Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP MLC Chandrasekhar Reddy Takes On AP Govt1
AP: ‘టీచర్లను ఎలా మోసం చేశారంటే...’

నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కరా్ ప్రహాసనంగా మార్చేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బదిలీల్లో మ్యానువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్స్‌ను తప్పనిసరి చేయడం ద్వారా మొత్తం ఉపాధ్యాయలోకంను పచ్చిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్‌కు రెడ్‌బుక్‌పై ఉన్న శ్రద్దలో కాస్తైనా విద్యాశాఖపై లేకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యావ్యవస్థ అధ్వన్నంగా మారిందని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు మ్యానువల్ విధానంలోనే బదిలీ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...తాజాగా కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ రోజు నుంచి 48 గంటల్లో ఆన్‌లైన్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలంటూ, ఒక్కో టీచర్ 2500 ఆప్షన్స్‌ పెట్టుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాల వల్ల రాష్ట్రంలో 1.20 లక్షల మంది ఎస్జీటీలకు సంబంధించి అటు హెచ్‌ఎం పదోన్నతులు లేకుండా చేశారు. మరోవైపు 48 గంటల్లో ఒక్కో టీచర్ 2500 ఆన్‌లైన్ బదిలీ అప్షన్స్‌ పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.టీచర్లను ఎలా మోసం చేశారంటే...టీచర్ల బదిలీలకు సంబంధించిన చట్టానికి విరుద్దంగా రోజుకోరకంగా నిబంధనలను మార్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం టీచర్లకు వెన్నుపోటు పొడిచింది. 35 వారాల పాటు ప్రతి శుక్రవారం మీటింగ్‌లు పెట్టి మ్యానువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేస్తానని చెప్పి నమ్మించారు. తరువాత అసెంబ్లీలో మాత్రం మ్యాన్‌వల్‌కు బదులు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్ చేస్తామని చట్టం తీసుకువచ్చారు. దీనిపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు చట్టంలో ఉన్న దానిని పక్కకుపెట్టి మ్యాన్‌వల్‌ బదిలీలనే చేస్తామని హామీ ఇచ్చారు. గత మే నెలలో ఆన్‌లైన్‌ బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండటంతో డీఈఓ కార్యాలయాల ముందు మే 25న ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. దీనితో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీచర్ యూనియన్లతో ఒక మీటింగ్ పెట్టి చట్టప్రకారం ఆన్‌లైన్ బదిలీలు ఉన్నా కూడా, దానిని పక్కకు పెట్టి మ్యానువల్ బదిలీలే చేస్తామని హామీ ఇవ్వడంతో టీచర్ యూనియన్లు ఆందోళనను విరమించుకున్నారు. అదే క్రమంలో ప్రభుత్వం మే 25న బదిలీలకు సంబంధించి జారీ చేసిన జీఓ 22లో ఖచ్చితంగా ఆన్‌లైన్ బదిలీలే చేస్తామని స్పష్టం చేసింది. ఇంతకంటే మోసం ఎక్కడైనా ఉంటుందా? దీనిపై టీచర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పొరపాటుగా ఆ జీఓ జారీ చేశామని, మ్యానువల్ బదిలీలే చేస్తామంటూ టీచర్ సంఘాలకు అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు హటాత్తుగా బదిలీలపై తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా పదేపదే టీచర్లను నమ్మించి, నిలువుగా దగా చేస్తూనే ఉన్నారు.బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తంగత ప్రభుత్వం జారీ చేసిన 117 జీఓను రద్దు చేసి, కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల స్కూల్స్‌ను తీసుకువచ్చింది. బదిలీల కోసం వెబ్ అప్షన్స్‌లో ఫౌండేషన్, బేసిక్, మెడల్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అనే నాలుగు ఆప్షన్స్ కనిపించాల్సి ఉంది. కానీ కేవలం ఎంపీపీ, యుపీ స్కూల్స్ అని మాత్రమే పెట్టారు. దీనితో టీచర్లలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాము ఆప్షన్ ఇచ్చే స్కూల్ ఏ కేటగిరిలోకి మార్పు చెందిందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రేపు సాయంత్రంతో వెబ్ అప్షన్స్ గడువు ముగుస్తోంది. తొమ్మిదిరకాల స్కూల్స్‌గా మార్చిన నేపథ్యంలో కొన్ని మండలాల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువగా పెడితే, మరికొన్ని మండలాల్లో ఫౌండేషన్ స్కూల్స్‌ను ఎక్కువగా పెట్టారు. ఎక్కడా హేతుబద్దత అనేది లేకుండా చేశారు. తెలుగుదేశం నాయకులు చెప్పినట్లుగా స్కూల్స్ కేటగిరిని మార్చారు. ఆర్జేడీ, డీఈఓ, ఎంఈఓలతో సంబంధం లేకుండా, నిబంధనలకు అనుగుణంగా ఏ స్కూల్ ఏ కేటగిరిలో ఉండాలని నిర్ణయించకుండా, టీడీపీ నాయకులు సూచించినట్లుగా స్కూల్స్‌ను మార్చేశారు. టీచర్లు ఎన్ని సంవత్సరాలు, ఎంత దూరంలో పనిచేశారనే దానిపై పాయింట్స్‌ ఇస్తారు. దాని ప్రకారమే బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో ఈ పాయింట్స్‌ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని చూపి టీచర్లను భయపెట్టాలని అనుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్ళతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు. ఎనిమిది అకడమిక్ ఇయర్స్ పూర్తయితే బదిలీ చేస్తామనే నిబంధనలు ఉంటే, ఎనిమిది క్యాలెండర్ ఇయర్స్‌ పూర్తి కాలేదంటూ సాకులు చూపి పాయింట్స్ ఇవ్వడం లేదు. అలాగే దాదాపు 4000 మంది స్కూల్ అసిస్టెంట్‌లు సర్‌ప్లస్‌గా మారిపోయారు. వారిని నిబంధనలకు విరుద్దంగా ప్రైమరీ స్కూల్‌కు కేటాయిస్తున్నారు. ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉన్న స్కూల్ అసిస్టెంట్‌ను కూడా పీఎస్ హెచ్‌ఎంగా మోడల్ స్కూల్స్‌కు పంపడం దారుణం. దీనివల్ల ఎస్‌జీటీలకు పీఎస్ హెచ్‌ఎం పదోన్నతి రాకుండా పోయింది.పదో తరగతి మూల్యాంకనంతో పరువు పోయిందిమంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా, పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో చూసిన నిర్లక్ష్యంతో విద్యాశాఖ పరువు పోయింది. పదోతరగతి పరీక్షలు విద్యార్ధుల భవిష్యత్తుకు తొలి మెట్టు. అటువంటి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయో అందరికీ తెలుసు. నెల్లూరుకు చెందిన విద్యార్థిని సాయి కుందనకి అన్ని సబ్జెక్ట్‌ల్లో తొంబైకి పైగా మార్కులు వస్తే, హిందీ సబ్జెక్ట్‌లో 34 మార్కులు వచ్చాయి, బాలికను ఫెయిల్ చేశారు. ఆమె రీవాల్యుయేషన్ పెట్టకుంటే 90 మార్కులు వచ్చాయి. నెల రోజుల పాటు ఆ విద్యార్ధి ఎంత వేదన చెంది ఉంటారో అర్థం చేసుకోవాలి. బొర్రా శిశింద్రారెడ్డికి గణితంలో 32 మార్కులు వేశారు. అన్నింటిలో మంచి మార్కులు వచ్చిన ఈ విద్యార్ధి తిరిగి రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 72 మార్కులు వేశారు. దీనిపైన మళ్ళీ రీకౌంటింగ్ చేయించుకుంటే 78 మార్కులు వచ్చాయి. ప్రొద్దుటూరుకు చెందిన గంగిరెడ్డి మోక్షితను సోషల్ లో 21 మార్కులతో ఫెయిల్ చేశారు. రీవాల్యుయేషన్‌లో 84 మార్కులు వచ్చాయి. ఇలా అనేక మంది విద్యార్ధుల జవాబుపత్రాలను తీసుకువస్తే, ఎంత దారుణంగా వాల్యుయేషన్ చేశారో అర్థమవుతుంది. ఒక సబ్జెక్ట్‌ను దిద్దడానికి పదిరోజులు సమయం ఇచ్చే పరిస్థితి ఉంటే, ఆరు రోజుల్లో పూర్తి చేయాలని ఒత్తిడి చేశారు’ అని చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Asian Suniel Resigns Telangana State Film Chamber2
ప్రెసిడెంట్ అయిన 24 గంటల్లోనే పదవికి రాజీనామా

