడం విధితమే. ఈ కాలంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. 2019 నుంచి ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి ఏటా మత్స్యకార భరోసా అందజేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వస్తే రూ. 20 వేల జీవనభృతి ఇస్తామని చెప్పిన నాయకులు మొదటి ఏడాది భృతి ఇవ్వకుండా దాటవేశారు. ఈ ఏడాది మే నెలలో భృతి ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధించడం దారుణం. జిల్లాలో గతేడాది మత్స్యకార భరోసాకు 3798 మందిని అర్హులుగా తేల్చారు. వీరందరూ వేట విరామ సమయంలో భృతి పొందినప్పటికీ.. అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరాతో పాటు ఇతర సంక్షేమ పథకాలు పొందారు. కాని నేటి కూటమి ప్రభుత్వం మాత్రం జీవన భృతి పొందిన మత్స్యకారులు ఆడబిడ్డ నిధి, చంద్రన్న పెళ్లికానుక, ఎన్టీఆర్ భరోసా పెన్సన్లకు అనర్హులుగా తేల్చింది. అలాగే 60 ఏళ్లు దాటిన వ్యక్తులు, 300 యూనిట్ల కంటే అధికంగా విద్యుత్ వినియోగించిన వారు, గ్రామీణ ప్రాంతంలో రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతంలో రూ. 1.44 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారు, 3 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్టు ఉన్న మత్స్యకారులను అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఇవేం ఆంక్షలురా బాబూ అంటే గంగపుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమం తప్పదు.. వేట నిషేధ భృతి చెల్లించాల్సిన కూటమి సర్కారు లేనిపోని ఆంక్షలు విధించడం దారుణం. భృతి పొందిన వారిని ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తిస్తే ఉద్యమం చేయక తప్పదు. బర్రి చినఅప్పన్న , జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు, విజయనగరం. మత్స్యకారుల జీవనభృతిపై ఆంక్షలు.. ఇంతవరకు అందని వేట నిషేధం భృతి ఇదుగో..అదుగో.. అంటూ కాలయాపన తాజాగా భృతి పొందిన వారికి సంక్షేమ పథకాలు కట్ అంటూ మెమో జారీ ఆందోళనలో మత్స్యకారులు -
రక్తదానం చేసిన మంత్రి
గజపతినగరం రూరల్: ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. అనంతరం స్థానిక యువత నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన కూడా రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మక్కువ శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు రాజాం సిటీ: జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పొగిరి సురేష్బాబుపై రాజాం పోలీస్స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందని ఎస్సై వై.రవికిరణ్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. జనసేన సభ్యత్వ నమోదు కార్డులు స్థానిక బొబ్బిలి రోడ్డులోని ఆర్కే కాంప్లెక్స్లో ఇస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తెలియజేయడంతో ఒమ్మి గ్రామానికి చెందిన చిత్తిరి నాగరాజు శనివారం ఉదయం అక్కడకు చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జనసేన నాయకుడు పొగిరి సురేష్బాబు నువ్వెందుకు ఇక్కడకు వచ్చావని నాగరాజును దుర్భాషలాడాడు. కులం పేరుతో దూషించడంతో పాటు కాలితో తన్నాడు. పైగా తన అనుచరులతో దాడి చేసేందుకు ప్రయత్నించగా.. బాధితుడు తప్పించుకుని బయటకు వచ్చి జనసేన నాయకులకు విషయం తెలియజేశాడు. అనంతరం పొగిరి సురేష్బాబుపై శనివారం సాయంత్రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ..ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చంద్రబాబు పుట్టిన రోజు.. మనకు వంచన దినం ● అంబేడ్కర్ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తివిజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినాన్ని ఎస్సీ రిజర్వేషన్ల వంచన దినంగా పాటిద్దామని ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవన్లో కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన దుర్మార్గమన్నారు. గత వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల సర్వేను క్యాస్ట్ సర్వేగా పరిగణిస్తూ జీఓ 91 విడుదల చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టిన రోజును ఎస్సీ రిజర్వేషన్ల వంచనదినంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం వంచనదినం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో దారాన వెంకటేష్ , బుదరాయవలస మధుసూదనరావు, వేమల వంశీ, లోపింటి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి టెక్కలి రూరల్: ఇంట్లో కరెంట్ లేదని, దాన్ని మరమ్మతు చేసే క్రమంలో ఓ వ్యక్తి విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు వదిలేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఆదిఆంధ్ర వీధికి చెందిన పినిమింటి నారాయణరావు(40) అనే వ్యక్తి ఆదివారం తన ఇంట్లో కరెంట్ వచ్చి పోతుండటంతో స్విచ్ బోర్డుకి వచ్చే వైర్లు ఊడిపోవడం గుర్తించి దాన్ని మరమ్మతు చేసేందుకు పూనుకున్నారు. అయితే మరమ్మతు చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై కిందకు పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి నారాయణరావు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకు న్న కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రో దించారు. మృతుడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి కీర్తన, మహేష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు. -
ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
విజయనగరం క్రైమ్: వారం రోజుల పాటు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. నగరంలోని న్యూపూర్ణ జంక్షన్ వద్దనున్న అగ్నిమాపక స్టేషన్ సిబ్బంది ఈ వారం రోజులు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన నష్ట నివారణ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఇదిలా ఉంటే ఆదివారం స్థానిక అగ్నిమాపక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయనగరం డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మహేంద్ర గిరి, లంకె శ్రీనివాసరావు, డాక్టర్ అరుణ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై వివరించారు. కార్యక్రమంలో ఫైర్స్టేషన్ అధికారులు సోమేశ్వరరావు, సంతోష్కుమార్, మహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
నేతాజీ మాజీ సైనికుల అసోసియేషన్ నూతన కార్యవర్గం
విజయనగరం అర్బన్: నేతాజీ మాజీ సైనికుల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని స్థానిక యూత్ హాస్టల్లో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అసోసియేషన్ అధ్యక్షుడిగా పెద్దింటి గుణాకరరావు, గౌరవఅధ్యక్షుడిగా చలుమూరు రామారావు, ఉపాధ్యక్షుడిగా పి.మన్మధరావు, ప్రధాన కార్యదర్శిగా ఎల్.నారాయణరావు, సహాయకార్యదర్శిగా గొర్లె శివకుమార్, కోశాధికారిగా ఓఎస్ ప్రకాశరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.గణపతి, కార్యవర్గ సభ్యులుగా కేవీజీఎస్గుప్తా, వై.రవి కుమార్, డి.శ్రీనివాస్లను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా బర్ల మహేష్రావు, వై.సూరి, పర్యవేక్షణ అధికారులుగా ఎస్ఎస్రాజు, ఎస్వీరాజు గార్ల సమక్షంలో ఎన్నికలు జరిగాయి. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. -
పెడతారంటే ఆశ..తిడతారంటే భయం అన్న చందాన అదిగో డీఎస్సీ..ఇదిగో టీచర్ ఉద్యోగం అంటూ నిరుద్యోగ ఉపాధ్యాయులను 11 నెలల పాటు ఊరించిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంవత్సరాల తరబడి ప్రిపేరవుతూ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న నిరు
విజయనగరం అర్బన్: కూటమి ప్రభుత్వం తొలి సంతకంతో ప్రకటించిన హామీ మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఎట్టకేలకు 11 నెలల తరువాత శనివారం విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో వివిధ కేడర్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వివరాలను ప్రకటించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ యాజమాన్యాల పాఠశాలలకు చెందిన పోస్టులు 446, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో మరో 137 పోస్టులు నోటిఫికేషన్లో ప్రకటించారు. అదేవిధంగా జోన్–1 (నాలుగు ఉమ్మడి జిల్లాల) పరిధిలో భర్తీ చేసే ఏపీఆర్ఎస్/ఏపీఎంఎస్/ఏపీఎస్డబ్ల్యూ/బీసీవెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్ తది తర సంక్షేమ సంస్థల గురుకులాల జోన్ల స్థాయి పోస్టులు ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ కేటగిరి పోస్టులు మరో 400 వరకు ఉన్నాయి. జూన్ 6 నుంచి జూలై 6వ వరకు డీఎస్సీ పరీక్ష డీఎస్సీ–2025 నోటిఫికేషన్ షెడ్యూల్ మేరకు మే నెల 15 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉంది. మే నెల 20వ తేదీ నుంచి మాక్టెస్ట్ (నమూనా పరీక్ష) నిర్వహిస్తారు. అదే నెల 30 నుంచి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. డీఎస్సీ పరీక్షల ప్రక్రియ జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు చేపడతారు. అన్ని పరీక్షలు పూర్తయిన రెండోరోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు. కీ విడుదలైన తరువాత ఏడు రోజుల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు. తుది కీ విడుదల తర్వాత మెరిట్ జాబితా ప్రకటిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదినియామక తేదీలేని షెడ్యూల్ విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్లో దరఖాస్తుల స్వీకరణ నుంచి మెరిట్ జాబితా వరకు తేదీలు స్పష్టంగా ఉన్నాయి. కానీ మెరిట్ జాబితా తరువాత చివరిగా నూతన ఉద్యోగ ప్రవేశాల తేదీ షెడ్యూల్లో లేదు. పోస్టుల నియామక ఆదేశాల ప్రక్రియకు నిర్దిష్ట తేదీలు లేకపోవడంతో ఈ విద్యా సంవత్సరానికి పోస్టుల నియామకాలు జరిగే అవకాశాలు లేనట్టేనని నిరుద్యోగులు అనుమాన పడుతున్నారు. -
పవన్ అనాలోచిత నిర్ణయాలతో రైతులకు తీవ్ర నష్టం
● ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనాలోచిత నిర్ణయాలతో ఈ రోజు బియ్యం ఎగుమతులు లేక రైతులు తీవ్రమైన నష్టాలకు గురవుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం టెక్కలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీజ్ ద షిప్ వ్యవహారంలో అక్రమాలను వెలికితీస్తామని చెప్పి ఎందుకు మౌనంగా ఉన్నారని దువ్వాడ ప్రశ్నించారు. గతంలో ఏపీ నుంచి విస్తారంగా సన్న రకాలు ఎగుమతులు జరిగాయని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. గతంలో వైఎస్సార్సీపీ పాలనలో రూ.2900 ధర పలికిన సన్న రకాల ధర ఈ రోజు రూ.1700కు పడిపోయిందని అన్నారు. అవి కూడా కొనుగోలు చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. సన్న రకాలను ప్రోత్సహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనలతో ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల్లో విస్తారంగా సన్న రకాలు పండించారని, ఇప్పుడు ధరలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారని దువ్వాడ మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ పాలనలో విత్తు నుంచి విక్రయం వరకు. రైతుల సంక్షేమం కోసం అధికారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితులను ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం నుంచి సుమారు 31 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, ఇదే డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ గతంలో గోల చేశారని ఇప్పుడు అదృశ్యమైన మహిళల్ని ఎందుకు తీసుకురావడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రెండు బడ్జెట్లలో ఉత్తరాంధ్రకు వచ్చిన ప్రయోజనమేమిటని దువ్వాడ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఏడాది కాలంలో సుమారు 80 శాతం పనులు పూర్తి చేశారని ఇప్పుడు టీడీపీ నాయకులు పోర్టు కాంట్రాక్ట్ల కోసం కుమ్ములాడుకుంటున్నారు తప్ప పోర్టును పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. బారువాను మరో గోవా చేస్తామంటూ ఇటీవల కేంద్ర మంత్రి చేసిన ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని శ్రీనివాస్ అన్నారు. లింగాలవలస గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రగల్బాలు పలకడం ఆపేసి ఎన్నికల మునుపు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు
పార్వతీపురం టౌన్: సీఎం చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విజయచంద్ర కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. అలాగే జిల్లా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పాత బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబులాంటి విజనరీ లీడర్ దేశంలో ఇంకొకరు లేరన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. బలిజిపేట మండలంలో రక్తదాన శిబిరం నిర్వహించి రక్తం యూనిట్లను జిల్లా ఆస్పత్రికి అందజేశారు. కార్యక్రమంలో మూడు మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, టీడీపీ నా యకులు, కార్యకర్తలు, ఆభిమానులు పాల్గొన్నారు. -
భక్తి శ్రద్ధలతో ఈస్టర్
పాలకొండ రూరల్: చినమంగళాపురంలో కొవ్తొత్తులతో ప్రార్థనలు చేస్తున్న విశ్వాసులు పాలకొండ రూరల్: లోకరక్షకుడు క్రీస్తు పునరుత్థానం(ఈస్టర్) వేడుకలను ఆదివారం ఊరువాడా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ విశ్వాసులు చర్చిలు, ప్రార్థనా మందిరాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలో పాలకొండ మండలంలోని చిన మంగళాపురం మందిరంలో పాస్టర్ నేతృత్వంలో విశేష ప్రార్థనలు చేపట్టి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పాలకొండ పట్టణంలోని బేతేలు బాప్టిస్ట్ చర్చి నిర్వాహకుడు ఆదాము ఫాధర్ నేతృత్వంలో సమాధుల వద్ద తమ పూర్వీకులను స్మరిస్తూ ప్రార్థనలు చేశారు. -
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి...
క్రైమ్ కార్నర్గంట్యాడ: ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మదనాపురం గ్రామానికి చెందిన వర్రి రామారావు (45) ఆదివారం ఉదయం మదనాపురం జంక్షన్ నుంచి ట్రాక్టర్పై గ్రామంలోకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపైనున్న గొయ్యిని తప్పించేక్రమంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో అక్కడికక్కడే రామారావు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలున్నారు. పెద్ద దిక్కు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లారీ ఢీ కొట్టడంతో ఒకరు.. సాలూరు రూరల్: మండలంలోని జీగిరాం గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సాలూరు మండలం మంచాడవలసకు చెందిన తంబరి బంగారయ్య, తూలిగి బంగారయ్యలు సాలూరు నుంచి మంచాడవలసకు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. సరిగ్గా జీగిరాం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తంబరి బంగారయ్య మృతి చెందాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. తెట్టంగిలో చోరీ.. గుర్ల: మండలంలోని తెట్టంగిలో జమ్ము పైడినాయుడు ఇంటిలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో దొంగలు ప్రవేశించి ఐదు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి. నారాయణరావు తెలిపారు. -
సత్యనారాయణ నేత్రదానం
శ్రీకాకుళం కల్చరల్: పట్టణంలోని ఇప్పిలి వీధిలో నివాసం ఉంటున్న నారంశెట్టి సత్యనారాయణ (86) అనారోగ్య కారణంగా మృతి చెందారు. మరణానంతరం ఆయన నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆయన కుమారులు ఎన్వీ మొహెర్ సుధాకర్, ఎన్వీ సురేష్, ఎన్వీ రవికిషోర్, జగదీశ్వరరావులు బరాటం వరప్రసాద్ ద్వారా తండ్రి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేయగా, నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇంచార్జి సుజాత, నంది ఉమాశంకర్లు సత్యనారాయణ కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు సభ్యులు దుర్గాశ్రీనివాస్లను అభినందించారు. -
ప్రభుత్వ కార్యక్రమాలుగా గురజాడ జయంతి, వర్ధంతి
విజయనగరం టౌన్: ప్రభుత్వ అధికార కార్యక్రమాలుగా గురజాడ అప్పారావు జయంతి, వర్ధంతులను నిర్వహించాలని జిల్లాకు చెందిన కవులు, రచయితలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక గురజాడ స్వగృహంలో సాహిత్య సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో మహాత్మా మన్నించు పేరిట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు మాట్లాడుతూ.. తెలుగు సమాజానికి ఆధునిక ఆలోచనలందించిన మహాకవి గురజాడ అని కొనియాడారు. దేశభక్తి గీతాన్ని రాసిన మహాకవిని ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకూ అందరూ స్మరించుకుంటారు గాని ఆయన పేరిట అవార్డు మాత్రం ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. గురజాడ జయంతి, వర్ధంతిలను ఇకపై అధికారిక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సాహిత్య సంస్థల ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్, డాక్టర్ జక్కు రామకృష్ణ, చీకటి దివాకర్, అధిక సంఖ్యలో సాహితీవేత్తలు పాల్గొన్నారు. కవుల, రచయితల డిమాండ్ -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
సీతానగరం: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో చదువుకునేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. జోగింపేట గిరిజన ప్రతిభా (స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్)ఎస్ఓయీ విద్యాలయ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. విద్యార్థులకు ప్రిన్సిపాల్ ధర్మరాజు, సహోపాధ్యాయులు స్వీట్లు తినిపించి అభినందించారు. ఆల్ ఇండియా ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలో ఎస్.నాథవర్దన్–137, పి.జగదీశ్వరరావు–2,864, ఎస్.అఖిల్–900, ఎ.లోకేష్–6,299, కె.అభిరాం–3,077 ర్యాంకులు సాధించారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ
సీతానగరం: ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. సీతానగరం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలతో పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధించాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక పీహెచ్సీని పరిశీలించి మెరుగైన వైద్యసేవలు అందజేయాలని వైద్యులు ఉషారాణి, పావనికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసన్నకుమార్, ఎంపీడీఓ త్రివిక్రమరావు, ఎకై ్సజ్ సీఐ పద్మావతి, తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో.. పార్వతీపురం రూరల్: స్వచ్ఛ దివస్లో భాగంగా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ ప్రక్రియలో సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది భాగస్వాములయ్యారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ఆరోగ్యానికి హానికరం పార్వతీపురంటౌన్: ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ఆరోగ్యానికి హానికరమని జిల్లా ప్రత్యేకాధికారి నారాయణ భరత్ గుప్త అన్నారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ–వేస్ట్ చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, విస్మరించిన విద్యుత్ పరికరాలతో ఆరోగ్యం, పర్యావరణంపై హానికర ప్రభావం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ఎస్ శోభిక, డీఆర్ఓ హేమలత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్: కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది. ఈ కాలంలో జిల్లా ప్రజలకు ఏమన్నా మంచి పనులు చేశారా అంటే.. వేళ్లు తీసి లెక్క పెట్టడానికి ఆలోచించాలి. ఇదే సమయంలో దోచుకోవడం.. దాచుకోవడం.. పంచుకోవడం.. వర్గవిభేదాలతో రచ్చకెక్కడం.. రోజుకొక చోట విభేదాలతో వీధిన పడటం.. తమ అక్రమాల దారికి అడ్డొచ్చేవారిని అదిలించడం.. ఇదే ‘తమ్ముళ్లు’ పనిగా పెట్టుకున్నారు. అసలే మూడు పార్టీలతో ముచ్చటగా ఏర్పడిన కూటమి.. వారిలో వారికే సఖ్యత లేమి. మూణ్నాళ్లు కూడా కలిసి ఉండలేక.. సతమతమై ‘పంపకాల’లో తేడాతో బజారున పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. పాలకొండలో నామినేటెడ్ పోస్టుల లొల్లి.. పాలకొండ నియోజకవర్గంలో కూటమి మధ్య ఉన్న వర్గపోరు.. ఇన్చార్జి పడాల భూదేవిపై ఉన్న అసంతృప్తి మరోసారి బహిర్గతమైంది. తక్షణమే ఆమెను ఇన్చార్జి పదవి నుంచి తప్పించాలని నాలుగు మండలాల తెలుగు తమ్ముళ్లు.. టీడీపీ పరిశీలకుల వద్దే ఏకరవు పెట్టారు. ఏకంగా వీధికెక్కారు. శనివారం జరిగిన పాలకొండ నియోజకవర్గ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమం దీనికి వేదికై ంది. వాస్తవానికి నియోజకవర్గంలో గత ఎన్నికలకు ముందు నుంచే కూటమిలో రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అనేలా ఉన్నాయి. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ (తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కళా వర్గం), టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి (మంత్రి అచ్చెన్న వర్గం)ల మధ్య విభేదాలు నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే వస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి నామినేటెడ్, పార్టీ పదవుల కేటాయింపుల భర్తీ మరింత చిచ్చు రేపింది. ఇటీవల మార్కెట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, డైరెక్టర్ పదవుల కేటాయింపుల్లో పట్టు సాధించే క్రమంలో ఎమ్మెల్యే జయకృష్ణ.. తమ వర్గానికి చెందిన వారికి పదవులు కట్టబెట్టేందుకు పావులు కదిపారు. జనసేన కండువాలు కప్పి తనకు నచ్చినవారికి పదవులు కేటాయిస్తున్నట్లు ఓ వర్గం ఆరోపణలు చేస్తోంది. మరోవైపు పట్టు కోసం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో సంప్రదించి భూదేవి వర్గం ఎమ్మెల్యే ప్రస్తావన లేకుండానే ఉపాధ్యక్ష, ఆరు డైరెక్టర్ పోస్టులు నేరుగా కేటాయించారు. దీంతో జయకృష్ణ వర్గం జీర్ణించుకోలేక ఆరోపణలు, విమర్శలు, సవాళ్లకు దిగింది. ఇటీవల పట్టణంలోని ఓ కళ్యాణ మండంలో ఎమ్మెల్యే మద్దతు వర్గం బహిరంగంగానే.. అచ్చెన్నాయుడు స్థానికంగా గ్రూపులు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. ఈ సమస్యను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అయ్యాయి. పార్టీ పరిశీలకుని వద్దే ఘర్షణ ఈ వివాదం చివరికి ఘర్షణ వరకూ వచ్చింది. టీడీపీ సభ్యత్వ పత్రాలు అందించేందుకు పాలకొండలోని ఓ కళ్యాణపమండపంలో నియోజకవర్గ నాయకులు, సభ్యులతో అరకు పార్లమెంట్ పరిశీలకుడు హర్షప్రసాద్ సమావేశమయ్యారు. ఆయన ఎదుటే టీడీపీలో వర్గపోరు బయట పడింది. భూదేవి, ఆమె వర్గానికి పదవులు ఎలా కేటాయిస్తారని, తక్షణమే అమెను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని, వారికి కేటాయించిన నామినేటెడ్ పోస్టులు రద్దు చేయాలని మరో వర్గానికి చెందిన ‘తమ్ముళ్లు’ నినాదాలు చేశారు. పరిశీలకుడు వారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల వారూ పరస్పర ఆరోపణలకు దిగారు. నెట్టుకుంటూ వాదోపవాదనలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇన్చార్జి భూదేవిని సైతం తోసేశారు. ఎమ్మెల్యే మద్దతుదారులైన టీడీపీ నాయకులు కర్రెన అప్పలనాయుడు, జాడ శివప్రసాద్తోపాటు మరి కొంత మంది మీడియా ఎదుటే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. భూదేవిని బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలంటూ నినాదాలు చేసుకుంటూ, ర్యాలీగా బయటకు వెళ్లిపోయారు. ఉద్రిక్తత నడుమే భూదేవి కూడా తన వాహనం ఎక్కి వెనుదిరిగారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనను ఆరోపిస్తున్న వారు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించారని.. వారు నాయకులా, గూండాలా? అని ప్రశ్నించారు. ఈ గందరగోళ స్థితి మధ్య కార్డుల పంపిణీ మధ్యలోనే నిలిపివేసి పరిశీలకులు వెనుదిరిగారు. న్యూస్రీల్కురుపాం నియోజకవర్గంలో తమ్ముళ్ల ‘పంచాయితీ’ మరోవైపు కురుపాం నియోజకవర్గంలోనూ తెలుగు తమ్ముళ్ల మధ్య గ్రూపుల పంచాయితీ నడుస్తోంది. ఆధిపత్యం, ఉనికి కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నిత్యం రోడ్డెకెక్కుతున్నారు. గ్రూపు రాజకీయాలతో కత్తులు నూరుకుంటున్నారు. ప్రధానంగా కురుపాం, కొమరాడ మండలాల్లో తమ్ముళ్ల మధ్య ‘సఖ్యత’.. ఉప్పు, నిప్పులా ఉంది. పదవుల కేటాయింపులో అసంతృప్తి మధ్య విభేదాలకు కారణమవుతోంది. శుక్రవారం ఓ వర్గం కొమరాడ మండలంలో ఎమ్మెల్యే వద్ద పంచాయితీ పెట్టగా.. శనివారం మరో వర్గం కలిసినట్లుగా తెలుస్తోంది. కొమరాడ మండలంలో పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు ఎవరు గొప్ప అన్నఅంశంతో ఆధిపత్యపోరు మొదలైంది. ఈ వివాదం కాస్త కూటమి ఎమ్మెల్యే వద్దకు చేరింది. ఆమె సూచనతో మధుసూదనరావు, వెంకటనాయుడు, పి.వెంకటనాయుడు, సుదర్శనరావు, శేఖర్పాత్రుడు తదితరులతో ‘ఐదుగురు సభ్యుల కమిటీ’ ఏర్పాటైంది. ఏ గ్రామంలో ఏ పనికావాలన్నా, పథకాలు, బీసీ రుణాలు మంజూరు కావాలన్నా, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలన్నా ఈ కమిటీ అంగీకరించాల్సిందే. వీరు అధికార దర్పం ప్రదర్శించడంతో పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. మరో టీడీపీ నాయకుడు పార్టీ మండల పదవిని అడ్డం పెట్టుకుని పెత్తనం చేయడం మొదలుపెట్టాడు. ప్రభుత్వ శాఖల్లో తలదూర్చుతూ ఏ ౖపైనెనా తాను చెప్పినదే చేయాలని పట్టుబట్టాడు. ఐదుగురు సభ్యుల కమిటీ నిర్ణయాలను తోసిపుచ్చాడు. దీంతో పార్టీలో కుంపటి రాజుకుంది. మండల నాయకుడిని వ్యతిరేకిస్తూ 31 పంచాయతీల నుంచి ఓ అసమ్మతి వర్గం శుక్రవారం ఎమ్మెల్యే వద్ద పంచాయితీ పెట్టగా.. నాయకుడు సైతం తన మాట నెగ్గించుకునేందుకు ఎమ్మెల్యేను తన అనుచర వర్గంతో శనివారం కలిశారు. నాయకులంటే ప్రజలకు మేలు చేసేందుకు పోటీ పడతారని, కూటమి ప్రభుత్వంలో మాత్రం ప్రజాధనం దోచుకునేందుకు.. పదవులు పంచుకునేందుకు, రాజకీయ వివక్ష చూపేందుకు పోటీపడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శస్తున్నారు. పరిశీలకులు ఎదురుగానే పాలకొండలో తమ్ముళ్ల బాహాబాహీ గతంలో ఇచ్చిన నామినేటెడ్ పదవుల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిని మార్చాల్సిందేనని రోడ్డెక్కిన కార్యకర్తలు నాయకులా.. గూండాలా? అంటూ ప్రశ్నించిన పడాల భూదేవి అటు కురుపాం నియోజకవర్గంలోనూ ‘తమ్ముళ్ల’ మధ్య రోజుకో పంచాయితీ -
కొటియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల కవ్వింపు చర్యలు
సాలూరు: వివాదాస్పద ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశా పోలీసుల కవ్వింపు చర్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇటీవల గంజాయిభద్ర పంచాయతీ పరిధి దిగువశెంబి అంగన్వాడీ కేంద్రం వద్ద తెలుగులో ఏర్పాటుచేసిన బోర్డులను తీసుకెళ్లిపోయారు. ధూళిభద్ర వద్ద జల్జీవన్మిషన్ పనుల సామగ్రిని సీజ్ చేశారు. తాజాగా శనివారం ధూళిభద్ర వద్ద జల్ జీవన్మిషన్లో భాగంగా నీళ్ల ట్యాంకు నిర్మించి రంగులు వేస్తుండగా ఒడిశా పోలీసులు గొడవకు దిగారు. గ్రామానికి చెందిన చోడిపల్లి సుబ్బ, నర్సుతో పాటు విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన పెయింటర్ శివను కొటియా పోలీస్ స్టేషన్కు, అక్కడ నుంచి పొట్టంగి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టుపై స్థానికుల ఆందోళనకు దిగారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ బీసు, దిగువశెంబి, ఎగువశెంబి, గంజాయిభద్ర గిరిజన యువత కొటియా స్టేషన్కు పెద్ద సంఖ్యలో చేరుకుని అరెస్టు చేసిన వారిని తక్షణమే విడిచిపెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కలెక్టర్ శ్యామ్ప్రసాద్ స్పందిస్తూ విషయాన్ని ఎస్పీకి తెలియజేశానని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లను కొటియా స్టేషన్కు పంపించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేస్తామని ఒడిశా పోలీసులు తెలిపినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా మంత్రి సంధ్యారాణి, కూటమి నాయకులు స్పందించకపోవడంపై కొటియా గ్రామాల గిరిజనులు మండిపడుతున్నారు. కొటియా గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు
పార్వతీపురం: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధిస్తూ ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. పార్వతీపురం గిరిమిత్ర సమావేశ మందిరంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్తంగా శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో 51 శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, 70 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు ఒక యూనిట్గా ఏర్పడి 16 శాతం వృద్ధి సాధించాలన్నారు. ప్రాథమిక రంగాలైన వ్యవ సాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్య్స రంగాలపై రైతులు దృష్టిసారించాలన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఉపాధిహామీ పథకం నిధులతో ఫారం పాండ్స్ను నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. ఉపాధి నిధులతో పశుగ్రాసాన్ని పెంచి ఎకరాకు రూ.39వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించిన జిల్లాగా పార్వతీపురంను నీతిఅయోగ్ సంస్థ గుర్తించిందన్నారు. జీడీ, పసుపు, ఆయిల్పాం పంటలను మరింత విస్తరింపజేయాలన్నారు. గిరిజనులకు బిందుసేద్యం యూనిట్లపై శతశాతం, ఇతరులకు 90 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించారు. పార్వతీపురం, వీరఘట్టం, సాలూరు ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయని, వాటిని అద్దె ప్రాతిపదికన వినియోగించుకునేలా రైతు లకు అవగాహన కల్పించాలన్నారు. ఏనుగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, చింతపల్లి ప్రచురించిన ఉన్నత పర్వత శ్రేణి, గిరిజన ప్రాంతాల్లో వలిసెలసాగు సమగ్ర యాజమాన్యం బుక్లెట్ను విడుదల చేశారు. రైతులకు అవసరమైన సేంద్రియ ఎరువు, జీవన ఎరువుల ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పి.వి.సత్యనారాయణ, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అసోసియేట్ డైరెక్టర్ డా.ఎ.అప్పలస్వామి, అధికారులు డాక్టర్ జి.శివనారాయ ణ, బి.శ్యామల, జి.శ్రీనివాసరావు, షణ్ముఖ, కేవీకే శాస్త్రవేత్తలు, ఎన్జీఓలు, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ -
ఆధునికంగా సాగితే 15 శాతం వృద్ధి సాధ్యం
విజయనగరం అర్బన్: ప్రాథమిక రంగాలైన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక రంగాల్లో ఆధునికంగా సాగితే 15 శాతం వృద్ధిరేటు సాధ్యమవుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి చెందుతుందని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి అధికారి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. వ్యవసాయంలో కొత్త ఆలోచనలు, ప్రయోగాలు అమలుచేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్ డా.అహ్మద్బాబు, జిల్లా అధికారులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వద్ధి రేటు సాధనకు ఆయా శాఖల అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పండించే పంటలు, కూరగాయలు, పూలు ఇతర ఉద్యాన ఉత్పత్తులకు విశాఖలో మంచి మార్కెట్ ఉందని, దీనిని వినియోగించుకోవాలన్నారు. అహ్మద్ బాబు మాట్లాడుతూ వృద్ధిరేటు సాధనలో కిందిస్థాయి సిబ్బందిని భాగస్వాములను చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, సీపీఓ పి.బాలాజీ, డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్తో జాతీయవాష్ నిపుణుల భేటీ విజయనగరం అర్బన్: కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్తో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత ఆధ్వర్యంలో జాతీయ వాష్ (నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత) నిపుణులు సుధీర్కుమార్ బండారీ, సౌమేంద్ర రంజన్ గంగూలి శనివారం భేటీ అయ్యారు. జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనాంశాలను కలెక్టర్కు వివరించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. డీఈలు ఢిల్లీశ్వరరావు, యడ్ల గోవిందరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గొంతు కోసి.. నడిరోడ్డుపై వదిలేసి.. ●పైడిభీమవరం నడిబొడ్డున ఘటన ●వివాహిత దారుణ హత్య రణస్థలం: మండలంలోని పైడి భీమవరం నడి బొడ్డున శనివారం సాయంత్రం జరిగిన వివాహిత దారుణహత్య కలకలం రేపింది. స్థానికులు, జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం బోనం పేరంటాలు గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి అవాల భవాని(25) అనే వివాహితను దారుణంగా చాకుతో గొంతు కోసి వెళ్లిపోయాడు. సంఘటన స్థలంలోనే చాకును నీళ్లతో కడిగేసి అక్కడే పడేశాడు. కొన ఉపిరితో ఉన్న భవాని అక్కడకు కొద్ది దూరంలో వైఎస్సార్ విగ్రహం వెనుక బస్టాప్ దగ్గరలో చెరువు గట్టు వరకు వచ్చి అక్కడే పడిపోయి మృతి చెందింది. ఆమె భర్త వెంకట సత్యం లారీ డ్రైవర్గా పనికి వెళుతుంటాడు. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలోని బరంపురం దగ్గరలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. భవానీ స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని పెద్ద పతివాడ గ్రామం. నాలుగేళ్ల క్రితం పైడిభీమవరం పంచాయతీలోని గొల్లపేట గ్రామానికి చెందిన వెంకట సత్యంతో వివాహమైంది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. వెంకట సత్యం లారీ డ్రైవర్గా పనిచేస్తుండగా.. భవాని పైడిభీమవరంలోని ఒక హోటల్ పని చేస్తోంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో హోటల్ నుంచి వెళ్లిపోయిందని యజమాని చెబుతున్నాడు. ఆ తర్వాత ఆమె సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బస్టాప్ వద్ద విగతజీవిగా కనిపించింది. స్థానికులు సమాచారం అందించడంతో జేఆర్ పురం సీఐ అవతారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 3.30 గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఆమె ఎటు వెళ్లిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. హోటల్లో పని చేసిన వ్యక్తుల ప్రమేయంపై కూడా విచారణ చేస్తున్నారు. తదుపరి క్లూస్ టీం వివరాలు సేకరించి, మృతదేహాన్ని శవపంచనామా కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. దీనిపై జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవిని వివరణ కోరగా హత్య జరిగిందని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
జీడికి దక్కని మద్దతు!
● దళారుల పాలవుతున్న గిరిజన రైతులు ● ప్రకటనలకే పరిమితమవుతున్న అధికారుల హామీలు సాక్షి, పార్వతీపురం మన్యం : ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు అటవీ ఉత్పత్తుల్లో ఆర్థిక దన్నుగా నిలిచేది జీడి పంటే. కొండ పోడు భూముల్లో జీడితోటలనే సాగు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. ఇటువంటి పంట విషయంలో ప్రభుత్వం వారికి మద్దతుగా నిలవడం లేదు. సీజన్ దాటిపోతున్నా.. జీడి పిక్కల కొనుగోలు విషయమై కనీస దయ కరవవుతోంది. కొంతకాలంగా మార్కెట్లో సరైన ధర పొందలేకపోతున్నారు. మరోవైపు మొదట్లోనే తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. దీనివల్ల గిరిజన రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. జీడి పిక్కలకు కనీస మద్దతు ధర చెల్లించాలని కొన్నాళ్లుగా రైతులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. వేలమంది గిరిజన రైతులకు ఆధారం.. జిల్లాలో దాదాపు 68 వేల ఎకరాల్లో జీడి తోట లు సాగులో ఉన్నాయి. 30 వేల మంది రైతు లు వీటిపైనే ఆధార పడి జీవిస్తున్నారు. ఇందులో అత్యధికం గిరిజనులే. జీడిపిక్కల దిగు బడి దాదాపు మార్చి నాటికి వస్తున్నప్పటికీ.. ఏప్రిల్ వచ్చినా జీసీసీ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసు కోవడం లేదు. ఇప్పటికే గిరిజనులు దాదాపు 60 శాతం జీడి పిక్కలు దళారులకు విక్రయించేశారు. సిండికేట్గా మారుతున్న వ్యాపారులు జిల్లాలోని సీతంపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు జీడి తోటలపైనే చాలా ఏళ్లుగా బతుకుతున్నారు. ప్రసుత్తం జీడి పిక్కల ధర మార్కెట్లో కిలో రూ.180 వరకు ఉంది. గిరిజనులకు పంట చేతికందేసరికి దళారులు, వ్యాపారులు సిండికేట్గా మారుతున్నారు. జీడి పిక్కలను కిలో రూ.100 నుంచి రూ.130లోపే కొనుగోలు చేస్తున్నారు. దీంతో గిరిజన రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదు. వరి, మొక్కజొన్న, పత్తి మాదిరి జీడి పిక్కలకు మద్దతు ధర ఇవ్వాలని.. జీసీసీ, వెలుగు ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఎప్పటి నుంచో ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నా ఫలితం దక్కడం లేదు. వాస్తవానికి మన్యం జిల్లా జీడికి మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ఏటా ఈ సీజన్ అధికంగా రవాణా అవుతోంది. కనీసం జీడి పిక్కలను నిల్వ చేసుకునేందుకు గోదాములు కూడా జిల్లాలో అందుబాటులో లేవు. ప్రకటనలకే పరిమితమవుతున్న ప్రాసెసింగ్ యూనిట్లు జీడి పిక్కల ద్వారా మంచి ఆదాయం పొందేలా ఐటీడీఏల పరిధిలో ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించాలని అధికారులు తరచూ ప్రకటనలైతే చేస్తున్నారు గానీ.. ఆచరణలోకి రావడం లేదు. జీడిపప్పు మార్కెటింగ్లో రైతులు దళారుల బారిన పడకుండా వన్ధన్ వికాస్ కేంద్రాల ద్వారా మంచి ధర కల్పించేలా చూడాలని ఐటీడీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం, సాలూరుల్లో యూనిట్లను స్థాపించనున్నట్లు చెబుతున్నారు. ఇవన్నీ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి.. జీడి పిక్కలకు కిలో రూ.200, 80 కిలోల బస్తా రూ.16 వేల చొప్పున మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని పలు సందర్భాల్లో గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. వారి రోదనను పట్టించుకునే తీరిక ఎవరికీ ఉండటం లేదు. ఇటీవల పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ అధికారుల్లో చలనం రాలేదని గిరిజన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. -
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్గా శివనాగజ్యోతి
పార్వతీపురంటౌన్: పార్వతీపురం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ శివనాగజ్యోతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించా రు. ఇప్పటి వరకు ఆమె పాలకొండ ఏరియా ఆస్పత్రి వైద్యురాలిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బి.వాగ్దేవి డీసీహెచ్ఎస్గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి, మెరుగైన వైద్యసేవలు అందించి రిఫర్ కేసుల సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపడతామని డాక్టర్ శివనాగజ్యోతి తెలిపారు. ఏనుగుల విధ్వంసం భామిని: మండలంలోని బిల్లుమడ గ్రామ సమీపంలో తిష్టవేసిన ఏనుగుల గుంపు వ్యవసాయ బోర్లను ధ్వంసం చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. నేరడి–బికి చెందిన సరిసాబ ద్ర మిన్నారావుకు చెందిన వ్యవసాయ బోరు ను, పైపులను ఏనుగుల గుంపు ధ్వంసం చేశా యి. రైతు సమాచారంతో అటవీశాఖ అధికారు లు వచ్చి బోరును పరిశీలించారు. 1 నుంచి 10 తరగతులు ఒకే చోట సరికాదు పార్వతీపురం టౌన్: ఒకటి నుంచి 10వ తరగ తి వరకు తరగతులను ఒకే చోట నిర్వహించడం సరికాదని, వెంటనే ఈ ప్రతిపాదనను ప్రభు త్వం విరమించుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.బాలకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో ఆయన శుక్రవారం మా ట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన విద్యా విధానాలు విద్యారంగానికి మేలుచేసే విధంగా ఉండాలే తప్ప నష్టపరచకూడదన్నా రు. రానున్న విద్యాసంవత్సరం నుంచి 1557 పాఠశాలల్లో 1, 2 తరగతులు కూడా కలిపి 1 నుంచి 10 తరగతుల వరకు కొనసాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామన్నారు. రాష్ట్రం మొత్తం 9,200 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేసి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని నిర్ణయించడం, దాదాపు 700 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడం మంచిదేనన్నారు. అయితే, ఒక్కో పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని, విద్యార్థుల సంఖ్య 20 దాటితే మూ డో పాఠశాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలు 6 నుంచి 10 తరగతులు మాత్రమే ఉండాలన్నారు. 30 మందికి ఒక సెక్షన్ ఉంచుతూ ఆంగ్ల, తెలుగు మాధ్యమాలు సమాంతరంగా కొనసాగించాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో కలిపిన 3,4,5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలకు పంపాలన్నారు. ఫౌండేషన్ స్కూళ్ల పేరుతో రాష్ట్రంలోని దాదాపు 5వేల పాఠశాలలను కేవలం 1 ,2 తరగతులతో నిర్వహించడం వల్ల తల్లిదండ్రులు వారి పిల్లలను కేవలం రెండు సంవత్సరాల విద్యకోసం పంపించారని, వాటిని బేసిక్ ప్రైమరీ పాఠశాలలుగా మార్చి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. 21న కంచి విశ్వవిద్యాలయ ప్రవేశాలు విజయనగరం: కంచి విశ్వవిద్యాలయ ప్రవేశాలు ఈ నెల 21న విశాఖపట్నం శంకర మఠంలో నిర్వహించనున్నట్టు శ్రీకంచి కామకోటి శంకర మఠం అధ్యక్షుడు డాక్టర్ టి.రవిరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం ద్వారకానగర్ శంకర మఠంలో 21న, 22న విజయనగరంలోని సన్ స్కూల్ ఆవరణలో, అదే రోజు శ్రీకాకుళంలోని గాయత్రి స్కూల్, గీతాంజలి స్కూల్ ఆవరణలోనూ ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు యూనివర్సిటీ వీసీ ఆచార్య గుళ్లపల్లి శ్రీనివాస్, వైస్ చాన్సలర్ కె.వెంకటరమణ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
700 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం)/జియ్యమ్మవలస రూరల్: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా కురుపాం ప్రొహిబిషన్/ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని జియ్యమ్మవలస మండలం గడసింగుపురం గ్రామపరిసరాల్లో సారా తయారీ స్థావరాలపై శుక్రవారం నిర్వహించిన దాడిలో 700 లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా డీపీఈఓ ఆదేశాల మేరకు సీతానగరం ఎకై ్సజ్ స్టేషన్ సీఐ పద్మావతి, గజపతినగరం, బొబ్బిలి, కురుపాం ఎకై ్సజ్ స్టేషన్ల ఎస్సైలు నరేంద్రకుమార్, శ్రావణ్కుమార్, జె.రాజశేఖర్ తదితర సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారన్నారు. ఆ స్థావరంలో సారా తయారీ కోసం పులియబెట్టేందుకు ఉపయోగించిన ప్లాస్టిక్ టబ్బులతో పాటు 10 లీటర్ల సారాను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా సారా తయారీ శిబిరం నిర్వహిస్తున్న వారితో పాటు ముడిసరుకులు సరఫరా చేసే కోసం దర్యాప్తు నిర్వహిస్తున్నామని, దర్యాప్తులో వాస్తవాలు తేలితే చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. కొత్తవలసలో 200 లీటర్ల బెల్లం ఊట కొత్తవలస: మండలంలోని రామలింగాపురం గ్రామం సమీపంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ జీఎస్.రాజశేఖర నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన దాడుల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 200 లీటర్లు పులబెట్టిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అలాగే 4 లీటర్ల సారాను పారబోశారు. పోలీసుల అలికిడిన గమనించిన తయారీదారులు అక్కడి నుంచి జారుకున్నారు. సారా తయారీ, రవాణా, అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సీఐ తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్సై వీఎన్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
● కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సొంత క్యాంపస్ ● సువిశాల ప్రాంగణంలో చకచకా భవనాల నిర్మాణం ● వచ్చే విద్యాసంవత్సరానికల్లా సిద్ధం చేయడానికి కృషి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి 2023 ఆగస్టు 25వ తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసినచోటనే శాశ్వత క్యాంపస్ సమకూరుతోంది. గిరిజనుల జీవితాల్లో కాంతులు నింపాలంటే ఈ విద్యాదీపం నిబంధనల ప్రకారం వారి చెంతనే ఉండాలన్న ఆయన ఆశయం నెరవేరుతోంది. ప్రస్తుతం విజయనగరం శివారు గాజులరేగ వద్ద ఏయూ స్టడీ సెంటర్ భవనాల్లో తాత్కాలికంగా కొనసాగుతున్న ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థను ఎస్టీ రిజర్వుడ్ సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మెంటాడ మండలానికి మార్చేందుకు మార్గం సుగమమవుతోంది. పచ్చని కొండల నడుమ 561.88 ఎకరాల సువిశాలమైన ప్రకృతి రమణీయతతో కూడిన చక్కని ప్రాంతంలో విద్యాసౌరభాలు విరబూయనున్నాయి. రూ.834 కోట్ల నిధులతో భవనాల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. పరిపాలన భవనం (అడ్మిన్ బిల్డింగ్), తరగతి భవనాలు (అకడమిక్ బ్లాక్స్), విద్యార్థుల వసతి భవనాలను రానున్న విద్యాసంవత్సరానికి పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. -
ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు అన్యాయం
● జిల్లా రెల్లికుల సంఘం నాయకుడు గండి డేనియల్పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం రెల్లి, వాటి ఉపకులాల ఆవేదన ఏమాత్రం పట్టించుకోకపోడం చాలా అన్యాయమని జిల్లా రెల్లికుల సంఘం నాయకుడు గండి డేనియల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన స్వగృహంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రెల్లి ఉపకులాలలకు 1శాతం రిజర్వేషన్ కల్పించి తీవ్ర అన్యాయం చేశారన్నారు. రెల్లి సామాజిక వర్గానికి సంబంధించి ఆర్థిక, సామాజిక, ఉద్యోగ, రాజకీయాల్లో వెనుకబాటుతనం గురించి తెలిసికూడా ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించి ఆర్డినెన్స్ తేవడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. బలవంతులైన మాల, మాదిగలకే అధికప్రాధాన్యం ఇస్తున్నారని, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న రెల్లిలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల్లో ఇంతవరకు అభివృద్ధి చెందని వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని, కానీ కూటమి ప్రభుత్వం కులగణన ఇంతవరకు చేయలేదన్నారు. రెల్లి వాటి ఉపకులాలు చాలా తక్కవ జనాభా కలిగి ఉన్నాయని ఏ ఆధారాలతో నిర్ణయిస్తారని మండిపడ్డారు. లోపభూయిస్టమైన ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఆలోచించి రెల్లీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో గండి శరత్ చైతన్య, సొండి గౌరీశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
అన్నింటిలోనూ అటెండర్!
● పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పనులన్నీ చిరుద్యోగి కనుసన్నల్లోనే.. ● అధికారులపైనా హూంకరింపు ● మందు, విందుతో ప్రసన్నం చేసుకుంటున్న వైనం ● భార్య పేరుతో అధికారులకు అద్దెకార్లు ● దివ్యాంగ ఉద్యోగి స్థానంలో అనధికారికంగా మరొకరి నియామకం ● అదే వ్యక్తితో అధికారి ఇంటిలో వెట్టిచాకిరీ ● ఆయన తీరును చూసి విస్తుపోతున్న ఉద్యోగ వర్గాలు పార్వతీపురంటౌన్: ఆయన జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగంలో ఓ చిరుద్యోగి. అయితేనేం... ఆయనకు అందరూ సలాం చెప్పాల్సిందే. ఎదురు ప్రశ్నించేవారు అధికారి అయినా స్థానిక బలాన్ని అడ్డుపెట్టుకుని ముందు బెదిరిస్తారు. తర్వాత మందు, విందుతో మచ్చిక చేసుకుంటారు. తర్వాత అన్నీ తానై వ్యవహరిస్తారు. ఆ శాఖ పరిధిలో ఏ పని జరగాలన్నా ఆయన అనుమతి ఉండాల్సిందే. కమీషన్ ఇచ్చుకోవాల్సిందే.! సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఒకే చోట మూడేళ్లు, ఐదేళ్లు పనిచేస్తే బదిలీలు జరగడం సహజం. ఆయన మాత్రం 20 ఏళ్లుగా అదే కార్యాలయంలో పాతుకుపోయారు. కొన్నేళ్లుగా చిరుద్యోగి సాగిస్తున్న దందా, అవినీతి పనులతో ఉద్యోగవర్గాలు కలవరపడుతుండగా, ఆయన మాత్రం ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నారు. అంతా వ్యాపారమే.. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయాన్ని ఆ చిరుద్యోగి వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ప్రశ్నించిన అధికారులపై స్థానిక నేతలతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నారు. తన భార్యపేరిటి మూడు షిప్ట్ డిజైర్ కార్లను డీపీఆర్ఈఓ, మరో ఇద్దరు మండలాభివృద్ధి అధికారులకు ఎంగేజ్లో పెట్టినట్టు సమాచారం. ఇంజినీరింగ్ శాఖ పరిధిలో బిల్లుల అంచనా, ప్రతిపాదనలు, చెల్లింపుల్లో ఆయనదే పైచేయి. దీనికోసం అధిక మొత్తంలో వసూళ్లుచేసి పై అధికారులకు అందజేసేందుకు మధ్యర్తిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తన పనులు, కారు బిల్లులు సకాలంలో పొందేందుకు అధికారులకు మందు, విందు ఇస్తున్నారు. కార్యాలయాన్ని బార్గా మార్చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మన్ననలు పొందేందుకు... అధికారుల మన్ననలు పొందేందుకు ఆ చిరుద్యోగి ఎంతకై నా తెగిస్తారని రుజువైంది. కార్యాలయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చేస్తారు. ఆ శాఖలో కీలక అధికారి అండదండలతో అదే శాఖలో పనిచేస్తున్న దివ్యాంగ నైట్వాచ్మన్ను బెదిరించి, ఆయన వద్ద నుంచి నెలకు రూ.10వేలు వసూలుచేస్తూ ఆ స్థానంలో వేరే ప్రైవేటు వ్యక్తిని నియమించారు. ఆ వ్యక్తితో కీలక అధికారి ఇంటిలో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఆ అధికారి మన్ననలు పొందుతూ తన పనులను చక్కబెట్టుకుంటున్నారు. బిల్లుల చెల్లింపులో రూ.లక్షలు దండి వాటాలు పంచుతున్నారన్నది ఆ శాఖ వర్గాల్లోనే కొందరు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం. ఆయన తీరు అందరికీ తెలిసినా చర్యలు తీసుకునేందుకు వెనుకడుగువేస్తున్నారంటే ఆయన ఆర్థిక శక్తిని అర్థం చేసుకోవచ్చు. ఇలాగే వదిలేస్తే అందరికీ ‘టెండర్’ పెడతారని, కార్యాలయానికి మాయని మచ్చను తెస్తారని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ●చర్యలు చేపడతాం పంచాయతీరాజ్ శాఖలో అటుంటి ఉద్యోగు లు ఉంటే వారిపై చర్యలు చేపడతాం. ఓ ఉద్యోగి సొంతకార్లు నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చింది. ప్రభుత్వ నిబంధనలకు ఇది విరుద్ధం. ఇతర అంశాలపైనా విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు చేపడతాం. – చంద్ర శేఖర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి -
గొలుసు దొంగల ఆటకట్టు
● మూడు కేసుల్లో నలుగురు నిందితుల అరెస్ట్ ఎంవీపీకాలనీ: నగరంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన వరుస గొలుసు దొంగతనాల కేసులను ద్వారకా క్రైం పోలీసులు ఛేదించారు. ఎంవీపీ క్రైం పోలీస్స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ద్వారకా క్రైం ఏసీపీ లక్ష్మణరావు ఆ వివరాలు వెల్లడించారు. నగరంలో వరుస దొంగతనాలు జరగడంతో క్రైం పోలీసు విభాగం అప్రమత్తమై త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ●శివాజీపాలెంలో శోభారాణి అనే మహిళ నుంచి 4 తులాల బంగారు గొలుసు అపహరించిన నిందితులకు తీవ్ర నేర చరిత్ర ఉన్నట్లు తెలిపారు. విజయవాడకు చెందిన నాగరాజు, ఇమ్రాన్లను ఈ కేసులో నిందితులుగా గుర్తించామని, ఇప్పటికే నాగరాజుపై 35, ఇమ్రాన్పై 25 పాత కేసులు నమోదైనట్లు చెప్పారు. ●మద్దిలపాలెం చైతన్యనగర్కు చెందిన హేమలత అనే మహిళ నుంచి బంగారు గాజులు, చైను లాక్కొని పరారైన నిందితుడు విజయనగరానికి చెందిన సిరిపురపు వెంకటరమణగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు క్రైం ఏసీపీ తెలిపారు. అతనికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని వెల్లడించిన ఏసీపీ.. అతని నుంచి రూ.10 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దొంగిలించిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో రూ.2,80,500కు నిందితుడు తాకట్టు పెట్టినట్లు వివరించారు. ముత్తూట్ ఫైనాన్స్ నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయాల్సి ఉందన్నారు. ●ఎంవీపీ కాలనీలో లలిత అనే 90 ఏళ్ల మహిళ మెడలో రెండు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటనలో నిందితుడు రైల్వే న్యూ కాలనీకి చెందిన పిడుగు జగదీష్గా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. -
కొబ్బరిబొండాల వ్యాన్ బోల్తా
సీతానగరం: మండలంలోని అంటిపేట వద్ద కొబ్బరి బొండాల వ్యాన్ బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. దీనిపై అంటిపేట గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలంలోని అంటిపేట మీదుగా పార్వతీపురం వెళ్తున్న కొబ్బరిబొండాల వ్యాన్ అంటిపేట గ్రామ శివారులో వ్యక్తిని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న పొలంగోతిలో పడింది. వ్యాన్ డ్రైవ్రర్కు చిన్నపాటి గాయాలయ్యాయి. వ్యాన్ ముందు వీల్స్ మట్టిలో కూరుకుపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు చెబుతున్నారు. జేసీబీ, 3 ట్రాక్టర్లు సీజ్బొండపల్లి: మండలంలోని వెదురువాడ పంచాయతీ పరిధి పాడిపేట గ్రామ సమీపంలో అక్రమంగా గ్రావెల్ మట్టిని తవ్వి వెదురువాడలోని జిరాయితీ భూమిలో వేస్తుండగా అందిన ఫిర్యాదు మేరకు 1 జేసీబీతో పాటు, మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తహసీల్దార్ డోలా రాజేశ్వర్రావు తెలిపారు. ఈ సందర్భంగా జేసీబీ డ్రైవర్ శీల గణేష్తో పాటు తాడి పైడినాయుడు, శీల శ్రీను, యడ్ల గోపిలు గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్ చేసి రూ.25 వేలు జరిమానా విధించినట్లు చెప్పారు. సీజ్ చేసిన వాహనాలను బొండపల్లి పోలీస్స్టేషన్కు తరలించి ఎస్సై యు.మహేషకు అప్పగించినట్లు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం జిల్లా గనుల శాఖ ఎ.డికి నివేదిక అందజేసినట్లు తెలిపారు. పిడుగుపాటుతో ఆవు మృతిసాలూరు రూరల్: మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం కురిసిన పిడుగుల వర్షంతో పిడుగుపాటుకు గురై గ్రామానికి చెందిన హరిశ్రీను ఆవు మృతి చెందింది. పొలంలో మేత మేస్తుండగా అకస్మాత్తుగా గాలి వర్షంతో పాటు పిడుగులు పడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన విషయంలో గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల అభ్యున్నతికి కమిషన్ కృషి● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు విజయనగరం అర్బన్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. షెడ్యూల్ ప్రాంతాల్లో భూములపై గిరిజనులకే హక్కులు దక్కేలా చర్యలు తీసుకోవాలని ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్ సంస్థ ప్రతినిధులు పలువురు శుక్రవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం చేసిన చట్టాలు అమలయ్యేలా చూడాలని వారు కోరారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన భూసమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేస్తూ వారి సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కమిషన్ కృషి చేస్తోందన్నారు. గిరిజన ప్రాంతవాసుల సమస్యలు కమిషన్ దృష్టిలో ఉన్నాయని సంబంధిత చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వాన్ని కమిషన్ కోరుతున్నట్లు చెప్పారు. చైర్మన్ను కలిసిన వారిలో అజయ్కుమార్, తిరుమల రావు, గోపాలరావు, చంద్రరావు తదితరులు ఉన్నారు. -
స్వచ్ఛంద భూదానోద్యమం రావాలి
● ఆచార్య వినోబా భావేకు లోకసత్తా ఘనంగా నివాళివిజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో స్వచ్ఛంద భూదానోద్యమానికి రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్ధలు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో స్వచ్ఛంద భూదాన ఉద్యమం సృష్టికర్త స్వాతంత్య్ర సమరయోధుడు, ఆచార్య వినోబా భావే చేపట్టిన భూదాన ఉద్యమం 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వినోబాభావే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ.. వినోబా భావే పాదయాత్ర చేస్తూ..1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని పోచంపల్లిలో స్వచ్ఛంద భూదాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టి అక్కడ జమీందారు వెదిరే రామచంద్రారెడ్డి మనసును గెలిచి వంద ఎకరాల భూమిని దానంగా స్వీకరించారన్నారు. తెలంగాణలో 1.30లక్షల ఎకరాలు, ఆంధ్రాలో 80 వేల ఎకరాలు వినోబా భావే సేకరించినవి ఉన్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో సుమారు రెండు లక్షల యాభై ఎకరాలు పేద ప్రజలకు దాదాపు 50లక్షల ఎకరాల భూమిని దానంగా స్వీకరించి 1965లో అప్పటి ప్రధాని లాల్బహుదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో భూదాన్ గ్రామ్దాన్ చట్టం వచ్చేలా చేశారని కొనియాడారు. తన తాత స్వాతంత్య్ర సమరయోధుడు, స్వర్గీయ భీశెట్టి అప్పారావు అనకాపల్లి శాసనసభ్యుడిగా వినోబా భావే స్ఫూర్తితో స్వచ్ఛంద భూదాన్ ఉద్యమంలో పాల్గొని పేదలకు భూములు పంచారని భీశెట్టి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అల్లంశెట్టి నాగభూషణం, థాట్రాజు రాజారావు, బోరరమేష్, పౌరవేదిక ప్రతినిధులు జలంత్రి రామచంద్ర రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రాను విజయవంతం చేయాలి
పార్వతీపురంటౌన్: ప్రతి శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ శుక్రవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరగాలని స్పష్టం చేశారు. ‘ఇ వేస్ట్ మేనేజ్మెంట్’ శీర్షికన ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొని పరిశుభ్ర వాతావరణం నెలకొనే విధంగా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మండల ప్రత్యేకాధికారులు, మండల అధికారులు మండల స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రజలను పెద్ద ఎత్తున కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కోరారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండడం, కార్యాలయంలో ఇవేస్ట్ నివారణకు తగిన చర్యలు చేపట్టడం, పట్టణ ప్రాంతాల్లో ఇవేస్ట్ సేకరణ చేసి నిల్వ చేసేందుకు అవసరమైన ప్రదేశాలను గుర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో పదివేల జనాభా కంటే ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ కార్యకలాపాలను చేపట్టి, చురుగ్గా పాల్గొనాలని అన్నారు. చెత్త నుంచి సంపద తయారీ కావాలి జిల్లాలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలన్నీ పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గల 212 చెత్త నుంచి సంపద కేంద్రాల నుంచి వర్మీకంపోస్టు ఉత్పాదకత జరగాలని స్పష్టం చేశారు. వర్మీ కంపోస్టు విక్రయించి స్వయం సాధికారత సాధించాలని సూచించారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
డీఐజీ ఆధ్వర్యంలో నాకాబందీ
● విజయనగరంలో రెండు గంటల పాటు పోలీసుల తనిఖీలు ● 20 కిలోల వెండి, 50 వాహనాలు సీజ్విజయనగరం క్రైమ్: నాకాబందీ, కార్డన్సెర్చ్లు వంటి స్పెషల్ ఆపరేషన్లతో పోలీసులు జిల్లాలో తాము ముందుగా నిర్దేశించిన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో విజయనగరంలో గురువారం రాత్రి విశా ఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో ఎస్పీ వ కుల్ జిందల్ స్వీయ పర్యవేక్షణలో ఆకస్మిక త నిఖీలు చేశారు. రాత్రి రెండు గంటల పాటు విస్తృతంగా విజయనగరాన్ని మొత్తం పోలీసులు జల్లెడ పట్టారు. నగరంలోని వై జంక్షన్, వీటీఅగ్రహారం, మయూరీ జంక్షన్, రైల్వే స్టేషన్, ఎత్తుబ్రిడ్జి, ఆర్అండ్బీ, కంటోన్మెంట్, కలెక్టరేట్, ఉడాకాలనీ, కామాక్షినగర్, గంటస్తంభం, గూడ్స్ షెడ్, కన్యకాపరమేశ్వరి టెంపుల్, మూడు లాంతర్లు, నీళ్ల ట్యాంక్, దాసన్నపేట, కోట జంక్షన్లో ముగ్గురు డీఎస్పీలు,14 మంది సీఐలు, 44 మంది ఎస్సైలు 276 మంది కానిస్టేబుల్స్తో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ ఈ ఆకస్మిక తనిఖీలో 51 వాహనాలను సీజ్ చేశామన్నారు. అలాగే 4,437వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశామని చెప్పారు. ప్రధానంగా వన్ టౌన్స్టేషన్ పరిధిలో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 20 కిలోల వెండిని పట్టుకున్నామని తెలిపారు. అలాగే ఒక ఇసుక లారీ, 8 మద్యం బాటిల్స్ సీజ్ చేశామని చెప్పారు. మద్యం తాగిన వారిపై వంద కేసులు బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై రెండు కేసులు నమోదు చేశామని ఎస్పీ వివరించారు. ఆకస్మిక తనిఖీల్లో విజయనగరం కలెక్టరేట్ జంక్షన్ వద్ద విజయనగం టౌన్ డీఎస్పీ శ్రీనివాస్, బొబ్బిలిలో డీఎస్పీ భవ్యా రెడ్డి, చీపురుపల్లి రైల్వేస్టేషన్ వద్ద డీఎస్పీ రాఘవులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారని ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా తెలియజేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు నాకాబందీ పార్వతీపురం రూరల్: చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా వాహనాల తనిఖీ స్పెషల్ డ్రైవ్ (నాకాబందీ) చేపట్టినట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన స్వయంగా గురువారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలో ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. అలాగే జిల్లావ్యాప్తంగా ఆయా స్టేషన్ల ఎసైలు వారి పరిధిలో ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధానంగా చెక్పోస్టుల వద్ద, ప్రధాన కూడలివద్ద స్టాపర్లు ఏర్పాటు చేసి గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమరవాణా, మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, అధిక లోడ్ ఉన్న వాహనాలు, రికార్డుల పరిశీలన, పెండింగ్ చలానాలు తదితర చట్ట వ్యతిరేక కార్యక్రమాల కట్టడికి ఈ ఆకస్మిక తనిఖీలు ఒకేరోజు జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ అధికారులు నిర్వహించినట్లు తెలిపారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పార్వతీపురం ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ శివారు ప్రాంతాలైన వెంకంపేట గోరీలు, ఎస్వీడీ కళాశాల వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో స్వయంగా పాల్గొని వచ్చిపోయే వాహనాలను ఆపి సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ127 శ్రీ218 శ్రీ228మెరిట్ జాబితా విడుదలగుమ్మలక్ష్మీపురం: ఏకలవ్య, ఆదర్శ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు సంబంధించిన మెరిట్ జాబితా, విద్యార్థులు ఎంపికై న పాఠశాలల వివరాలను ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ అధికారిక వెబ్సైట్ http://twreircet.apcfss.in లో పొందుపర్చినట్లు గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వీర్సింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విద్యార్థులు/తల్లిదండ్రులు వారి మెరిట్ స్థితిని, ఏ పాఠశాలకు ఎంపికయ్యారో ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకుని తదనంతరం చర్యలకు సిధ్ధపడాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులు తగిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో 2025 ఏప్రిల్ 21 నుంచి 30వ తేదీలోగా ఆయా ఎంపికై న పాఠశాలలకు హాజరై నమోదు ప్రక్రియను పూర్తిచేసుకోవాలని చెప్పారు. ప్రవేశాలకు గడువును పొడిగించబోరని స్పష్టం చేశారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలువిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల గుడివాడలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించి విజయనగరం కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారు. స్థానిక కోడి రా మ్మూర్తి వ్యాయామ సంఘం ప్రతినిధి, అభిన వ భీమ పెద్ది లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో శిక్షణ పొందిన క్రీడాకారులు స్ట్రాంగ్ ఉమన్ జారా గోల్డ్ మెడల్ సాధించగా, ఉదయ్ అనే మరో క్రీడాకారుడు ద్వితీయస్థానంలో నిలిచి సి ల్వర్ మెడల్ సాధించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అభినందించారు. బైపీసీ విద్యార్థులకు అవకాశం శ్రీకాకుళం రూరల్: ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు పారామెడికల్ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు రాగోలులోని బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 19లోగా దర ఖాస్తు చేసుకోవాలని కోరారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం కల్పించి ఫీజును జీతంలో మినహాయిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9121999654, 76809 45357 నంబర్ను గానీ, రాగోలు జెమ్స్ ఆసుపత్రి లోని బొల్లినేని మెడిస్కిల్స్ను గానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పోలీస్ కుటుంబానికి సిబ్బంది ‘చేయూత’ ● రూ.3 లక్షల ఆర్థిక సాయం విజయనగరం క్రైమ్: ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన కానిస్టేబుల్ సీహెచ్.గోపాలరావు కుటుంబానికి ఏఆర్, సివిల్ సిబ్బంది అండగా నిలిచారు. తాము పోగుచేసిన సొమ్ము రూ.3 లక్షల 60 వేల నగదును ఎస్పీ వకుల్ జిందల్ చేతుల మీదుగా మృతుడి సతీమణి శారదకు గురువారం అందజేశారు. 2000 బ్యాచ్కు చెందిన ఏపీఎస్పీ, ప్రస్తుతం ఏఆర్ కన్వర్షన్గా బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్న మిలీనియం బ్యాచ్ కానిస్టేబుల్స్ స్వచ్ఛందంగా పొదుపు చేసిన రూ.3లక్షల 60వేలను సహచర ఉద్యోగి అకాలమరణం చెందడంతో ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థికంగా భరోసా కల్పించారని ఎస్పీ వకుల్ జందల్ ఈ సందర్భంగా అన్నారు. మృతుడి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం సకాలంలో కల్పించే విధంగా చర్యలు చేపడతామని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అందుకుగల సర్టిఫికెట్లను డీపీఓలో అందచేయాలని మృతుడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, ఆర్ఐలు గోపాలనాయుడు, రమేష్, శ్రీనివాస్ రావు, మిలీనియం బ్యాక్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరావు, ఉమా మహేశ్వరరావు, పైడితల్లి, కృష్ణమోహన్, శేషగిరి, రమేష్, మోహన్, రమేష్, హరిశంకర్, చిట్టిబాబు, సీతారాం, చక్రధర్, ప్రసాద్లు పాల్గొన్నారు. -
ఇంటర్ తప్పిన విద్యార్థులు 22లోగా పరీక్షఫీజు చెల్లించాలి
