పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు, పెద్దలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఘటాలను సమర్పించారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జ్ ఈఓ కెఎన్వీడీవీ .ప్రసాద్ పర్యవేక్షించారు.
పుష్పాలంకరణలో పైడితల్లి
Comments
Please login to add a commentAdd a comment