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే ఆ పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అందుకు గల కారణాల్ని కూడా వెల్లడించారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ పదవిలో కొనసాగడం తనకు కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు)అసలేం జరిగిందంటే?టాలీవుడ్‌లో గత కొన్నిరోజులుగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. పర్సంటేజీ విషయమై నిర్మాతలతో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లకు మధ్య కొన్నిరోజుల క్రితం చర్చలు నడిచాయి. ఇది జరిగిన కొన్నిరోజులకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు బంద్‍‌ చేయనున్నారనే న్యూస్ బయటకొచ్చింది. దీని తర్వాత పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేశారు. తన సినిమా 'హరిహర వీరమల్లు' వస్తుందనే ఇలా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన తర్వాత ఆ నలుగురు అనే మాట తెగ వైరల్ అయింది.ఆ నలుగురే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని శాసిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దీంతో తొలుత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. పవన్ సినిమాని ఆపడానికి తాము ప్రయత్నించలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో శనివారం.. తెలంగాణ ఫిలిం చాంబర్‌లో జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్‌ని ఎంపిక చేశారు. ఇప్పుడు ఇది జరిగిన 24 గంటలు కూడా కాకముందే ఆ పదవికి సునీల్ రాజీనామా చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

Punjab Kings Scored Most Runs In IPL 20253
IPL 2025: 'ఈ లెక్కన' పంజాబ్‌దే టైటిల్‌.. రన్నరప్‌ ముంబై ఇండియన్స్‌..!

తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2025 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఆ జట్టు పంజాబ్‌ కింగ్స్‌పై 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది, 18 ఏళ్ల ఐపీఎల్‌ ప్రస్తానంలో తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ, పంజాబ్‌ ఆది నుంచి పోటాపోటీ పడుతూ ఫైనల్‌ వరకు చేరాయి. ఇరు జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. అయితే తుది సమరంలో ఆర్సీబీ అనుభవం ముందు పంజాబ్‌ తలవంచక తప్పలేదు.ఈ సీజన్‌లో ఆర్సీబీ టైటిల్‌ గెలిచినప్పటికీ.. ఓ రకంగా చూస్తే పంజాబ్‌దే విజయం అని చెప్పవచ్చు. అదెలా అనుకుంటున్నారా..? ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు (అన్ని మ్యాచ్‌ల్లో) చేసిన జట్టుగా పంజాబ్‌ నిలిచింది. ఈ జట్టు ఈ సీజన్‌ మొత్తంలో 3000 పరుగులు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఓ జట్టు ఓ సీజన్‌లో 3000 పరుగుల మార్కును తాకడం ఇదే మొదటిసారి.ఈ సీజన్‌లో పంజాబ్‌ తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టు ముంబై ఇండియన్స్‌. ఈ సీజన్‌లో ఆ జట్టు 2802 పరుగులు చేసింది. పంజాబ్‌, ముంబై తర్వాత గుజరాత్‌ (2766), లక్నో (2598), ఆర్సీబీ2539), రాజస్థాన్‌ (2496),ఢిల్లీ (2386), సన్‌రైజర్స్‌ (2378), సీఎస్‌కే (2315), కేకేఆర్‌ (1886) అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో వరుస స్థానాల్లో ఉన్నాయి. పరుగుల సంఖ్య ప్రకారం చూస్తే.. అత్యధిక పరగులు చేసిన పంజాబ్‌ను విజేత అనుకోవచ్చు. పంజాబ్‌ తర్వాతి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌ను రన్నరప్‌గా చెప్పుకోవచ్చు.ఈ లెక్క చూసిన తర్వాత ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గత మూడు సీజన్లలో అత్యధిక పరుగులు చేసిన జట్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాయి. 2023 సీజన్‌లో గుజరాత్‌ (2906) అత్యధిక పరుగులు చేయగా.. ఆ సీజన్‌ ఫైనల్లో ఆ జట్టు సీఎస్‌కే చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2024 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (2906) అత్యధిక పరుగులు చేయగా.. ఫైనల్లో ఆ జట్టు కేకేఆర్‌ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో ఇదే సెంటిమెంట్‌ రిపీటైంది.ఫోర్లలో ముంబై ఇండియన్స్‌, సిక్సర్లలో పంజాబ్‌ఈ సీజన్ మొత్తంలో అత్యధిక బౌండరీలు బాదిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలువగా.. అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా పంజాబ్‌ కింగ్స్‌ నిలిచింది. ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో అన్ని జట్లకంటే ఎక్కువగా 259 బౌండరీలు బాదగా.. పంజాబ్‌ అన్ని జట్లకంటే ఎక్కువగా 173 సిక్సర్లు కొట్టింది.ఈ సీజన్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన జట్లు..ముంబై ఇండియన్స్‌- 259గుజరాత్‌- 256పంజాబ్‌- 255ఆర్సీబీ- 238ఢిల్లీ- 219సన్‌రైజర్స్‌- 219లక్నో- 218రాజస్థాన్‌- 209సీఎస్‌కే- 199కేకేఆర్‌- 173ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్లు..పంజాబ్‌- 173లక్నో- 152రాజస్థాన్‌- 146ముంబై ఇండియన్స్‌- 142ఆర్సీబీ- 125గుజరాత్‌- 124సన్‌రైజర్స్‌- 120ఢిల్లీ- 109సీఎస్‌కే- 102కేకేఆర్‌- 101