పార్వతీపురంటౌన్: ఇటీవల మార్చి నెలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం ఇంటర్ బోర్డు పేర్కోన్న నిర్ణీత గడువులోగా ఫీజులు చెల్లించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ ఫీజు చెల్లించేందుకు తుది గడువు అనే విషయాన్ని విద్యార్థుల తల్లితండ్రులు గమనించాలని కోరారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరాల్లో గ్రూప్ సబ్జెక్టులకు సంబంధించి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. సబ్జెక్టు వారీగా ఇంప్రూవ్మెంట్కు హాజరయ్యే విద్యార్థులు రూ.600తో పాటు అదనంగా ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చెప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులు రూ.275, ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సులకు హాజరయ్యే వారు రూ. 165 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ బీఐఈ.ఏపీ.జోఓవీ.ఐన్ ద్వారా ఆన్లైన్లో ఈ నెల 22వ తేదీలోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12న ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు మే.28 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. నైతికత, మానవ విలువలు పరీక్ష జూన్ 4న, పర్యావరణ విద్య పరీక్ష జూన్ 6న జరగనున్నట్లు వివరించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి మంజుల వీణ -
1800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం)/జియ్యమ్మవలస రూరల్: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని చినమేరంగి గ్రామ పరిసరాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సారా స్థావరాలపై గురువారం నిర్వహించిన దాడుల్లో 18 ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 1800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈమేరకు సీఐ వీవీఎస్ శేఖర్బాబు, కురుపాం ఎకై ్సజ్ ఎస్సైలు రాజశేఖర్, చంద్రకాంత్లు తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఈ దాడుల్లో 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా సారా స్థావరాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పాటు వారికి ముడిసరుకు సరఫరా చేసిన ఇద్దరు వ్యాపారులపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని, నిర్ధారణ అయితే వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. వెయ్యిలీటర్ల సారా ఊటలు ధ్వంసం భామిని: మండలంలోని కొత్తగూడలో గురువారం సారా అమ్మకం దారులపై దాడులు జరిపి 40లీటర్ల సారాతో ఇద్దరు అమ్మకం దారులు బిడ్డిక రవి, బిడ్డిక కొండలరావులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఏఈఎస్ ఏఎస్,దొర ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే దాడిలో వెయ్యి లీటర్ల సారా ఊటలు ధ్వంసం చేసి సారా తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పాలకొండ ఎకై ్సజ్ సీఐ కె.సూర్యకుమారి సారథ్యంలో నవోదయం 2 కిం సారా నిర్మూలనలో భాగంగా సారా తయారీకి బెల్లం అందిస్తున్న ఘనసరకు చెందిన భూపతి షణ్ముఖపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. దాడుల్లో పాలకొండ సీఐ సూర్యకుమారితో పాటు మొబైల్ సీఐ మురళి, కొత్తూరు సీఐ కిరణ్మయి, పి.లీలారాణి, పాలకొండ ఎస్సై కొండలరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పేదల భూముల ఆక్రమణపై విచారణ జరిపించండి
సాలూరు: నియోజకవర్గంలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో దళితులు, గిరిజనులు, నిరుపేదల భూములు అన్యాయంగా ఆక్రమణలకు గురవుతున్నాయని, మంత్రి సంధ్యారాణికి చిత్తశుద్ధి ఉంటే వాటన్నింటిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మండలంలోని మోసూరు గ్రామంలో దళితులు సుమారు 24 ఏళ్ల క్రితం, వారికి పట్టాలివ్వక ముందు నుంచి బంజరుభూములు సాగుచేసుకోగా తరువాత ప్రభుత్వం వారికి పట్టాలిచ్చిందన్నారు. ఈ పట్టాలు ఇచ్చి సుమారు 20 సంవత్సరాలు దాటిపోయిందని, సుమారు 24 ఏళ్లుగా సాగుచేస్తున్న దళితుల భూముల మీదకు ఇటీవల విచారణలో భాగంగా అధికారులు స్థానిక బీసీలను తీసుకువెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మోసూరులో పాఠశాల భవనం కట్టిన స్థలం ప్రభుత్వానిదా? లేక జిరాయితీ స్థలమా? అన్న విషయం అధికారులు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తేల్చకుండానే దళిత ఎంఈఓపై సస్పెన్షన్ విధించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరాయితీ స్థలంలో పాఠశాల భవనం నిర్మించారని, పాఠశాల కావడంతో ఎవరూ ఏమీ అనలేదన్నారు. తరువాత భవనం పడిపోయి నిపపయోగంగా ఉండడంతో, స్థలం యజమాని భూమిని అమ్మగా స్థానిక సర్పంచ్ కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఇల్లు నిర్మించుకున్నారన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేసిన తరువాత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే మోసూరు గ్రామంలో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేయగా, చెరువు ఆక్రమణ వాస్తవమేనని అంగీకరిస్తూ అది ఎవరు ఆక్రమించారో తెలియదని రెవెన్యూ అధికారులు పేర్కొనడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ భూములు పేదలకు ఇవ్వాలి నిజంగా గ్రామంలోని చెరువులు ప్రభుత్వానికి అవసరం లేకపోతే అక్కడ ఉన్న దళితులు, గిరిజనులు, బీసీ, అగ్రవర్ణ పేదలకు ఇవ్వాలని కోరారు. దళితులు, గిరిజనుల భూములను ఎక్కడైనా ఎవరైనా ఆక్రమిస్తే దర్యాప్తు చేయించి, దర్యాప్తును అనుసరించి సర్వే చేసి అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయ పడ్డారు. ఇటీవల అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో తాను మాట్లాడిన విషయాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంపై రాజన్నదొర స్పందిస్తూ, తాను మాట్లాడిన విషయాలను అంశాల వారీగా ప్రజలకు మీడియా ద్వారా వివరిస్తానన్నారు. ఆ సభలో తాను అంబేడ్కర్ రాజ్యాంగం గురించి మాత్రమే మాట్లాడానని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు, మున్సిపల్ వైస్చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ గిరిరఘు, వైఎస్సార్సీపీ నాయకుడు మొకర లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ -
ప్రతి 3 నెలలకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం
విజయనగరం అర్బన్: ఎస్సీ, ఎస్టీ కులాలు, షెడ్యూల్ తెగలపై జరుగుతున్న దాడులపై నిర్వహించే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఇక నుంచి ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. సమావేశం నిర్వహించిన అనంతరం మినిట్స్ను కలెక్టర్కు పంపాలని, అక్కడి అంశాలపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా 30న అన్ని మండలాల్లో ఎస్హెచ్ఓ, తహసీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే జరపాలని, ఆ మీటింగ్ మినిట్స్ను పంపాలని ఆదేశించారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ కాలనీల్లో కొన్ని చోట్ల స్మశానాలు లేవని, మరికొన్ని చోట్ల ఆక్రమించుకున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ముగ్గురు ఆర్డీఓలు అన్ని ఎస్సీ కాలనీల్లో తనిఖీ చేసి శ్మశానాలు ఎక్కడెక్కడ లేవో, ఎక్కడెక్కడ ఆక్రమణకు గురయ్యాయో పరిశీలిలంచి నివేదిక పంపాలని ఆదేశించారు. కొన్ని చోట్ల 2 గ్లాస్ల విధానం ఇంకా అమలవుతోందని సమావేశం దృష్టికి తీసుకెళ్లగా చట్టంపై పోలీసులు అవగాహన కలిగించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ రఘురాజు, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఏఎస్పీ సౌమ్యలత, సోషల్ వెల్ఫేర్ డీడీ రామానందం, ఏపీజీఎల్ఐ ఎ.డి హైమవతి, ట్రాన్స్కో ఎస్ఈ లక్ష్మణరావు, డీఎస్పీలు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్
● విజేత బలిజిపేట ● బహుమతులు అందజేసిన ఏఆర్ ఏఎస్పీవిజయనగరం క్రైమ్: స్థానిక పోలీస్ బ్యారెక్స్లో నిర్వహించిన ఏఆర్ కానిస్టేబుల్ సీహెచ్.గోపాలరావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్లో ముగింపు వేడుకలకు ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై బుధవారం రాత్రి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ వాలీబాల్ పోటీలలో నాలుగు పోలీస్స్టేషన్ల పరిధికి చెందిన ఏఆర్,సివిల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఏఆర్ కానిస్టేబుల్గా పని చేసిన గోపాలరావు ఏఆర్ విభాగానికి ఓ డాక్టర్గా సేవలందించారని కొనియాడారు. ఆయన జ్ఙాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం ఆయన సేవలను గుర్తుంచుకోవడమేనన్నారు.ఈ టోర్నమెంట్లో ప్రథమస్థానంలో నిలిచిన బలిజిపేట జట్టుకు రూ.12 వేలు, ద్వితీయస్థానంలో నిలిచిన గంట్యాడ జట్టుకు రూ.8 వేలు తృతీయ స్థానంలో నిలిచిన కొత్తవలస జట్టుకు రూ.6 వేలు కన్సొలేషన్ ప్రైజ్గా విజయనగరం జట్టుకు రూ.4 వేలు ఏఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐలు గోపాలరావు, శ్రీనివాసరావు, ఆర్ఎస్సైలు సూర్యనారాయణ, రామారావు, మహేష్, ముబారక్ ఆలీ, దివంగత కానిస్టేబుల్ కుటుంబసభ్యలు పాల్గొన్నారు. -
లైంగికదాడి కేసులో ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి పోలీస్స్టేషన్లో 2020వ సంవత్సరంలో నమోదైన లైంగికదాడి కేసులో ముద్దాయికి విజయనగరం మహిళాకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎన్.పద్మావతి పదేళ్ల కారాగార శిక్ష, రూ. 5వేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ వివరాలను వెల్లడిస్తూ..గరుగుబిల్లి మండలం, దళాయివలస గ్రామానికి చెందిన ఫిర్యాదిదారు జీవనోపాధి నిమిత్తం 2017వ సంవత్సరంలో ఆకివీడులోని రొయ్యల పరిశ్రమలో పనిచేస్తూ కంపెనీ హాస్టల్లో ఉంటూ జీవనం సాగిస్తుండగా..అదే సంవత్సరంలో గరుగుబిల్లి మండలం, కొంకడివరం గ్రామానికి చెందిన ముద్దాయి బలగ శివ జీవనోపాధి నిమిత్తం అక్కడికి వెళ్లాడని చెప్పారు. ఈ క్రమంలో బాధితురాలిని ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని అభయమిచ్చి పలుమార్లు శారీరకంగా లోబరుచుకుని మోసం చేశాడన్నారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు 2020లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువైన మేరకు విజయనగరం న్యాయస్థానం పైవిధంగా శిక్ష ఖరారు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును సంబంధించి దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
తప్పని ఆధార్ తిప్పలు
● కార్డులో మార్పులకు అవస్థలు ● జిల్లాలో పనిచేయని కేంద్రాలు ● సచివాలయాల్లో మూలన పడిన పరికరాలు ● జిల్లా కేంద్రంలో పోస్టాఫీసు వద్ద మాత్రమే నమోదు పార్వతీపురంటౌన్: ● సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన ఊర్మిళ తన చంటి బిడ్డతో దయనీయంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద వేచిచూస్తోంది. తనకు ఆధార్లో అడ్రస్ మార్పు గ్రామ సచివాలయంలో అవడం లేదని జిల్లా కేంద్రంలో బీఎస్ఎన్ఎల్, పోస్టల్ కార్యాలయాల వద్ద అప్డేట్ అవుతుందన్న సమాచారం తెలుసుకుని పట్టణానికి వచ్చింది. సర్వర్ పనిచేయడం లేదని, 4గంటల కాలం పాటు వేచి చూసి వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయింది. ● కొమరాడ మండలం పొడుగువలస గ్రామానికి చెందిన కిల్లక అరుణ మూడు రోజులుగా ఆధార్ అప్డేట్ కోసం వేచి చూస్తోంది. ప్రతిరోజూ బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వచ్చి వేచి చూస్తున్నా ఆమెకు టోకెన్ దొరకడం లేదు. సిబ్బందిని టోకెన్ కావాలని అడగ్గా వారం రోజుల పాటు టోకెన్లు ఇచ్చేశామని, అయినా సర్వర్ పనిచేయడం లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.● పార్వతీపురం మండలం ఆర్కె బట్టివలస గ్రామానికి చెందిన వెంకీ తన కుమార్తె, కుమారుడు నాని, దివ్యల ఆధార్ అప్డేట్ చేయడానికి మూడు రోజులుగా పార్వతీపురం పట్టణంలోని పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ టోకెన్లు లేవన్న కారణంతో అప్డేట్ చేయలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నాడు. -
అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమా..?
ఇలా ఈ ముగ్గురే కాదు. జిల్లాలోని వందలాది మంది ప్రజలు ఎన్ని ఆపసోపాలు పడినా..ఆధార్ కష్టాలు తీరేలా కనిపించడం లేదు. జిల్లాలోని ఏ సచివాలయానికి వెళ్లినా, ఎవరిని అడిగినా జిల్లా కేంద్రంలో పెదపోస్టాఫీసుకు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లండి, అక్కడైతేనే చేస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం జిల్లాలో సరైన ఆధార్ కేంద్రాలు లేకపోవడమేనని తెలుస్తోంది. గతప్రభుత్వం సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోక పోవడం, సచివాలయాల్లో సరైన పరికరాలు లేకపోవడం, పరికరాలు ఉన్నా సిబ్బంది అందుబాటులో లేకపోవడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో హెడ్్పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడా టోకెన్లు ముందుగానే బుక్ అవుతున్నాయి. దీంతో జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఒక రోజుకు వందటోకెన్లకు పైగా బుక్ అవుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వేకువ జామునుంచే పడిగాపులు హెడ్పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో ఆధార్ మార్పుల కోసం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు వేకువ జామునుంచే టోకెన్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం ఈ కార్యాలయాల వద్ద సుమారు 150మందికి పైగా ఒకేసారి వచ్చారు. టోకెన్లు ముందే బుక్ అయ్యాయని తెలియక పడిగాపులు కాశారు. ఈ విషయం ఆలస్యంగా అధికారులు చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొందరు టోకెన్ల కోసం క్యూలో వేచి ఉన్నారు. జిల్లాలో ఆధార్, సెంటర్లు ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ సేవా కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో దాదాపు పదుల సంఖ్యలో బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలు ఉన్నా ఎక్కడా సేవలు అందించడం లేని తెలుస్తోంది. గతంలో సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిబ్బంది కొరత, పరికరాలను మూలపడేసిన కారణంగా మారుమూల గ్రామస్తులు జిల్లా కేంద్రంలో ఉన్న బీఎస్ఎన్ఎల్, హెడ్పోస్టాఫీసుకు రావాల్సిన దుస్థితి నెలకొంది. -
కదం తొక్కిన కూలీలు
చేసిన కష్టానికి ఫలితం దక్కదు. పని ప్రాంతంలో కనీస వసతులు ఉండవంటూ ఉపాధి వేతనదారులు..రాజకీయ ఒత్తిళ్లతో పని సక్రమంగా చేయలేకపోతున్నామని ఫీల్డ్ అసిస్టెంట్లు, తమకు పారితోషికం ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ ఉపాధి మేట్ల ఆగ్రహం పెల్లుబకడంతో అంతా కలిసి కలెక్టరేట్ వద్ద కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధి పథకంలో పనిచేస్తున్న వేతనదారులు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లాకేంద్రంలో గురువారం కలెక్టరేట్ వద్ద వెళ్లగక్కిన ఆవేదన ఇలా ఉంది. ●12 వారాలుగా అందని వేతనాలు ఉపాధి వేతనదారులకు గడిచిన 12 వారాలుగా వేతనాలు చెల్లించడం లేదు. పనిజరిగే ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. వేసవికాలం దృష్ట్యా కల్పించాల్సిన సదుపాయాలు కానరావడం లే దు. ఒక పూట పని మాత్రమే చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – బిడ్డిక సరోజ, ఉపాధి వేతనదారు, కిల్లాడ గ్రామం, సీతంపేట మండలంఉద్యోగభద్రత కల్పించాలి ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మేన్డేస్ విధానాన్ని రద్దుచేయాలి. రాజకీయ ఒత్తిళ్లతో విధుల నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి నియమించాలి. ప్రతి ఒక్కరినీ ఫీల్డ్ అసిస్టెంట్గా గుర్తించి రూ. 26వేలు కనీస వేతనం అమలు చేయాలి. న్యాయమైన సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి. – ఎ. జానకీరావు, ఫీల్డ్ అసిస్టెంట్, పెద్దూరు గ్రామం, సీతంపేట మండలం పార్వతీపురం టౌన్: మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలపై కదం తొ క్కారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గురువారం నిరసన తెలి యజేశారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్కు తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఉపాధిహామీ పథకం ముఖ్య ఉద్దేశమైన గ్రామీణ పేదరిక నిర్మూలన, వలసల నివారణలో భాగంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. వేతనదారులకు గడిచిన 12వారాలుగా వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమని ఉపాధివేతన దారులు వాపోయారు. వేసవికాలంలో పనుల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పనులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి మేట్లకు పారితోషికం ఇస్తామని చెప్పి నేటికీ చెల్లించకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని మండిపడ్డారు. కనీసం కూలీల వివరాలు నమోదు చేసేందుకు మేట్లకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిహమీ పథకంలో సమస్యలు పరిష్కరించి అందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనట్లైతే భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యం గత 20 సంవత్సరాలుగా ఉపాధిహామీ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న తమపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫీల్డ్ అసిస్టెంట్లు మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లతో తమ పని తాము సరిగా నిర్వహించ లేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మేన్డేస్ విధానాన్ని రద్దుచేసి అందరికీ ఎఫ్టీఎఫ్ అమలు చేసి తమకు ఉద్యోగభద్రత కల్పించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో విధుల నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. కనీ స వేతనం రూ.26,000 చెల్లించి 19 సంవత్సరాల సర్వీసును గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమోట్ చేసే గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి అందరినీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాల ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, కార్యదర్శి వై.మన్మథరావు, అవుట్సోర్సింగ్ అండ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా కన్వీనర్ బీవీ రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు, ఉపాధ్యక్షురాలు వి.ఇందిర, ఉపాధి వేతనదారులు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. పనులు చేయించుకుంటూ ఇవ్వని పారితోషికం మేట్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. చేసిన పనికి పారితోషికం ఇస్తామ ని చెప్పి నేటికీ చెల్లించడం లేదు. కనీసం వేతనదారు ల వివరాలు నమోదు చేసేందుకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం లేదు. గడిచిన 12 వారాలుగా వేతనాలు చెల్లించలేదు. ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే రానున్న రోజుల్లో భారీ ఉద్యమం చేపడతాం. – అశ్విని, ఉపాధి మేట్, చినడోజ గ్రామం, జియ్యమ్మవలస మండలం పదివారాలుగా అందని ఉపాధి వేతనాలు పనిప్రాంతాల్లో వసతులు కరువు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి మేట్లకు వేతనాలు చెల్లించాలి కలెక్టరేట్ వద్ద వేతనదారులు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన -
వర్మీ కంపోస్టుతయారీ జరగాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురంటౌన్: పంచాయతీల్లో ఉన్న చెత్త నుంచి సంపద కేంద్రాల్లో తడి, పొడి చెత్తగా వేరు చేసి వర్మీ కంపోస్టు తయారీ జరగాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డీఎస్ అధికారులతో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర డ్రైడే వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెస్స్ ద్వారా గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ సారి ఈవేస్ట్ సేకరణ థీమ్స్ నిర్వహిస్తున్నందున యాక్షన్ ప్లాన్ను నోడల్ అధికారులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, డీఆర్ఓ హేమలత, కేఆర్సీ డివ్యూటీ కలెక్టర్ ధర్మాచంద్రారెడ్డి, డ్వామాపీడీ కె. రామచంద్రరావు, వివిథ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
హత్యా..? ఆత్మహత్యా..?
