‘నాన్నే నా ప్రాణం’.. చిరాగ్‌ భావోద్వేగ పోస్ట్‌ | Chirag Paswan Inspirational Post on Instagram | Sakshi
Sakshi News home page

‘నాన్నే నా ప్రాణం’.. చిరాగ్‌ భావోద్వేగ పోస్ట్‌

Jun 11 2024 12:05 PM | Updated on Jun 11 2024 12:05 PM

Chirag Paswan Inspirational Post on Instagram

బీహార్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ మూడోసారి ఎంపీగా ఎన్నికై, తొలిసారి మోదీ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. మోదీ 3.0 క్యాబినెట్‌లో చిరాగ్ పాశ్వాన్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖను కేటాయించారు. చిరాగ్‌ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్  ఒకప్పుడు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖలను చేపట్టారు. తాజాగా చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను షేర్‌ చేశారు.

ఈ పోస్టుకు తన తండ్రికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలను జతచేశారు. నాడు రాష్ట్రపతి భవన్‌లో రామ్ విలాస్ పాశ్వాన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫొటోను చిరాగ్‌ పోస్ట్‌ చేశారు. అలాగే తాను తన తండ్రితో  ఉన్నప్పటి ఫొటోలను కూడా షేర్‌ చేశారు.  వీడియోలో రామ్ విలాస్ పాశ్వాన్ రికార్డ్ చేసిన వాయిస్ ప్లే అవుతుంది. అలాగే ఇదే వీడియోలో చిరాగ్‌ మాట్లాడుతూ ఈ దీపం(చిరాగ్‌) దేశానికి, ప్రపంచానికి వెలుగు నిచ్చేదిగా మారినందుకు సంతోషిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

చిరాగ్‌ షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు మూడు కోట్ల మంది వీక్షించగా, 11 లక్షల మంది లైక్ చేశారు. అదే సమయంలో చిరాగ్‌ను ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో బీహార్ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కొందరు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement