Top Stories
ప్రధాన వార్తలు

AP: ‘టీచర్లను ఎలా మోసం చేశారంటే...’
నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కరా్ ప్రహాసనంగా మార్చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బదిలీల్లో మ్యానువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ను తప్పనిసరి చేయడం ద్వారా మొత్తం ఉపాధ్యాయలోకంను పచ్చిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్కు రెడ్బుక్పై ఉన్న శ్రద్దలో కాస్తైనా విద్యాశాఖపై లేకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యావ్యవస్థ అధ్వన్నంగా మారిందని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు మ్యానువల్ విధానంలోనే బదిలీ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...తాజాగా కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ రోజు నుంచి 48 గంటల్లో ఆన్లైన్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలంటూ, ఒక్కో టీచర్ 2500 ఆప్షన్స్ పెట్టుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాల వల్ల రాష్ట్రంలో 1.20 లక్షల మంది ఎస్జీటీలకు సంబంధించి అటు హెచ్ఎం పదోన్నతులు లేకుండా చేశారు. మరోవైపు 48 గంటల్లో ఒక్కో టీచర్ 2500 ఆన్లైన్ బదిలీ అప్షన్స్ పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.టీచర్లను ఎలా మోసం చేశారంటే...టీచర్ల బదిలీలకు సంబంధించిన చట్టానికి విరుద్దంగా రోజుకోరకంగా నిబంధనలను మార్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం టీచర్లకు వెన్నుపోటు పొడిచింది. 35 వారాల పాటు ప్రతి శుక్రవారం మీటింగ్లు పెట్టి మ్యానువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేస్తానని చెప్పి నమ్మించారు. తరువాత అసెంబ్లీలో మాత్రం మ్యాన్వల్కు బదులు ఆన్లైన్ కౌన్సెలింగ్ చేస్తామని చట్టం తీసుకువచ్చారు. దీనిపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు చట్టంలో ఉన్న దానిని పక్కకుపెట్టి మ్యాన్వల్ బదిలీలనే చేస్తామని హామీ ఇచ్చారు. గత మే నెలలో ఆన్లైన్ బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండటంతో డీఈఓ కార్యాలయాల ముందు మే 25న ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. దీనితో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీచర్ యూనియన్లతో ఒక మీటింగ్ పెట్టి చట్టప్రకారం ఆన్లైన్ బదిలీలు ఉన్నా కూడా, దానిని పక్కకు పెట్టి మ్యానువల్ బదిలీలే చేస్తామని హామీ ఇవ్వడంతో టీచర్ యూనియన్లు ఆందోళనను విరమించుకున్నారు. అదే క్రమంలో ప్రభుత్వం మే 25న బదిలీలకు సంబంధించి జారీ చేసిన జీఓ 22లో ఖచ్చితంగా ఆన్లైన్ బదిలీలే చేస్తామని స్పష్టం చేసింది. ఇంతకంటే మోసం ఎక్కడైనా ఉంటుందా? దీనిపై టీచర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పొరపాటుగా ఆ జీఓ జారీ చేశామని, మ్యానువల్ బదిలీలే చేస్తామంటూ టీచర్ సంఘాలకు అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు హటాత్తుగా బదిలీలపై తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా పదేపదే టీచర్లను నమ్మించి, నిలువుగా దగా చేస్తూనే ఉన్నారు.బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తంగత ప్రభుత్వం జారీ చేసిన 117 జీఓను రద్దు చేసి, కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల స్కూల్స్ను తీసుకువచ్చింది. బదిలీల కోసం వెబ్ అప్షన్స్లో ఫౌండేషన్, బేసిక్, మెడల్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అనే నాలుగు ఆప్షన్స్ కనిపించాల్సి ఉంది. కానీ కేవలం ఎంపీపీ, యుపీ స్కూల్స్ అని మాత్రమే పెట్టారు. దీనితో టీచర్లలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాము ఆప్షన్ ఇచ్చే స్కూల్ ఏ కేటగిరిలోకి మార్పు చెందిందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రేపు సాయంత్రంతో వెబ్ అప్షన్స్ గడువు ముగుస్తోంది. తొమ్మిదిరకాల స్కూల్స్గా మార్చిన నేపథ్యంలో కొన్ని మండలాల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువగా పెడితే, మరికొన్ని మండలాల్లో ఫౌండేషన్ స్కూల్స్ను ఎక్కువగా పెట్టారు. ఎక్కడా హేతుబద్దత అనేది లేకుండా చేశారు. తెలుగుదేశం నాయకులు చెప్పినట్లుగా స్కూల్స్ కేటగిరిని మార్చారు. ఆర్జేడీ, డీఈఓ, ఎంఈఓలతో సంబంధం లేకుండా, నిబంధనలకు అనుగుణంగా ఏ స్కూల్ ఏ కేటగిరిలో ఉండాలని నిర్ణయించకుండా, టీడీపీ నాయకులు సూచించినట్లుగా స్కూల్స్ను మార్చేశారు. టీచర్లు ఎన్ని సంవత్సరాలు, ఎంత దూరంలో పనిచేశారనే దానిపై పాయింట్స్ ఇస్తారు. దాని ప్రకారమే బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో ఈ పాయింట్స్ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని చూపి టీచర్లను భయపెట్టాలని అనుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్ళతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు. ఎనిమిది అకడమిక్ ఇయర్స్ పూర్తయితే బదిలీ చేస్తామనే నిబంధనలు ఉంటే, ఎనిమిది క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదంటూ సాకులు చూపి పాయింట్స్ ఇవ్వడం లేదు. అలాగే దాదాపు 4000 మంది స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్గా మారిపోయారు. వారిని నిబంధనలకు విరుద్దంగా ప్రైమరీ స్కూల్కు కేటాయిస్తున్నారు. ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉన్న స్కూల్ అసిస్టెంట్ను కూడా పీఎస్ హెచ్ఎంగా మోడల్ స్కూల్స్కు పంపడం దారుణం. దీనివల్ల ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎం పదోన్నతి రాకుండా పోయింది.పదో తరగతి మూల్యాంకనంతో పరువు పోయిందిమంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా, పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో చూసిన నిర్లక్ష్యంతో విద్యాశాఖ పరువు పోయింది. పదోతరగతి పరీక్షలు విద్యార్ధుల భవిష్యత్తుకు తొలి మెట్టు. అటువంటి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయో అందరికీ తెలుసు. నెల్లూరుకు చెందిన విద్యార్థిని సాయి కుందనకి అన్ని సబ్జెక్ట్ల్లో తొంబైకి పైగా మార్కులు వస్తే, హిందీ సబ్జెక్ట్లో 34 మార్కులు వచ్చాయి, బాలికను ఫెయిల్ చేశారు. ఆమె రీవాల్యుయేషన్ పెట్టకుంటే 90 మార్కులు వచ్చాయి. నెల రోజుల పాటు ఆ విద్యార్ధి ఎంత వేదన చెంది ఉంటారో అర్థం చేసుకోవాలి. బొర్రా శిశింద్రారెడ్డికి గణితంలో 32 మార్కులు వేశారు. అన్నింటిలో మంచి మార్కులు వచ్చిన ఈ విద్యార్ధి తిరిగి రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 72 మార్కులు వేశారు. దీనిపైన మళ్ళీ రీకౌంటింగ్ చేయించుకుంటే 78 మార్కులు వచ్చాయి. ప్రొద్దుటూరుకు చెందిన గంగిరెడ్డి మోక్షితను సోషల్ లో 21 మార్కులతో ఫెయిల్ చేశారు. రీవాల్యుయేషన్లో 84 మార్కులు వచ్చాయి. ఇలా అనేక మంది విద్యార్ధుల జవాబుపత్రాలను తీసుకువస్తే, ఎంత దారుణంగా వాల్యుయేషన్ చేశారో అర్థమవుతుంది. ఒక సబ్జెక్ట్ను దిద్దడానికి పదిరోజులు సమయం ఇచ్చే పరిస్థితి ఉంటే, ఆరు రోజుల్లో పూర్తి చేయాలని ఒత్తిడి చేశారు’ అని చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు.

ప్రెసిడెంట్ అయిన 24 గంటల్లోనే పదవికి రాజీనామా
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే ఆ పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అందుకు గల కారణాల్ని కూడా వెల్లడించారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ పదవిలో కొనసాగడం తనకు కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు)అసలేం జరిగిందంటే?టాలీవుడ్లో గత కొన్నిరోజులుగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. పర్సంటేజీ విషయమై నిర్మాతలతో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లకు మధ్య కొన్నిరోజుల క్రితం చర్చలు నడిచాయి. ఇది జరిగిన కొన్నిరోజులకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు బంద్ చేయనున్నారనే న్యూస్ బయటకొచ్చింది. దీని తర్వాత పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేశారు. తన సినిమా 'హరిహర వీరమల్లు' వస్తుందనే ఇలా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన తర్వాత ఆ నలుగురు అనే మాట తెగ వైరల్ అయింది.ఆ నలుగురే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని శాసిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దీంతో తొలుత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. పవన్ సినిమాని ఆపడానికి తాము ప్రయత్నించలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో శనివారం.. తెలంగాణ ఫిలిం చాంబర్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ని ఎంపిక చేశారు. ఇప్పుడు ఇది జరిగిన 24 గంటలు కూడా కాకముందే ఆ పదవికి సునీల్ రాజీనామా చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

IPL 2025: 'ఈ లెక్కన' పంజాబ్దే టైటిల్.. రన్నరప్ ముంబై ఇండియన్స్..!
తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో ఆ జట్టు పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది, 18 ఏళ్ల ఐపీఎల్ ప్రస్తానంలో తొలి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో ఆర్సీబీ, పంజాబ్ ఆది నుంచి పోటాపోటీ పడుతూ ఫైనల్ వరకు చేరాయి. ఇరు జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. అయితే తుది సమరంలో ఆర్సీబీ అనుభవం ముందు పంజాబ్ తలవంచక తప్పలేదు.ఈ సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలిచినప్పటికీ.. ఓ రకంగా చూస్తే పంజాబ్దే విజయం అని చెప్పవచ్చు. అదెలా అనుకుంటున్నారా..? ఈ సీజన్లో అత్యధిక పరుగులు (అన్ని మ్యాచ్ల్లో) చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఈ జట్టు ఈ సీజన్ మొత్తంలో 3000 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు ఓ సీజన్లో 3000 పరుగుల మార్కును తాకడం ఇదే మొదటిసారి.ఈ సీజన్లో పంజాబ్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టు ముంబై ఇండియన్స్. ఈ సీజన్లో ఆ జట్టు 2802 పరుగులు చేసింది. పంజాబ్, ముంబై తర్వాత గుజరాత్ (2766), లక్నో (2598), ఆర్సీబీ2539), రాజస్థాన్ (2496),ఢిల్లీ (2386), సన్రైజర్స్ (2378), సీఎస్కే (2315), కేకేఆర్ (1886) అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో వరుస స్థానాల్లో ఉన్నాయి. పరుగుల సంఖ్య ప్రకారం చూస్తే.. అత్యధిక పరగులు చేసిన పంజాబ్ను విజేత అనుకోవచ్చు. పంజాబ్ తర్వాతి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ను రన్నరప్గా చెప్పుకోవచ్చు.ఈ లెక్క చూసిన తర్వాత ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గత మూడు సీజన్లలో అత్యధిక పరుగులు చేసిన జట్లు రన్నరప్తోనే సరిపెట్టుకున్నాయి. 2023 సీజన్లో గుజరాత్ (2906) అత్యధిక పరుగులు చేయగా.. ఆ సీజన్ ఫైనల్లో ఆ జట్టు సీఎస్కే చేతిలో ఓటమిపాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (2906) అత్యధిక పరుగులు చేయగా.. ఫైనల్లో ఆ జట్టు కేకేఆర్ చేతిలో ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది. ఈ సీజన్లో ఇదే సెంటిమెంట్ రిపీటైంది.ఫోర్లలో ముంబై ఇండియన్స్, సిక్సర్లలో పంజాబ్ఈ సీజన్ మొత్తంలో అత్యధిక బౌండరీలు బాదిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలువగా.. అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అన్ని జట్లకంటే ఎక్కువగా 259 బౌండరీలు బాదగా.. పంజాబ్ అన్ని జట్లకంటే ఎక్కువగా 173 సిక్సర్లు కొట్టింది.ఈ సీజన్లో అత్యధిక ఫోర్లు కొట్టిన జట్లు..ముంబై ఇండియన్స్- 259గుజరాత్- 256పంజాబ్- 255ఆర్సీబీ- 238ఢిల్లీ- 219సన్రైజర్స్- 219లక్నో- 218రాజస్థాన్- 209సీఎస్కే- 199కేకేఆర్- 173ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్లు..పంజాబ్- 173లక్నో- 152రాజస్థాన్- 146ముంబై ఇండియన్స్- 142ఆర్సీబీ- 125గుజరాత్- 124సన్రైజర్స్- 120ఢిల్లీ- 109సీఎస్కే- 102కేకేఆర్- 101

AP: ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
అనంతపురం: జిల్లాలో దారుణం చోటు చేసకుంది. ఇంటర్ చదువుతున్నఓ విద్యార్థిని దారుణంగా హత్య చేయబడింది. కొంతమంది దుండగులు ఇంటర్ విద్యార్థినిని తొలుత తలపై బండరాయితో కొట్టి చంపి.. ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఉరవకొండ నియోజవర్గం కూడేర మండలం బ్రహ్మణపల్లి వద్ద మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. తమ కుమార్తె కనిపిండం లేదని ఆరు రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పోలీసలు పట్టించుకోలేదని, చివరకు ఇలా పూర్తిగా కాలిపోయి కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటర్ చదివే ఆ విద్యార్థినిని హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి కాల్చివేసినట్ల తెలుస్తోంది. ఆర రోజుల క్రితం అదృశ్యమైనప్పటికీ పోలీసుల కాలయాపన చేయడంతోనే ఇలా జరిగిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు ముందుగానే పట్టించుకని ఉంటే తమ కూతురు బతికేదని తల్లిదండ్రలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాల్లిస్ట్ పేరుతో పోలీసులు కాలయాపన చేశారని ఆ అమ్మాయి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడి ఈరోజు(ఆదివారం) ఉదయం మృతిచెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యాహ్నం మూడ గంటల ప్రాంతంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడమ మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి గోపీనాథ్ అంతిమ సంస్కారాలకు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. కేటీఆర్, హరీష్ రావు తదితర నేతలు గోపీనాథ అంతిమ సంస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం.. సీపీఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.హైదరాబాద్ : మాగంటికి నేతలు కన్నీటి నివాళి (ఫొటోలు)మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్

‘అది డైవర్ట్ చేయడానికే టీడీపీ బురద చల్లుడు రాజకీయాలు’
సాక్షి, తాడేపల్లి: జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవే, వాటిని వైఎస్సార్సీపీకి, సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణంరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తరువాత కూడా కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు, వైఎస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హననానికి వాడుకుంటోందని మండిపడ్డారు.మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలనైనా సరే సాక్షి టీవీ, వైఎస్సార్సీపీ సమర్థించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం వెన్నుపోటు దినం విజయవంతం ద్వారా బహిర్గతం అవ్వడంతో, దానిని నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్రపూరితంగా టీడీపీ దానికి వంతపాడే ఎల్లోమీడియా, సోషల్ మీడియా ద్వారా పనిగట్టుకుని దుష్ప్రచారంకు దిగారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..గతంలో అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లలో, పబ్లిక్ మీటింగ్ల్లో కూర్చుని టీడీపీ సీనియర్ నాయకులే ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారంతా ఏమైపోయారు. ఈటీవీ, టీవీ 5, ఏబీఎన్ ఛానెళ్ల ముందు ఎందుకు ధర్నాలు నిర్వహించలేదు? ఆ పత్రికల ప్రతులను ఎందుకు తగలబెట్టలేదు? టీడీపీ నాయకులు మాట్లాడిన సందర్భాల్లో వారి మనోభావాలు దెబ్బతినలేదా?టీడీపీ నాయకులు, కిర్రాక్ ఆర్పీ, సీమ రాజా, చేబ్రోలు కిరణ్ మాట్లాడిన వీడియోలను కూడా ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాము. సాక్షాత్తు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత వైయస్ కుటుంబం గురించి, వారి ఇంటి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా వారి మీద ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. నాడు సీఎం వైయస్ జగన్ ను ఉద్దేశించి పదే పదే సైకో అని మాట్లాడిందే చంద్రబాబు. వైయస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాన్ నా కొడకల్లారా అని రెచ్చిపోయాడు. వారిద్దరి మీద కూడా ఎందుకు కేసులు పెట్టలేదు?ఐటీడీపీ పేరుతో రెచ్చిపోతున్న సైకోలువ్యక్తిత్వ హననం అనేది టీడీపీ జీన్స్ లోనే ఉంది. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ నుంచి నేటి వైయస్ జగన్ వరకు వ్యక్తిత్వ హననం చేయడమే ఎజెండాగా సైకోలను ప్రోత్సహించడమే టీడీపీ పనిగా పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లు వైయస్ కుటుంబంపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఐ-టీడీపీ పేరుతో నారా లోకేష్ ఒక సైకో వ్యవస్థను సృష్టించి డబ్బులిచ్చి పోషిస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతోనే వీడియోలు చేస్తున్నానని టీడీపీ సైకో చేబ్రోలు కిరణ్ స్పష్టంగా చెప్పాడు. అధికారం అండ చూసుకుని, రెడ్ బుక్ రాజ్యాంగం పొగరుతో ఏం చేసినా పోలీసులు మనల్ని ఏం చేయరులే అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోలు దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి చర్యలను వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. వైయస్ కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదు.మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వానికి పట్టదుమహిళల మీద అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేస్తే ఇంతవరకు కేసు నమోదు చేసి నిందితులను శిక్షించలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ నియోజకవర్గాల్లో మహిళల మీద దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ముచ్చుమర్రిలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన జరిగి 9 నెలలు దాటినా ఇంతవరకు బాలిక మృతదేహాన్ని వెతికి తీయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైంది.రాష్ట్ర వ్యాప్తంగా దళిత మీద దాడులు నిత్యకృత్యమైపోయాయి. పిఠాపురంలో ఏకంగా దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా పవన్ కళ్యాణ్ దానిపై ఇంతవరకు నోరుమెదపలేదు. ఈ ఘోరాలపై నోరెత్తి మాట్లాడే తీరిక ప్రభుత్వ పెద్దలకు లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన డీజీపీ ఎక్కడున్నారో తెలియదు. రాజధాని పేరుతో అమరావతి భూములను దోచుకోవడమే అజెండాగా చంద్రబాబు పనిచేస్తున్నాడని రాజధాని రైతులు, మహిళలు గుర్తించాలి. అమరావతిలోని వందల ఎకరాల భూములను తన బినామీల కంపెనీలకు చంద్రబాబు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నాడు. గతంలో సేకరించిన భూములనే అభివృద్ధి చేయలేక చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు, మళ్లీ 44 వేల ఎకరాలు సేకరిస్తానని చెప్పడం భూములు దోచుకునే కుట్రలో భాగమే.

నా స్కూల్ మీ వద్దే అని ప్రధాని మోదీకి చెప్పాను: సీఎం రేవంత్
హైదరాబాద్: హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ 'ఆటో బయోగ్రఫీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆదివారం( జూన్8) ఘనంగా నిర్వహించారు 'ప్రజల కథే నా ఆత్మకథ' పేరుతో బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘గౌలిగూడ గల్లి నుంచి హర్యానా గవర్నర్గా ఎన్నో రాజకీయ ఓడి దుడుకులు ఎదుర్కొని ఎదిగిన వ్యక్తి బండారు దత్తాత్రేయ. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. మొన్న నీతి అయోగ్ మీటింగ్లో ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడును చూపించి అప్ కి సాతి యా వా హై(మీ స్నేహితుడు అక్కడున్నారు) అన్నారు. నేను ప్రధానికి చెప్పాను నేను స్కూల్ మీ దగ్గర చదివాను , కాలేజీ వారి(టీడీపీ) దగ్గర చదివి, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నానని అన్నాను. అన్ని రాజకీయ పార్టీల నేతలు అరుదుగా ఒక వేదికపై కనిపిస్తారు అంటే అది అలయ్ బలయ్ వేదిక. మా మంత్రి వర్గం అంత ఇక్కడే ఉంది. నేను ఇక్కడ కేబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. హైదరాబాద్ ప్రజల గుండెల్లో పి. జనార్ధన్ రెడ్డి, దత్తాత్రేయలది చెరగని ముద్ర. దత్తాత్రేయ ముక్కు సూటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకి వెళ్ళాలి. కిషన్ రెడ్డితో నాకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటా. కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకి తీసుకెళ్తాను’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

దేశంలో కోవిడ్ కలకలం.. ఆరు వేలు దాటిన యాక్టివ్ కేసులు
ఢిల్లీ: భారత్లో రోజురోజుకూ కోవిడ్–19 యాక్టివ్ కేసులు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలో కొత్తగా 1,131 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య ఆరు వేలు దాటింది. దేశంలో ఆదివారం ఉదయం 8 గంటల నాటికి కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 6,133కి చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.కోవిడ్తో దక్షిణాది రాష్ట్రాల్లో ఆరుగురు మృతి చెందారు. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు మృతి చెందారు. కేరళలో 1950, గుజరాత్లో 822, బెంగాల్లో 693, మహారాష్ట్రలో 595, కర్ణాటకలో 366, ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ మృతుల సంఖ్య కూడా పెరగడంతో మరో ‘కరోనా వేవ్’ముంచెత్తుతుందా అన్న భయాలు సైతం వివిధ వర్గాల ప్రజల్లో నెలకొన్నాయి. కేరళలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి.కేరళలో శనివారం నాటికి (గత 24 గంటల్లో) 192, గుజరాత్లో 107, పశ్చిమబెంగాల్లో 58, కర్ణాటకలో 15, ఆంధ్రప్రదేశ్లో 12 కొత్త యాక్టివ్ కేసులు వెలుగు చూశాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేసుల వ్యాప్తికి కారణమైన ఒమిక్రాన్ సబ్వేరియెంట్లు, లీనియేజ్లు ఎగువ శ్వాసకోశ వ్యవస్థ (అప్పర్ రెస్పిరేటరీ) పైనే ప్రభావం చూపుతున్నందున పెద్దగా భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు అంటున్నారు.

గౌతమ్ అదానీ వేతనం పెరిగింది.. కానీ..
అదానీ గ్రూప్ చైర్మన్, దేశంలోనే రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ .10.41 కోట్ల వేతనం అందుకున్నారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. అదానీ గ్రూప్లోని తొమ్మిది లిస్టెడ్ కంపెనీల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (రూ.2.54 కోట్లు), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (రూ.7.87 కోట్లు) నుంచి ఆయనకీ ఆదాయం వచ్చింది.గతంతో పోలిస్తే ఈసారి వేతనం పెరిగినప్పటికీ, అదానీ పారితోషికం దేశంలోని చాలా మంది అగ్రశ్రేణి పారిశ్రామిక అధినేతల కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. తోటి వ్యాపారాధినేతలైన సునీల్ భారతి మిట్టల్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.32.27 కోట్లు), రాజీవ్ బజాజ్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.53.75 కోట్లు), పవన్ ముంజాల్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.109 కోట్లు), ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ (2025 ఆర్థిక సంవత్సరంలో రూ.76.25 కోట్లు), ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఎస్ పరేఖ్ (2025 ఆర్థిక సంవత్సరంలో రూ.80.62 కోట్లు) వంటి వారు అదానీ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తన గ్రూప్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్లలో కొంతమంది అదానీ కంటే ఎక్కువ పారితోషిక ప్యాకేజీలను అందుకున్నారు. ఏఈఎల్ సీఈవో వినయ్ ప్రకాశ్ రూ.69.34 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ ఎండీ వినీత్ ఎస్ జైన్ రూ.11.23 కోట్లు ఆర్జించారు. ఇది భారతదేశ కార్పొరేట్ నాయకత్వంలోని విభిన్న వేతన నిర్మాణాలను హైలైట్ చేస్తుంది. ఇక్కడ కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు వేతన ఆధారిత సంపాదనలో కంపెనీ వ్యవస్థాపకులనే అధిగమిస్తుండటం గమనించవచ్చు.

మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మాగంటి మృతదేహానికి నివాళి అర్పించేందుకు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్బంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మాగంటి గోపీనాథ్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం, మాగంటి భౌతికకాయం వద్ద పుచ్చగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. ఈ క్రమంలో కేసీఆర్ భావోద్వేగానికి గురైన పెద్దాయన కన్నీరు పెట్టుకున్నారు. మాగంటి మృతదేహాన్ని చూసి ఆవేదన చెందారు. అనంతరం, మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాగంటి కుమారుడిని అప్యాయంగా దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు.
ప్రేక్షకుల వెంట పరిగెత్తిన స్టార్ హీరో.. ఎవరూ గుర్తుపట్టలేదు!
AP: ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
నిప్పులు చెరిగిన సీఎస్కే బౌలర్
డబ్బులు ఊరికే రావు: ఐపీవోకి వస్తున్న లలితా జ్యువెలరీ
వైట్ షర్ట్లో జవాల్కర్ హొయలు.. దేవకన్యలా జాక్వెలిన్
టాటా కారు ఓనర్లకు గుడ్న్యూస్..
దారుణంగా విఫలమైన పంజాబ్ కింగ్స్ బ్యాటర్
అదుపు తప్పిన కారు.. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..
బీ గ్రేడ్ చిత్రాలతో కెరీర్ నాశనం.. పెద్ద సినిమాలు చేజార్చుకున్నా!
గౌతమ్ అదానీ వేతనం పెరిగింది.. కానీ..
Akhil -Zainab Wedding : ఘనంగా అఖిల్ అక్కినేని- జైనబ్ వివాహం (ఫోటోలు)
‘48 గంటల తర్వాత కానీ పరిస్థితి చెప్పలేమన్నారు’
పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
స్పా ముసుగులో వ్యభిచారం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనూష కలిసి..
దాచటం దేశభక్తిని చాటడమా?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు
3,000 కొత్త కార్లు సముద్రంపాలు!
కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను
శ్రేయాస్ అయ్యర్ను పెళ్లి చేసుకున్నాను.. తల్లిని కూడా: నటి
మొత్తానికి శ్రీవారు ప్రపోజ్ చేశారు, సీక్రెట్ చెప్పిన ‘ప్రేమపావురం’ (ఫొటోలు)
పలు దేశాల పౌరుల రాకపై అమెరికా నిషేధం
20 ఏళ్లు దాటేసినా 'వెంకీ'లో అది కనిపెట్టలేకపోయారు
రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?
పెళ్లయి రెండేళ్లు.. భార్య గురించి సుమలత కొడుకు పోస్ట్ (ఫొటోలు)
అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ
అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య పెరుగుతున్న దూరం
ఈ రాశి వారు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
ఈ రాశి వారికి శుభవర్తమానాలు.. ఆస్తిలాభం
నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!
ప్రేక్షకుల వెంట పరిగెత్తిన స్టార్ హీరో.. ఎవరూ గుర్తుపట్టలేదు!
AP: ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
నిప్పులు చెరిగిన సీఎస్కే బౌలర్
డబ్బులు ఊరికే రావు: ఐపీవోకి వస్తున్న లలితా జ్యువెలరీ
వైట్ షర్ట్లో జవాల్కర్ హొయలు.. దేవకన్యలా జాక్వెలిన్
టాటా కారు ఓనర్లకు గుడ్న్యూస్..
దారుణంగా విఫలమైన పంజాబ్ కింగ్స్ బ్యాటర్
అదుపు తప్పిన కారు.. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..
బీ గ్రేడ్ చిత్రాలతో కెరీర్ నాశనం.. పెద్ద సినిమాలు చేజార్చుకున్నా!
గౌతమ్ అదానీ వేతనం పెరిగింది.. కానీ..
‘48 గంటల తర్వాత కానీ పరిస్థితి చెప్పలేమన్నారు’
పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
స్పా ముసుగులో వ్యభిచారం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనూష కలిసి..
దాచటం దేశభక్తిని చాటడమా?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు
3,000 కొత్త కార్లు సముద్రంపాలు!
శ్రేయాస్ అయ్యర్ను పెళ్లి చేసుకున్నాను.. తల్లిని కూడా: నటి
కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను
పలు దేశాల పౌరుల రాకపై అమెరికా నిషేధం
20 ఏళ్లు దాటేసినా 'వెంకీ'లో అది కనిపెట్టలేకపోయారు
రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?
అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ
అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య పెరుగుతున్న దూరం
ఈ రాశి వారు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
ఈ రాశి వారికి శుభవర్తమానాలు.. ఆస్తిలాభం
నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఐపీఎల్ 2025 జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
పనికి ముంబై వెళ్లిన భర్త.. మరిదిని పెళ్లాడిన భార్య
సినిమా

బీ గ్రేడ్ చిత్రాలతో కెరీర్ నాశనం.. పెద్ద సినిమాలు చేజార్చుకున్నా!
దీప్శిఖ నగ్పాల్ (Deepshikha Nagpal).. కోయిల, బాద్షా, దిల్లగీ, పార్ట్నర్ వంటి బాలీవుడ్ (Bollywood) హిట్ సినిమాల్లో నటించింది. హిందీ బిగ్బాస్ 8వ సీజన్లోనూ పాల్గొంది. బుల్లితెరపైనా పలు సీరియల్స్లో తళుక్కుమని మెరిసింది. అయితే కొన్ని చెత్త సినిమాలను సెలక్ట్ చేసుకోవడం వల్ల అవకాశాలు తగ్గడంతో బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చిందంటోంది.తప్పుడు నిర్ణయాలతో కెరీర్ తలకిందులుఇన్స్టంట్ బాలీవుడ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్శిఖ మాట్లాడుతూ.. నేను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కెరీర్ను దెబ్బకొట్టాయి. అప్పట్లో ఎలా ఉండేదంటే.. యశ్ రాజ్, సుభాష్ వంటివారు నిర్మించేవి మాత్రమే ఏ గ్రేడ్ సినిమాలుగా పరిగణించేవారు. కొత్త నిర్మాణ సంస్థ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుందంటే అది బీ గ్రేడ్ సినిమాలకిందే లెక్కేసేవారు. నాకు ఏవి సెలక్ట్ చేసుకోవాలనేది అర్థం కాలేదు.ఏదైనా పనే అనుకున్నా..పైగా నా ఫ్యామిలీలో ఎవరికీ సినీరంగంతో పరిచయమే లేదు. కానీ సినీరంగంలో మనకు సలహాలిచ్చే వ్యక్తి ఉంటే బాగుంటుందని నాకిప్పుడనిపిస్తుంది. సినిమాల ఎంపికలో చాలా తప్పులు చేశాను. మా తాతయ్య ఏమనేవారంటే.. ఏ పనీ చిన్నది, పెద్దది అని వ్యత్యాసం చూపించకూడదనేవారు. ఏదైనా పనే అనేవారు. దాన్ని నేను సీరియస్గా తీసుకున్నాను. అందుకనే నాకు ఏ అవకాశం వచ్చినా ముందూవెనకా ఆలోచించకుండా చేసుకుంటూ పోయాను. ఈ క్రమంలో ఎన్నో చెత్త సినిమాలు చేశా.. అవి ఇప్పటికీ రిలీజ్ కాకుండా ఆగిపోయాయి.(చదవండి: అరటిపండ్లు అమ్మా, నెంబర్ ప్లేట్లు తయారు చేశా.. మారుతి)ఆ పోస్టర్ దెబ్బ కొట్టిందికొన్ని విడుదలయ్యాయి.. కానీ, అవి నా కెరీర్ను దెబ్బకొట్టాయి. ఉదాహరణకు ట్రేడ్ గైడ్ అనే సినిమా చేసినప్పుడు ఓ పోస్టర్ వదిలారు. అప్పటికే నేను చాలా పెద్ద సినిమాలకు సంతకం చేశాను. కానీ ఆ పోస్టర్ చూశాక నేను బీ గ్రేడ్ సినిమాలు చేస్తున్నానని పక్కన పెట్టేశారు. నాకు విషయం అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ సినిమాల గురించి మర్చిపోదాం అని కోరినా కూడా వాళ్లు వినలేదు. నిన్ను తీసుకుంటే మేము నష్టపోవాల్సి వస్తుంది అని రిజెక్ట్ చేశారు. చెత్త సినిమాలు చేసినందున జనాలు నన్ను నమ్మడం మానేశారు.ఆ కోపంతో బుల్లితెరకు షిఫ్ట్పెద్ద సినిమాల్లో పని చేసే అర్హత లేదని భావించారు. నాకు పట్టరానంత కోపం వచ్చింది. అందుకే బుల్లితెరపై ఫోకస్ పెట్టాను. ఇక్కడ సీరియల్స్, షోలు చేయడం స్టార్ట్ చేశాను. శాశ్వతంగా కనుమరుగైపోకుండా నటిగా నిలబడ్డాను అని చెప్పుకొచ్చింది. దీప్శిక.. సన్ పరి, రామాయణ్, కరిష్మా- ద మిరాకిల్స్ ఆఫ్ డెస్టినీ, బల్వీర్, మధుబాలా- ఏక్ ఇష్క్ ఏక్ జునూన్, సంతోషి మా వంటి పలు సీరియల్స్లో నెగెటివ్ పాత్రలు చేసింది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన కుంకుమ భాగ్య సీరియల్ నటి

సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం.. మా ఇద్దరి కెరీర్ ముగిసింది: రియా చక్రవర్తి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తీవ్ర విషాదం మిగిల్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం బాలీవుడ్ను కుదిపేసింది. అతని మరణం తర్వాత ప్రియురాలైన రియా చక్రవర్తిపై పలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆమెను పోలీసులు సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆమెతో తమ్ముడైన షోయిక్ చక్రవర్తిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో వారిద్దరి జీవితం అనేక మలుపులు తిరిగింది.తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన రియా చక్రవర్తి..సుశాంత్ మరణం తర్వాత తాను, తన తమ్ముడు అనుభవించిన బాధను పంచుకుంది. సుశాంత్ మృతి తర్వాత మాపై ఆరోపణలు రావడంతో మా ఇద్దరి కెరీర్ ఒక్కసారిగా తలకిందులైందని వెల్లడించింది. ఆ సంఘటనతో మా ఇద్దరి కెరీర్లు ముగిశాయని తెలిపింది.రియా మాట్లాడుతూ.. "సుశాంత్ మరణం తర్వాత మేము ఎదుర్కొన్న పరిస్థితులు చాలా దారుణం. ఆ సంఘటనతో మా ఇద్దరి కెరీర్లు ముగిశాయి. నాకు నటనాపరంగా ఎలాంటి ఆఫర్స్ రాలేదు. అంతేకాకుండా నా తమ్ముడు షోయిక్ క్యాట్ పరీక్షలో 96 పర్సంటైల్ పొందాడు. కానీ అదే సమయంలో నాతో పాటు అతను అరెస్టు అయ్యాడు. జైలు నుంచి నా తమ్ముడు తిరిగి వచ్చాక మొదటి త్రైమాసిక పరీక్షలు మిస్సయ్యాడు. దీంతో అతని ఎంబీఏ కెరీర్ భవిష్యత్తును కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ఏదైనా కార్పొరేట్లో ఉద్యోగం పొందడం చాలా కష్టమైంది. ఎందుకంటే నా తమ్ముడిని నియమించుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. కొద్దిరోజులు మా జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కాలేదు. ఆ తర్వాత ఛాప్టర్-2 డ్రిప్ అనే దుస్తుల బ్రాండ్ను ప్రారంభించాలనే ఆలోచన తనకు, షోయిక్కు వచ్చిందని.. దాన్నే కెరీర్గా ఎంచుకున్నామని " అని తాము ఎదుర్కొన్న బాధలను వివరించింది.అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోయిక్లకు చివరికి క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియా తిరిగి తన కెరీర్ నటనలో మళ్లీ అడుగుపెట్టింది. ఆమె ఇటీవలే రోడీస్లో కనిపించింది. ఆమె తన సొంత పాడ్కాస్ట్ను కూడా ప్రారంభించింది. ఇందులో అమీర్ ఖాన్, సుష్మితా సేన్, ఫర్హాన్ అక్తర్, హనీ సింగ్ లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది.

నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు
ప్రస్తుతం తెలుగు సినిమా వ్యవహారాలు దాదాపు ఓటీటీ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మూవీని ఏ తేదీన థియేటర్లలో విడుదల చేయాలనేది వారే నిర్ణయిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్కి పర్లేదు గానీ చాలామంది చిన్న, మీడియం బడ్జెట్ పెట్టే నిర్మాతలు.. తమ చిత్రాల్ని పూర్తి చేసినా సరే రిలీజ్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు 'కన్నప్ప' ఓటీటీ గురించి పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటి గురించి అడగ్గా.. విష్ణు తాజా ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు.'కన్నప్ప' ఓటీటీ డీల్ కుదిరిందా? అని అడగ్గా.. 'వాళ్లు ఓ ఫిగర్ చెప్పారు అది నాకు నచ్చలేదు. హిట్ అయ్యాక అమ్మితే ఎంత ఇస్తారని అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు నచ్చింది. డబ్బులు రెడీ చేస్కోండి. విడుదలయ్యాక వస్తాను అని చెప్పాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఇతడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాపై చాలా నమ్మకంతోనే ఉన్నాడనిపిస్తుంది. చూడాలి మరి ఫలితం ఎలా వస్తుందో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. గత చిత్రాలు సరిగా ఆడకపోవడంతో చాన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు. భారీ బడ్జెట్ పెట్టి స్వయంగా నిర్మించాడు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్.. ఇలా చాలామంది స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మార్కెట్ పరంగా చూసుకుంటే దక్షిణాది స్టార్స్ చాలామంది ఉన్నారు. సినిమా హిట్ అయితే ఓటీటీల నుంచి డిమాండ్ ఉండొచ్చు. ఒకవేళ తేడా కొడితే మాత్రం అంతే సంగతులు.జూన్ 27న 'కన్నప్ప' సినిమా థియేటర్లలోకి రానుంది. చాన్నాళ్ల క్రితం తొలుత ఓ టీజర్ రిలీజ్ చేయగా.. విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకుని మరో టీజర్ రిలీజ్ చేయగా, నెగిటివిటీ కాస్త తగ్గింది. ప్రస్తుతం ప్రమోషన్ల బాధ్యత విష్ణునే తీసుకున్నాడు. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేయబోతున్నాడు. దీనికి ప్రభాస్ కూడా హాజరవుతాడని టాక్.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!)

రెండో బిడ్డకు జన్మనిచ్చిన కుంకుమ భాగ్య సీరియల్ నటి
కుంకుమ్ భాగ్య సీరియల్ ఫేమ్ పూజా బెనర్జీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తాను రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పలు సీరియల్స్తో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామకు ఇప్పటికే సనా అనే మూడేళ్ల కూతురు ఉన్నారు. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను అందరితో పంచుకోవడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం.. ఇప్పుడు నలుగురు కుటుంబ సభ్యులం అయ్యామంటూ శనివారం తన జీవితంలోకి మరో బిడ్డకు ఆహ్వానం పలికింది బాలీవుడ్ బ్యూటీ.అనేక టీవీ సీరియల్స్తో తన నటనకు పేరుగాంచిన పూజా బెనర్జీ ప్రముఖ స్విమ్మర్, ఒలింపియన్ సందీప్ సెజ్వాల్ను వివాహం చేసుకుంది. పూజ ఈ రోజు ఉదయం మగబిడ్డను ప్రసవించింది.. మేమందరం చాలా సంతోషంగా ఉన్నామని ఆమె భర్త సందీప్ తెలిపారు. కాగా.. కొత్త ఏడాది ప్రారంభంలో తాను గర్భం ధరించినట్లు అభిమానులతో పంచుకుంది. ఆ తర్వాత తన బేబీ బంప్ ఫోటోషూట్ను షేర్ చేసింది.పూజా బెనర్జీ బాలీవుడ్లో చంద్ర నందిని, దిల్ హి తో హై, కసౌతి జిందగీ కే 2, కుంకుమ్ భాగ్య, బడే అచ్చే లగ్తే హై 2 లాంటి ప్రముఖ సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా పూజా కొన్ని వెబ్ సిరీసుల్లో కూడా భాగమైంది. కెహ్నే కో హమ్సఫర్ హై అనే షోలో నటనతో పూజా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చివరిసారిగా 2023లో వచ్చిన బడే అచ్చే లగ్తే హై -2 సీరియల్లో కనిపించింది. ఆ తర్వాత పూజ నటనకు దూరంగా ఉంది. తాజాగా ఆమె రెండవ బిడ్డకు జన్మనివ్వడంతో నటనకు కొద్ది రోజులు విరామం తీసుకోనుంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఘనంగా రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. మాజీ సీఎం సహా ప్రముఖులు హాజరు
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఎంగేజ్మెంట్ ఇవాళ (జూన్ 8) లక్నోలోని ద సెంట్రమ్ ఫైవ్ స్టార్ హోటల్లో ఘనంగా జరిగింది. రింకూ సమాజ్వాది పార్టీ ఎంపీ (లోక్సభ) ప్రియా సరోజ్ను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రింకూ, సరోజ్ నిశ్చితార్థం రింగులు మార్చుకున్నారు. ఈ వేడుకకు రింకూ, సరోజ్ కుటుంబ సభ్యులతో పాటు క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.Rinku Singh got engaged with Priya Saroj. 💍 ❤️- Congratulations to both of them. pic.twitter.com/hj8aAslurI— Johns. (@CricCrazyJohns) June 8, 2025తెలుపు, పింక్ కలర్ ఔట్ ఫిట్లలో రింకూ, సరోజ్ జోడీ చూడముచ్చటగా ఉంది. ఈ వేడుకకు యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, అతని భార్య డింపుల్ యాదవ్, బిగ్బీ సతీమణి, సమాజ్వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్, సమాజ్వాది పార్టీ సీనియర్ లీడర్ ప్రొఫెసర్ రామ్గోపాల్ యాదవ్, ఇక్రా హసన్ (సరోజ్ క్లోజ్ ఫ్రెండ్), బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఉత్తర్ప్రదేశ్ మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పియుశ్ చావ్లా, ఉత్తర్ప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ తదితరులు హాజరయ్యారు. వేడుక అనంతరం అతిథులకు దేశీయ విందుతో పాటు యురోపియన్ వంటాలను వడ్డించారు. ఎంగేజ్మెంట్ వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. 27 ఏళ్ల రింకూ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సీజన్లో అతను 29.42 సగటున, 153.73 స్ట్రయిక్రేట్తో 206 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో అతను ప్రాతినిథ్యం వహించిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు 14 మ్యాచ్ల్లో కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. రింకూ అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. భారత్ తరఫున 33 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. ఇందులో 3 అర్ద సెంచరీల సాయంతో 601 పరుగులు చేశాడు.సరోజ్ విషయానికొస్తే.. 26 ఏళ్ల సరోజ్ ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లోని మచ్లిషెహర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 జనరల్ ఎలెక్షన్స్లో ప్రియా సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీపీ సరోజ్పై 35000 ఓట్ల తేడాతో గెలుపొందింది. ప్రియాకు ఇవే తొలి ఎన్నికలు.వారణాసికి చెందిన సరోజ్ పాలిటిక్స్లోకి రాక ముందు 'లా'లో బ్యాచ్లర్ డిగ్రీ పొందారు. సరోజ్ తన ఉన్నత చదువులను ఢిల్లీలో పూర్తి చేశారు. సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం అతను జౌన్పూర్ జిల్లాలోని కేరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

శ్రేయస్ నన్ను చెంపదెబ్బ కొట్టాల్సింది: పంజాబ్ స్టార్ ప్లేయర్
ఐపీఎల్-2025 సీజన్ క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. తన సహచర ఆటగాడు శశాంక్ సింగ్పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కీలక సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి రనౌట్ కావడంతో శశాంక్పై అయ్యర్ అసహనం వ్యక్తం చేశాడు.మ్యాచ్ అనంతరం శశాంక్ షేక్ హ్యాండ్ వచ్చిన కూడా అయ్యర్ పట్టించుకోలేదు. తాజాగా ఈ విషయపై శశాంక్ సింగ్ స్పందించాడు. ఆ మ్యాచ్లో తను ఘోర తప్పిదం చేశానని అతడు అంగీకరించాడు. అంతేకాకుండా ఆ సమయంలో అయ్యర్ తనను చెంప దెబ్బ కొట్టిండాల్సిందని శశాంక్ అభిప్రాయపడ్డాడు."నిర్లక్ష్యంగా పరిగెత్తి నేను తప్పు చేశాను. అయ్యర్ నన్ను చెంపదెబ్బ కొట్టి ఉండాల్సింది. మా నాన్న కూడా నాపై సీరియస్ అయ్యారు. ఫైనల్ వరకు నాతో మాట్లాడలేదు. నేను చాలా క్యాజువల్గా పరిగెత్తాను. ఏదో బీచ్లో నడుస్తున్నట్లు పరుగుకు వెళ్లాను.ఇది చాలా కీలకమైన సమయం, ఇది అస్సలు నీ నుంచి ఊహించలేదని అయ్యర్ నాతో అన్నాడు. అయితే గెలిచిన తర్వాత నన్ను అతడు డిన్నర్కు తీసుకువెళ్లాడని" తాజా ఇంటర్వ్యూలో శశాంక్ సింగ్ పేర్కొన్నాడు. కాగా 11 ఏళ్ల తర్వాత ఫైనల్కు చేరిన పంజాబ్ జట్టు ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. తుది పోరులో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై రన్నరప్గా పంజాబ్ నిలిచింది.Shreyas Iyer ANGRY On Shashank Singh After Run Out 😡 | KKR vs PBKS 2025 Heated MomentShreyas Iyer lost his cool on Shashank Singh after a shocking run out during the intense KKR vs PBKS 2025 IPL match! 🔥Watch the full drama as tensions rise in the middle and see how this… pic.twitter.com/OhCcdwH1NV— Junoon Ki Jersey (@paramjit3092) June 3, 2025

IND vs ENG: టీమిండియా ప్రాక్టీస్ షురూ..
భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం మొదలైంది. విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలు వంటి దిగ్గజాలు లేకుండా తొలి టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. శుబ్మన్ గిల్ సారథ్యంలోని యువ భారత జట్టుకు ఇంగ్లండ్ రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది.రోహిత్ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన శుబ్మన్ గిల్.. జట్టును ఎలా నడిపిస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్లను భారత్ కోల్పోవడంతో హెడ్కోచ్ గౌతం గంభీర్పైన కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో గిల్-గౌతీ కాంబనేషన్లో భారత జట్టు ఎలా రాణిస్తుందో మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.టీమిండియా ప్రాక్టీస్ షూరూ..ఇక ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆదివారం(జూన్ 8)తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్లో షేర్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ గిల్ రవీంద్ర జడేజా, అర్ష్దీప్, సిరాజ్ కసరత్తలు చేస్తున్నట్లు కన్పించింది.కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లె రౌక్స్ కూడా భారత జట్టులో చేరారు. రాజీనామా చేసిన సోహమ్ దేశాయ్ స్ధానంలో అడ్రియన్ బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం..! వీడియో వైరల్𝗣𝗿𝗲𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 ✅First sight of #TeamIndia getting into the groove in England 😎#ENGvIND pic.twitter.com/TZdhAil9wV— BCCI (@BCCI) June 8, 2025

రెండు నెలలు బ్యాట్ టచ్ చేయలేదు.. వింతగా అన్పించింది: స్టీవ్ స్మిత్
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2025 ఫైనల్కు సమయం అసన్నమవుతోంది. జూన్ 11 నుంచి 15 వరకు ప్రతిష్టాత్మక లార్డ్స్లో జరగనున్న తుది పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి రెండోసారి ఛాంపియన్గా నిలవాలని ఆస్ట్రేలియా భావిస్తుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికా తొలి ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకోవాలని భాస్తోంది.ఇప్పటికే లండన్కు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నాయి. ఇక ఫైనల్ పోరుకు ముందు తన ప్రాక్టీస్పై ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు నెలల పాటు కనీసం బ్యాట్ను కూడా తను టచ్ చేయలేదని స్మిత్ చెప్పుకొచ్చాడు.కాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీఫైనల్లో ఆసీస్ ఓటమి తర్వాత.. స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. ఆ తర్వాత తన సహచర ఆటగాళ్లు కొంతమంది ఐపీఎల్లో పాల్గొంటే.. మరి కొంతమంది డొమాస్టిక్ క్రికెట్లో ఆడారు. కానీ స్మిత్ మాత్రం న్యూయర్క్కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. తన తుంటి గాయంపై ట్రైనర్తో కలిసి పనిచేశాడు."నేను సాధరణంగా ఇంటిలో ఖాళీగా ఉంటే షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. కానీ ఈసారి మాత్రం అందుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే న్యూయర్క్కు వెళ్లిపోయాను. నేను ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్లో తొలి షాట్ ఆడేంతవరకు కనీసం బ్యాట్ను కూడా టచ్ చేయలేదు.చాలా రోజులు తర్వాత బ్యాట్ పట్టుకుంటే చాలా కొత్తగా అన్పించింది. రెండు ప్రాక్టీస్ సెషన్ల తర్వాత నా లయను తిరిగి నేను అందుకున్నాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ప్రస్తుతం ఫిట్నెస్ పరంగా కూడా ఎటువంటి సమస్యలు లేవు. 2014లో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. తుంటి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాను. ఇప్పుడు తిరిగి స్లిప్స్లో ఫీల్డింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాను. నేను ఇప్పటికీ ఓపెనర్గా రాణించగలనని భావిస్తున్నాను. కానీ నేను ఆడిన గత నాలుగు మ్యాచ్లలో అంత మెరుగ్గా రాణించలేకపోయాను. ఈ రోజుల్లో టాప్-4లో బ్యాటింగ్ చేసే ఎవరైనా ఓపెనర్గా రాణించగలరు" అని స్మిత్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం..! వీడియో వైరల్
బిజినెస్

జాబ్ రావాలంటే క్రెడిట్ స్కోరే కీలకం.. కంపెనీల్లో కొత్త ధోరణి..
సాంకేతిక పురోగతి, మారుతున్న సంస్థల అవసరాలతో ఉద్యోగ అన్వేషణ తీరులో వేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలను నిర్ణయించడానికి కంపెనీలు రెజ్యూమెలు, ఇంటర్వ్యూలను దాటి వెతుకుతున్నాయి. చాలా సంస్థలు ఇప్పుడు అభ్యర్థుల ఆర్థిక నేపథ్యాన్ని అంచనా వేయడానికి వారి క్రెడిట్ స్కోర్ను కూడా తనిఖీ చేస్తున్నాయి. ఇది నేరుగా ఉద్యోగ పనితీరుతో సంబంధం లేనప్పటికీ, అభ్యర్థి ఆర్థిక క్రమశిక్షణ, విశ్వసనీయతకు సూచికగా క్రెడిట్ స్కోర్ను యాజమాన్యాలు పరిగణిస్తున్నాయి.అయితే ప్రతి కంపెనీ ఉద్యోగార్థుల క్రెడిట్ హిస్టరీని తనిఖీ చేయదు కానీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు మాత్రం ఈ వైఖరిని అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఫైనాన్స్, బ్యాంకింగ్, అకౌంటింగ్ లేదా సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరమయ్యే ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుంటే నియామక ప్రక్రియలో భాగంగా మీ క్రెడిట్ స్కోర్ను పరిగణనలోకి తీసకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలా కంపెనీలు అభ్యర్థుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ కసరత్తును నిర్వహించడానికి థర్డ్ పార్టీ ఏజెన్సీలను సైతం నియమించుకుంటున్నాయి.జాబ్ అప్లికేషన్పై క్రెడిట్ స్కోర్ ప్రభావంక్రెడిట్ స్కోర్ అనేది మూడు అంకెల సంఖ్య, దీనిని ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడానికి తరచుగా ఉపయోగిస్తాయి. ఇది 300 నుండి 900 మధ్య ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, అనుకూలమైన వడ్డీ రేటుతో రుణాలు త్వరగా ఆమోదం పొందే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఇది మీ రుణ అర్హత గురించి రుణదాతకు హామీ ఇస్తుంది. మీరు తీసుకున్న మొత్తాన్ని ఎటువంటి డిఫాల్ట్ లేకుండా సకాలంలో తిరిగి చెల్లంచగలరు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది.మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే, మీరు రుణం లేదా క్రెడిట్ కార్డు చెల్లింపులను మిస్ అయ్యారని, అవసరానికి మించి అప్పు తీసుకున్నారని లేదా రుణాలను డిఫాల్ట్ చేశారని చూపిస్తుంది. దీని వల్ల డబ్బు దొంగిలించడం, డేటా లీక్ చేయడం లేదా మోసానికి పాల్పడటం వంటి విషయాలకు మీరు ఎక్కువగా గురవుతారని కంపెనీ యజమాన్యం అనుకోవచ్చు.ఒక కంపెనీ మీ క్రెడిట్ హిస్టరీని చెక్ చేసిందంటే.. మీరు రుణాలు, క్రెడిట్ కార్డులు, బిల్లు చెల్లింపులను ఎంత బాగా నిర్వహించారు వంటి మీ గత ఆర్థిక ప్రవర్తనను చూస్తోందని అర్థం. మీరు అప్పుల్లో ఉంటే, మీరు మీ ఆర్థిక వ్యవహారాలను సరిగ్గా నిర్వహించడం లేదని ఇది సూచిస్తుంది.👉ఇదీ చదవండి: టీనేజ్ అప్పులు.. తీరని తిప్పలు!తక్కువ క్రెడిట్ స్కోర్ మీరు పనిలో చాలా పరధ్యానంలో ఉన్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఇది తప్పులు చేయడానికి, గడువులను కోల్పోవటానికి దారితీస్తుంది. ఆర్థిక విషయాలను నిర్వహించే పాత్రలకు, మీరు సరైన వ్యక్తి కాదని కంపెనీలు భావించవచ్చు.క్రెడిట్ స్కోరు మీ ఉద్యోగ దరఖాస్తును నేరుగా ప్రభావితం చేయదు కానీ, కొన్నిసార్లు ఇది కొన్ని రంగాలలో నియామక నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఫైనాన్షియల్ సెక్టార్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సున్నితమైన ఆర్థిక విషయాలను బాధ్యతాయుతంగా నిర్వహించగలరని భరోసా ఇవ్వడానికి తమ క్రెడిట్ స్కోర్ను షేర్ చేయాలని కంపెనీలు అడగవచ్చు.

ఐపీవోకి వస్తున్న ఏక్వస్
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్ గూడ్స్, వైమానిక విడిభాగాల కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఏక్వస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా మార్గంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా 20 కోట్ల డాలర్లు(రూ. 1,700 కోట్లు) సమీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.తాజా ఈక్విటీ జారీ, ప్రస్తుత ఇన్వెస్టర్ల వాటా విక్రయం ద్వారా కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్కానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీలో ఇప్పటికే అమికస్, అమన్సా, స్టెడ్వ్యూ క్యాపిటల్సహా కాటమారన్, స్పర్ట గ్రూప్ తదితరాలు ఇన్వెస్ట్ చేశాయి. కంపెనీ ఏరోస్పేస్, కన్జూమర్ రంగాలకు ప్రెసిషన్ మ్యాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్ను సమకూర్చుతోందిఏక్వస్ భారత్తోపాటు ఫ్రాన్స్, మూఎస్ఏలలో తయారీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. బహుళ పరిశ్రమ విభాగాలలో తన ప్రపంచ కస్టమర్ బేస్కు ఉత్పత్తులను అందిస్తోంది. ఈ సంస్థకు భారత్లోని కర్ణాటకలో మూడు తయారీ క్లస్టర్లు (బెల్గావి, హుబ్బళ్ళి, కొప్పల్) ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. టాటా ఎలక్ట్రానిక్స్, మదర్సన్ గ్రూప్, జబిల్తో కలిసి ఏక్వస్ కూడా యాపిల్ ఉత్పత్తుల కోసం మెకానికల్ విడిభాగాలను ఉత్పత్తి చేస్తోంది.

అనిల్ అంబానీకి భారీ ఉపశమనం
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దివాలా చర్యలను నిలిపివేస్తూ తాజాగా అపిల్లేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు జారీ చేసింది. తమ అప్పీల్ మేరకు ఎన్సీఎల్టీ ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ రద్దు చేసినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఆదేశిస్తూ ఇంతక్రితం ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ సీపీ(ఐబీ)/624(ఎంబీ)2022 కేసులో 2025 మే 30న జారీ చేసిన ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ రద్దు చేసినట్లు పేర్కొంది. తమకు సౌర విద్యుత్ సరఫరా చేసిన ధుర్సర్ సోలార్ పవర్కి చెల్లింపులు జరపలేదంటూ రిలయన్స్ ఇన్ఫ్రాపై ఆరోపణలు ఉన్నాయి. ధుర్సర్కి సెక్యూరిటీ ట్రస్టీగా వ్యవహరించిన ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ సంస్థ 2022 ఏప్రిల్లో రిలయన్స్ ఇన్ఫ్రాపై కార్పొరేట్ దివాలా పరిష్కార చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. రిలయన్స్ ఇన్ఫ్రా 2018 ఆగస్టు 28 నుంచి అసలు రూ. 88.68 కోట్లతో పాటు వడ్డీ కూడా బాకీ పడిందని వివరించింది.దీనితో రిలయన్స్ ఇన్ఫ్రాపై ఎన్సీఎల్టీ దివాలా చర్యలకు ఆదేశించింది. అయితే, ధుర్సర్ సోలార్ పవర్కు పూర్తిస్థాయిలో రూ. 92.68 కోట్లు చెల్లించేసినందున దివాలా చట్ట చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా పేర్కొంది. ఇంధన కొనుగోలు ఒప్పందంలో భాగంగా టారిఫ్లకింద సొమ్ము చెల్లించినట్లు తెలియజేసింది.

మెహుల్ చోక్సీ ఖాతాల అటాచ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మెహుల్ చోక్సీ ఆస్తులను అటాచ్ చేసేందుకు ఆదేశించింది. వీటిలో చోక్సీ బ్యాంక్ ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ఉన్నాయి. జ్యువెలరీ కంపెనీ గీతాంజలి జెమ్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన కేసులో సెబీ రూ. 2.1 కోట్లు రికవర్ చేసుకునేందుకు తాజా ఆదేశాలు జారీ చేసింది. గత నెల 15న చోక్సీకి డిమాండ్ నోటీసు జారీ చేసిన సెబీ 15 రోజుల గడువు ముగియడంతో రికవరీ చర్యలకు తెరతీసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు నేపథ్యంలో 2022 జనవరిలోనూ సెబీ జరిమానా విధించింది. అయితే చెల్లింపులు చేపట్టకపోవడంతో డిమాండ్ నోటీసు జారీ చేసింది. గీతాంజలి జెమ్స్ చైర్మన్, ఎండీ చోక్సీ ప్రమోటర్ గ్రూప్లోని వ్యక్తికావడంతోపాటు.. నీరవ్ మోడీకి మేనమామకూడా. ప్రభుత్వ రంగ పీఎన్బీలో రూ. 14,000 కోట్లమేర మోసానికి తెరతీసినట్లు ఇరువురిపైనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే పీఎన్బీని మోసగించిన అంశం వెలుగుచూసిన 2018 మొదట్లో వీరిరువురూ విదేశాలకు పారిపోగా.. చోక్సీని బెల్జియంలోనూ, మోడీని స్కాట్లాండ్లోనూ అక్కడి ప్రభుత్వాలు అరెస్ట్ చేయడం గమనార్హం!
ఫ్యామిలీ

ఎవరీ పిడుగు.. ఎనిమిదేళ్లకే పత్రిక ఎడిటర్గా రికార్డ్!
పిల్లలూ! రోజూ పొద్దున్నే న్యూస్పేపర్ చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే రకరకాల వార్తలు ఏరి, కూర్చి మనకు అందించేందుకు న్యూస్పేపర్ సంస్థలో అనేకమంది పనిచేస్తుంటారు. వారందరికీ బాస్గా వ్యవహరించేది ఎడిటర్. ఆ పత్రిక బయటకు రావడంలో ఆయనదే కీలకపాత్ర. ఎడిటర్గా స్థానం పొందాలంటే ఎంతో అనుభవం కావాలి. అయితే ఓ పాప మ్యాగజైన్ ఎడిటర్గా మారి రికార్డు సృష్టించింది.ఆస్ట్రేలియాకు చెందిన రోక్సాన్ డౌన్స్...ఎనిమిదేళ్లకే ’ఇట్ గర్ల్ మ్యాగజన్’ (It Girl Magazine) అనే మ్యాగ్జైన్ కి ఎడిటర్గా మారింది. ఆ వయసున్న చిన్నారులు తోటి పిల్లలతో ఆడుకోవాలని అనుకుంటారు. అయితే రోక్సాన్ మాత్రం ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉంది. తన వయసున్న ఆడపిల్లలు చదువుకునే మ్యాగ్జైన్ రూపొందించాలని భావించింది. దానికి తనే ఎడిటర్గా మారింది. మ్యాగ్జైన్లో ఏం రాయాలో, ఎలాంటి అంశాలను చేర్చాలో తెలుసుకునేందుకు రోక్సాన్ చాలా పరిశోధనలు చేసింది. రోజంతా తన వయస్సు గల వారితో తిరుగుతూ వారి ఇష్టాలు, ఇబ్బందులు, వారు ఆసక్తులు గమనించి, వాటి గురించి తన మ్యాగ్జైన్లో వ్యాసాలు రాయడం మొదలుపెట్టింది.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంమ్యాగ్జైన్ కోసం ప్రముఖ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ని రోక్సాన్ ఇంటర్వ్యూ చేసింది. అది ప్రఖ్యాతి పొందడంతో ఆ తర్వాత అనేకమంది రచయితలు, టిక్టాక్ స్టార్లు, గాయకులు, నటులను ఇంటర్వ్యూలు చేసే స్థితికి చేరుకుంది. ఆ ఇంటర్వ్యూలను వీడియో రూపంలో యూట్యూబ్లో చూడొచ్చు. ఓ వైపు మ్యాగ్జైన్ పనులు చేస్తూనే, పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది రోక్సాన్. బద్దకంగా ఉండటం తనకు అస్సలు నచ్చదని, జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆకాంక్ష అందరిలోనూ ఉండాలని తను చెపుతోంది.ఇదీ చదవండి: Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్

Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్
ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో రెండోది బక్రీద్. ఇది త్యాగానికి ప్రతీక. దీనిని ‘ఈదుల్ అజ్ హా’ అని కూడా అంటారు. ఈ రోజూ ప్రతి ముస్లిం తమ తాహతుకు తగ్గట్టుగా ఇరుగు పొరుగు వారికి ఖుర్బానీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఏటా మంచి ఘుమ ఘుమలతో ఈ పండుగను జరుపు కుంటారు. రోజూ అందించే టిప్లో భాగంగా ఈ రోజు కాలా మటన్, రామ్పూరి తార్ కుర్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కావలసినవి: మటన్ – ముప్పావు కేజీ, గ్రీన్ చట్నీ(పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు) – అరకప్పు, పసుపు – అరటీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, పెరుగు – కప్పు, ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు, నూనె – ఐదు టేబుల్ స్పూన్లు, ధనియాలు – టేబుల్ స్పూను, గసగసాలు – టేబుల్ స్పూను, యాలుక్కాయలు – నాలుగు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, లవంగాలు – ఐదు, మిరియాలు – ఐదు, సోంపు – టేబుల్ స్పూను, ఎండు మిర్చి – నాలుగు, ఎండుకొబ్బరి తురుము – అరకప్పు, బిర్యానీ ఆకు – ఒకటి, షాజీరా – టీస్పూను, వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, అల్లం తరుగు – టేబుల్ స్పూను, బంగాళ దుంపలు – రెండు, చింతపండు గుజ్జు – రెండు టేబుల్ స్పూన్లు.తయారీ: మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్రీన్ చట్ని, పెరుగు వేసి కలిపి ఇరవైనిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత మటన్ను కుకర్లో వేయాలి. దీనిలో కొద్దిగా ఉల్లి పాయ తరుగు, కప్పు నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చేంతవరకు పెద్దమంట మీద ఉడికించాలి. తరువాత సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేయాలి. వేడెక్కిన నూనెలో ధనియాలు, గసగసాలు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. దీనిలో కొన్ని ఉల్లి పాయ ముక్కలు వేసి ముదురు బ్రౌన్ రంగు వచ్చేంతవరకు వేయించాలి. ఇప్పుడు ఎండుకొబ్బరి తురుము వేసి రంగు మారేంత వరకు వేయించి, చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. నూనె వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, షాజీరా వేసి నిమిషం పాయించాలి. ∙తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి లేత బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు బంగాళ దుంపల్ని తొక్కతీసి ముక్కలు తరిగి వేసి, కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. దుంప ముక్కలు సగం ఉడికిన తరువాత ఉడికిన మటన్ మిశ్రమం వేయాలి. ఐదు నిమిషాల తరువాత మసాలా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి పదినిమిషాల పాటు మగ్గనిచ్చి దించేయాలి. అంతే ఘుమఘుమ లాడే టేస్టీ టేస్టీ కాలా మటన్ రెడీ. రామ్పూరి తార్ కుర్మాకావలసినవి: నెయ్యి – కప్పు, మటన్ - కేజీన్నర, అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్ స్పూన్లు, కారం - రెండు టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు – రెండు, పసుపు – అర టీస్పూను, గరం మసాలా పొడి – టేబుల్ స్పూను, వేయించిన ఉల్లిపాయ పేస్టు - పావు కప్పు, పెరుగు – ఆరు టేబుల్ స్పూన్లు, పాలు -కప్పు, ఫూల్ మఖనీ – నాలుగు టేబుల్ స్పూన్లు, కర్బూజా గింజలు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా, మటన్ సూప్- అరలీటర్, జీడిపప్పు - పది. కుర్మా మసాలా: యాలుక్కాయలు -పది, నల్ల యాలుక్కాయలు - రెండు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, జాపత్రి ΄ పొడి -పావు టీ స్పూన్, అనాసపువ్వు- రెండు, లవంగాలు- నాలుగు, షాజీరా - టీ స్పూను, ఎండుకొబ్బరి తురుము - టేబుల్ స్పూను, మిరియాలు -పది, కశ్మీరి ఎండుమిర్చి రెండు. తయారీ: ∙మటన్ను శుభ్రంగా కడిగి టేబుల్ స్పూను ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపి పక్కనబెట్టాలి. ∙కర్బూజ గింజలు, పూల్ మఖనీలను అరకప్పు ΄పాలలో నానబెట్టి, పేస్టు చేయాలి. ∙కుర్మా మసాలా దినుసులన్నింటిని దోరగావేయించి పొడిచేసి పక్కనపెట్టుకోవాలి. ∙మందపాటి బాణలిని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, కారం వేయాలి. అరనిమిషం వేగాక మటన్ ముక్కలు, పసుపు, ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి పదినిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మంటను మీడియంకు తగ్గించి, కుర్మా మసాలా టీస్పూను పక్కన పెట్టి మిగతాది వేయాలి, ఉల్లి΄పాయ పేస్టు, పూల్ మఖనీ పేస్టు, పెరుగు కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మటన్ సూప్,పావు కప్పుపాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద ముక్క మెత్తబడే వరకు ఉడికించాలి. చివరిగా కుర్మా మసాలా పొడి, జీడిపప్పు వేసి మగ్గనిచ్చి దించేయాలి.

పాటనుకుంటివా.. ఫైర్ ఇంజన్లు..!
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ యేడాది ఒడిశా (Odisha) 4,500 హెక్టార్లకు (11,120 ఎకరాలు) పైగా అడవులను మంటలు (wildfires) ప్రభావితం చేశాయి. ఈ సమస్య ప్రతి యేటా ఎదుర్కొనేదే. అధికారులు సీసీ కెమెరాలు, ఉపగ్రహ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మంటలను ట్రాక్ చేస్తున్నారు. అడవిలో ఎండు ఆకులను కాల్చడం వల్ల కూడా వేడిగాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఈ మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఆర్పడం మరింత కష్టతరం అవుతోంది. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నుంచి గ్రామ ప్రజలను రక్షించడం కోసం ఒకప్పుడు పురుషులు జట్లు జట్లుగా కలిసి ఊళ్లన్నీ తిరిగి పాటలుపాడి అగ్నిప్రమాదాలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను స్త్రీలు స్వీకరించడమే కాదు. మరింత బాగా అవగాహన కల్పిస్తూ... ప్రమాదాల నుంచి రక్షిస్తున్నారని కియోంఝర్ జిల్లాలోని అటవీ డిప్యూటీ పరిరక్షకుడు హనుమంత్ ధమ్ధేరే అన్నారు.ఒడిషా రాష్ట్రంలోని ముర్గపహాడి గ్రామంలోని మహిళలు సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా పొలం పనులు, పిల్లలను సాకడం చేస్తుండేవారు. దీంతోపాటు అడవుల్లో పువ్వులు, కట్టెలు సేకరిస్తుంటారు. ఉపాధి లేనప్పుడు వారి భర్తలు నగరాల్లో పని చేస్తుంటే వీళ్లు ఇళ్లను నడిపిస్తుండేవారు. రెండేళ్లుగా మహిళలు కూడా బృందాలుగా చేరి, పాటలుపాడుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇది వారి స్వీయ గౌరవాన్ని పెంచడమే కాదు సమాజంలో వారి పాత్రను మరింత బలపరుస్తోంది.సంప్రదాయ గీతాలతో ఆధునిక పరిష్కారంఈ ప్రయత్నం ఫలితంగా అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు 20–30 శాతం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ధమ్ధేరే కొన్ని మహిళా సంకీర్తన బృందాలను చేర్చుకున్నారు. ఈ బృందాలు స్థానిక భాషలలో కాపాడతాయి. వాటిని స్థానిక ప్రజలు సులభంగా అర్థం చేసుకోవడంతోపాటు అవగాహనతో అటవీ పరిరక్షణకు పాటు పడుతుంటారు. ఈ పని చేసినందుకు గాను ఈ బృందాలకు అటవీశాఖ నుంచి ఆదాయం కూడా లభిస్తుంది.సాంస్కృతిక పునరుద్ధరణసంకీర్తన మండళ్ళు 15వ శతాబ్దం నుంచి ఉన్న సంప్రదాయ గీతాల సమూహాలు. ఈ సంప్రదాయాన్ని ఆధునిక అవసరాలకు అన్వయించి, పర్యావరణ పరిరక్షణలో ఉపయోగిస్తున్నారు. దీన్ని ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంగా పరిగణించవచ్చు. అయితే, సంకీర్తన మండలి బృందాలలో సాధారణంగా పురుష గాయకులు, నృత్యకారులు ఉండేవారు. వీరు డ్రమ్స్ వాయించడం, మతపరమైన భక్తిపాటలు పాడేవారు. ‘గ్రామాల్లోని పురుషులు ఫ్యాక్టరీలలో పని చేయడానికి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లినప్పుడు సంకీర్తన మండళ్ళు దాదాపుగా పనిచేయడం లేదు. మేం దానిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాం’ అని ముర్గపహాడిలోని బృందానికి నాయకత్వం వహిస్తున్న 35 ఏళ్ల ప్రమీలా ప్రధాన్ చెప్పారు. ప్రధాన్ బృందంలో 17 మంది ఉండగా, వారిలో తొమ్మిదిమంది మహిళలు ఉన్నారు.పురుషులు ఈ మండళ్ళను వదిలి వెళ్లాక, గ్రామీణ మహిళలు ‘సంకీర్తన మండలి’ అనే సంప్రదాయ సంగీత సమూహాన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ గీతాలు దేవుని గురించి మాత్రమే కాక, ప్రకృతి పరిరక్షణ, అగ్నిప్రమాదాల నివారణ వంటి సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తాయి. ఇది ఒకవైపు వారిని సాధికారతవైపుకు తీసుకెళ్తుండగా, మరోవైపు పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతోంది.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంఉపాధి గీతాలురాష్ట్రంలో దాదాపు 20,000 సంకీర్తన బృందాలు ఉండగా వాటిలో కనీసం 1,000 బృందాలు మహిళలే నిర్వహిస్తున్నారు. అటవీ మంటలు వారి ఆదాయాలను, పిల్లల పోషణను ప్రభావితం చేస్తున్నాయని మహిళలు అంటున్నారు. ‘కుటుంబ పోషణ కోసం అడవిదుంపలు, ఆకుకూరలు, పుట్టగొడుగులను సేకరిస్తాం. పెద్ద అగ్నిప్రమాదం జరిగితే, ప్రభుత్వం నుంచి మాకు లభించే బియ్యంతోనే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేలా సంకీర్తన మండలిలో చేరినందుకు మాకు ఉపాధి కూడా లభిస్తోంది‘ అని 42 ఏళ్ల బాలమతి చెప్పారు. చదవండి: మాల్యా లగ్జరీ విల్లాను దక్కించుకున్న బాలీవుడ్ జంట ఎవరో తెలుసా?కేతకి నాయక్కి 10 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. ఇప్పుడు ఆమెకు పాతికేళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘నా చిన్నతనంలో పాటలు పాడేదాన్ని. పెళ్లయ్యాక నా నోరు మూతపడిపోయింది. ఇప్పుడు బృందంలో చేరి, ఊరంతా తిరిగి పాటలు పాడుతున్నాను. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు’ అని ఆనందంగా చెబుతుంది. ఇప్పుడు ఈ మండళ్ళలో యువతులు, విద్యార్థులు కూడా చేరి శిక్షణ తీసుకుంటున్నారు. దీని ద్వారా తరువాతి తరం అడవుల పరిరక్షణకు ఏం చేయగలరో నేర్చుకుంటున్నారు. ఇదీ చదవండి: Food Safety ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలు

World Food Safety Day 2025 ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలు
World Food Safety Day 2025 సాధారణంగా కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. ఈ సమస్య అంతా వంట గది నుంచే మొదలవుతుంది. ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలంటే..? ప్రతి యేటా సురక్షితం కాని ఆహారం తినడం వల్ల 60 కోట్ల మంది అనారోగ్యానికి గురవుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. నేడు ఫుడ్ సేఫ్టీ దినోత్సవ సందర్భంగా కొన్ని సురక్షితమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం...చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. వాడిన పాత్రలను, వాడాలనుకున్న పాత్రలను తప్పనిసరిగా కడిగాకనే తిరిగి ఉపయోగించాలి. ముడి పదార్థాలను, వండిన పదార్థాలను వేరుగా ఉంచడం వల్ల క్రాస్–కాలుష్యాన్ని నివారించ వచ్చు. పూర్తిగా ఉడికించాలి. ముఖ్యంగా మాంసం, మాంసాహారం, సముద్రపు ఆహారం.. బాగా ఉడికించిన తర్వాతనే తీసుకోవాలి. ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేయాలి. అతి చల్లని, అతి వేడి పదార్థాలను తీసుకోవడం నివారించాలి. సురక్షితమైన నీరు, ముడి పదార్థాలను ఉపయోగించాలి. పదార్థాల తాజాదనాన్ని చెక్ చేసి, తీసుకోవాలి. ఇది పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో చాలా ముఖ్యం.ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలుఆహారాన్ని శుభ్రంగా వుంచుకోవడం అన్నది 200 కంటే ఎక్కువ ఆహార సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది.ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. తాజా ఆహారం వల్ల ఆహార నష్టం, వ్యర్థాలను తగ్గించవచ్చు. సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు. ఇంట్లో/రెస్టారెంట్లలో ఆహారాన్ని ఎక్కడ తీసుకున్నా ఆరోగ్యకరమైన దాని పట్ల తప్పక దృష్టి పెట్టాలి.
ఫొటోలు
అంతర్జాతీయం

మస్క్.. ‘ది అమెరికా పార్టీ’కి 80 శాతం మద్దతు
వాషింగ్టన్ డీసీ: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇటీవల మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో యూఎస్లో కొత్త రాజకీయ పార్టీ కోసం పిలుపునిచ్చారు. అగ్రరాజ్యంలో కొత్త పార్టీకి సమయం ఆసన్నమయ్యిందా? అని మస్క్ ‘ఎక్స్’ యూజర్లను అడిగారు. దీనికి వచ్చిన ఆసక్తికర ఫలితాలను తాజాగా ఆయన వెల్లడించారు.మస్క్ తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు 80 శాతం మంది యూజర్లు మద్దతు పలికారు. ఈ ఫలితాల వెల్లడి తరువాత మస్క్ తన రాజకీయ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. ‘ఎక్స్’లో వైరల్ అవుతున్న ఈ పోస్టులో మస్క్.. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని, 80 శాతం ప్రజలు దీనికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్లో మస్క్ పలు విమర్శలు చేశారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, అతనికి కృతజ్ఞత లేదని మస్క్ ఆరోపించారు. దీనికి స్పందనగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్రూత్లో మస్క్ కంపెనీలకు ఫెడరల్ కాంట్రాక్టులు, సబ్సిడీలను రద్దు చేస్తానని హెచ్చరించారు. ఎలాన్ మస్క్- డోనాల్డ్ ట్రంప్ మొన్నటి వరకూ ఎంతో సన్నిహితులుగా మెలిగారు. గత జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో హత్యాయత్నం నుండి ట్రంప్ తృటిలో బయటపడిన అనంతరం మస్క్ బహిరంగంగా ఆయనకు మద్దతును ప్రకటించారు. అయితే ప్రస్తుతం వీరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఇది కూడా చదవండి: 400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా

ట్రంప్తో ఫైటింగ్.. మస్క్కు రష్యా బంపరాఫర్
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)ల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎలాన్ మస్క్ను రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. మస్క్ తమ దేశానికి రావాలని.. రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్కు అవకాశం కల్పిస్తామని రష్యా తెలిపింది. ఈ మేరకు దిమిత్రి నోవికోవ్ చెప్పుకొచ్చారు.డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహ బంధం బీటలు వారింది. ఈ నేపథ్యంలో మస్క్ను మచ్చిక చేసుకునేందుకు రష్యా రంగంలోకి దిగింది. తాజాగా రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోవ్ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ భిన్నమైన వ్యక్తి. ఆయన ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తోంది. అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ స్నోడెన్ లాగానే మస్క్కు కూడా రష్యాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రట్లు రావాలని మస్క్ కోరుకోవడం లేదని తాను అనుకుంటున్నానని దిమిత్రి తెలిపారు.మరోవైపు.. ట్రంప్, మస్క్ల మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ నిరాకరించారు. ఇది యూఎస్ సమస్య అని, తమకు ఇందులో జోక్యం చేసుకొనే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాము అనుకుంటున్నట్లు తెలిపారు.Breaking News 🔴Russian MP Dmitry Novikov states that Elon Musk may be offered political asylum in Russia. pic.twitter.com/rp2pwqomuD— Global Report (@Globalrepport) June 6, 2025ఇదిలా ఉండగా.. నిజానికి ట్రంప్, మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు.

400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగింది. ఏకంగా 400 డ్రోన్లు, 40 క్షిపణులను ప్రయోగించి, అతిపెద్ద దాడికి పాల్పడింది. ఈ దాడి దేశమంతటినీ ప్రభావితం చేసిందని, లెక్కలేనంత మంది గాయపడ్డారని, వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాకు చెందిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను లక్ష్యంగా చేసుకుని, ఉక్రెయిన్ ‘ఆపరేషన్ స్పైడర్వెబ్’ను నిర్వహించిన దరిమిలా, రష్యా తాజాగా ఉక్రెయిన్పై భీకరదాడి చేసింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ‘ఈరోజు, మన దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరాల్లో రెస్క్యూ ఆపరేషన్తో పాటు అత్యవసర కార్యకలాపాలు రోజంతా కొనసాగాయి. రష్యన్లు 400కు మించిన డ్రోన్లు, 40కిపైగా క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో 80 మంది గాయపడ్డారు. కొందరు ఇప్పటికీ శిథిలాల కింద విలవిలలాడుతున్నారు. ప్రపంచంలోని కొందరు ఇటువంటి దాడులను ఖండించరు. పుతిన్ ఈ కోవకు చెందిన వ్యక్తి. యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.ఉక్రెయిన్ రాజధాని కైవ్లో ఈ దాడి కారణంగా ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందారు. లుట్స్క్లో ఇద్దరు పౌరులు, చెర్నిహివ్లో మరొక వ్యక్తి మృతిచెందారు. మొత్తం ఆరుగురు మరణించారని, పలువురు గాయపడ్డారని ఉక్రేనియన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ (సీఎన్ఎన్) మీడియాకు తెలిపింది. రష్యా జరిపిన ఈ సైనిక దాడి ఇరు దేశాల మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న దాడులలో అతిపెద్ద దాడి. కైవ్ ఉగ్రవాద చర్యలకు ప్రతిగా ఈ దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: కాళ్ల బేరానికి పాక్.. ‘సింధు ఒప్పందం’పై వేడుకోలు

కాళ్ల బేరానికి పాక్.. ‘సింధు ఒప్పందం’పై వేడుకోలు
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా పాకిస్తాన్ను ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. దీనికితోడు ఇటీవల భారత్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడుల అనంతరం ఆ దేశాన్ని మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందంటూ, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్ల్యూటీ)నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చి, భారత్కు ఈ విషయమై పునరాలోచించాలని కోరుతూ లేఖ రాసింది.ఇప్పటికే పాకిస్తాన్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో, భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై నిర్ణయం తీసుకోవడంతో పాకిస్తాన్ మరింత ఆందోళనకు లోనయ్యింది. వెంటనే తేరుకున్న ఆ దేశ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా తాజాగా ఐడబ్ల్యూటీని పునరుద్ధరించాలని కోరుతూ, భారత జల్ శక్తి మంత్రిత్వ శాఖకు నాలుగు లేఖలు రాశారు. వీటిని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) పరిశీలనకు పంపినట్లు జల్ శక్తి మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి ఉండలేవని, రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని పాకిస్తాన్కు భారతదేశం ఇప్పటికే స్పష్టం చేసింది. ఐడబ్ల్యూటీని పరస్పర నమ్మకం, స్నేహబంధం మేరకు రూపొందించినప్పటికీ, పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిందని భారత్ పేర్కొంది. భారత్ తన జాతీయ భద్రతా అధికారాన్ని ప్రయోగిస్తూ.. ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ముగించే వరకు ఈ ఒప్పందం నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.పాక్లో నెలకొన్న నీటి సంక్షోభాన్ని తక్షణం పరిష్కరించకపోతే దేశంలోని ప్రజలు చనిపోతారని, తమ దేశానికి వచ్చే నీటిలో మూడు వంతులు దేశం వెలుపల నుండి వస్తున్నందని పాక్ సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్ ఇటీవల పేర్కొన్నారు. సింధూ బేసిన్ పాక్ జీవనాడి అని, ఈ దేశంలోని ప్రతీ 10 మందిలో తొమ్మిది మంది తమ జీవనోపాధి కోసం సింధు నీటిపై ఆధారపడతారని ఆయన అన్నారు. దేశంలో పండించే పంటలలో 90 శాతం సింధు జలాలపైనే ఆధారపడి ఉన్నాయని, పలు విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలన్నీ దానిపైనే నిర్మితమయ్యాయని సయ్యద్ అలీ జాఫర్ తెలిపారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్ ఎన్నికలపై యూనస్ కీలక ప్రకటన
జాతీయం

విపత్తులను ఎదుర్కోవాలంటే కలిసి పని చేయాలి
న్యూఢిల్లీ: విపత్తులను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన మౌలిక సదుపాయాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విపత్తులను ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. అన్ని దేశాలు కలిసి పనిచేస్తేనే నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని స్పష్టంచేశారు. ‘డిజాస్టర్ రీసైలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్–2025’అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ శనివారం వీడియో సందేశం ఇచ్చారు. విపత్తుల నివారణ విషయంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యుత్తమ విధానాలు పరస్పరం పంచుకోవడానికి గ్లోబల్ డిజిటల్ వేదిక, నిధుల సేకరణ అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థతోపాటు దేశాల మధ్య సహకారం కచి్చతంగా అవసరమని అన్నారు. ఇండియా ఏర్పాటు చేసిన సునామీ వార్నింగ్ సిస్టమ్తో 29 దేశాలు ప్రయోజనం పొందుతున్నాయని గుర్తుచేశారు. కాలుష్యం, వాతావరణ మార్పులతోపాటు ప్రకృతి విపత్తుల సముద్ర తీర ప్రాంతాలు, దీవులకు పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అంశంపై ప్రపంచ దేశాలు తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు.

‘తీవ్రమైన పేదరికం’ తగ్గుముఖం
న్యూఢిల్లీ: భారతదేశంలో ‘తీవ్రమైన పేదరికం’రేటు క్రమంగా తగ్గిపోతోందని ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో వెల్లడించింది. 2011–12లో పేదరికం రేటు 16.2 శాతం ఉండగా, పదేళ్ల తర్వాత 2022–23 నాటికి 2.3 శాతానికి తగ్గిపోయినట్లు పేర్కొంది. రోజుకు 3 డాలర్లు (రూ.257) సంపాదిస్తే పేదలు కానట్లేనని ప్రపంచ బ్యాంకు గతంలో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. రోజుకు 2.15 డాలర్లు సంపాదిస్తే పేదలు కాదనే సూత్రీకరణ 2017 దాకా ఉండేది. దాన్ని 2021లో 3 డాలర్లకు పెంచారు. ఇండియాలో 2011–12లో దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) 34 కోట్ల మంది ఉండగా, 2022–23 నాటికి వారి సంఖ్య 7.5 కోట్లకు పడిపోయినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. పేదరిక నియంత్రణలో ఇండియా చక్కటి పురోగతి సాధిస్తున్నట్లు తెలియజేసింది. → 2024లో ఇండియాలో 5.46 కోట్ల మంది రోజువారీ సంపాదన 3 డాలర్ల కంటే తక్కువే ఉంది. ఈ లెక్కన తీవ్రమైన పేదరికం రేటు 5.44 శాతంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు లెక్కగట్టింది. → ఉచితం లేదా రాయితీతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వాలు పంపిణీ చేస్తుండడం, కొత్తగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తుండడంతో పేదరికం తగ్గుముఖం పడుతోంది. → అలాగే పేదరికం విషయంలో పల్లెలు–పట్టణాల మధ్య అంతరం తగ్గిపోతుండడం మరో కీలక పరిణామం. → అత్యంత పేదల్లో 54 శాతం మంది ఐదు అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లోనే ఉన్నారు. → 2011–12 నుంచి 2022–23 మధ్య దేశంలో 17.1 కోట్ల మంది తీవ్రమైన పేదరికం నుంచి బయటపడ్డారు. → ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన పేదరికం 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణాల్లో 10.7 శాతం నుంచి 1.1 శాతానికి పడిపోయింది. పల్లెలు–పట్టణాల మధ్య అంతరం 7.7 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గిపోయింది.

బిహార్లో చెరో సగం!
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న బిహార్ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల సంఖ్యపై ఎన్డీఏ కూటమి పార్టీలు సీట్ల పంపకంపై ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కూటమిలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూలో సమాన స్థాయిలో సీట్లు తీసుకోవాలని ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 243 స్థానాలకు గానూ బీజేపీ, జేడీయూలు చెరో వంద స్థానాలు పోటీ చేసేలా అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిహార్లోని ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) , జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామీ మోర్చా (హెచ్ఏ ఎం), ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్మంచ్ (ఆర్ఎల్ఎం) ఉన్నాయి. గడిచిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్జేపీ 5, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం ఒక్కొక్క స్థానంలో పోటీ చేశాయి. పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీ ఒక స్థానంలో అధికంగా పోటీ చేసినప్పటికీ ఈసారి సమానంగా సీట్ల పంపకాలు ఉంటాయని తెలుస్తోంది. 243 అసెంబ్లీ సీట్లలో జేడీయూ 102–103 సీట్లలో, బీజేపీ 101–102 సీట్లలో పోటీ చేయవచ్చని సమాచారం. మిగిలిన 40 సీట్లు కూటమిలోని మిగతా పార్టీలకు వదిలేస్తారని భావిస్తు న్నారు. పార్లమెంట్లో ఐదుగురు సభ్యుల ప్రాతినిధ్యం దృష్ట్యా ఎల్జేïపీ దాదాపు 28 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. హెచ్ఏఎంకు 7 సీట్లు, ఆర్ఎల్ఎంకు 4–5 సీట్లు కేటాయించవచ్చని అంటున్నారు. కొద్ది నెలల కిందట అసెంబ్లీ నియోజక వర్గాలన్నింటిలో నిర్వహించిన అంతర్గత బీజేపీ సర్వేల ఆధారంగా సీట్ల పంపిణీపై ఒక అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల కేటాయింపుతోపాటు అభ్యర్థుల ఎంపిక కోసం ఈ సర్వే చేశారు. ఎన్నికల తేదీలను ప్రకటించకముందే అభ్యర్థులను ప్రకటించేలా రెండు పార్టీల ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

డ్రోన్.. స్టార్టప్లు పెరిగెన్
డ్రోన్స్ .. ఇటీవలి కాలంలో ఈ మానవ రహిత విమానాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆపరేషన్ సిందూర్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో వీటిపట్ల జనంలో ఆసక్తి పెరిగింది. రక్షణ రంగం, ఈ–కామర్స్, వ్యవసాయం, ఆరోగ్యం వంటి విభిన్న రంగాల్లో కొత్త అవకాశాలను డ్రోన్స్ స్టార్టప్స్ అందిపుచ్చుకుంటున్నాయి. మరోపక్క ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఈ స్టార్టప్ల ఏర్పాటులో ముందుంటున్నారు. ఈ కంపెనీలకు ఉన్న అపార అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడుల వరద పారిస్తున్నారు. డ్రోన్ కంపెనీలు గత ఏడాది స్వీకరించిన నిధులు రెండింతలు అయ్యాయంటే భవిష్యత్ అవకాశాలను అంచనా వేయొచ్చు. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో డ్రోన్ టెక్నాలజీ స్టార్టప్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నాయి. మార్కెట్లో విస్తరించడంతోపాటు సాంకేతిక సామర్థ్యాలూ పెంచుకుంటున్నాయి. ప్రస్తుతం భారత డ్రోన్ తయారీ రంగంలో 506 కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఈ రంగంలోని టాప్–100 స్టార్టప్స్లో సంఖ్య పరంగా బెంగళూరు ముందంజలో ఉంటే.. ఈ కంపెనీలను స్థాపించిన వ్యవస్థాపకుల్లో అత్యధికులు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో (ఐఐటీ) చదివిన విద్యార్థులు కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక డ్రోన్ స్టార్టప్లు అమెరికాలో ఉంటే తరవాత మనదేశంలోనే ఉన్నాయి. అలాగే ఈ పదేళ్లలో ఈ రంగంలో అత్యధిక ఫండింగ్ అందుకున్న దేశాల్లో మనది నాలుగో స్థానం.బెంగళూరు టాప్..డ్రోన్ ్స రంగంలో దేశంలో 2018లో అత్యధికంగా 61 కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. ఆ తర్వాతి సంవత్సరం ఈ సంఖ్య 54గా నమోదైంది. 2020లో 59 కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. టాప్–100 కంపెనీల్లో బెంగళూరు నుంచి 24, హైదరాబాద్ 11, ముంబై 11, ఢిల్లీ 10, చెన్నై 8, నోయిడా నుంచి 8 కొలువుదీరాయి. ఇక డ్రోన్ కంపెనీల స్థాపకుల్లో ఐఐటీ బాంబే 18 మంది, ఐఐటీ కాన్పూర్ నుంచి 14 మంది, బిట్స్ పిలానీ విద్యార్థులు 12 మంది ఉన్నారు. ప్రపంచంలో డ్రోన్ స్టార్టప్స్ను అందించిన టాప్ – 10 విద్యాసంస్థల్లో మనదేశానివి 3 ఉండటం విశేషం.వెన్నుతడుతున్న ప్రభుత్వం..ప్రభుత్వ అనుకూల విధానాలు, వివిధ రంగాలలో డ్రోన్స్ డిమాండ్ పెరగడం, ఆవిష్కరణలు.. ఈ రంగానికి కలిసి వచ్చే అంశాలు. వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగం మొదలు దేశ రక్షణ అవసరాలు, విపత్తుల సమయంలో వాడకం వరకు డ్రోన్ వినియోగ పరిధి విస్తరిస్తుండడం జోష్నిస్తోంది. 2021లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రోన్ నియమాలు ముఖ్యంగా.. అనుమతుల సంఖ్య, పత్రాలు, రుసుముల తగ్గింపు మొదలు ఆన్ లైన్ సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు వంటివి ఈ రంగం పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.నిధులు వెల్లువెత్తాయి..దశాబ్ద కాలంలో భారతీయ డ్రోన్ కంపెనీల్లోకి రూ.4,882 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. 2016లో రూ.38.6 కోట్ల నుంచి 2024 నాటికి రూ.2,119 కోట్లకు ఎగిశాయి. అంటే ఏకంగా 5,389% వృద్ధి నమోదైందన్న మాట. 2020 నుంచి ఫండింగ్ ఊపు మీద ఉంది. 2023తో పోలిస్తే గతేడాది ఈ పెట్టుబడుల రాక రెండింతలకుపైగా పెరిగింది. 2025లో జూన్ 4 నాటికి సుమారు రూ.335 కోట్ల నిధులను డ్రోన్ కంపెనీలు అందుకున్నాయి. ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టార్టప్స్లో అత్యధికంగా దశాబ్ద కాలంలో రూ.927 కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐఎం కలకత్తా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఐఐటీ కాన్పూర్ విద్యార్థుల స్టార్టప్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీలు బాగా రాణిస్తుండటం, మరికొన్ని సాంకేతికత పరంగా మెరుగ్గా ఉండటం తదితర కారణాలతో.. ఈ రంగంలోని 12 కంపెనీలు చేతులు మారాయి. నాలుగు కంపెనీలు ఐపీవోల ద్వారా నిధులు సమీకరించాయి.
ఎన్ఆర్ఐ

పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్
మన దేశంలో ఏం రేంజ్లో వివాహ వేడుకలు జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం పెట్టే డీజేలు, బరాత్ల సందడితో ఊరు ఊరే హోరెత్తిపోతుంది. పైగా పెళ్లి వేడుక కావడంతో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పారు. ఓ వీధిలో పెళ్లి ఊరేగింపుతో కోలాహాలంగా ఉంటే..ఆటోమేటిగ్గా ఆ రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది..వాహనదారులు, బాటసార్లు మరోదార్లో వెళ్తారు. అది సర్వసాధారణం. మరీ దేశం కానీ దేశంలో అదే రేంజ్లో ఆర్భాటంగా పెళ్లి చేయాలంటే.. కష్టమనే చెప్పాలి. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)ఎందుకంటే ఎన్నో పర్మిషన్లు కావలి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్కి అంతరాయం కలుగకుండా ఆయా అధికారుల నుంచి అనుమతి వంటివి ఎన్నో కావాలి. మరీ ఈ పెళ్లి సముహం అనుమతి తెచ్చుకుని మరీ ఏకంగా వాల్స్ట్రీట్లో వివాహ వేడుక ధూం ధాంగా నిర్వహించింది. అచ్చం మన దేశంలో నిర్వహించినట్లుగా పెళ్లి బరాత్ నిర్వహించి..ఓ లెవెల్లో ఆడిపాడి ఎంజాయ్ చేశారు వారంతా. ఈ వేడుక కోసం అత్యంత రద్దీగా ఉండే వాల్స్ట్రీట్ మూసేశారు. ఆ వాల్స్ట్రీట్ వీధుల్లో దాదాపు 400 మంది పెళ్లి సముహంతో కోలాహాలంగా ఉంది. అందుకోసం పెళ్లి వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో కదూ..!. ఎందుకంటే మన కరెన్సీ ప్రకారం..లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తారు. అక్కడ ఓ పక్క డీజే మ్యూజిక్ సందడి..మరోవైపు ఆ బీట్లకు అనుగుణంగా డ్యాన్స్లతో కన్నులపండుగ ఉంది. ఈ వేడుక జరిగేలా సహకరిస్తుందా అన్నట్లు వాల్స్ట్రీట్ వీధులు వాహానాల రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. నెటిజన్లు మాత్రం మన వివాహ సంప్రదాయాలు న్యూయార్క్ వీధుల్లోకి వచ్చేశాయి. పైగా అక్కడ ఉండే స్థానికులు ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి వేడుకలో భాగమవ్వడం చూస్తుంటే.. మన సంస్కృతికి ఉన్న గొప్పదనం మరోసారి తేటతెల్లమైంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by DJ AJ (@djajmumbai) (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్)

FNCA -మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు
ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA -మలేషియా) ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2025 మలేషియాలో ఘనంగా జరిగాయి. మలేషియా కోలాలంపూర్ లోని MAB కాంప్లెక్స్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు , స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. పిల్లలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఆడి పాడి సందడి చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్ , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య సుధాకరన్ , మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాతో డాక్టర్ ప్రకాష్ రావు ,తెలుగుఇంటలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ శివ ప్రకాష్ , బి ర్ స్ మలేషియా ప్రెసిడెంట్ మారుతి, మలేషియా తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ MJR వరప్రసాద్ , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సారి ఉగాది పురస్కారాలు సమాజ సేవా కార్యక్రమాలను, కోవిడ్ లాక్ డౌన్ సమయములో మలేషియ లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయం కల్పించి వారి స్వదేశానికి పంపించే వరకు అన్ని రకాల సదుపాయాలు అందించిన అసోసియేషన్ నాయకులకు మరియు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడు కోవడానికి కృషి చేసిన వారిని గుర్తించి వారిని గౌరవించే ఉగాది కీర్తి రత్న పురస్కారాలతో సత్కరించామని ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తరువాత ఆపరేషన్ సిందూర్లో అమరులైన జవాన్లకు, పహల్గమ్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఒక్క నిమిషం పాటు మౌనం వహించి నివాళులు అర్పించారు. అనంతరం ఉగాది పురస్కారాలను ఈ కార్యక్రమ ముఖ్య అతిధులు చేతుల మీదుగా అందజేశారు . ఈ సంవత్సరం ఉగాది కీర్తి రత్న అవార్డు గ్రహీతలు వీరే తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు సూర్యదేవర ,షైక్ సుభాని సాహెబ్, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ నుండి శ్రీమతి విజయ శారద గరిమెళ్ళ ,వెంకట్ చిక్కం, మలేషియా తెలుగు ఫౌండేషన్ నుంచి ప్రకాష్ రావు, జగదీశ్వర్ రావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుండి కృష్ణ మూర్తి , సుబ్బారావు,తెలుగు ఇంటలెక్చవల్ సొసైటీ అఫ్ మలేషియా నుంచి శ్రీ రాములు సన్నాసి ,తొండ కృష్ణ మూర్తి చంద్రయ్య , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి పారు ఆపతినారాయణన్ ,గువేంద్ర శ్రీనివాస్ రావు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు . అలాగే ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా 2025-2026 కి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆ తర్వాత కార్యక్రమంలో ఆట పాటలతో ఆలరించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఇటీవల మలేషియా ప్రభుత్వం ప్రకటించిన మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం మే 19 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అమలులో ఉంటుందని ఈ విషయాన్ని ఇతర సంఘాల ప్రతినిధులు వారి వారి అధికార ప్రసార మాధ్యమాలలో దీని గురించి తెలియ జేయాలని, ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదైనా సహాయం కావలసినవారు ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియాను info@fnca.com.my or website www.fnca.com.my సంప్రదించాలని బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు. ఆమ్నెస్టీ సద్వినియోగం అయ్యే దిశగా మలేషియా లో ఉంటున్న కార్మికులను స్వదేశానికి చేరుకునేలా తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు చర్యలు తీసు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు, అలాగే ఈ కార్యక్రమం గురించి మలేషియాలో ఉంటున్న కార్మికులకు తెలిసే విధంగా తెలంగాణ ఆంధ్రా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిసి..కన్నీళ్లు ఆగలేదు!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ మే7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ గురించి విని పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతీగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తాజాగా ఆ పహల్గాం ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న భారత సంతతి సింగపూర్ మహిళ వైశాలి భట్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సందేశాన్ని తీసుకెళ్తున్న ప్రతినిధి బృందంతో సింగపూర్లో ఉన్న బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషితో జరిగిన సంభాషణలో..ఇలా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు వైశాలి భట్. నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ..ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరామని చెప్పారు. ఆ తర్వాత ఆ భయంకరమైన ఉగ్రదాడి గురించి వార్తల్లో విని భయాందోళనలకు లోనైనట్లు తెలిపారు. తాము తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నామని తెలిసి..వొళ్లు గగుర్పొడించిందన్నారు. అయితే తాము ఈ ఉగ్రదాడిపై తక్షణమే భారత ప్రభుత్వం చర్ తీసుకుంటుందని ఆశించా..కానీ రోజుల గడిచేకొద్ది నిరాశ వచ్చేసిందని చెప్పారు. కానీ మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు విన్నానో..వెంటనే కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయన్నారు. అస్సలు ఎంతలా కంట్రోల్ చేసుకుందామన్నా ఆగలేదంటూ భావోద్వేగంగా మాట్లాడారు. నాటి భయంకరమై ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాల ఆక్రందనే ఈ ఆపరేషన్ సిందూర్ అని అన్నారామె. పైగా దీనికి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంది. మహిళ నుదిట కుంకుమన చెరిపేసి వికృత ఆనందం పొందిని ఉగ్రవాదులపై ఉక్కుపాదంలా ఈ ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వనించిందని చెప్పారామె. నాటి ఘటనలో పురుషులను మాత్రమే చంపి వారి భార్యలను వితంతువులుగా మార్చినందుకు గానూ భారత ప్రభుత్వం సిందూర్ పేరుతోనే ఈ ఆపరేషన్ని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు వైశాలి భట్. కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో.. భారత త్రివిధ దళాలు ఉగ్రమూకల్ని, వారి మౌలిక సదుపాయల్ని, స్థావరాలని మట్టుబెట్టింది.(చదవండి: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్)

అమెరికా అంతటా గులాబీ మయం..!
అమెరికా,డల్లాస్ లోని డాక్టర్ పెప్పర్ ఎరినా వేదికగా జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. డల్లాస్ సభను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సన్నాహక సభల్లో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సందడి నెలకొంది. ఆస్టిన్, న్యూజెర్సీ, రాలీలో నిర్వహించిన సన్నాహక సభలు విజయవంతమయ్యాయి.ఆస్టిన్ లో నిర్వహించిన సన్నాహక సభలో 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే లు, గండ్ర వెంకట రమణ రెడ్డి, పెద్ది సుధర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ మహేష్ తన్నేరు, అభిలాష్ రంగినేని, వంశీ కంచర్ల కుంట్ల, శ్రీధర్ రెడ్డి, వ్యాళ్ల హరీష్ రెడ్డి, వెంకట్ మంతెన, శ్రీనివాస్ పొన్నాల, శీతల్ గంపవరం, అరుణ్ బీఆర్ఎస్ , వెంకట్ గౌడ్ దుడాల, రాజ్ పడిగల, మల్లిక్ , నవీన్ కనుగంటి, సుధీర్ జలగం, గాయకురాలు స్పూర్తి జితేంద్ర తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆస్టిన్లో వక్తలు వివరించారు. ఇక న్యూజెర్సీలోని గోదావరి ప్రిన్స్టన్లో జరిగిన సన్నాహక సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యే గదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బాల మల్లు, కార్పొరేటర్ రోజా మాధవరం, యుగంధర్, జక్కిరెడ్డి శ్రీనివాస్ , రవి ధన్నపునేని, మహేష్ పొగాకు తదితరులు పాల్గొన్నారు. జూన్ 1న డల్లాస్లో జరిగే గ్రాండ్ సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యూఎస్ఏ.. నార్త్ కరోలినాలోని రాలీలో.. యూనిటీ, సన్నాహక సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, టీటీజీఏ అధ్యక్షుడు భారతి వెంకన్నగారి, మాజీ అధ్యక్షులు చంద్ర ఎల్లపంతుల, కృష్ణ పెండోటి, మహిపాల్ బేరెడ్డి, హరీష్ కుందూర్, పున్నం కొల్లూరు, వీరేందర్ బొక్కా, శంకర్ రేపాల, అరుణ జ్యోతి కట్క, శ్రీధర్ అంచూరి, రఘు యాదవ్ , రాజు కటుకం , శ్రీనాథ్ అంబటి , క్రాంతి కుమార్ కట్కం, ఉమేష్ పరేపల్లి , హరి అప్పని, రాఘవ రావు తదితరులు హాజరై ప్రసంగించారు. రానున్న రెండు రోజుల్లో హ్యూస్టన్, డెలావేర్, వాషింగ్టన్, కాలిఫోర్నియా, డల్లాస్లో సన్నాహక సభలు నిర్వహించనన్నారు. అలాగే, మే 30 సాయంత్రం అతిథులతో భారీ ఎత్తున సభ నిర్వహించనున్నారు. కేటీఆర్ యూఎస్ పర్యటన వివరాలను మహేశ్ బిగాల తెలిపారు. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారని వివరించారు. జూన్ 1న టెక్సాస్లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ భారీ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్ఆర్ఐలు హాజరవుతారు.జూన్ 2న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లో భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచే కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్, భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యూఎస్ పర్యటనపై అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రవాస తెలంగాణవాసులతో పాటు ప్రవాస భారతీయులు, విద్యార్థులను తన పర్యటనలో కేటీఆర్ కలవనున్నారు.(చదవండి: యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు)
క్రైమ్

ఈత రాకున్నా నదిలోకి వెళ్లి..
భూపాలపల్లి/కాళేశ్వరం: వారంతా విద్యార్థులు.. పైగా సమీప బంధువులు.. ఓ వివాహ వేడుకలో కలుసుకున్నారు... ఎవరికీ ఈత రాకున్నా మేడిగడ్డను చూసి సరదాగా గోదావరిలో స్నానం చేద్దామని నదిలోకి దిగారు. కానీ నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేక ఒకరిని కాపాడబోయి ఒకరు మొత్తం ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోల్కొండ మల్లయ్య కుమార్తె త్రివేణి వివాహం ఈ నెల 5న జరిగింది. వివాహం అనంతరం సమీప బంధువులైన అదే గ్రామానికి చెందిన పట్టి మధుసూదన్ (18), పట్టి శివమనోజ్ (15), తొగరి రక్షిత్ (13), కర్ణాల సాగర్ (16)తోపాటు మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రాంచరణ్ (17), స్తంభంపల్లి (పీపీ)కి చెందిన పసుల రాహుల్ (19), పట్టి శివమణి.. మేడిగడ్డ ఎగువ భాగంలో మూడో బ్లాక్ వద్ద స్నానం చేసేందుకు శనివారం సాయంత్రం 6 గంటలకు వెళ్లారు. మోకాలి లోతు నీళ్లలో స్నానం చేసే క్రమంలో ఆడుకుంటుండగా తొలుత ఒకరు నీటమునిగారు. ఆపై ఒకరిని కాపాడబోయి ఒకరు.. ఆరుగురు నీటమునిగారు. నది ఒడ్డునున్న పట్టి శివమణి వెంటనే పట్టి మధుసూదన్ను కాపాడేందుకు ప్రయత్నించాడు. సాధ్యంకాకపోవడంతో చివరకు ఒడ్డుకు వచ్చేశాడు. మిగిలిన ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. వద్దని వారిస్తున్నా వినకుండా... అంబట్పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్ ఉన్నారు. వారితోపాటు మిగిలిన ఐదుగురు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా వెంకటస్వామి అడ్డుకున్నాడు. నదిలో నీటిమట్టం ఎక్కువగా ఉందని.. వెళ్లొద్దని వారించినా వినకుండా వారు వెళ్లా రు. దీంతో అతను కూడా వారితో అక్కడికి వెళ్లాడు. మోకాలి లోతు వరకు వెళ్లాక తిరిగి రావాలని పిలుస్తున్న క్రమంలోనే తన కుమారులు సహా ఆరుగురు ఒకరి వెనుక ఒకరు నీటము నగడంతో వెంకటస్వామి అచేతన స్థితిలో ఉండిపోయాడు. ఘటనాస్థలిలో 5,100 క్యూసెక్కుల నీరు.. కొద్ది రోజులుగా గోదావరి ఎగువన వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం పెరుగుతోంది. ప్రమాదం జరిగిన మేడిగడ్డ ఎగువ భాగం మూడో బ్లాక్లో ప్రస్తుతం 5,100 క్యూసెక్కుల నీరు ఉంది. పిల్లలు నీటిని అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఆరుగురు యువకుల గల్లంతు వార్త తెలుసుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి హసన్పర్తి: వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపురం చెరువులో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మునిగి మృతిచెందాడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం టేకులకుంట తండాకు చెందిన తేజావత్ గణేష్ నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. అదే హాస్టల్లోని నలుగురు స్నేహితులతో కలిసి రెడ్డిపురం సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లాడు. గణేశ్ ఈత కొడుతూ ముందుకు వెళ్లి మునిగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గణేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి తండ్రి తేజావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.

భార్య తల నరికి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన భర్త.. కారణం ఏంటంటే?
బెంగళూరు,సాక్షి: బెంగళూరు సమీపంలో ఒళ్లు గగూర్పొడిచే సంఘటన చోటు చేసుకుంది. అనేకల్ ప్రాంతంలోని హీలాలిగె గ్రామంలో నివసిస్తున్న ఓ యువకుడు తన భార్యను నరికి, ఆమె తలతో పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయిన ఘటన కలకలం రేపింది.28 ఏళ్ల శంకర్ అనే వ్యక్తి తన 26 ఏళ్ల భార్య మానసను తల నరికి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శంకర్, మానస దంపతులు కొంతకాలంగా హీలాలిగె గ్రామంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. జూన్ 3 రాత్రి శంకర్ తన పని ముగించుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మానస మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి శంకర్ తీవ్రంగా కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, మానస పుట్టింటికి వెళ్లింది.అయితే, ఆ తర్వాత కొన్ని రోజులు మానస తిరిగి ఇంటికి వచ్చి శంకర్ను వేధించినట్లు సమాచారం. హత్యకు ముందు రోజు కూడా ఆమె ఇంటికి వచ్చి గొడవ పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 6 రాత్రి శంకర్ తాను మానసను హత్య చేసి, ఆమె తల నరికి, నేరుగా సూర్యనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడే తాను హత్య చేసినట్టు పోలీసులకు చెప్పిన శంకర్, తలను కూడా పోలీసులకు చూపించాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (బెంగళూరు రూరల్) సీకే బాబా మాట్లాడుతూ...రాత్రి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదంలో భార్యను తలను నరికి స్టేషన్కు తీసుకువచ్చాడు. మానసకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో గత వారం రోజులుగా ఈ దంపతులు తరచూ గొడవపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, శంకర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలుగు నేతలే టార్గెట్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ఆదిలాబాద్ /చర్ల: వరుస ఘటనలు చూస్తుంటే... తెలుగు నేతలే టార్గెట్గా స్పెషల్ ఆపరేషన్లు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నేషనల్ పార్కులో గురు, శుక్రవారాల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందారు. గురువారం కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం, శుక్రవారం తెలంగాణ కమిటీ సభ్యుడు మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ చనిపోయారు. కాగా, ఆయన తెలంగాణ కమిటీతోపాటు స్పెషల్ జోనల్ కమిటీలోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. భాస్కర్పై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి రూ.25 లక్షలు, తెలంగాణ నుంచి రూ.20 లక్షల రివార్డు ఉండగా, ఆయన మృతదేహం వద్ద ఏకే 47 తుపాకీ లభించింది. మూడో అంచెపై వలమావోయిస్టులను దెబ్బ తీసేందుకు పోలీసులు, భద్రతా దళాలు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అమలుచేస్తున్నా యి. అగ్ర నేతలకు మూడంచెల భద్రత ఉంటుంది. ఇందులో తొలి అంచెలో అగ్రనేతతోపాటు అతని సపోర్టింగ్ స్టాఫ్, రెండు, మూడో అంచెలో ఇతర మావోలు ఉంటారు. వీరిలో ఎక్కువమంది బస్తర్ వాసులే ఉంటున్నారు. అగ్రనేతలే టార్గె ట్గా దాడులు జరిగినప్పుడు ఎక్కువగా చనిపోయే వారిలో వీరే ఉంటున్నారు. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ ‘తెలుగు నేతలను కాపాడేందుకు మీరు ఎందుకు చనిపోవాలి’అంటూ ప్రచార కార్యక్రమాన్ని వ్యూహత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నా రు.ఇది సత్ఫలితాలను ఇస్తోందని పోలీసులే బాహాటంగా ఒప్పుకుంటున్నారు. దీనికి తగ్గట్టే ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు ముందు ఆయన రక్షణ టీమ్లో ముగ్గురు మావోలు లొంగిపోవడం తీవ్రనష్టానికి దారి తీసింది. అంతకు ముందు దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ భాను విష యంలో ప్రస్తుతం సుధా కర్, మైలారపు ఆడెళ్లు విష యంలోనూ ‘కోవర్ట్’ తర హా ఆపరేషన్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే పరంపరలో నేటి తరం అగ్రనేత, బస్తర్ మూలవాసి, మోస్ట్వాంటెడ్ మావోయిస్టుగా ఉన్న మడావి హిడ్మా లేటెస్ట్ ఫొటోను సైతం భద్రతా దళాలు సంపాదించాయి. హిట్లిస్ట్లో తెలుగు నేతలుతెలంగాణ నుంచి మల్లోజుల వేణుగోపాల్ తి ప్పర్తి తిరుపతి. పాక హనుమంతు , కడారి సత్యనారాయణరెడ్డి, తక్కెళ్లపల్లి వాసుదేవరావు, చంద్రన్న, బండి ప్రకాశ్, రామన్న, పాపారావు, కంకణాల రాజిరెడ్డిలు మావోయిస్టు పార్టీలో అగ్రనేతలుగా కొనసాగుతున్నారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్తో పాటు కొయ్యాడ సాంబయ్య, వెంకటేశ్ కూడా కీలక నేతలుగా ఉన్నారు. వీరి కదలికపై కన్నేసిన భద్రతా దళాలు అనుకూల సమయం చూసి దాడి చేస్తున్నట్టు తెలు స్తోంది. ఇంద్రావతి నదీతీరంలో రెండో రోజైన శుక్రవారం కూడా మావోలు – పోలీసుల బలగాల నడుమ కాల్పులు కొనసాగాయని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ చెప్పారు.మూడు దశాబ్దాల క్రితమే ఉద్యమంలోకి..మైలారపు ఆడెళ్లుది ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చర స్వస్థలం. బోథ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన ఆడెళ్లు...1989లో నిర్మల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో చేరాడు. ఆ సమయంలో భూపోరాటాలు ఉధృతంగా సాగేవి. అభ్యుదయ భావాలు కలిగిన ఆయన రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరాడు. దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు.ఆ తర్వాత ఉద్యమం వైపు మళ్లి 1995లో నక్సల్స్లో చేరాడు. మొదట బోథ్ దళ సభ్యుడిగా, ఆ తర్వాత ఇంద్రవెల్లి దళ డిప్యూటీ కమాండర్గా పనిచేసి, దండకారణ్యంలోకి వెళ్లిపోయాడు.ఉద్యమంలో ఉన్న సమయంలోనే నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మిసాగర్ గ్రామానికి చెందిన దళ సభ్యురాలు కంతి లింగవ్వను వివాహం చేసుకున్నారు. 2022 డిసెంబర్లో మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతిచెందింది. అప్పటి నుంచి అడెల్లు దండకారణ్యంలోనే ఉంటున్నారు. ఆయన సోదరులు మాత్రమే స్వగ్రామంలో ఉంటున్నారు. ఆడెళ్లు మరణ వార్తతో పొచ్చరలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అతని పెద్ద సోదరుడు పేరు కూడాఆడెళ్లు. మావోయిస్టు ఆడెళ్లు మృతిచెందిన వార్త తెలిసిన తర్వాత ఆయన తన ఇంటివైపు ఎవరూ రావద్దని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆడెళ్లు మృతదేహాన్ని పొచ్చరకు తీసుకొస్తారా.. అందుకు సోదరులు సమ్మతిస్తారా అనేది చూడాల్సిందే.

కాకినాడలో సైబర్ స్కామర్లు
కాకినాడ క్రైం: అమాయకులే లక్ష్యంగా కాకినాడలో ఓ ముఠా ఖాతాలు తెరచి, వాటిని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఎస్పీ బిందుమాధవ్ «శుక్రవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన నార్ని సతీశ్ చంద్ర (37), దాసరి వీరవెంకట సత్యనారాయణ (31) కొద్ది నెలలుగా కాకినాడలోని వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు. పాస్బుక్, చెక్బుక్, ఏటీఎం కార్డుతో కూడుకున్న బ్యాంక్ కిట్లు తమకు అప్పగిస్తే ఖాతా తెరిచేందుకు అయ్యే ఖర్చుతో పాటు మరో రూ.5 వేలు ఇస్తామని ప్రలోభ పెట్టేవారు. ఈ ఖాతాపై రెండు నెలల్లో రూ.5 లక్షల చొప్పున లోన్ ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో పదుల సంఖ్యలో జనం ఖాతాలు తెరచి, కిట్లను వీరికి అప్పగించారు. కాకినాడకు చెందిన ఉదయ్కిరణ్కు ఈ కిట్లు అప్పగిస్తే అతను వీరికి డబ్బు ఇచ్చేవాడు. కాకినాడ సాంబమూర్తినగర్కు చెందిన కొర్రా లోవరాజు ఖాతా తెరచి కిట్ అప్పగించి రెండు నెలలైంది. లోన్ కోసం కాకినాడలోని బ్యాంక్ ఆఫ్ కర్ణాటకకు వెళ్లాడు. బ్యాంక్ అధికారులు అతని ఖాతా పరిశీలిస్తే కేవలం నెల రోజుల వ్యవధిలో రూ.50 లక్షల విలువైన లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. దీంతో లోవరాజు పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు కాకినాడకు చెందిన ఉదయ్కిరణ్ అనే వ్యక్తికి ఈ ఖాతాల కిట్లు అప్పగిస్తే అతడు వీటిని దుబాయ్ పంపిస్తున్నాడని తేలింది. దుబాయ్లో ఈ బ్యాంకు వివరాలు పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నాడని తెలిసింది. ఇందుకు ఉదయ్ కిరణ్కు ఖాతాకు రూ.30 వేల చొప్పున పుట్టారామ్ చెల్లిస్తున్నాడు. గడచిన 2 నెలల్లో సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణ కాకినాడ జిల్లాతో పాటు గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటకకు చెందిన పేర్లతో 48 ఖాతాలు తెరచి రూ.9 కోట్ల విలువైన మొత్తం జమ చేసినట్టు ఎస్పీ తెలిపారు. సతీశ్ చంద్ర, సత్యనారాయణను అరెస్టు చేయగా ఉదయ్కిరణ్ పరారీలో ఉన్నాడు. పుట్టారామ్ను పట్టుకునేందుకు కేంద్ర నిఘా విభాగాలకు సమాచారమిచ్చామని ఎస్పీ చెప్పారు.