పూసపాటిరేగ: భోగాపురం మండలం రావాడ గొల్లపేట గ్రామంలో గురువారం అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఇప్పిలి అంకయ్యమ్మ (55), భర్త రమణ తరచూ రాజాపులోవలో ఉన్న ఎకరా డీ పట్టా భూమి విషయంపై గొడవ పడేవారు. డీ పట్టా అత్తపేరు మీద ఉండడంతో ఆ భూమిని విక్రయించేందుకు రమణ పలు మార్లు ప్రయత్నించాడు. దీనిని అంకయ్యమ్మ అడ్డుకుంది. ఈ విషయంపై ఇద్దరు కుమారులు, కుమార్తె సమక్షంలోనే భార్యాభర్తలు వాగ్వాదం చేసుకునేవారు. ఈ క్రమంలో అంకయ్యమ్మ మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె మృతికి భర్త రమణ, మృతురాలి బావ నర్సయ్య, కుమారుడు వెంకటే ష్ కారణమని, ఆ సమయంలో ఈ ముగ్గురూ ఇంట్లోనే ఉన్నారని బంధువులు చెబుతున్నారు. మరోవైపు ఆత్మహత్యకు పాల్పడిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. భోగాపురం ఎస్ఐ సూర్యకళ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కమ్యూనిటీ పోలీసింగ్తో యువత సన్మార్గం
● ఎస్పీ మాధవరెడ్డి సీతంపేట: యువతను సన్మార్గంలో నడిపించడానికి కమ్యూనిటీ పోలీసింగ్ దోహదపడుతుందని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం సీతంపేట మండలంలోని దోనుబాయి పోలీస్స్టేషన్ ఆవరణలో జరిగిన వాలీబాల్ టోర్న్మెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై ఫైనల్ గేమ్ను ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీతంపేట, సీతానగరం, దోనుబాయి పరిధిలో పలు గ్రామాల్లో ఇప్పటికే మెడికల్ క్యాంపులు కూడా ఘనంగా నిర్వహించామన్నారు. ప్రజలతో పోలీసులకు సత్సంబంధాలు నెలకొల్పడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. సైబర్నేరాలు, మత్తుపదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రతి పోలీస్స్టేషన్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా మీ ప్రాంతంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ప్రాంతంలో సారా వంటకాలు జరుగుతున్నాయనే సమాచారం ఉందని, సారా వండడం, విక్రయించడం నేరమని స్పష్టం చేశారు. వాలీబాల్ విజేత దుగ్గి.. దోనుబాయి పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ పోటీల్లో దుగ్గి జట్టు మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో పొల్లకాలనీ, మూడో స్థానంలో పెద్దపల్లంకి జట్టు నిలిచాయి. నగదు బహుమతులు వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2 వేలు, షీల్డులు, క్రీడాదుస్తులు, నెట్, బాల్ను ఎస్పీ మాధవరెడ్డి విజేతలకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ఆదినారాయణ, పాలకొండ సీఐ మీసాల చంద్రమౌళి, దోనుబాయి, సీతంపేట, బత్తిలి,వీరఘట్టం ఎస్సైలు మస్తాన్, వై.అమ్మన్నరావు, అనిల్కుమార్, కళాధర్, పీహెచ్సీ వైద్యాధికారి భానుప్రతాప్, దోనుబాయి ఆశ్రమపాఠశాల పీడీ ఆర్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తొక్కుడువలసకు బోరొచ్చింది
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తొక్కుడువలస గ్రామానికి ఎట్టకేలకు మంచినీటి సమస్య తీరనుంది. గ్రామానికి బోరు తవ్వే పనులను అధికారులు చేపట్టారు. గ్రామస్తుల తాగునీటి సమస్యను ‘తేనె కాదు.. తాగునీరే’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. గిరిజనులు కూడా తమ ఆవేదనను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో బోరు తవ్వేందుకు నిధుల సమస్య ఉన్నట్లు సంబంధిత అధికారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎంపీపీ, సర్పంచ్లు తమ నిధుల నుంచి కొంత మొత్తం సమకూర్చగా.. సుమారు రూ.3.50 లక్షల వ్యయంతో గ్రామంలో బోరు తవ్వించారు. తాగునీటి కష్టాలు తీరే దారి దొరికిందని గిరిజనులు సంతోషపడుతున్నారు. -
తమ్ముళ్లకే ఉపాధి
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025మా మాటే శాసనం..● ఉపాధి హామీ పథకంలో కూటమి పెత్తనం ● పనుల్లో రాజకీయం ● మొన్నటి వరకూ క్షేత్ర సహాయకులపై కత్తి.. ● ఇప్పుడు మేట్ల తొలగింపు ● ఆ స్థానంలో తమవారిని నియమించుకుంటున్న వైనం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలిపార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం తక్షణ మే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని వైఎస్సార్సీపీ పార్వతీపురం నియోజకవర్గ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అలజంగి విఘ్నేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారం చేపట్టి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఫీజు రీయింబ ర్స్మెంట్ చెల్లించని కారణంగా కళాశాలల యాజమాన్యాలు హాల్టికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికే విద్యాసంవత్సరం పూర్తి చేసుకున్న ఎంతోమంది విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల ను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంబేడ్కర్ దార్శనికత దేశానికే మార్గనిర్దేశం ● కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాశ్వాన్ విజయనగరం అర్బన్: సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల కోసం అంబేడ్కర్ అవిశ్రాంతంగా కృషిచేశారని, ఆయన దార్శనికత దేశానికి మార్గనిర్దేశం ఇస్తోందని కేంద్ర మాజీ మంత్రి, విద్యావేత్త ప్రొఫెసర్ సంజయ్ పాశ్వాన్ అన్నారు. విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో ‘జాతి నిర్మాణం మరియు మహిళా సాధికారతలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్ర’ అనే అంశంపై గురువారం నిర్వహించిన ఒక రోజు జాతీయ సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అణచివేత, సాధికారత వంటి సమస్యల పరిష్కారంలో అంబేడ్కర్ చొరవను కొనియాడారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ ఐజీ సనాది మాట్లాడుతూ మహిళలకు చట్టపరమైన సమానత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నించిన హిందూ కోడ్ బిల్లుకు ఆయన చేసిన కృషిని వివరించారు. వివాహం, వారసత్వం, ఆస్తి హక్కు విషయాలపై చట్టపరమైన స్పష్టత ఇచ్చారన్నారు. గౌరవ అతిథి ప్రొఫెసర్ ప్రమాణ్ణి జయదేవ్ మాట్లాడుతూ సామాజిక పనిలో అంబేడ్కర్ తత్వశాస్త్రం ప్రాముఖ్యతను, సమ్మిళిత విధాన రూపకల్పనపై ఆయన ప్రభావాన్ని వివరించారు. యూనివర్సిటీ వీసీ టీవీ కట్టిమణి మాట్లాడుతూ సమాజహితమైన అంశాలపై కళాశాల స్థాయి విద్యాలయాల్లో సెమినార్లు నిర్వహించడం వల్ల చైతన్యవంతమై సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు. అనంత రం ముఖ్య అతిథులను వీసీ సత్కరించారు.సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఉపాధి వేతనదారులపై స్థానిక నాయకు లు కక్ష సాధిస్తున్నారని పాలకొండ మండలంలోని ఎల్.ఎల్. పురం గ్రామానికి చెందిన వేతనదారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సర్పంచ్ ద్వారపూడి సావిత్రమ్మను కలిసి పలువురు వాపోయారు. గ్రామ పంచాయతీ పరిధిలో 300 మంది వేతనదారులు ఉన్నారు. ఆరుగురు మేట్ల పర్యవేక్షణలో కాలువ, ఫారంపాండ్స్ వంటి పనులు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కూటమి నాయకులు పాత మేట్లను తొలగించి, కొత్తవారిని నియమించడానికి ప్రయత్నిస్తున్నారని వేతనదారులు చల్లా పార్వతి, సుశీల, భవానీ, నక్క ఆనంద్ తదితరులు వాపోతున్నారు. రాజకీయ కారణాలతో పనులు కూడా జరగనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ●బలిజిపేట మండలంలోని బర్లి మహిళా ఫీల్డ్ అసిస్టెంట్పై దర్యాప్తుల పేరున రాజకీయ వేధింపుల పరంపర కొనసాగిస్తున్నారు. లేనిపోని ఆరోపణలు లేవనెత్తి అధికారులపై ఒత్తిడి పెట్టి దర్యాప్తు చేయిస్తున్నారు. పాత ఆరోపణలే ఎత్తిచూపుతూ దర్యాప్తు చేస్తుండడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్నడూ లేని, చూడని విధంగా ఉపాధిహామీ వేతనదారులు, మేట్లుపై రాజకీయ వేధింపులు అధికమయ్యాయి. పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజక వర్గాల్లో సాగుతున్న ఉపాధి హామీ పనులు కూటమి తమ్ముళ్లకు ఉపాధి మార్గాలుగా మారిపోయాయి. వివిధ అభివృద్ధి పనుల కాంట్రాక్టులు పొందడం ఒక ఎత్తు అయితే.. ఉపాధి హామీ పథకంలో ఏళ్లుగా పని చేస్తున్న క్షేత్ర సహాయకులు, మేట్లు వంటి చిన్న ఉద్యోగుల పోస్టులను కూడా వదలడం లేదు. ప్రధానంగా టీడీపీ నాయకులు తమ అనుచరులకు వీటిని కట్టబెట్టేందుకు పోటీపడుతున్నారు. మొన్నటి వరకు పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లోని పలువురు క్షేత్ర సహాయకులను అక్రమంగా తొలగించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొంతమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ఉపాధి మేట్లును కూడా టీడీపీ నాయకులు తొలగిస్తూ ఆ స్థానంలో తమ వారిని నియమించుకుంటున్నారు. వీరికి మద్దతుగా వేతనదారులు పలుచోట్ల నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నా.. కూటమి నాయకుల్లో మార్పు రావడం లేదు. అధికారుల్లో చలనం కలగడం లేదు. కొత్తగా తమ్ముళ్ల ప్రోద్బలంతో నియమితులైన మేట్లు.. వేతనదారుల మధ్య గ్రూపులు ప్రోత్సహించడం, వారికి ఇష్టం వచ్చిన వారికే పనులు ఇవ్వడం, మిగిలిన వేతనదారుల పట్ల ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై పలుచోట్ల వేతనదారులు ఆయా ఎంపీడీవోల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో 1.69 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. 52.23 వేల కుటుంబాలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నాయి. సగటున 50 నుంచి 60 మంది వేతనదారులకు ఒక్కోమేట్ చొప్పున ఉంటారు. సాధారణంగా ఆయా వేతనదారుల అభిప్రాయం మేరకు స్థానికులనే మేటుగా నియమించుకుంటారు. ఎన్నో ఏళ్లుగా సాఫీగా సాగుతున్న ఉపాధి పనుల్లో కూటమి ప్రభుత్వం పుణ్యమా అని రాజకీయ గ్రహణం పట్టుకుంది. 19న వాష్ కేంద్రబృందం సందర్శన బాడంగి: వాటర్ అండ్ శానిటేషన్, హైజనిక్ (వాష్) కేంద్ర బృందం ఈ నెల 19న బాడంగి మండలం లక్ష్మీపురం గ్రామాన్ని సందర్శించనున్నట్టు ఎంపీడీఓ ఎస్.రామకృష్ణ, గ్రామీణరక్షితనీటి సరఫరా విభాగం ఏఈఈ రాజశేఖర్ తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా, జల్జీవన్మిషన్ పనులను పరిశీలిస్తుందన్నారు. ఇందులో భాగంగా గ్రామాన్ని గురువారం పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు చేయించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ ఢిల్ల్శ్వేరరావు, పంచాయతీ విస్తరణాధికారి సూర్యనారాయణ, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు పాలవలస గౌరు, తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్ ఉపాధి వేతనదారులతో రాజకీయం చేస్తున్నారని పాలకొండ మండలంలోని చిన మంగళాపురం సర్పంచ్ గోగుల కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పలువురు వేతనదారులతో కలిసి సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డిని కలసి వినతి పత్రం అందజేశారు. వీరి గ్రామంలో 343 మంది ఉపాధి వేతనదారులున్నారు. గతంలో వారి అంగీకారంతోనే ఆరుగురు మేట్లును ఏర్పాటు చేసుకున్నారు. చాలా కాలంపాటు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా జాబ్ కార్డుదారులు పనులు చేసుకునేవారు. ఏ సమస్య లేకున్నా.. కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే సదరు మేట్లను నిబంధనలకు విరుద్ధంగా, వేతనదారుల తప్పుడు సంతకాలతో విధులకు దూరం చేశారు. వారి స్థానంలో రాజకీయం చేసి, కొత్తవారికి అవకాశం కల్పించటంతోపాటు దశాబ్ద కాలంగా అనుభవం ఉన్న వారిని అన్యాయంగా తప్పించారని సర్పంచ్ తోపాటు.. వేతనదారుల ఆవేదన. జియ్యమ్మవలస మండలం జోగులమ్మ పంచాయతీలో ఉపాధి హామీ పథకం వేతనదారులకు పనికల్పనలో రాజకీయ వేధింపులు మితిమీరా యి. వేతనదారులందరి ముందు కాళ్లుపట్టుకుంటనే పనులు కల్పిస్తామంటూ టీడీపీకి చెందిన ఎలకల శంకరబాబు, కాబోతుల ఇల్లంనాయుడు వేధించడంతో వేతనదారు బూరి గౌరమ్మ ఇటీవల గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో వేతనదారులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలు నిలిచాయి. -
బడికి వెళ్లాలన్నా.. మూడు కిలోమీటర్లు నడవాల్సిందే
●గంగాపురం పంచాయతీ తాన్నవలస, తొక్కుడవలస, తొక్కుడవలస కొత్తపాకలు గిరిజన గ్రామాలకు పాఠశాలలు కూడా లేవు. ఇక్కడ చదువుకునే పిల్లలు 30 మంది వరకు ఉన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు చదవాలన్నా.. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరి, పనసభద్ర గ్రామాలకు వెళ్లాల్సిందే. అంగన్వాడీ కేంద్రం కూడా పనసభద్రలోనే ఉంది. అంగన్వాడీ సేవలు పొందాలన్నా.. పౌష్టికాహారం తీసుకోవాలన్నా గర్భిణులు, బాలింతలు సైతం మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న కేంద్రానికి నడుచుకుని వెళ్లాలని గిరిజనులు చెబుతున్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న డోకిశీల పీహెచ్సీకి వెళ్లాల్సిందే. ●తాన్నవలసలో 20 వరకు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. కొండ ఊట నీరు ఆధారంగానే పంటలు పండిస్తుంటారు. చెక్డ్యామ్ లేకపోవడం వల్ల కొండ నీరు వృథాగా పోతోంది. గ్రామానికి దిగువన ఉన్న స్థలంలో కొండ భూమిపై వీరికి హక్కులు కల్పిస్తూ అసైన్మెంట్ కాపీలిచ్చారు. సబ్ డివిజన్ చేసి, వన్బీలు ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. అప్పుడే ఐటీడీఏ ఫలాలు అందుతాయని ఆశిస్తున్నారు. ●తొక్కుడవలస గిరిజన గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కలుషిత నీటిని తాగడం వల్ల విష జ్వరాలు, పచ్చకామెర్లతో తరచూ గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నా.. తమ బాగోగులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
జొన్నపంట కొనుగోలుకు ఉత్తర్వులు రావాలి మొక్కజొన్న గింజలు కొనుగోలు చేయాలన్న మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఇంతవరకూ రాలేదు. జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్నపంట కూడిక పనులు జరుగుతున్నాయి. జొన్నలు కొనుగోలు చేయాలని ఆదేశాలు వచ్చిన వెంటనే కొనుగోలు చేయనున్నాం. – విమల, మార్క్ఫెడ్ మేనేజర్● రైతుల డిమాండ్సీతానగరం: రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో పారదర్శకంగా అండగా ఉంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం, దళారులను ప్రోత్సహించడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. సీతానగరం మండలంలో నీటివనరులుండి ఖరీఫ్ వరి పంట కోసిన మాగాణీ భూములు వందలాది ఎకరాల విస్తీర్ణంలో రైతులు మొక్కజొన్న సాగుచేశారు. ఈ ప్రాంతంలో రైతులు వాణిజ్యపంటగా మొక్కజొన్నను ఎంపిక చేసుకున్నారు. చక్కెర కర్మాగారం మూతపడడంతో చెరకు సాగు చేయాల్సిన భూముల్లో మొక్కజొన్న, పామాయిల్ తోటలను సాగు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మొక్క జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, లేదా గత ప్రభుత్వం మక్కువలో ఏర్పాటు చేసిన జొన్నపంట కొనుగోలు కేంద్రాన్ని పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ఇదే అదునుగా వారికి నచ్చిన ధరకు పంట ఇవ్వాలని లేదంటే మీ ఇష్టమని అనడంతో పండించిన పంట ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నా మని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జొన్నపంటంతా పొలాల్లో నూర్పిడిచేసి తేమ నివారించడానికి ఆరబెట్టే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. -
ముద్దాయికి ఆరు నెలల జైలుశిక్ష
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలో జరిగిన దొంగతనాల కేసులో చీపురుపల్లి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు సివిల్జడ్జి వై.ప్రేమలత ముద్దాయికి ఆరునెలల జైలుశిక్ష విదిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపారు. గరివిడి పోలీస్స్టేషన్ పరిధిలో గల దుమ్మెద, వెదుళ్లవలస,కొండలక్ష్మీపురం గ్రామాల్లో 2019లో దొంగతనాలు జరిగాయి. ఈ సంఘటనలపై అప్పుడే కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో బుదవారం కోర్టులో విచారణ జరపగా నేరం రుజువు కావడంతో ముద్దాయి పున్నాన రాంబాబుకు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వివరించారు. హుషారుగా ఏనుగుల గుంపుభామిని: మండలంలోని బిల్లుమడ సమీపంలో గల జీడితోటల్లో బుదవారం ఏనుగుల గుంపు హుషారుగా దర్శనమిచ్చింది. రెండు రోజుల క్రితం సింగిడికి చెందిన పింటూ సాంత్రో ఆరటిగెలను ఏనుగులకు అందివ్వబోయి కిందపడి రభస జరిగిన అనంతరం అటవీశాఖాధికారులు ఆందోళన చెందారు. పాలకొండ పారెస్ట్ రేంజర్ వచ్చి పరిస్థితి సమీక్షించి ఏనుగులను రెచ్చగొట్ట వద్దని ప్రజలకు చేసిన సూచనల మేరకు చూపరులు దూరమయ్యారు. ఈ క్రమంలో ఏనుగులు హుషారుగా యథావిధిగా తిరుగుతూ కనిపించాయి. -
అడ్మిషన్ డ్రైవ్ ప్రారంభించాలి
పార్వతీపురం టౌన్: పాఠశాలల్లో అడ్మిషన్ డ్రైవ్ ప్రారంభించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ విద్యాశా ఖ, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదే శించారు. పాఠశాలల్లో అడ్మిషన్లు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల విద్యా, ఆరోగ్య స్థాయిలపై కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటున్న చిన్నారులందరూ ఒకటో తరగతిలో విధిగా చేర్చాలని ఆయన ఆదేశించారు. ఏ ఒక్క విద్యార్థి పాఠశాలలో చేరకుండా ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల 19న వీడ్కోలు కార్యక్రమం జరుగుతుందని, 21వ తేదీ నాటికి పిల్లలు అందరూ పాఠశాలల్లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది ఒకటవ తరగతిలో 10,932 మంది చేరార ని, అదే స్థాయిలో ఈ ఏడాది కూడా విద్యార్థులు చేరాలన్నారు. జిల్లాలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్లో 9,200 సీట్లు ఉన్నాయని తెలిపారు. వయస్సుకు తగిన బరువు, పెరుగుదల ఉండాలి అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల బరువు, పెరుగుదల వయస్సుకు తగ్గట్టుగా ఉండా లని ఐసీడీఎస్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సూపర్వైజర్లే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నా రు. గుమ్మ, సీతంపేట ప్రాంతంలో నిర్దేశిత ప్రమాణాల మేరకు చిన్నారుల పెరుగుదల, బరువు ఉండ డం లేదని, దీనిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలకు మంజూరు చేసిన మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ఆదేశించారు. పోషణ పక్వాడ కిట్లను పక్కాగా అందించాలని పేర్కొన్నారు. 2 నెలల్లో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ శిశువు జన్మించిన రెండు నెలల్లో జనన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత పంచాయతీ కార్యదర్శి జారీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జనన ధ్రువీకర ణ పత్రాలు జారీచేయకుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ నిర్వహణ కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి డాక్టర్ టి. కనకదుర్గ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి.మంజుల వీణ, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి ఎన్.కష్ణవేణి, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి ఎం. డి.గయాజుద్దీన్, జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి ఇ.అప్పన్న, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రాజేశ్వరరావు, సీడీపీఓలు, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు పాల్గొన్నారు. -
ఏఆర్ కానిస్టేబుల్ పేరిట వాలీబాల్ టోర్నమెంట్
విజయనగరం క్రైమ్: స్థానిక పోలీస్ బ్యారెక్స్లో ఏఆర్ కానిస్టేబుల్ పేరిట వాలీబాల్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది.ఈ పోటీలను ఏఎస్పీ సౌమ్యలత ప్రారంభించారు. ఇటీవలే ఏఆర్ విభాగానికి చెందిన సీహెచ్.గోపాలరావు అనారోగ్యంతో మృతి చెందగా ఆయన స్మారకార్థం ఏఆర్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిద్దామని పోలీస్శాఖ అడ్మిన్ ముందుంచారు. ఏఎస్పీ అనుమతితో పరేడ్ మైదానంలో వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు అన్ని పోలీస్స్టేషన్ల నుంచి లా అండ్ ఆర్డర్, ఏఆర్కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. పోటీలను ప్రారంభించిన ఏఎస్పీ సౌమ్యలత మాట్లాడుతూ గోపాల్ రావును స్మరించుకుంటూ తోటి సిబ్బంది ఈ పోటీలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్లో విజయనగరం, గంట్యాడ, కొత్తవలస, బలిజిపేటకు చెందిన టీమ్లు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.12 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.8 వేలు, తృతీయస్థానంలో నిలిచిన జట్టుకు రూ.6 వేలు, కన్సొలేషన్ ప్రైజ్కు రూ.4 వేల నగదును బహుమతిగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, ఆర్ఐలు గోపాల్రావు, శ్రీనివాసరావు, ఆర్ఎస్సైలు సూర్యనారాయణ, రామారావు, ముబారక్ ఆలీ, దివంగత కానిస్టేబుల్ సతీమణి శారద పాల్గొన్నారు. ప్రారంభించిన ఏఎస్పీ -
ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు
రేగిడి: ప్రస్తుతకాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టపడాల్సిందే. ఈ కష్టానికి తోడు అదృష్టం కలిసిరావాలి. అప్పుడే ప్రభుత్వ కొలువైనా..ప్రైవేట్ ఉద్యోగమైనా లభిస్తుంది. అటువంటిది రేగిడి మండలంలోని ఓ యువకుడిని ఒకే దఫా మూడు బ్యాంకు ఉద్యోగాలు వరించాయి. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొండవలస గ్రామానికి చెందిన బెవర చూడామణి ఒకే ప్రయత్నంలో మూడు బ్యాంకు ఉద్యోగాలు సాధించాడు. లోకల్ యూనియన్ బ్యాంకులో ఎల్బీఓగా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రగా ప్రొబేషనరీ ఆఫీసర్గా, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్/క్యాషియర్గా ఉద్యోగాలు సాధించాడు. డిగ్రీ అనంతరం మూడు సంవత్సరాలు విజయవాడలో బ్యాంకు ఉద్యోగాల నిమిత్తం చూడామణి కోచింగ్ తీసుకుంటున్నాడు. చివరికి తన ప్రయత్నం ఫలించి, మూడు ఉద్యోగాలు సాధించి లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆయన తండ్రి బెవర గోపాలకృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తుండగా, తల్లి గౌరీశ్వరి గృహిణి. కొద్దిపాటి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ సందర్భంగా చూడామణి మాట్లాడుతూ తన తల్లిదండ్రుల కష్టంతో పాటు రాజాంలోని ఎస్ఎల్టీఎన్ కళాశాల ప్రిన్సిపాల్, తన పినతండ్రి ఉదయ్భాస్కర్ రాజా ప్రోత్సాహంతో తాను ఈ కొలువులు సాధించానని వెల్లడించాడు. -
చట్టాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి
పార్వతీపురం రూరల్: పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరికీ చట్టాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం అయన జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో పోలీస్ కాన్ఫరెన్సు హాల్లో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించి పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, 174 సీఆర్పీఎస్ కేసులు, మిస్సింగ్, చీటింగ్ కేసులు, సైబర్ నేరాలు, ఇతర కేసులపై సమీక్షించారు. పోలీస్స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని ఎస్పీ ఈ సందర్భంగా ఆదేశించారు. కళాశాలలో ర్యాగింగ్ లేకుండా అవగాహన కల్పించాలి ఈ నేర సమీక్ష సమావేశంలో ఐజీ కేవీ మోహన్ రావు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ..జిల్లా పరిధిలో ఉన్న కాలేజీల్లో విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, మహిళా సంబంధిత నేరాలపై ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు జరపాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతం ఒడిశా సరిహద్దులో ఉండడం వల్ల రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో గంజాయి అక్కడినుంచి వస్తున్నందున రైల్వే, ఆర్పీఎఫ్ ఫోర్స్తో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలని ఐజీ ఆదేశించారు. ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను ఎస్పీ అందజేసి అభినందించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2022, 2023వ సంవత్సరంలో విధి నిర్వహణలో ఉత్తమసేవలు అందించిన వారికి గుర్తింపుగా అందజేసిన యాంత్రిక సురక్ష, ఉత్కృష్ట సేవా పతకాలను సిబ్బందికి ఎస్పీ అందజేశారు. సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
అవగాహన అవసరం
అగ్ని ప్రమాదాల నివారణకు● 14 నుంచి ప్రారంభమైన జాతీయ వారోత్సవాలుపార్వతీపురం రూరల్: ఇటీవల కాలంలో అగ్నిప్రమాదాలు తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యం వహించి మరికొందరు ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు ప్రతి ఏడాది అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఏడాది ‘అగ్ని సురక్ష దేశం కోసం– అందరం ఏకమవడం’ అనే నినాదంతో వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు అగ్నిమాపక కేంద్రాలు పార్వతీపురం జిల్లా కేంద్రం, గుమ్మలక్ష్మీపురం, సాలూరులో, పాలకొండలో అగ్నిమాపక కేంద్రాలున్నాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున పలు జాగ్రత్తలు పాటిస్తే మేలని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ● అగ్గిపెట్టె లైటర్లు మండే పదార్థాలకు చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి ● నాణ్యతా ప్రమాణాలు ఉన్న ఎలక్ట్రికల్ పరికరాలను మాత్రమే వినియోగించాలి ● సెలవులపై ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇంటి మెయిన్ ఆఫ్ చేయడం సురక్షితం ● వంట గదిలో గాలి వెలుతురు ఉండేలా చూసుకోవాలి సమయస్ఫూర్తితో జాగ్రత్తలు పాటించాలి షాపింగ్ మాల్కు, అలాగే నూతన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ గోడలపై అంటించిన ఫైర్ సేఫ్టీ మ్యాపులను చూడాలి. అగ్నిప్రమాదాల నివారణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ప్రమాదాలు జరిగిన చోటికి సమాచారం అందగానే క్షణాల్లోనే చేరుకునేలా సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు. అవసరమైన మేరకు సమీపంలో ఉన్న కేంద్రాల నుంచి కూడా అగ్నిమాపక వాహనాలను తెప్పిస్తున్నాం. – కె. శ్రీనుబాబు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా● గ్యాస్ వాడకం పూర్తయిన తర్వాత సిలిండర్ వద్ద రెగ్యులర్ వాల్వ్ను నిలిపివేయాలి ● విద్యాసంస్థలు, ఆస్పత్రి, హోటల్లో అగ్నిప్రమాదాలు జరిగేటప్పుడు క్షేమంగా బయటపడేందుకు సరైన ప్రణాళికలను తయారుచేసి అవి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలి వారోత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలు ● 17న ఆస్పత్రిలోని సిబ్బందికి తరగతులు, మాక్డ్రిల్ ప్రదర్శన ● 18న పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాముల్లో అవగాహన తరగతులు ● 19న కల్యాణ మంటపాలు, విద్యాసంస్థల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు ● 20 న రాజకీయ పార్టీ ప్రతినిధులతో అగ్నిమాపక కార్యాలయంలో ప్రమాదాల నివారణపై శిక్షణ తరగతుల సమావేశం. -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
డెంకాడ: మండలంలోని చొల్లంగిపేట జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని ఎన్జీఆర్ పురం గ్రామానికి చెందిన జిగిలి రాములప్పడు(54) అక్కడికక్కడే మృతి చెందగా మృతుడి భార్య మహలక్ష్మి తీవ్ర గాయాలపాలైంది. దీనిపై ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాములప్పడు, భార్య మహలక్ష్మి తమ కుమార్తె వివాహ విషయమై మాట్లాడేందుకు విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని గంగచోళ్లపెంట గ్రామానికి వెళ్తున్నారు. కుమిలి–విజయనగరం రోడ్డులోని చొల్లంగిపేట జంక్షన్కు వచ్చేసరికి బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడిపోయింది. దీంతో బైక్ నడుపుతున్న రాములప్పడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, బైక్ వెనుక కూర్చున్న మహలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం విజయనగరం తరలించారు. మృతుడి సోదరుడు జిగిరి రాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత.. గరుగుబిల్లి: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి హెచ్సీ ఈశ్వరరావు బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి చెందిన సవలాపురపు సంజీవు, భార్య కొండమ్మ పార్వతీపురం మండలంలోని గోపాలపురంలో చింతాడ కామేశ్వరి (కొండమ్మ చెల్లి) పెళ్లిరోజు వేడుకలకు హాజరై 15న సాయంత్రం ద్విచక్రవాహనంపై గోపాలపురంనుంచి స్వగ్రామం రాజాం వెళ్తురన్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో గరుగుబిల్లి మండలంలోని రావివలస జంక్షన్ సమీపంలో వెనుక కూర్చున్న కొండమ్మ ప్రమాదవశాత్తు బైక్నుంచి జారిపడగా తలకు బలమైన గాయమైంది. దీంతో మెరుగైన చికిత్సకోసం విజయనగరం తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ మేరకు మృతురాలు కొండమ్మ, తండ్రి రేజేటి పైడిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. మృతుడి భార్యకు తీవ్రగాయాలు -
జిల్లాలో న్యాయ సేవలు సంతృప్తికరం
● జిల్లా జడ్జి సాయి కల్యాణ్ చక్రవర్తి బొబ్బిలి: జిల్లాలో న్యాయమూర్తిగా అందజేసిన సేవలు తనకు సంతృప్తినిచ్చాయని జిల్లా జడ్జి బి.సాయికల్యాణ్ చక్రవర్తి అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక కోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదులు జడ్జి సాయి కల్యాణ్ చక్రవర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. శాఖాపరమైన బదిలీలో భాగంగా గుంటూరు జిల్లా జడ్జిగా వెళ్తున్నందున ఆయనను సత్కరించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మోహన్ మురళీ కుమార్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు సీనియర్ న్యాయమూర్తి దామోదర రావు, స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎస్.అరుణశ్రీ, ఏజేఎఫ్సీఎం రోహిణీరావు, న్యాయవాదులు కొల్లి సింహాచలం, ఎం.బెనర్జీ, ఎ.రామకృష్ణ, ఎం.సింహాచలం, డి.లక్ష్మి దీపవల్లి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు సీజ్బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామం వద్ద వేగావతి నదిలో ఇసుకను తవ్వి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆర్డీఓ జేవీవీ రామ్మోహనరావు బుధవారం సీజ్ చేశారు. బొబ్బిలి నుంచి విజయనగరం వెళ్తున్న ఆయన వేగావతి నదిలో ఇసుకను లోడ్ చేస్తుండగా గమనించి ట్రాక్టర్ డ్రైవర్లను తవ్వకాలపై ప్రశ్నించారు. ఎక్కడికి తరలిస్తున్నారని ,అనుమతులు, పర్మిట్లు ఉన్నాయా అని ఆరాతీసిన ఆర్డీఓకు అవేమీ లేవని బొబ్బిలికి తరలిస్తున్నామని డ్రైవర్లు తెలపగా వెంటనే రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేయాలని తహసీల్దార్ శ్రీనుకు ఆర్డీఓ ఆదేశాలు జారీచేశారు. ఎస్సైపై దాడికేసులో వ్యక్తి అరెస్టురాజాం సిటీ: సంతకవిటి ఎస్సైపై దాడిచేసి ఘటనలో నిందితుడిని అరెస్టు చేశామని రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13న సంతకవిటి మండలం జావాం గ్రామదేవత పగడాలమ్మ జాతర నిర్వహించారు. ఈ జాతరలో మద్దూరుశంకరపేట, జావాం గ్రామాల యువకుల మధ్య కొట్లాట జరిగింది. ఈ కొట్లాటను నివారించే క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఆర్.గోపాలరావుపై మద్దూరుశంకరపేట గ్రామానికి చెందిన యడ్ల రమణ దాడిచేసి మెడలో రెండు తులాల బంగారు చైను తీసుకుపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి నిందితుడిని మద్దూరుశంకరపేట గ్రామంలో అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్సై ఆర్.గోపాలరావు, హెచ్సీ ప్రసాదరావు, పీసీ కృష్ణ తదితరులు ఉన్నారు. ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య● విశాఖపట్నంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఘటన చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన తీడ వేదాంత కార్తికేయ(16) విశాఖపట్నంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్య ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఈనెల 7న విద్యార్థి కార్తికేయ ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం కోసం విశాఖపట్నంలోని శ్రీచైతన్య కళాశాలలో జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థి నాలుగు రోజులుగా అసౌకర్యంగా ఉండడంతో కళాశాల యాజమాన్యం నుంచి తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ మేరకు తల్లిదండ్రులు అచ్యుతరావు, పార్వతి మంగళవారం కళాశాల హాస్టల్కు వెళ్లి విద్యార్థితో మాట్లాడారు. తరువాత విద్యార్థిని హాస్టల్లో ఉంచి ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ బుధవారం ఉదయం కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ చేసి కార్తికేయ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందించగా తల్లిదండ్రులు కుమారుడి వద్దకు వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. -
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సీతంపేట గిరిజన గ్రామం ● చంద్రబాబు కేబినెట్లో ప్రస్తావన లేకపోవడం బాధాకరం ● హామీ ఇచ్చి మర్చిపోవడంపై ఆందోళన ఈ చిత్రంలోని వ్యక్తి పేరు మెల్లిక కురమయ్య. 2023లో ఆయన కుమార్తె చిన్నమ్మి జ్వరంతో మృత్యువాత పడింది. రెండు రోజులపాటు జ్వరం వచ్చిందని.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తే, పచ్చకామెర్లు సోకాయని వైద్యులు చెప్పారని, వెంటనే చనిపోయిందని ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు. 20 ఏళ్ల వయస్సులోనే కుమార్తెను కోల్పోయానని వాపోయాడు. గ్రామంలో ఇటువంటి మరణఘోషలు ఎన్నో ఉన్నాయని.. కలుషిత నీరే ఇందుకు కారణమని ఆవేదన వ్యక్తం చేశాడు. కొండకోనల్లో నాలుగు దశాబ్దాలుగా నివసిస్తున్న ఊరు వారిది కాదని, తక్షణమే ఖాళీచేయాలంటూ హుకుం జారీచేస్తున్నవారు కొందరు... ఏళ్ల తరబడి బురదనీరు తాగుతున్నామని, ఆరోగ్యం క్షీణించి గ్రామస్తులు మరణిస్తున్నారని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటే.. ‘కొబ్బరి నీళ్లు కావాలా’ అంటూ వెటకారం చేసేవారు మరికొందరు... సాగుభూమికి పట్టాలు ఇవ్వాలని ప్రాథేయపడినా కనికరించని అధికారులు... గ్రామం పక్కనే మైనింగ్ తవ్వకాలకు మాత్రం ఆగమేఘాలమీద అనుమతులు మంజూరు చేసిన పరిస్థితి మరోవైపు.. ఇలా.. ఆ గిరిజన గ్రామాలకు వెళ్తే కన్నీటి వ్యథలు, గిరిజనుల కష్టాల జీవనం, సమస్యలే సాక్షాత్కరిస్తాయి. – సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్ ● జిల్లా కేంద్రంలో ఉన్నా సరే.. విసిరేసినట్లు ఉండే గిరిజన గ్రామాలు ● కనీస సౌకర్యాలకు నోచుకోని తాన్నవలస, తొక్కుడవలస, సీతంపేట గిరిజనులు ● రహదారికీ నోచుకోని అభాగ్యులు న్యూస్రీల్ -
డిజిటల్ అరెస్ట్ కేసులో ఏబీసీడీ అవార్డు
● డీజీపీ చేతుల మీదుగా అందుకున్న వన్టౌన్ సీఐవిజయనగరం క్రైమ్: విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ పరిధి విజయనగరం వన్టౌన్ స్టేషన్ సీఐగా ఎనిమిది నెలల క్రితం చార్జ్ తీసుకున్న శ్రీనివాస్ ముంబై, పుణెలకు వెళ్లి మరీ నిందితులను పట్టుకున్నందుకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా మంగళగిరిలో బుదవారం అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ను అందుకున్నారు. వివిధ పోలీస్స్టేషన్లలో ప్రతి మూడు నెలలకోసారి పలు కేసుల ఛేదనలో స్థానిక స్టేషన్హౌస్ ఆఫీసర్లు చూపిన ప్రతిభను డీజీపీ ఆఫీస్ పరిశీలనలోకి తీసుకుంటుంది. అందులో భాగంగా గతేడాది దాదాపు కోటిన్నర పైగా డబ్బులు పొయాయని వన్టౌన్ పోలీసులు ఫిర్యాదు అందుకున్నారు. ఎస్పీ వకుల్ జిందల్ అదేశాలతో అప్పుడే విజయనగరం వన్టౌన్ పోలీసులు డిజిటల్ అరెస్ట్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ కేసులో విజయనగరం వన్టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మీప్రసన్నకుమార్లు జమ్ము, ముంబై, పుణె ప్రాంతాల్లో ఉండి మరీ ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏబీసీడీ అవార్డు పరిశీలనలోకి వెళ్లారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయం పరిశీలనలో విజయనగరం వన్టౌన్ సీఐ, ఎస్ఐల పేర్లు రావడం, మంగళగిరి నుంచి పిలుపు రావడంతో ఎస్పీ వకుల్ జిందల్తో కలిసి వెళ్లి వారు ఈ అవార్డును అందుకున్నారు. -
రోబోటిక్స్ కోర్సులకు డిమాండ్
చికెన్నెల్లిమర్ల రూరల్: రానున్న కాలంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్, ఇంటెలిజెన్స్కు సంబంధించిన కోర్సులకు మంచి డిమాండ్ ఉందని గాయత్రి విద్యా పరిషత్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ ధర్వేకర్ అన్నారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో రోబోతాన్ 2కే25 కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎంచుకున్న రంగంలో పూర్తి పట్టు సాధిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టుల మూల్యంకనం చేసి బాగున్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి, ప్రొఫెసర్ దీపక్ కుమార్, సన్నీ డియోల్, పీఎస్వీ రమణారావు, శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉద్రిక్తతల నడుమ పామాయిల్ మొక్కల తొలగింపు
సంతకవిటి: మండలంలోని సిరిపురం గ్రామంలో కొండపై వెలసిన కొండకామేశ్వర స్వామి ఆలయం ఇటీవల దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. ఈ ఆలయానికి సంబంధించి సర్వే నంబర్ 84లో 2.70 ఎకరాల భూమి ఉంది. ఈ పొలాన్ని కౌలుకు ఇచ్చేందుకు అధికారులు ముందుకు రావడంతో ఆలయ అర్చకుడు అడ్డుపడగా రెండు పర్యాయాలు వాయిదా పడింది. పొలంలోని పామాయిల్ మొక్కలు తొలగిస్తేనే కౌలుకు తీసుకునేందుకు ముందుకు వస్తామని సిరిపురం గ్రామ ప్రజలు పట్టుబట్టడంతో విజయనగరం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శిరీష బుధవారం గ్రామానికి చేరుకుని జేసీబీ సహాయంతో మొక్కలను తొలగించారు. జేసీబీ పొలంలో దిగుతున్న సమయంలో, మొక్కలు తొలగిస్తున్న సమయంలో అర్చకుల కుటుంసభ్యులు పదేపదే జేసీబీకి అడ్డుతగిలారు. ఈ క్రమంలో అధికారులే రక్షణ కవచంలా నిలబడి వారిని నిలువరించారు. పోలీసులకు ముందస్తు సమాచారం అందించినా ఎవరూ కనీసం రాలేదని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శిరీష వాపోయారు. పని పూర్తి కావస్తున్న సమయంలో కేవలం ఇద్దరు పోలీసులు రావడం విశేషం. కార్యక్రమంలో ఈఓ బి.వి.మాధవరావు, రాజాం నవదుర్గ దేవాలయం ఈఓ పి.శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. -
గణకులు లేకుండా..
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 20258లోసాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగానికి సిబ్బంది కొరత వెంటాడుతోంది. సహాయ గణాంక శాఖాధికార పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్నవారిపై పనిభారం పడుతోంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడి నుంచి వెళ్లే వారే గానీ.. వచ్చే వారు ఎవరూ ఉండడం లేదు. దీంతో ఉన్నవారే ఏళ్ల తరబడి ‘చిక్కుకుపోతున్నారు’. మండలాల్లో ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన గణాంకాలకు వీరే కీలకం. అటువంటి ‘లెక్కల’ మాస్టార్ల పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీగా ఉండిపోవడంతో ‘లెక్కలు’ గతి తప్పుతున్నాయి. ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. జిల్లాలో పార్వతీపురం, పాలకొండ రెవెన్యూ డివిజన్లు ఉండగా.. 15 మండలాలకు ఒక్కొక్కరు చొప్పున సహాయ గణాంకాధికారులు(ఏఎస్వోలు) బాధ్యతలు నిర్వర్తించాలి. జిల్లా కేంద్రంలో ముగ్గురు ఏఎస్వోలు ఉండాలి. ప్రస్తుతం గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్మమ్మవలస, గరుగుబిల్లి, కొమరాడ, భామిని, పాచిపెంట, సాలూరు మండలాల్లో పోస్టులు ఖాళీలున్నాయి. మిగిలిన మండలాల ఏఎస్వోలతోనే అదనపు బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. మొత్తంగా 15 మండలాల్లో ఏడుగురే పని చేస్తున్నారు. ప్రమోషన్లు తక్కువ.. పని భారం ఎక్కువ ఏఎస్వోలు ఏళ్ల తరబడి ఒకే క్యాడర్లో పని చేస్తుండడం వల్ల పని భారం అధికమవుతోంది. దీంతో పాటు.. ప్రమోషన్లు ఉండడం లేదు. మండలానికి ఒకే పోస్టు ఉండడం వల్ల ఎదుగూబొదుగూ ఉండదని ఉద్యోగులు చెబుతున్నారు. పేరుకే గ్రూప్–2 ఉద్యోగాలు అయినప్పటికీ కనీసం తమకు సహాయకులు కూడా ఉండరని వాపోతున్నారు. రాష్ట్రంలో 285 వరకు ఏఎస్వో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయా ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తోంది. మండలంలో పనిచేసే వీఆర్వోలకు, ఆర్ఐలకు కూడా సహాయకులు ఉంటారని.. తమకు ఎవరూ ఉండరని చెబుతున్నారు. ముఖ్యంగా పార్వతీపురం మన్యంలాంటి ఏజెన్సీ ప్రాంతానికి ఎవరూ వచ్చేందుకు ఇష్టపడకపోవడంతో ఉన్నవారిపైనే పని భారం పడుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. బదిలీలు చేపట్టినా కొంత మార్పు కనిపిస్తోందని ఆశిస్తున్నారు. న్యూస్రీల్ఉదయాన్నే వర్షపాతం కొలిచింది మొదలు.. ప్రణాళికా శాఖలో సహాయ గణాంకాధికారి పోస్టులు ఖాళీ 15 మండలాల్లో సగం ఖాళీలే ఒక్కొక్కరికీ లెక్కకు మించి బాధ్యతలు తలకు మించిన భారం మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే సహాయ గణాంకాధికారి.. జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారు. వర్షపాతం, ఉష్ణోగ్రత వివరాలను ప్రతిరోజూ ఉదయం ఆన్లైన్లో పొందుపరచడం ద్వారా ఉద్యోగ జీవితం ప్రారంభమవుతుంది. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో స్థూల ఉత్పత్తిని లెక్కించడం ప్రైమరీ సెక్టార్(వ్యవసాయం), ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీసు సెక్టార్ల నుంచి డేటాను సేకరించడం... జనాభా గణన, ప్రజల నైపుణాన్ని అంచనా వేయడం, సామాజిక ఆర్థిక గణన, చిన్న తరహా నీటి వనరుల గణన, వ్యవసాయ కమతాల గణన, పారిశ్రామిక సర్వేలు చేపడతారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న పీ 4 సర్వేలోనూ వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి రెయిన్గేజ్ ద్వారా వీరికి వర్షపాతం సేకరణ అలవాటు లేకపోయినప్పటికీ ఆ బాధ్యతను కూడా అప్పగించారు. ఆ యంత్రాల్లో సాంకేతికంగా ఏమైనా ఇబ్బందైనా అవస్థలు పడాల్సిందే. టెక్నికల్గా అంత సామర్థ్యం వీరి వద్ద ఉండదు. -
పవర్ లిఫ్టింగ్లో కల్యాణి ప్రతిభ
చీపురుపల్లి: పవర్లిఫ్టింగ్ బ్రెంచ్ ప్రెస్ చాంపియన్షిప్ పోటీల్లో పట్టణానికి చెందిన సాకేటి రేణుక కల్యాణి ఉత్తమ ప్రతిభ కనపరిచింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో రేణుక కల్యాణి మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో కోచ్ గంగాధర్ ఆమెను అభినందించారు. ఈ నెల 11 నుంచి 13 వరకు కృష్ణా జిల్లాలోని గుడివాడలో గల ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో 12వ ఏపీ స్టేట్ కాస్లిక్ పవర్ లిఫ్టింగ్, బ్రెంచ్ ప్రెస్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 84 ప్లస్ కేజీల పవర్ లిఫ్టింగ్ పోటీల విభాగంలో పాల్గొన్న రేణుక కల్యాణి రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది. అలాగే బ్రెంచ్ ప్రెస్ విభాగంలో రజత పతకం సాధించింది. -
ప్రతి ఒక్కరికీ అక్షరజ్ఞానం అవసరం
పార్వతీపురంటౌన్: జిల్లాలో వయోజన విద్య కార్యక్రమం కింద శిక్షణ పొందేవారికి కనీస అక్షర జ్ఞానం ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వయోజనులు చదవడం, రాయడం, పుస్తకాల నిర్వహణ, ప్రయాణ సమయంలో అసౌకర్యానికి గురికాకుండా ఉండడం, ఫోన్లో వచ్చే సమాచారాన్ని అర్థం చేసుకోకపోవడం వంటి కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. ఉల్లాస్ మొదటి దశలో గతంలో 23,944 మంది అక్షరాస్యులయ్యారని తెలిపారు. ప్రస్తుత దశలో 25,579 మంది నిరక్షరాస్యులకు మే 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 8 వరకు బోధన తరగతులు నిర్వహించాలన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యుల్లో చదువుకున్న వారిని బోధకులుగా ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 24 వరకు నిరక్షరాస్యుల సర్వే ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు నిరక్షరాస్యుల సర్వే చేపడతామని కలెక్టర్ తెలిపారు. 29న మండల స్థాయిలో మండల పరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వెలుగు ఏపీఎంలతో అవగాహన సమావేశం జరుగుతుందని వివరించారు. మే 2వ తేదీన గ్రామస్థాయిలో సమావేశం జరుగుతుందన్నారు. బోధనా తరగతులు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు, సామాజిక భవనాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డీపీఓ కొండలరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, డీఐపీఆర్ఓ లోచర్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16 నుంచి నిరక్షరాస్యుల సర్వే కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
ద్విచక్రవాహన చోదకుడిని ఢీకొన్న బస్సు
పాలకొండ రూరల్: మండలంలోని గోపాలపురం వద్ద మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ద్విచక్రదారుడిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు అందించిన వివరాల మేరకు శ్రీకాకుళం జిల్లా అమదలవలసకు చెందిన ఇప్పిలి సత్యనారాయణ విజయనగరం జిల్లా రేగిడి మండంలంలో గల చక్కెర కార్మగారంలో విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో పాలకొండ నుంచి విశాఖ వెళ్తున్న ఓఎంఎస్ సర్వీసు బస్సు గోపాలపురం వద్ద ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనదారుడు గాయాలపాలు కాగా వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై ఎస్సై కె.ప్రయోగమూర్తి కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. పాలకొండ–వీరఘట్టం ప్రధాన రహదారిలో మంగళవారం సాయంత్రం స్కార్పియో వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో మూడు ద్విచక్రవాహనాలు చెల్లాచెదురు కాగా ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీనిపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు విజయనగరం జిల్లా రేగిడిఆమదాలవలస మండలం వండానపేటకు చెందిన కొమ్మోజు గణపతిరావు తన ద్విచక్రవాహనంపై వీరఘట్టం వెళ్తుండగా అదే మండలంలోని చిన్నయ్యపేటకు చెందిన సవిరిగాన సింహాచలం స్కార్పియో వాహనం నడుపుతూ వీరఘట్టం వైపు వెళ్తున్నాడు. ఆ సమయంలో వర్షం కురుస్తుండడంతో ద్విచక్రవాహనదారు ఉన్నట్లుండి తన వాహనాన్ని కుడివైపు మళ్లించే యత్నం చేశాడు. దీంతో ఆ బైక్ను తప్పించబోయిన స్కారియో వాహన చోదకుడు కూడా పూర్తిగా కుడివైపు తన వాహనం తిప్పడంతో ద్విచక్రవాహదారుడిని వెనక నుంచి బలంగా తాకుతూ అక్కడి వైన్షాపు ముందు నిలిపి ఉన్న మరో రెండు బైక్లను, ముందున ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారు గణపతిరావు గాయాలపాలయ్యడు. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో క్షతగాత్రుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై ఎస్సై కె.ప్రయోగమూర్తి కేసు నమోదు చేశారు. -
అన్నీ బొంకులే..!