Inter Student Incident In Andhra Pradesh's Anantapur4
AP: ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

అనంతపురం: జిల్లాలో దారుణం చోటు చేసకుంది. ఇంటర్‌ చదువుతున్నఓ విద్యార్థిని దారుణంగా హత్య చేయబడింది. కొంతమంది దుండగులు ఇంటర్‌ విద్యార్థినిని తొలుత తలపై బండరాయితో కొట్టి చంపి.. ఆపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఉరవకొండ నియోజవర్గం కూడేర మండలం బ్రహ్మణపల్లి వద్ద మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. తమ కుమార్తె కనిపిండం లేదని ఆరు రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పోలీసలు పట్టించుకోలేదని, చివరకు ఇలా పూర్తిగా కాలిపోయి కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటర్‌ చదివే ఆ విద్యార్థినిని హత్య చేసిన తర్వాత పెట్రోల్‌ పోసి కాల్చివేసినట్ల తెలుస్తోంది. ఆర రోజుల క్రితం అదృశ్యమైనప్పటికీ పోలీసుల కాలయాపన చేయడంతోనే ఇలా జరిగిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు ముందుగానే పట్టించుకని ఉంటే తమ కూతురు బతికేదని తల్లిదండ్రలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాల్‌లిస్ట్‌ పేరుతో పోలీసులు కాలయాపన చేశారని ఆ అమ్మాయి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

BRS MLA Maganti Gopinath Funeral Held At Mahaprasthanam5
మాగంటి గోపీనాథ్‌ అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్‌: గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడి ఈరోజు(ఆదివారం) ఉదయం మృతిచెందిన జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో గోపీనాథ్‌ అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యాహ్నం మూడ గంటల ప్రాంతంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడమ మాగంటి గోపీనాథ్‌ అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి గోపీనాథ్‌ అంతిమ సంస్కారాలకు బీఆర్‌ఎస్‌ నేతలు హాజరయ్యారు. కేటీఆర్‌, హరీష్‌ రావు తదితర నేతలు గోపీనాథ అంతిమ సంస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్‌ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.హైదరాబాద్‌ : మాగంటికి నేతలు కన్నీటి నివాళి (ఫొటోలు)మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్‌

Pothina Mahesh Fires On Chandrababu And TDP6
‘అది డైవర్ట్‌ చేయడానికే టీడీపీ బురద చల్లుడు రాజకీయాలు’

సాక్షి, తాడేప‌ల్లి: జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీ డిబేట్‌లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవే, వాటిని వైఎస్సార్‌సీపీకి, సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైఎస్సార్‌సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణంరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తరువాత కూడా కూటమి సర్కార్‌ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు, వైఎస్‌ కుటుంబం మీద వ్యక్తిత్వ హననానికి వాడుకుంటోందని మండిపడ్డారు.మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలనైనా సరే సాక్షి టీవీ, వైఎస్సార్‌సీపీ సమర్థించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం వెన్నుపోటు దినం విజయవంతం ద్వారా బహిర్గతం అవ్వడంతో, దానిని నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్రపూరితంగా టీడీపీ దానికి వంతపాడే ఎల్లోమీడియా, సోషల్ మీడియా ద్వారా పనిగట్టుకుని దుష్ప్రచారంకు దిగారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..గ‌తంలో అనేక సంద‌ర్భాల్లో టీవీ డిబేట్ల‌లో, ప‌బ్లిక్ మీటింగ్‌ల్లో కూర్చుని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులే ఇష్టారాజ్యంగా మాట్లాడిన‌ప్పుడు ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్న వారంతా ఏమైపోయారు. ఈటీవీ, టీవీ 5, ఏబీఎన్ ఛానెళ్ల ముందు ఎందుకు ధ‌ర్నాలు నిర్వ‌హించ‌లేదు? ఆ ప‌త్రిక‌ల ప్ర‌తుల‌ను ఎందుకు త‌గ‌ల‌బెట్టలేదు? టీడీపీ నాయ‌కులు మాట్లాడిన సందర్భాల్లో వారి మ‌నోభావాలు దెబ్బ‌తిన‌లేదా?టీడీపీ నాయ‌కులు, కిర్రాక్ ఆర్పీ, సీమ రాజా, చేబ్రోలు కిర‌ణ్‌ మాట్లాడిన వీడియోలను కూడా ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ప్రజలు చూసేందుకు గానూ ప్ర‌ద‌ర్శిస్తున్నాము. సాక్షాత్తు స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, హోంమంత్రి అనిత వైయ‌స్ కుటుంబం గురించి, వారి ఇంటి మ‌హిళ‌ల గురించి అసభ్యంగా మాట్లాడినా వారి మీద ఒక్క కేసు కూడా న‌మోదు చేయ‌లేదు. నాడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ను ఉద్దేశించి ప‌దే ప‌దే సైకో అని మాట్లాడిందే చంద్రబాబు. వైయ‌స్సార్సీపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ క‌ళ్యాన్ నా కొడ‌క‌ల్లారా అని రెచ్చిపోయాడు. వారిద్ద‌రి మీద కూడా ఎందుకు కేసులు పెట్ట‌లేదు?ఐటీడీపీ పేరుతో రెచ్చిపోతున్న సైకోలువ్య‌క్తిత్వ హ‌న‌నం అనేది టీడీపీ జీన్స్ లోనే ఉంది. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ నుంచి నేటి వైయ‌స్ జ‌గ‌న్ వ‌ర‌కు వ్య‌క్తిత్వ హ‌న‌నం చేయ‌డ‌మే ఎజెండాగా సైకోల‌ను ప్రోత్స‌హించడమే టీడీపీ ప‌నిగా పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ సోష‌ల్ మీడియా తోడేళ్లు వైయ‌స్ కుటుంబంపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఐ-టీడీపీ పేరుతో నారా లోకేష్‌ ఒక సైకో వ్య‌వ‌స్థ‌ను సృష్టించి డ‌బ్బులిచ్చి పోషిస్తున్నాడు. చంద్ర‌బాబు ఇచ్చిన ప్రోత్సాహంతోనే వీడియోలు చేస్తున్నాన‌ని టీడీపీ సైకో చేబ్రోలు కిర‌ణ్ స్ప‌ష్టంగా చెప్పాడు. అధికారం అండ చూసుకుని, రెడ్ బుక్ రాజ్యాంగం పొగ‌రుతో ఏం చేసినా పోలీసులు మ‌న‌ల్ని ఏం చేయ‌రులే అని తెలుగుదేశం పార్టీ సోష‌ల్ మీడియా సైకోలు దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారు. ఇలాంటి చ‌ర్య‌ల‌ను వైయ‌స్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. వైయ‌స్ కుటుంబాన్ని కించ‌ప‌రిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించే ప్ర‌స‌క్తేలేదు.మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు జ‌రుగుతుంటే ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌దుమ‌హిళల మీద అత్యాచారాలు, దాడులు జ‌రుగుతుంటే ఈ ప్ర‌భుత్వం చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. ద‌ళిత బాలిక‌పై సామూహిక అత్యాచారం చేస్తే ఇంత‌వ‌ర‌కు కేసు న‌మోదు చేసి నిందితుల‌ను శిక్షించ‌లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హోంమంత్రి అనిత‌, మంత్రి నారా లోకేష్ నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌హిళ‌ల మీద దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ముచ్చుమ‌ర్రిలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘ‌ట‌న జ‌రిగి 9 నెల‌లు దాటినా ఇంత‌వ‌రకు బాలిక మృత‌దేహాన్ని వెతికి తీయడంలో ఈ ప్ర‌భుత్వం ఘోరంగా ఫెయిలైంది.రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళిత మీద దాడులు నిత్య‌కృత్య‌మైపోయాయి. పిఠాపురంలో ఏకంగా ద‌ళితుల‌ను సాంఘిక బ‌హిష్క‌ర‌ణ చేసినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ దానిపై ఇంత‌వ‌ర‌కు నోరుమెద‌ప‌లేదు. ఈ ఘోరాల‌పై నోరెత్తి మాట్లాడే తీరిక ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు లేదు. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన డీజీపీ ఎక్క‌డున్నారో తెలియ‌దు. రాజ‌ధాని పేరుతో అమ‌రావ‌తి భూముల‌ను దోచుకోవ‌డ‌మే అజెండాగా చంద్రబాబు ప‌నిచేస్తున్నాడ‌ని రాజ‌ధాని రైతులు, మ‌హిళ‌లు గుర్తించాలి. అమ‌రావ‌తిలోని వంద‌ల ఎక‌రాల భూముల‌ను త‌న బినామీల కంపెనీల‌కు చంద్ర‌బాబు దోచిపెట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. గ‌తంలో సేక‌రించిన భూముల‌నే అభివృద్ధి చేయ‌లేక చేతులెత్తేసిన సీఎం చంద్ర‌బాబు, మ‌ళ్లీ 44 వేల ఎక‌రాలు సేక‌రిస్తాన‌ని చెప్ప‌డం భూములు దోచుకునే కుట్ర‌లో భాగ‌మే.

CM Revanth Reddy Comments On His Political Journey7
నా స్కూల్‌ మీ వద్దే అని ప్రధాని మోదీకి చెప్పాను: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ 'ఆటో బయోగ్రఫీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్​ శిల్పకళా వేదికలో ఆదివారం( జూన్‌8) ఘనంగా నిర్వహించారు 'ప్రజల కథే నా ఆత్మకథ' పేరుతో బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘గౌలిగూడ గల్లి నుంచి హర్యానా గవర్నర్‌గా ఎన్నో రాజకీయ ఓడి దుడుకులు ఎదుర్కొని ఎదిగిన వ్యక్తి బండారు దత్తాత్రేయ. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. మొన్న నీతి అయోగ్ మీటింగ్‌లో ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడును చూపించి అప్ కి సాతి యా వా హై(మీ స్నేహితుడు అక్కడున్నారు) అన్నారు. నేను ప్రధానికి చెప్పాను నేను స్కూల్ మీ దగ్గర చదివాను , కాలేజీ వారి(టీడీపీ) దగ్గర చదివి, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నానని అన్నాను. అన్ని రాజకీయ పార్టీల నేతలు అరుదుగా ఒక వేదికపై కనిపిస్తారు అంటే అది అలయ్ బలయ్ వేదిక. మా మంత్రి వర్గం అంత ఇక్కడే ఉంది. నేను ఇక్కడ కేబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. హైదరాబాద్ ప్రజల గుండెల్లో పి. జనార్ధన్ రెడ్డి, దత్తాత్రేయలది చెరగని ముద్ర. దత్తాత్రేయ ముక్కు సూటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకి వెళ్ళాలి. కిషన్ రెడ్డితో నాకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటా. కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకి తీసుకెళ్తాను’ అని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

Active Covid-19 Cases In India Cross 6000 Mark8
దేశంలో కోవిడ్‌ కలకలం.. ఆరు వేలు దాటిన యాక్టివ్‌ కేసులు