బంకుల్లో ● పెట్రోల్ బంకుల్లో కానరాని సౌకర్యాలు ● జిల్లావ్యాప్తంగా 44 చోట్ల ఏర్పాటు ● అందుబాటులో లేని మరుగుదొడ్లు, ప్రథమ చికిత్సకిట్లు, తాగునీరు ● ఆపద సమయాల్లో లేని ఫోన్ సౌకర్యం, నాణ్యత తనిఖీ పరికరాలు, ఫిర్యాదుల పెట్టె ● మరమ్మతుల బారిన గాలియంత్రాలుపార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లావ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరిస్తూ వినియోగదారులకు అందించాల్సిన సేవలను అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తమను ఎవరూ ప్రశ్నించరనే భావనతో వారు వ్యవహరిస్తున్న తీరు కానరాని సౌకర్యాల పట్ల తేటతెల్లమవుతోంది. బంకుల్లో నిబంధనల మేరకు ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు దాదాపు ఏ బంకులోనూ కానరావడం లేదు. వాటిని విధిగా పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీ చేయాల్సి ఉన్నప్పటికీ మొక్కుబడిగా ఒకటి రెండు బంకులను తనిఖీ చేసి మమ అనిపించేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ట్యాక్స్లను వసూలు చేస్తున్న యాజ మాన్యాలు సౌకర్యాలు కల్పించడంలో తాత్సారం వహిస్తున్నాయి. వినియోగదారులకు అందాల్సిన సేవలు అందకపోవడంతో యాజమాన్యాలు ట్యాక్స్ లను అప్పనంగా వసూలు చేసి వినియోగదారులకు సేవలు దూరం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో హెచ్పీ, బీహెచ్పీఎల్, ఇండియన్ ఆయిల్, నయారా సంస్థలకు సంబంధించి 44 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిని ఆయా ప్రాంతాల్లోని యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. ఈ సౌకర్యాలు ఉండాలి స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రథమ చికిత్స కిట్లు, ఉచితంగా గాలినింపే యంత్రాలు, ఆపద వేళ సమాచారం ఇచ్చేందుకు ఫోన్, నాణ్యత తనిఖీ చేసే బ్లాటింగ్ పేపర్లు, ఫిర్యాదుల పెట్టె తదితరమైన సౌకర్యాలు పెట్రోల్ బంకుల్లో ఉండాలి. అలంకరణకే.. పెట్రోల్ బంకుల్లో ఎక్కడ చూసినా గాలినింపే యంత్రాలు మరమ్మతుల బారిన పడి నిరుపయోగంగా దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో తాగునీరు సౌకర్యం ఏర్పాటు కానరావడం లేదు. పెట్రోల్, డీజిల్ కోసం వచ్చే వాహనదారులు టైర్లలో గాలి నింపమని సిబ్బందిని అడిగితే పనిచేయడం లేదని బదులిస్తున్నారు. మరుగుదొడ్లకు తాళాలు బంకుల్లో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లకు తాళం వేసి అందుబాటులో లేకుండా చేస్తున్నారు. కేవలం సిబ్బంది మాత్రమే ఉపయోగించుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కనీస స్థాయిలో మూత్రశాలలు పరిశుభ్రత లేకుండా అధ్వానంగా, అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. కానరాని ప్రథమ చికిత్స కిట్లు ప్రథమ చికిత్స కిట్లు ఏ చోట కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కొన్ని చోట్ల పెట్టెమాత్రమే ఉండి లోపల ఔషధాలు, ప్రథమ చికిత్స పరికరాలు కనిపించడం లేదు. అలాగే వినియోగదారులకు ఫిర్యాదుల పెట్టె, నాణ్యత తనిఖీకి కావాల్సిన పరికరాలు అత్యవసర సమయాల్లో సమాచారం ఇచ్చేందుకు ఫోన్ సౌకర్యం వంటివి కనిపించడం లేదు.మా దృష్టికి వస్తే సమస్య పరిష్కారం బంకుల్లో అందాల్సిన సేవలపై కానీ యాజమాన్యం వినియోగదారుల పట్ల వ్యవహరిస్తున్న శైలిపై కానీ ఫిర్యాదులు వస్తే సంబంధిత బంకు యాజమాన్యంపై చర్యలు చేపడతాం. పార్వతీపురం మన్యం జిల్లాకు సివిల్ సప్లైస్ జీఎంగా కొద్దిరోజుల క్రితం బాధ్యతలు స్వీకరించాను. సిబ్బందితో సమన్వయం చేసుకుని బంకుల్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై తనిఖీ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాం. – ఐ.రాజేశ్వరి, జీఎం సివిల్ సప్లైస్, పార్వతీపురం మన్యం జిల్లా -
ఆర్థిక అవసరాలకు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ
● ఎస్పీ అధ్యక్షతన వార్షిక సమావేశం ● రుణాలపై వడ్డీ శాతం 6 నుంచి 4.08కి తగ్గింపు ● మ్యారేజ్ రుణాలు లక్ష నుంచి రెండు లక్షలకు పెంపు ● పర్సనల్ లోన్ పరిమితి 75 వేల నుంచీ లక్షకు పెంపువిజయనగరం క్రైమ్: హోం గార్డ్స్ ఆర్థిక అవసరాల నిమిత్తం తీసుకోవాల్సిన నిర్ణయాలను స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్స్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వార్షిక సమావేశంలో ఎస్పీ వకుల్ జిందల్ అధ్యక్షతన మంగళవారం చర్చించారు. ఈ సందర్భంగా హోం గార్డ్స్ వ్యక్తిగత రుణాలను పెంచాలని ఎస్పీ వకుల్ జిందల్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే హోం గార్డ్స్ పిల్లల వివాహాలకు రుణాల మంజూరుకు క్రెడిట్ సొసైటీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తీసుకున్న రుణాలపై వడ్డీ రేటును కూడా తగ్గించాలని సొసైటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ పోలీస్శాఖలో హోం గార్డ్స్ అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారని, వారి ఆర్థిక అవసరాల కోసం కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పనిచేస్తుందని చెప్పారు. కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో హోం గార్డ్స్ వ్యక్తిగత రుణాలను ప్రస్తుతం ఉన్న రూ.75 వేల నుంచి రూ.లక్షకు పెంచామని తెలిపారు. ఇక హోం గార్డ్స్ వారి పిల్లల వివాహాలకు ప్రస్తుతం తీసుకుంటున్న రుణాలను రూ.రెండు లక్షలకు పెంచామన్నారు. తీసుకుంటున్న రుణాలపై వడ్డీశాతం కూడా తగ్గించామని తెలిపారు. సొసైటీని మరింతగా వృద్ధిలోకి తీసుకువచ్చి ప్రగతి పథం వైపు నడిపించేందుకు సభ్యల నుంచి సలహాలను తీసుకుంటామని ఎస్పీ వకుల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక 2024–2025 వార్షిక సంవత్సరానికి సొసైటీ ఆదాయ, వ్యయాలను తీసుకుంటున్న నిర్షయాలను సొసైటీ సెక్రటరీ సుశీల సభ్యులకు వివరించారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత,సీఐలు లీలారావు, చౌదరి, ఆర్ఎస్సై గోపాల నాయుడు సంస్థ సెక్రటరీ సుశీల, నీలకంఠం, డైరెక్టర్లు శంకరరావు, గోపాలరావు, రమణ, మహేశ్వరరావు బంగార్రాజులు పాల్గొన్నారు. -
డీ పట్టాభూముల ఆక్రమణపై దళితుల ఆగ్రహం
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేట్టిన తరువాత దళితుల సమస్యలు పట్టించుకోవడంలేదంటూ భామిని మండలంలోని లివిరి గ్రామ దళిత రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 30 ఏళ్ల కిందట ఇచ్చిన డీ పట్టా భూముల ఆక్రమణకు నిరసనగా కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. కష్టపడి పెంచిన నీలగిరి, జీడి తోటలను అనకాపల్లికి చెందిన గుర్రం వరప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా తరలించుకుపోతున్నాడంటూ గగ్గోలు పెట్టారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల నిర్వహించిన భూ సర్వేలో తమ డీపట్టా భూములను పరిగణనలో తీసుకోలేదని, దీనివల్లే ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మండల సర్వేయర్, వీఆర్ఓల ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి కూరంగి మన్మథరావు, ఐటీటీయూసీ జిల్లా కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్, నాయకులు జనార్దన్, ఇ.వి.నాయుడు పాల్గొన్నారు. కష్టం మాది ఫలితం వేరేవారిది 30 ఏళ్ల కిందట ప్రభుత్వం మాకు అప్పగించిన భూముల్లో నీలగిరి పంట వేసి జీవనోపాధి సాగిస్తున్నాం. ప్రస్తుతం మా భూములు తమవంటూ అనకాపల్లికిచెందిన వ్యక్తి దౌర్జన్యం చేస్తున్నారు. మేము సాగుచేసిన నీలగిరిని తరలించుకుపోతున్నారు. తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. జిల్లా అధికారులు తక్షణమే మాకు న్యాయంచేయాలి. – శాంతమ్మ, లివిరి గ్రామం ఆదుకోండి సారూ.. ప్రభుత్వం మాకు ఇచ్చిన డీ పట్టా భూములకు ప్రస్తుతం రక్షణ కరువైంది. తహశీల్దార్కు విన్నవించుకున్నా ఫలితం లేదు. దళితులమైన మా భూములపై పెత్తందారులు అజామాయిషీ చెలాయిస్తున్నారు. అధికారులు స్పందించి భూములకు రక్షణ కల్పించాలి. – టి.లచ్చమ్మ, లివిరి గ్రామం 30 ఏళ్ల కిందట ఇచ్చిన భూముల ఆక్రమణపై ఆందోళన కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన భామిని మండలం లివిరి గ్రామ దళిత రైతులు పట్టించుకొనేవారే కరువయ్యారు తమ సమస్యను పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు డబ్బున్న వారిని, అధికారం ఉన్న వారినే పట్టించుకుంటున్నారు. మా లాంటి పేదవాళ్లని ఎవరూ పట్టించుకోవడం లేదు. మా పిల్లా, పాపలతో ఎలా బతకాలి. అధికారులు స్పందించి మా భూములను మాకు అప్పగించి ఆదుకోవాలి. – జి. చిన్నమ్మి, లివిరి గ్రామం -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ130 శ్రీ230 శ్రీ240సంతకవిటి ఎస్సైపై దాడి● 1.50తులం బంగారు చైన్ చోరీ ● ఆలస్యంగా వెలుగులోకి ఘటన సంతకవిటి: మండలంలోని జావాం గ్రామంలో ఇటీవల జరిగిన పగడాలమ్మ తల్లి జాతర బందోబస్తులో ఉన్న ఎస్సైపై దాడి చేసి 1.50 తులం చైన్ చోరీ చేసినట్లు ఏఎస్సై ఎం.వాసుదేవరావు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 1:30 గంటలకు డ్యూటీలో మాబ్ను కంట్రోల్ చేస్తు న్న సందర్భంలో ఎస్.అగ్రహారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెనుక నుంచి ఎస్సైపై దాడిచేసి చేసి చైన్ లాక్కుని వెళ్లిపోయినట్లు బాధిత ఎస్సై ఆర్.గోపాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వాసుదేవరావు మంగళవారం తెలిపారు. రైలు ఢీకొని యువకుడి మృతికొమరాడ: మండలంలోని అర్తాం–సోమినాయుడువలస రైల్వే గేటు మధ్యలో రైలు ఢీకొని యువకుడు కొప్పర వెంకటరమణ(26) మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్సీ రత్నకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటరమణ అర్తాం సమీపంలోని తన పొలానికి వెళ్తున్న క్రమంలో రైల్వేట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగి మృతిచెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆటో బోల్తా పడి వ్యక్తి..వేపాడ: మండలంలోని బల్లంకి గ్రామానికి చెందిన మారడబూడి రమణ (52) ఆటో బోల్తా పడడంతో జరిగిన ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వల్లంపూడి ఎస్సై బి.దేవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మారడబూడి రమణతో పాటు మరికొందరు కలిసి గ్రామానికి చెందిన ఆటోలో సోమవారం పూసపాటిరేగ మండలం గోవిందపురంలో బంధువుల ఇంటికి వెళ్లి అదే ఆటోలో తిరిగి వస్తుండగా బల్లంకి గ్రామ సమీపంలో గుమ్మడి బందవద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రమణ తల వెనుక భాగంలో గాయం కాగా అక్కడికక్కడే చనిపోయాడని, మిగిలిన వారంతా గాయాల పాలైనట్లు మృతుడి భార్య దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడు రమణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 20 నాటుకోళ్ల మృతివంగర: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణంలో మార్పు వచ్చి గంటన్నర పాటు ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. వంగర, ఎం.సీతారాంపురం, మడ్డువలస, మగ్గూరు, సంగాం, ఓనెఅగ్రహారం తదితర గ్రామాల్లో వర్షం కురవగా . మెట్టమగ్గూరు ఎస్టీ కాలనీలో డ్రైనేజీ పూడుకుపోవడంతో వర్షం నీరు ఇళ్లల్లోకి చేరి గ్రామానికి చెందిన పక్కి గంగమ్మ, సంగాపు పకీరు, సంగాపు జగన్నాథంలకు చెందిన 20 నాటుకోళ్లు మృతిచెందినట్లు బాధితులు వెల్లడించారు. అలాగే మడ్డువలస డ్రైనేజీలు పూడుకుపోవడంతో వర్షం నీరు ఇళ్ల ముందు చేరగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. టిప్పర్ దగ్ధంపాచిపెంట: మండలంలోని కేరంగి పంచాయతీ నందేడువలస సమీపంలో మంగళవారం విద్యుత్వైర్లు తాకి ఓ టిప్పర్ దగ్ధమైంది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పూడి నుంచి నందేడువలస నూతన రహదారి నిర్మాణానికి టిప్పర్లో మెటల్ రాయి తీసుకువెళ్లి నందేడువలస సమీపంలో ఒంపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు టిప్పర్కు విద్యుత్ వైర్లు తాకి మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్లు దూకేయడంతో ప్రాణపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసే సమయానికి టిప్పర్ పూర్తిగా దగ్ధమైపోయింది.విద్యుత్ వైర్లు రోడ్డు పక్కన తక్కువ ఎత్తులో ఉన్నాయని పలుమార్లు మండల, జిల్లా సర్వసభ్య సమావేశాల్లో అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని జెడ్పీవైస్ చైర్మన్, సర్పంచ్, ఎంపీటీసీ విలేకరులకు తెలిపారు. -
మే 10న జాతీయ లోక్ అదాలత్
పార్వతీపురంటౌన్: న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడానికి, వివాదాలను ముందుదశలోనే పరిష్కరించడానికి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా రెండవ అదనపు జడ్జి, మండల న్యాయ సేవా కమిటీ అధ్యక్షుడు ఎస్.దామోదర రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి మే 10వ తేదీన మొదటి జాతీయ లోక్అదాలత్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నామన్నారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలు పెండింగ్లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, ఇతర వివాదాలను పరిష్కరించడానికి లోక్అదాలత్ వారధిగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. కక్షిదారులు రాజీ చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేకన్నా కేసులను సామరస్యంగా పరిష్కరించుకుని రాజీ చేసుకోవడమే ఉత్తమ మార్గమన్నారు. కోర్టుకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా, కేసులు రాజీ చేసుకోవచ్చని సూచించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారమైతే కోర్టుకు మొదట చెల్లించిన రుసుమును కక్షిదారులకు కోర్టు తిరిగి చెల్లిస్తుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో బాధితులకు న్యాయం త్వరగా లభించే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క కక్షిదారు వినియోగించుకుని లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. -
తాగునీటి పథకాల క్లోరినేషన్ జరగాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా విస్తత చర్యలు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వివిధ పత్రికల్లో తాగునీటి సమస్యపై వచ్చిన వార్తలపై కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వేసవి తీవ్రత దష్ట్యా అధికారులు స్పష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి పథకాలను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని, తాగునీటి పరీక్షలు నిర్వహిం చాలని ఆదేశించారు. తాగునీటి పథకాలకు మెట్లు లేకపోతే తక్షణం మెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీటి సమస్య ఏర్పడినప్పుడు వెంటనే పనులు చేపట్టాలని కోరారు. జిల్లా పరిషత్ నిధులు మంజూరు కానున్నట్లు పేర్కొన్నారు. పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, వీరఘట్ట, సీతంపేట తదితర మండలాల నుంచి తాగునీటి సమస్యపై వచ్చిన అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వేసవి దృష్ట్యా చలివేంద్రాలను అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు. రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు శ్రీకాకుళం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాజు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా నుంచి అందిన రూ.50 లక్షల ప్రతిపాదనల మంజూరుకు త్వరలో చర్యలు చేపడతామన్నారు. సీతంపేట మండలం మెట్టుగూడ వద్ద తాగునీటిపై వచ్చిన వార్తలకు తక్షణ స్పందించి లీకేజీని పునరుద్ధరించామని గ్రామీణ నీటి సరఫరా డీఈ తెలిపారు. సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య ప్రస్తుతానికి లేదని, ఎప్పటికప్పుడు వాటిపై దష్టి సారించి చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్లు వివరించారు. వీడియో కాన్ఫరెనన్స్లో జిల్లా గ్రామీణ నెట్వర్క్ అధికారి ఒ.ప్రభాకర రావు, జిల్లా పంచాయతీ అధికారి టి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
విజయనగరం క్రైమ్: స్థానిక గాజులరేగకు చెందిన పత్తిగిల్లి దిలీప్కుమార్ సిటీ బస్టాండ్లో నిర్వహిస్తున్న గాయత్రి మెటల్ మార్ట్ షాప్లో 240 కిలోల రాగి,160 కిలోల ఇత్తడి, మూడు ఇన్వర్టర్ బ్యాటరీలతో పాటు 60 వేల నగదు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితుడు వన్టౌన్ స్టేషన్లో మార్చి 30వ తేదీన ఫిర్యాదు చేయగా వెంటనే స్టేషన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో పెందుర్తి మండలం చినముషిడివాడ అంబేడ్కర్నగర్కు చెందిన పేండ్ర నాయుడు, పేండ్ర సుదర్శన్ బాబు, ఏసు, కృష్ట అనే నలుగురు చోరీకి పాల్పడినట్లు తేలింది. పక్కా సమాచారం మేరకు పేండ్ర నాయుడు, పేండ్ర సుదర్శన్ బాబులను అరెస్ట్ చేసి, ముప్ఫై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ శ్రీనివాస్ చెప్పారు. -
పౌల్ట్రీ పరిశ్రమ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
● పరిశ్రమ నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వరకు పాదయాత్ర ● పోస్టర్లు విడుదల చేసిన సీఐటీయూ నాయకులుచీపురుపల్లి: నిబంధనలకు విరుద్ధంగా మండలంలోని కర్లాం శ్రీ వెంకటరామా పౌల్ట్రీ పరిశ్రమలో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని సీఐటీయూ నాయకులు స్పష్టం చేశారు. గడిచిన 40 రోజులుగా కార్మికులు నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా బుధవారం పౌల్ట్రీ పరిశ్రమ నుంచి చీపురుపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయం వరకు నిర్వహించ తలపెట్టిన సామూహిక పాదయాత్రకు సంబంధించిన పోస్టర్లను పరిశ్రమ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌల్ట్రీ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కార్మికశాఖ డిప్యూటీ కమీషనర్ ఆదేశాలు కూడా ఉన్నాయని అయినప్పటికీ యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు. అంతేకాకుండా పరిశ్రమలో స్థానికులకే 75 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కార్మికులను తీసుకొచ్చి నియమించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం పరిశ్రమ నుంచి కార్మికులంతా ఒక్కటై పాదయాత్రగా బయల్దేరి చీపురుపల్లిలోని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కార్యాలయం వరకు పాదయాత్రగా నిరసన తెలుపుతూ వెళ్లనున్నట్లు తెలిపారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ తలపెట్టిన ఈ పాదయాత్రకు ప్రజలు, ప్రజాప్రతినిధులు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులతో బాటు యూనియన్ నాయకులు టీవీ.రమణ, ఎ.గౌరునాయుడు, ఐ.గురునాయుడు, టి.ఈశ్వరరావు, సూరిబాబు, గొల్లబాబు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత తేలిపోయింది!
గిరిజన గ్రామాల ప్రజలు అమాయకులు... మారుమూల కొండప్రాంతం.. ఇక్కడ నాసిరకం పనులు చేసినా అడిగేవారు ఉండరన్న భావనతో కురుపాం మండలంలోని అంటిజోల గ్రామం నుంచి మనిగ గ్రామానికి 2.3 కిలోమీటర్ల మేర రూ.157.65 లక్షల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిచ్చేశారు. మట్టిపైనే తారురోడ్డు వేసి మమఅనిపించేశారు. రోడ్డుపై వాహనం వెళ్తే చాలు.. టైర్లకు తారు పెచ్చులు అంటుకుంటున్నాయి. ఎక్కడికక్కడే రోడ్డు ఎక్కిపోతోంది. వేసిన 20 రోజులకే నాణ్యత ‘తేలిపోయింది’. రోడ్డు పనుల్లో ‘డొల్ల’తనం బయటపడుతోందన్న విషయాన్ని పలువురు యువకులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. రూ.కోట్లు వెచ్చించి.. రహదారులు కల్పిస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం.. నాణ్యతకు పాతరేసి, కాంట్రాక్టర్లకు అప్పనంగా కాసులు కట్టబెడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంపై గిరిజనులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ వేసిన రోడ్డును చూడండంటూ ప్రయాణికులకు చూపిస్తున్నారు. దీనిని గుర్తించిన అధికారులు మళ్లీ ఉమ్ముతడి పనులు మొదలుపెట్టారు. వాస్తవంగా శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. కూటమి నాయకుల కమీషన్ కక్కుర్తి వల్లే గిరిజన ప్రాంతాల రహదారులకు ఈ దుస్థితి ఏర్పడిందని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గుంతలు లేని రహదారులు.. గిరి శిఖర గ్రామాలకు డోలీల కష్టాలు తీరుస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలైతే చేస్తున్నారు గానీ.. ఆచరణలో కూటమి నాయకుల నాణ్యతలేమి పనితీరుకు ఈ రోడ్డే నిలువెత్తు నిదర్శనమని విమర్శిస్తున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం -
సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురంటౌన్: సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షల ఆన్లైన్ శిక్షణకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారి ఇ.అప్పన్న తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీఈటీ ఉత్తీర్ణులై, సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు అర్హులైన స్థానికులైన వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనకబడిన తరగతుల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిగ్రీ మార్క్స్ లిస్ట్, కుల, ఆదాయ, స్థానికత తెలిపే ధ్రువీకరణ పత్రాలు, డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులు టీఈటీ మార్క్స్ లిస్ట్ జిరాక్స్, పాస్ పోర్ట్ ఫొటోలు 2 దరఖాస్తుతో జత చేయాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఆర్సీఎం స్కూల్, రూం నంబర్ 8, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా పార్వతీపురం కార్యాలయంలో పని వేళల్లో సమర్పించాలని సూచించారు. -
పాల ఉత్పత్తి పెంపే లక్ష్యం
రామభద్రపురం: భవిష్యత్లో పాల ఉత్పత్తితో పాటు మేలు జాతి దూడల వృద్ధికి ప్రత్యేక దృష్టిసారించామని పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. రామభద్రపురం మండలం ఆరికతోట పంచాయతీ మధుర గ్రామం జగన్నాథపురంలో హెచ్ఎఫ్ పాడి ఆవుకు పిండం బదిలీ పద్ధతిలో జన్మించిన మొదటి గిర్ జాతి దూడను జేడీ వైవీ రమణతో కలిసి మంగళవారం పరిశీలించారు. దూడ ఆరోగ్యానికి అవసరమైన మందులను పాడిరైతుకు అందజేశారు. రాష్ట్రంలో పిండ బదిలీ ప్రక్రియపై 45 మంది పశువైద్యాధికారులకు శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. 350 పశువులకు పిండ బదిలీ ప్రక్రియ జరిపితే 15 నుంచి 20 శాతం ఫలితాలు సాధించగలిగామన్నారు. పిండం బదిలీ పద్ధతిలో మేలు జాతి దూడను సంవత్సరం కాలంలోనే పొందవచ్చన్నారు. దేశీయ గిర్, సాహివాల్, ఒంగోలు జాతి గోవుల పరిరక్షణకు ఈ విధానం అవలంభిస్తున్నామని తెలిపారు. పిండమార్పిడి ప్రయోగంలో సత్ఫలితాన్ని సాధించిన ఆరికతోట పశువైద్యుడు సురేష్ను అభినందించారు. కార్యక్రమంలో ఎల్డీఏ జి.రాధాకృష్ణ, డీడీ దామోదర్, ఏడీ ఎల్.విష్ణు పాల్గొన్నారు. మేలు జాతి దూడల వృద్ధిపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ శ్రీనివాసరావు -
‘సహకార’ ఎన్నికలకు సన్నాహాలు!
వీరఘట్టం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, జిల్లా సహకార బ్యాంకులకు పాలక మండళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్పై ఈ నెలాఖరుకు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొన్నటివరకు సహకార సంఘాలకు కూడా నామినేటేడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమిస్తారన్న ప్రచారం సాగింది. చాలామంది స్థానిక నేతలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. వారంతా ఇప్పుడు నిరాశచెందుతున్నారు. వాస్తవంగా పాలక మండళ్ల పదవీకాలం 2018తోనే ముగిసింది. 2018లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానంలో పాలకమండళ్లను ఏర్పాటుచేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని కొనసాగించింది. దీంతో అప్పటి నుంచి సహకార సంఘాలకు ఎన్నికలు జరగలేదు. 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పీఏసీఎస్లలో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారందరితో రాజీనామాలు చేయించి ప్రత్యేక అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాలో 105 సంఘాలకు ఎన్నికలు ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం 105 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో విజయనగరం జిల్లాలో 63 సంఘాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 42 సంఘాలు ఉన్నాయి. రెండు జిల్లాల పరిధిలోని మొత్తం సంఘాల్లో సుమారు 1.44 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నట్టు సమాచారం. 1984 సహకార చట్టం ప్రకారం ఎన్నికకు మూడు నెలలకు ముందుగా సొసైటీల వారీగా సభ్యుల జాబితా ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అందుకనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తారు. తర్వాత తుది జాబితాను అందుబాటులో పెడతారు. ఇప్పటికే ఈ సొసైటీల్లో ఉన్న సీఈఓలకు ఓటర్ల జాబితా తయారీపై రాష్ట్రస్థాయి అధికారులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకార సంఘాలకు ఆర్థిక ప్రయోజనాలు కలగాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలన్నది నిబంధన. అందుకే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే, కూటమి ప్రభుత్వం సాగుకు పెట్టుబడి సాయం అందజేయకపోవడం, మద్దతు ధర కల్పనలో విఫలం కావడం వంటి కారణాలతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సహకార సంఘాల ఎన్నికల సమయంలో ఈ ప్రభావం తీవ్రంగా కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఆలోచనలో పడినట్టు సమాచారం. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతుల (ఓటర్లు) పేర్లుతో కూడిన జాబితాల తయారీపై సీఈఓలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం అన్ని సొసైటీల్లో ఉన్న రైతుల జాబితాలు తయారు చేస్తున్నాం. – పి.శ్రీరామ్మూర్తి, జిల్లా కోపరేటివ్ అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా -
ఇక్కడ సున్నా శాతం
అక్కడ శతశాతం.. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రామభద్రపురం మండలంలోని బూసాయవలస కేజీబీవీ బాలికలు సెకెండియర్లో శతశాతం ఫలితాలు సాధించారు. బైపీసీ విభాగంలో సెకెండియర్లో 33 మందికి 33 మంది, ఫస్టియర్లో 33 మందికి 32 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకెండియర్ విద్యార్థిని బి.షర్మిల బైపీసీలో 963/1000 మార్కులు సాధించింది. అయితే, రామభద్రపురం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న హైస్కూల్ ప్లస్ జూనియర్ కళాశాల విద్యార్థులు జీరో శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ పరీక్షకు హాజరైన 14 మందికి అందరూ ఫెయిలయ్యారు. హైస్కూల్ ప్లస్లను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, విద్యాబోధనకు అర్హత ఉన్న అధ్యాపకులను నియమించకపోవడమే దీనికి కారణమని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదువుకునే కళాశాలలపై నిర్లక్ష్యం తగదంటున్నారు. – రామభద్రపురం -
దళితులు, గిరిజనులపై దాడులు తగవు
పాచిపెంట: దళితులు, గిరిజనులపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడడం తగదని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. పాచిపెంట మండలం మోసూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన సోమ వారం ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన సామాజిక భవనాన్ని ప్రారంభించారు. మాజీ వైస్ ఎంపీపీ గండిపిల్లి రాము అధ్యక్షతన నిర్వహించిన సభలో రాజన్నదొర మాట్లాడుతూ నియోజకవర్గంలో మంత్రి సంధ్యారాణి రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. దళితులు, గిరిజనులే లక్ష్యంగా దాడులు చేయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. అనేక మంది చిరుద్యోగులను తొలగించడం, దళిత అధికారులను బదిలీ పేరుతో వేధించడం తగదన్నారు. పాచిపెంట మండలంలో 8 మంది, మెంటాడలో 8 మంది చిరుద్యోగులను సస్పెండ్ చేయించారని చెప్పారు. రాజ్యాంగంలో పంచాయతీ సర్పంచ్లకు కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిపై ప్రజలతో పాటు స్థానిక పాలకులు పోరాటం సాగించాలన్నారు. దాడులకు పాల్పడేవారిపై ఫిర్యాదులు చేసి రశీదు తీసుకోవాలన్నారు. పాచిపెంట మండలంలో దళిత నాయకుడు గండి పిల్లి రాము 24 ఏళ్లుగా సాగుచేస్తున్న భూములను ఇప్పుడు సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అదే గ్రామంలో టీడీపీ నాయకుడు చెరువుని దర్జాగా కబ్జా చేస్తే ఎందుకు స్పందించడం లేదన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి డోల బాబ్జి మాట్లాడుతూ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా దళితులు, గిరిజనులపై దాడులు జరుగుతున్నాయన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ వల్లనే మంత్రి అయిన విషయాన్ని సంధ్యారాణి మరచిపోయారని, అదే వర్గ ప్రజలపై దాడులను అరికట్టడంలో విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు దండి శ్రీనివాసరావు, ఎంపీపీ ప్రతినిధి పాచిపెంట వీరంనాయుడు, వైస్ ఎంపీపీ రవీంద్ర, పార్టీ మండలాధ్యక్షుడు గొట్టాపు ముత్యాలనాయుడు, మాజీ వైస్ ఎంపీపీ తట్టికాయల గౌరీష్, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన
సాలూరు: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం రెడ్బుక్ పాలన సాగిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడు పీడిక రాజన్నదొర వాపోయారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సాలూరు పట్టణంలోని బంగారమ్మపేట, పీఎన్ బొడ్డవలస ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్లు కట్చేసి చిన్నారులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలందరికీ మేలు జరిగేలా, అనేక దేశాలకు ఆదర్శంగా నిలిచిన అంబేడ్కర్ రాజ్యాంగం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కనుమరుగవుతోందన్నారు. దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయన్నారు. మరిపల్లి, కేసలి, మోసూరు, కరాసవలస తదితర ప్రాంతాల్లో దళితులు, గిరిజనులపై జరిగిన కక్షపూరిత చర్యలను వివరించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో తను ఏనాడూ రాజ్యాంగం, చట్టాలకు అతీతంగా నడుచుకోలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో సుమారు రూ.1300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 2014–19 మధ్యన అప్పటి టీడీపీ ప్రభుత్వం సాలూరు పట్టణంలో వంద పడకల ఆస్పత్రి, కందులపదం, మోసూరు, సాలూరు వంతెన పనులకు కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే తరువాత వైఎస్సార్సీపీ పాలనలో వాటి నిర్మాణాలు చేపట్టామని వివరించారు. కూటమి పాలనలో రాజకీయ కక్షతో సుమారు 25 మంది చిరుద్యోగులను విధుల నుంచి తొలగించారని, వారందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
దళిత అభ్యున్నతే అంబేడ్కర్ ఆశయం
● గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీకట్టిమణివిజయనగరం అర్బన్: దేశాభివృద్ధికి దళిత అభ్యున్నతే మూలమని, దానినే ఆశయంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసుకున్నారని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. భారతరత్న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు యూనివర్సిటీ ప్రాంగణంలో సోమవారం ఘనంగా జరిగాయి. తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాల్లో అన్నింటికన్నా ఉత్తమమైన భారత దేశ రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేడ్కర్కు దక్కిందన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, డాక్టర్ పరికిపండ్ల శ్రీదేవి, డాక్టర్ గంగునాయుడు మండల, డాక్టర్ కుసుమ్, సుప్రియదాస్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీలో.. అండ్కర్ జయంతి ఉత్సవాలు స్థానిక జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీలో సోమవారం వేడుకగా జరిగాయి. స్థానిక యూనివర్సిటీ ప్రాంగణంలో అంబేడ్కర్ చిత్రపటానికి యూనివర్సిటీ ఇచ్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి, పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
రెడ్క్రాస్ సొసైటీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం ఫోర్ట్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి సత్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు–1(డీఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ, అకౌంటెంట్ పోస్టు–1(ఏదైనా డిగ్రీ, టాలీ అనుభవం ఉండాలి), జన ఔషధి మెడికల్ షాపులో ఫార్మసిస్ట్ పోస్టు–1(బి.ఫార్మశీ లేదా డి.ఫార్మసీ విద్యార్హత)కు అర్హత గల అభ్యర్థులు ఈనెల 21 వతేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 08922–272700, 9493092700, 6305042755 లను సంప్రదించాలని సూచించారు. కరెంట్ పోల్పై తిరగబడ్డ జేసీబీ సాలూరు రూరల్: మండలంలోని కొదమ పంచాయతీ అడ్డుగూడ, కోడంగివలస గ్రామాల మధ్యలో ఘాట్రోడ్డు వద్ద ఆదివారం రాత్రి ట్రాలీపై తీసుకువెళ్తున్న జేసీబీ తిరగబడి పక్కనే ఉన్న కరెంట్ పోల్పై పడింది. దీంతో ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. యువకుడి అదృశ్యంపై కేసు నమోదుపార్వతీపురం రూరల్: మండలంలోని నర్సిపురం పరిధిలో ఓలేటి వారి ఫారం సమీపంలో నివాసం ఉంటున్న రాహుల్ పండిత్ అనే యువకుడు ఆదివారం సాయంత్రం నుంచి ఆచూకీ లేవకపోవడంతో తండ్రి ముఖేష్ పండిత్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి తెలిపారు.చికిత్స పొందుతూ వీఆర్ఏ మృతిసీతానగరం: మండలంలోని వెంకటాపురం(కామందొరవలస)రెవెన్యూ గ్రామానికి చెందిన వీఆర్ఏ తోట నాగయ్య విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటలకు మృతిచెందాడు. దీనిపై స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గతనెల 16న ఇంట్లో చెదలు నివారణకని తెచ్చి ఉంచిన చెదల నివారణ మందును వీఆర్ఏ నాగయ్య యాదృచ్ఛికంగా తాగాడు. చెదల నివారణమందు తాగినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా నాటి నుంచి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటలకు మృతిచెందినట్లు తెలియజేశారు. సోమవారం వీఆర్ఏ తోట నాగయ్య మృతిచెందినట్లు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.రాజేష్ కేసు నమోదుచేసి మృతదేహానికి పోస్టుమార్టం చేసినట్లు తెలియజేశారు. మృతుడు నాగయ్య అంత్యక్రియల నిమిత్తం తహసీల్దార్ ప్రసన్నకుమార్ ఆదేశాలమేరకు ఆర్ఐ నాగి రెడ్డి శ్రీనివాసరావు, వీఆర్వో బాబూరావు రూ.10వేలు కుటుంబసభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నాగయ్య కుటుంబాన్ని సచివాలయ ఉద్యోగులు పరామర్శించి సానుభూతి వెలిబుచ్చారు. పశువుల రవాణాను అడ్డుకున్న పోలీసులులక్కవరపుకోట: అక్రమంగా వాహనాల్లో పశువులను కుక్కి తరలిస్తున్న వాహనాలను ఎల్.కోట ఎస్సై నవీన్పడాల్ తన సిబ్బందితో కలిసి సోమవారం అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జామి మండలం అలమండ గ్రామం సంతనుంచి నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాల్లో అధిక పశువులను ఎక్కించి రవాణా చేస్తున్న వాహనాలను భీమాళి జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. 2 వాహనాల్లో పశువులను తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాలతో పాటూ పశువులను పోలీస్స్టేషన్కు తరలించి అక్కడి నుంచి పశువులను సమీపంలో గల గోశాలకు తరలించారు. ఈ మేరకు రెండు వాహనాలను సీజ్ చేసి సంబంధిత డ్రైవర్లను విచారణచేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పన్ను వసూలులో నిర్లక్ష్యం..!
● పంచాయతీల్లో పడకేసిన ప్రగతి ● వసూలులో వెనుకబడిన అధికారులు ● బకాయి రూ.కోట్లలోనే..రామభద్రపురం: పంచాయతీల్లో ఇంటి పన్ను, ఆస్తిపన్ను వసూలు విషయంలో అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది.ఫలితంగా ఆయా పంచాయతీలు ఆర్థిక సంక్షోహం ఎదుర్కొంటుండడంతో పల్లెల్లో ప్రగతి పూర్తిగా పడకేసింది. గ్రామాల్లోని గృహాలు, ఖాళీస్థలాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ద్వారా మార్చి 31 నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేస్తామని అధికారులు ప్రకటించినా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు. ఇంటి పన్నుల వసూలు ఇలా.. జిల్లాలో 777 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో మార్చి 31 నాటికి 2023–24 ఏడాదికి సంబంధించి ఇంటి పన్నులు పాతబకాయి రూ.3,31,52,718 కాగా, 2024–25 ఏడాదికి వసూలు చేయాల్సింది. రూ. 15,76,14,332. మొత్తంగా రూ. 19,07,67,050 లు వసూలు లక్ష్యం ఉంది. అయితే ఇందులో పాత బకాయి రూ.2,66,11,654లు, ఈ ఏడాది రూ.13,40,20,752లు వసూలు చేశారు.మొత్తంగా రూ.16,06,32,406 వసూలైంది. ఇంకా పాత బకాయిలు రూ.65,41,064లు, 2024–25 ఏడాది వసూలు చేయాల్సింది రూ.2,35,93,584 బకాయి ఉంది. మొత్తంగా రూ.3,01,34,644లు బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పడకేసిన ప్రగతి.. పంచాయతీ ఖజానాలో పైసా లేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిధులు లేక వాటిలో ప్రగతి పనులు పడకేశాయి. తాగునీటి పథకాల నిర్వహణతో పాటు వీధిదీపాలు, పారిశుద్ధ్యం నిర్వహణకు సొమ్ములేదు. దీంతో గ్రామకార్యదర్శులు, సర్పంచులు గ్రామాల్లో పనులు చేయించుకోలేకపోతున్నారు. వీధుల్లో రోడ్లు, మురుగుకాలువల నిర్మాణాలకు నిధులు లేవు.నీటి పథకాలను అతికష్టం మీద నిర్వహిస్తున్నారు. మోటార్లు కాలిపోతే రూ.వేలల్లో ఖర్చువుతుంది. ఆ సొమ్మును సర్పంచులే భరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తే వాటిలో బిల్లు చేసుకోవాలన్న ఆశతో సొంత సొమ్మును ఖర్చు పెడుతున్నారు. మారుమూల గ్రామాల్లో వీధి దీపాలు కూడా వెలగడం లేదని, పండగలకు మాత్రమే వీధి దీపాలు వెలుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.కాళ్లరిగేలా తిరిగినా సీసీ రోడ్డు వేయరు ప్రతి నాయుకుడి దగ్గరికి కాళ్లరిగేలా తిరిగినా మా వీధిలో సీసీ రోడ్డు వేయడం లేదు. ఏళ్లుగా బుగ్గి, బురదలోనే తిరుగుతున్నాం. ఎన్నికల సమయంలో వచ్చిన పెద్ద నాయకుల దృష్టిలో కూడా పెట్టాం. అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పడమే కానీ చేయడం లేదు. ఇకనైనా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – బోయిన బాలరాజు, నేరళ్లవలస, జన్నివలసపన్నులు వదిలే ప్రసక్తి లేదు.. గ్రామాల్లో ప్రజల నుంచి ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు రాబడతాం. వదిలే ప్రసక్తి లేదు.త్వరలో వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది. పన్ను వసూళ్లపై ప్రచార మాధ్యమాల ద్వారా, అలాగే సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపించి పక్కా ప్రణాళికతో వసూలు చేస్తాం. ఆస్తి పన్ను చెల్లింపులో ఇప్పుడు 50 శాతం రాయితీ వర్తిస్తుంది. పన్నులు వసూలైతేనే ప్రగతి పనులకు నిధుల కొరత లేకుండా ఉంటుంది. – వెంకటరమణ, ఈవోపీఆర్డీ, రామభద్రపురం ఆస్తి పన్ను వసూలు ఇలా.. అలాగే పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరులైన మార్కెట్ వేలం, చేపల చెరువులు, దుకాణాలు, చేపల చెరువుల లీజులు, సంతలు, సెల్టవర్స్ తదితర ఆస్తి పన్నులు 2023–24 ఏడాది పాత బకాయిలు రూ.1,65,42,853లు, 2024–25 ఏడాది వసూలు చేయాల్సింది రూ.3,25,95,344 ఉండగా, మొత్తంగా 4,91,38,197 వసూలు లక్ష్యం ఉంది. ఇందులో పాతబకాయి రూ.95,09,074లు, ఈ ఏడాది రూ.2,57,44,030లు వసూలు చేశారు.మొత్తంగా రూ.3,52,53,104 వసూలైంది.ఇంకా పాత బకాయిలు రూ.70,33,779లు, ఈ ఏడాది వసూలు చేయాల్సింది రూ.68,51,314 బకాయి ఉంది. మొత్తంగా రూ.1,38,85,093లు బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.అయితే మార్చి 31 అర్ధరాత్రి నుంచి ఆస్తిపన్నుకు సంబంధించి ప్రభుత్వ వెబ్సైట్ నిలిపివేసినట్లు తెలిసింది.ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం వివరాలు అప్డేట్ అయిన తర్వాత వెబ్సైట్ మళ్లీ అందుబాటులోకి రానుందని సమాచారం. -
రైతన్నకు వడ్డీ భారం
వీరఘట్టం: రైతన్న తీసుకున్న రుణాలపై వడ్డీల భారం మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. తీసుకున్న రుణానికి సకాలంలో ఏడు శాతం వడ్డీ చెల్లించి రెన్యువల్ చేయని రైతుల నుంచి 14 శాతం వడ్డీతో వసూలుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై రైతుల్లో ఆందోళన నెలకుంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేదికాదని, పంట పెట్టుబడికి ఠంచన్గా సాయం అందేదని, రుణాలపై వడ్డీభారం ఉండేది కాదని రైతులు వాపోతున్నారు. ఇదీ పరిస్థితి... ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఒక రైతు రూ.1 లక్ష రుణం తీసుకుంటే 7శాతం వడ్డీతో ఏడాదికి రూ.7 వేలు వడ్డీ చెల్లించాలి. ఈ వడ్డీ చెల్లిస్తే మరసటి ఏడాది ఇదే రూ.1 లక్ష రుణా న్ని రెన్యువల్ చేస్తున్నారు. వడ్డీ కట్టకపోతే తీసుకున్న అప్పు రూ.1లక్ష, వడ్డీ రూ.7వేలుతో కలిపి మొత్తం రూ.1,07,000లను వచ్చేఏడాది అసలులో చేర్చుతూ అప్పుకింద చూపిస్తున్నారు. వడ్డీ కట్టని వారిని మొండిబకాయిల జాబితాలో చేర్చుతూ 14 శాతం వడ్డీతో రుణాల వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీరఘట్టం పీఏసీఎల్లో మొండి బకాయిలంటూ 1400 మంది రైతుల రుణాలు రెన్యువల్ చేయకుండా నోటీసులు ఇచ్చేందుకు కార్యాచరణ చేపడుతున్నారు. ఆందోళనలో రైతులు వీరఘట్టం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 5,100 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో వ్యవసాయ రుణాలు పొందినవారు 3 వేల మంది ఉన్నారు. వీరంతా సుమారు రూ.30 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. గతంలో వీరు వడ్డీ డబ్బులు చెల్లించినా, చెల్లించకపోయినా ఆ రుణాలను రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం అండగా ఉండేది. ప్రస్తుతం పాలక మండలి లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలనలో పీఏసీఎస్లు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరుతో రైతు రుణాల రెన్యువల్ గడువు ముగిసింది. 1400 మంది రైతులు తీసుకున్న రూ. 12 కోట్లు రుణాలకు వడ్డీలు చెల్లించలేదని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. వీరి నుంచి వసూలుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నోటీసులు ఇస్తాం పీఏసీఎస్లో రుణాలు తీసుకుని వడ్డీలు చెల్లించని రైతులకు నోటీసులు ఇస్తాం. వడ్డీ కట్టని వారి రుణాలు రెన్యువల్ చేస్తే వారికి కొత్త రుణాలు ఇచ్చినట్లు అవుతుంది. పాలకమండలి ఉన్నప్పుడు పరిస్థితులు వేరు. ప్రత్యేక పాలనలో పరిస్థితులు వేరు. అందుకే రుణాల వసూళ్లకు కార్యాచరణ ప్రణాళిక చేపడుతున్నాం. – జి.మధుసూదనరావు, స్పెషల్ ఆఫీసర్, పీఏసీఎస్, వీరఘట్టం వీరఘట్టం వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వీరఘట్టం పీఏసీఎస్లో రెన్యువల్కాని రుణం రూ.12కోట్లు 1400 మంది రైతులకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం -
ఆటో ఢీకొని యువకుడికి గాయాలు
గంట్యాడ: విజయనగరం మండలం కోరుకొండపాలెం గ్రామానికి చెందిన యువకుడు నొడగల గణేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గణేష్ బైక్పై గంట్యాడ మండలం పెదవేమలి వైపు వస్తుండగా గంట్యాడ మండలం మురపాక నుంచి ఎదురుగా వస్తున్న ఆటో పెదవేమలి, కోరుకొండపాలెం మధ్య గెడ్డ సమీపంలో బైక్ను ఢీకొట్టడంతో గణేష్ కింద పడిపోగా కాలు విరిగిపోయింది. స్థానికులు 108 అంబులెన్సులో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బైక్ ఢీకొని మహిళకు..సీతానగరం: మండలంలోని జాతీయరహదారిలో సోమవారం రాత్రి అంటిపేట వద్ద రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ఓ మహిళ గాయాల పాలైంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంటిపేట ప్రజలకు కూడలిగా ఉండే రావిచెట్టు సమీపంలో గాడి లక్ష్మి రోడ్డు దాటుతుండగా బొబ్బిలి మండలం అప్పయ్యపేట గ్రామానికి చెందిన మోటార్ సైక్లిస్ట్ సీతానగరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా లక్ష్మిని ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. గాయాలపాలైన ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించండి
● అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేతవిజయనగరం గంటస్తంభం: వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.గురుమూర్తి కోరారు. వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు వీఆర్ఏలు స్థానిక కలెక్టరేట్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ రెవెన్యూ సహాయకులుగా పైకి విధులు నిర్వహిస్తున్నా వారు అంతర్గతంగా ఆఫీస్ కార్యాలయాల్లో అటెండర్లుగా, స్వీపర్లుగా, డ్రైవర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారన్నారు. అటువంటి వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. అలాగే అర్హులైన వారికి ప్రమోషన్, నైట్డ్యూటీల రద్దు, జీతంతో కలిపి డీఏలు, భూసర్వేల సందర్భంగా టీఏ, డీఏలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, ప్రసాద్, పైడిరాజు, సన్యాసప్పుడు, రామప్పుడు, జయరావు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తిప్రదాత అంబేడ్కర్
–8లోమృత్యుంజయుడు పింటూ భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన పింటూ ఏనుగుల నుంచి తప్పించుకోవడంతో అందరూ పిరిపీల్చుకున్నారు. పార్వతీపురంటౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనందరికీ స్ఫూర్తిప్రదాతని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రశాద్ అన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ జీవిత చరిత్రపై సమాచార పౌర సంబంధాలశాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తాత్విక చింతన దేశాన్ని నడిపిస్తుందన్నారు. దేశం ఏకతాటిపై నడుస్తుందంటే కారణం అంబేడ్కర్ దూరదృష్టేనన్నారు. జిల్లాలో ఎస్టీ, ఎస్సీ జనాభా ఎక్కువగా ఉందని, అంబేడ్కర్ స్ఫూర్తితో విజయాల దిశగా సాగాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.11.53 కోట్లతో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో హేమలత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సామల సింహాచలం, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి ఎస్.మన్మథరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి కె.రాబర్ట్పాల్, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎం.డి.గయాజుద్దీన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉన్నత విద్యావంతుడు అంబేడ్కర్ పార్వతీపురం రూరల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఉన్నత విద్యావంతుడు, రాజనీతిజ్ఞుడని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి జిల్లా పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ దేశ ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో వసుదైక కుటుంబంలా కులమతబేధాలకు అతీతంగా జీవించాలనే దృఢసంకల్పంతో రాజ్యాంగాన్ని రచించారన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆదాం, ఎస్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఏఆర్ ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
గంజాయి తరలింపు కేసులో ఆరో నిందితుడి అరెస్ట్
తెర్లాం: గంజాయి తరలిస్తుండగా పట్టుబడిన కేసులో ఆరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, తెర్లాం ఎస్సై సాగర్బాబు సోమవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వారు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. 2024లో రెండు కార్లలో 18.2 కేజీల గంజాయిని రామభద్రపురం నుంచి రాజాం తరలిస్తుండగా తెర్లాం జంక్షన్ వద్ద స్థానిక పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో వారి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి, రెండు కార్లను సీజ్ చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అదే కేసులో మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఒడిశా రాష్ట్రంలోని పొట్టంగి మండలం ఘాడిగూడకు చెందిన ఆరో నిందితుడు రామభద్రపురం బైపాస్ వద్ద ఆదివారం రాత్రి సంచరిస్తుండగా తెర్లాం పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ఐదవ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గంజాయి కేసును ఛేదించేందుకు కృషిచేస్తున్న ఎస్సై సాగర్బాబు, సిబ్బందిని సీఐ నారాయణరావు అభినందించారు.