ఢిల్లీ: భారత్‌లో రోజురోజుకూ కోవిడ్‌–19 యాక్టివ్‌ కేసులు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలో కొత్తగా 1,131 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య ఆరు వేలు దాటింది. దేశంలో ఆదివారం ఉదయం 8 గంటల నాటికి కోవిడ్-19 యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,133కి చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.కోవిడ్‌తో దక్షిణాది రాష్ట్రాల్లో ఆరుగురు మృతి చెందారు. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు మృతి చెందారు. కేరళలో 1950, గుజరాత్‌లో 822, బెంగాల్‌లో 693, మహారాష్ట్రలో 595, కర్ణాటకలో 366, ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కోవిడ్‌ మృతుల సంఖ్య కూడా పెరగడంతో మరో ‘కరోనా వేవ్‌’ముంచెత్తుతుందా అన్న భయాలు సైతం వివిధ వర్గాల ప్రజల్లో నెలకొన్నాయి. కేరళలో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి.కేరళలో శనివారం నాటికి (గత 24 గంటల్లో) 192, గుజరాత్‌లో 107, పశ్చిమబెంగాల్‌లో 58, కర్ణాటకలో 15, ఆంధ్రప్రదేశ్‌లో 12 కొత్త యాక్టివ్‌ కేసులు వెలుగు చూశాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనూ యాక్టివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేసుల వ్యాప్తికి కారణమైన ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్లు, లీనియేజ్‌లు ఎగువ శ్వాసకోశ వ్యవస్థ (అప్పర్‌ రెస్పిరేటరీ) పైనే ప్రభావం చూపుతున్నందున పెద్దగా భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు అంటున్నారు.

Gautam Adani Salary Revealed How It Compares to Peers And His Own Executives9
గౌతమ్ అదానీ వేతనం పెరిగింది.. కానీ..

అదానీ గ్రూప్ చైర్మన్, దేశంలోనే రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ .10.41 కోట్ల వేతనం అందుకున్నారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. అదానీ గ్రూప్‌లోని తొమ్మిది లిస్టెడ్ కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (రూ.2.54 కోట్లు), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (రూ.7.87 కోట్లు) నుంచి ఆయనకీ ఆదాయం వచ్చింది.గతంతో పోలిస్తే ఈసారి వేతనం పెరిగినప్పటికీ, అదానీ పారితోషికం దేశంలోని చాలా మంది అగ్రశ్రేణి పారిశ్రామిక అధినేతల కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. తోటి వ్యాపారాధినేతలైన సునీల్ భారతి మిట్టల్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.32.27 కోట్లు), రాజీవ్ బజాజ్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.53.75 కోట్లు), పవన్ ముంజాల్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.109 కోట్లు), ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ (2025 ఆర్థిక సంవత్సరంలో రూ.76.25 కోట్లు), ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఎస్ పరేఖ్ (2025 ఆర్థిక సంవత్సరంలో రూ.80.62 కోట్లు) వంటి వారు అదానీ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తన గ్రూప్‌లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌లలో కొంతమంది అదానీ కంటే ఎక్కువ పారితోషిక ప్యాకేజీలను అందుకున్నారు. ఏఈఎల్ సీఈవో వినయ్ ప్రకాశ్ రూ.69.34 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ ఎండీ వినీత్ ఎస్ జైన్ రూ.11.23 కోట్లు ఆర్జించారు. ఇది భారతదేశ కార్పొరేట్ నాయకత్వంలోని విభిన్న వేతన నిర్మాణాలను హైలైట్ చేస్తుంది. ఇక్కడ కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వేతన ఆధారిత సంపాదనలో కంపెనీ వ్యవస్థాపకులనే అధిగమిస్తుండటం గమనించవచ్చు.

BRS KCR Sad Over Maganti Gopinath Tribute10
మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మాగంటి మృతదేహానికి నివాళి అర్పించేందుకు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెళ్లారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. కాసేపటి క్రితమే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. మాగంటి గోపీనాథ్‌ ఇంటికి చేరుకున్నారు. అనంతరం, మాగంటి భౌతికకాయం వద్ద పుచ్చగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. ఈ క్రమంలో కేసీఆర్‌ భావోద్వేగానికి గురైన పెద్దాయన కన్నీరు పెట్టుకున్నారు. మాగంటి మృతదేహాన్ని చూసి ఆవేదన చెందారు. అనంతరం, మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాగంటి కుమారుడిని అప్యాయంగా దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement