mp
-
కాంగ్రెస్ ఎంపీకి వ్యతిరేక నినాదాలు.. క్రికెట్ బ్యాట్లతో దాడి
గౌహతి: అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సైన్తోపాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎంపీ క్షేమంగా బయటపడగా, ఆయన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ స్పందిస్తూ ఎంపీ రకిబుల్కు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.అస్సాంలోని నాగావ్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సైన్పై దాడి జరిగింది. రకీబుల్ హుస్సైన్ అస్సాంలో దూబ్రీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుపోహీ పోలీసు స్టేషన్ పరిధిలోని గునమారీ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి దాడికి దిగారు. క్రికెట్ బ్యాట్లతో విరుచుకుపడ్డారు. గుర్తుపట్టకుండా ముఖాలకు నల్లరంగు వ్రస్తాలు కప్పుకున్నారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రతా సిబ్బంది ఎంపీకి రక్షణగా నిల్చున్నారు. అయినా దుండుగులు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. భారీ సంఖ్యలో చుట్టుముట్టి దాడి చేయడంతో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ముష్కరులు వీరంగం సృష్టించారు.ఈ క్రమంలో సమాచారం అందుకున్న అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించడంతో వారంతా పారిపోయారు. అనంతరం ఎంపీ రకీబుల్ యథావిధిగా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీపై దాడి ఘటనపై అస్సాం కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముష్కర మూకను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ గురువారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఎంపీ రకీబుల్కు తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారికపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఇక, రకీబుల్ గతేడాది లోక్సభ ఎన్నికల్లో 10 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయనపై దాడికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. బీజేపీ పాలనలో తమకు రక్షణ లేకుండాపోయిందని అస్సాం కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీనియర్నేత గౌరవ్ గొగోయ్ ధ్వజమెత్తారు. గూండారాజ్ సంస్కృతి నుంచి రాష్ట్ర ప్రజలు స్వాతంత్య్రం కోరుకుంటున్నారని చెప్పారు. Brutal attack on @INCAssam MP Shri @rakibul_inc and his son Shri Tanzil Hussain, who faught recently concluded by-election as a MLA Candidate from Samuguri Constituency is highly condemnable. pic.twitter.com/XPzmF3MQ44— Gautam Bhattacharjee (@GautamB58738095) February 20, 2025 -
‘మార్గదర్శి’పై ఎంపీ మిథున్రెడ్డి ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: మార్గదర్శి స్కామ్ దేశంలోనే చాలా పెద్ద స్కామ్ అని, ఈ స్కామ్లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం(ఫిబ్రవరి10) మిథున్రెడ్డి లోక్సభలో బడ్జెట్పై చర్చలో భాగంగా మాట్లాడారు.‘ మార్గదర్శి లక్షల మంది డిపాజిటర్లను మార్గదర్శి ముంచేసింది. మార్గదర్శి అక్రమాలపై కేంద్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు. ప్రతిసారి ఈ అంశాన్ని లోక్సభలో ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద స్కాం జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఏం చేస్తోంది. రూ.2వేల600కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారా..కేంద్రం దీనికి సమాధానం చెప్పాలి.మిథున్రెడ్డి ఇంకా ఏమన్నారంటే..మార్గదర్శి రూ. 2600 కోట్ల రూపాయలు వసూలు చేసిందిఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వసూలు చేసిందిడిపాజిటర్లకు న్యాయం జరగాలిదీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలిఒకవైపు 75 వేల మెడికల్ సీట్లని కేంద్రం చెబుతోందికానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మాకు మెడికల్ సీట్లు వద్దని సరెండర్ చేస్తుంది ఏపీలో 17 మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపేశారు.కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇప్పించాలికేంద్రం విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలిపోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దుపోలవరం నిర్మాణానికి అరకొరగా నిధులు ఇస్తున్నారురాజధాని అమరావతికి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలిపదేళ్ల తర్వాత రైల్వే జోన్ ఇచ్చారువాల్తేర్ డివిజన్ రెండుగా విభజించి అన్యాయం చేశారువాల్తేర్ డివిజన్ విశాఖ జోన్లోనే ఉంచాలివిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాంతిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో నాపై దాడిచేశారు: ఎంపీ గురుమూర్తి తిరుపతిలో తనపై జరిగిన దాడి అంశాన్ని లోక్సభలో 377 నిబంధన కింద లేవనెత్తిన ఎంపీ గురుమూర్తిఏపీలో ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగిందితిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నాపైన, మహిళా కార్పొరేటర్లపై దాడికి పాల్పడ్డారుఎన్నికల నేపథ్యంలో రాజ్యాంగ విధులు నిర్వహిస్తున్న సమయంలో మమ్మల్ని అడ్డుకున్నారుతిరుపతి జిల్లా పోలీసులు దాడులు నిరోధించడంలో ఫెయిల్ అయ్యారుబాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర చూస్తున్నారుఈ దాడులపై వెంటనే దర్యాప్తు జరపాలిదాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి -
గుక్కపెట్టి ఏడ్చిన ఎంపీ.. రాజీనామా చేస్తానంటూ..
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో దళిత బాలిక హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై అయోధ్యకు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో ఆయన గుక్కపెట్టి ఏడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పక్కనే కూర్చున్న మాజీ ఎంపీ పవన్ పాండే.. అవధేష్ను ఊరడిస్తూ కనిపించారు.హత్యకు గురైన బాధిత దళిత బాలిక కుటుంబ సభ్యులను శనివారం అవధేష్ ప్రసాద్(Avadhesh Prasad) కలిశారు. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో అవధేష్ మాట్లాడుతూ ‘లోక్సభలో ప్రధాని మోదీ ముందు ఈ అంశాన్ని లేవనెత్తుతాను. ఈ విషయంలో న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తాను. మన బిడ్డ గౌరవాన్ని కాపాడుకోవడంలో మనం విఫలమవుతున్నాం. ఇది దేశంలో అత్యంత బాధాకరమైన ఘటన. यह जघन्य अपराध बेहद दुःखद हैं।अयोध्या के ग्रामसभा सहनवां, सरदार पटेल वार्ड में 3 दिन से गायब दलित परिवार की बेटी का शव निर्वस्त्र अवस्था में मिला है, उसकी दोनों आँखें फोड़ दी गई हैं उसके साथ अमानवीय व्यवहार हुआ है।यह सरकार इंसाफ नही कर सकती। pic.twitter.com/aSvI3N74Kl— Awadhesh Prasad (@Awadheshprasad_) February 2, 2025అయోధ్యలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక దళిత బాలికపై అత్యాచారం జరిపి, ఆపై దారుణంగా హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నగ్న స్థితిలో కాలువలోకి విసిరేశారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది’ అని చెబుతూ అవధేష్ మీడియా ముందు గుక్కపెట్టి ఏడ్చారు. కాగా అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్ అసెంబ్లీ స్థానా(Milkipur Assembly constituency)నికి ఫిబ్రవరి 5న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో అవధేష్ ప్రసాద్ కుమారుడు బరిలో ఉన్నారు. అటువంటి స్థితిలో అవధేష్ రోదిస్తున్న వీడియో వైరల్(Video goes viral) అయ్యింది. దీంతో అతని తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కిపూర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్టికానున్నాయి. మిల్కిపూర్ సీటును గెలుచుకునేందుకు అటు సమాజ్వాదీ పార్టీ, ఇటు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు -
ప్రముఖ సింగర్తో బీజేపీ ఎంపీ వెడ్డింగ్ బెల్స్ (ఫోటోలు)
-
ఎంపీ తేజస్వి పెళ్లి ఖాయం
బొమ్మనహళ్లి: బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. చెన్నైకి చెందిన గాయకురాలు శివశ్రీ స్కంధ ప్రసాద్తో పెళ్లి ఖాయమైనట్లు తెలిసింది. కొత్త ఏడాది మార్చిలో వివాహ వేడుక జరగనుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య ఓ ఇంటివారు కాబోతున్నారు. చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ను వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో ఆయనే మంగళవారం ప్రకటించారు. ఇక, శివశ్రీ.. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కళాశాలలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు. ఇక, తేజస్వి సూర్య.. బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన విషయం తెలిసిందే.ప్రముఖ సింగర్తో బీజేపీ ఎంపీ వెడ్డింగ్ బెల్స్ (ఫోటోలు) ಸಂಸದ ತೇಜಸ್ವಿ ಸೂರ್ಯ ಅವರು ಇದೀಗ ಗಾಯಕಿ, ಭರತನಾಟ್ಯ ಕಲಾವಿದೆಯಾಗಿರುವ ಚೆನ್ನೈ ಮೂಲದ ಸಿವಶ್ರೀ ಸ್ಕಂದಕುಮಾರ್ ಎನ್ನುವವರನ್ನು ವರಿಸಲು ಸಜ್ಜಾಗಿದ್ದಾರೆ. ಮಾರ್ಚ್ 4ಕ್ಕೆ ವಿವಾಹ ನಡೆಯಲಿದೆ#2025Wedding#TejasviSuryaWedding #TejasviSuryabride #sivasriskandaprasad pic.twitter.com/3xmUPRRuPJ— ಎ ಜೆ ಕ್ರಿಯೇಷನ್ಸ್ (@AjUniversal1) December 31, 2024 -
దీని వెనుక ఏదో మతలబు ఉంది: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ను ఆర్ఆర్ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు) బాధితులు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. తమ సమస్యను ఎంపీ దృష్టికి బాధితులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు తీసుకురావాలని గత ప్రభుత్వాన్ని రైతులు కోరారని.. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల పేదలు, రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.‘‘కొన్ని ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్ దూరాన్ని కుదించడంలో మతలబు ఉంది. హెచ్ఎండీఏకు అవతల ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరగాలి. అశాస్త్రీయ అలైన్మెంట్ ద్వారా నష్టం జరుగుతుంది. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ రోజు ఎంపీగా ఉన్నవారు ఈ రోజు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీరు గార్చుతున్నారనే దానికి ఇదే నిదర్శనం’’ అని లక్ష్మణ్ చెప్పారు.ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లు నితిన్ గడ్కారీ దృష్టికి తీసుకెళ్లారు, పేదవాళ్ల భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. పేదలకు అండగా బీజేపీ ఉంటుంది. అన్యాయంగా భూములు లాక్కుంటే ఎంతటి పోరాటానికి అయిన బీజేపీ వెనకాడదు’’ అని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
రాహుల్ అనుచితంగా ప్రవర్తించారు: మహిళా ఎంపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రతిపక్షనేత రాహుల్గాంధీపై నాగాలాండ్కు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్నాన్ కొన్యాక్ రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ బయట గురువారం(డిసెంబర్19) జరిగిన నిరసనల్లో తనకు రాహుల్ అత్యంత దగ్గరగా వచ్చి అసౌకర్యానికి కారణమయ్యారని ఆరోపించారు. గట్టిగా అరుస్తూ తనకు అత్యంత సమీపంలోకి వచ్చి తనతో అనుచితంగా ప్రవర్తించారని, ఇది తనను అసౌకర్యానికి గురి చేసిందని ఫిర్యాదు అనంతరం ఎంపీ కొన్యాక్ చెప్పారు. కాగా,పార్లమెంట్లో గురువారం గందరగోళం నెలకొంది. అంబేద్కర్ను అవమానించి కాంగ్రేస్సేనని బీజేపీ.. కాదు..కాదు బీజేపీ నేతలే రాజ్యాంగ నిర్మాతను అవమానించారంటూ అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు. ఎంపీలు చేట్టిన నిరసనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పార్లమెంట్ సిబ్బంది ఎంపీ సారంగిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో గందరగోళం.. రేపటికి వాయిదా -
నాలుగుసార్లు ఎంపీ.. ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు గ్యాంగ్స్టర్
బీహార్: కొందరు రాజకీయ నేతలు అక్రమ దందాలు సాగిస్తున్నారనే వార్తలను మనం అప్పుడప్పుడు వింటుంటాం. అయితే నాలుగు సార్లు ఎంపీ, ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రజాప్రతినిధి ఇప్పుడు గ్యాంగ్స్టర్గా మారాడంటే ఒక పట్టాన నమ్మలేం. కానీ ఇది నిజం. యూపీకి చెందిన ఒక నేత ప్రజాప్రతినిధి అనే పదానికే మచ్చతెచ్చేలా ప్రవర్తించాడు.రాజకీయాల్లో విజయంకల్తీ మద్యం కేసులో నిందితుడైన యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్ రాజకీయాల్లో పలు విజయాలను అందుకున్నారు. అజంగఢ్ నుంచి నాలుగు సార్లు ఎంపీ, ఫూల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022లో మహూల్లో చోటుచేసుకున్న విషపూరిత మద్యం కుంభకోణం కేసులో చిక్కుకున్న ఆయన రెండేళ్లకు పైగా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు రమాకాంత్ యాదవ్ ఐఆర్-42 గ్యాంగ్గా జాబితాలో చేరారు.1985లో రాజకీయ ప్రవేశంఫుల్పూర్ ప్రాంతంలోని అంబారి నివాసి రమాకాంత్ యాదవ్ 1985లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆఫుల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో అజంగఢ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఎంపీ అయ్యారు. 2019లో బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. అయితే ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరి 2022లో ఫూల్పూర్ పోవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.బీఎస్పీ అభ్యర్థిపై దాడి1998 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు ముందు రమాకాంత్ యాదవ్ బీఎస్పీ అభ్యర్థి అక్బర్ అహ్మద్ డంపీపై దాడి చేసినందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 2022లో మహుల్లో విషపూరిత మద్యం ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ కేసులో రమాకాంత్ యాదవ్ హస్తమున్నట్లు దర్యాప్తులో తేలింది. అప్పటి నుంచి ఆయన జైలులో ఉన్నారు.ఐఆర్ -42 ముఠా జాబితాలో..వారణాసి జోన్ ఏడీజీ హత్య, కల్తీ మద్యం తయారు చేయడం, లైసెన్స్ పొందిన దేశీయ మద్యం షాపులో దానిని విక్రయించడం లాంటి నేరాలకు పాల్పడి, జైలుకెళ్లిన ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్, అతనితో సంబంధం ఉన్న 15 మంది సభ్యులను ఐఆర్ -42 ముఠా జాబితాలో పోలీసులు చేర్చారు. ఇతనితో పాటు ఇతని ముఠా సభ్యులపై గ్యాంగ్స్టర్ చట్టం కింద పోలీసులు చర్యలు చేపడుతున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం -
జపాన్లో మహిళలపై ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
టోక్యో:మహిళల పునరుత్పత్తి అవయవాలపై జపాన్ చట్ట సభ సభ్యుడు నవోకీ హ్యకుట చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై దేశంలో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జపాన్లో ఎప్పటినుంచో పడిపోతున్న జననాల రేటుపై ఇటీవల హ్యకుట ఇటీవల స్పందించారు. 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత మహిళల గర్భసంచి తొలగించడంతో పాటు 25 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లిల్లు నిషేధించాలన్నారు. ఈ చర్యలు తీసుకుంటే దేశంలో జననాల రేటు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ వ్యాఖ్యలపై రోజురోజుకు వివాదం పెరుగుతూ మహిళల ఆగ్రహావేశాలు చల్లారకపోవడంతో హ్యకుట స్పందించారు.తన వ్యాఖ్యలు కేవలం ఊహాజనితం అ ని వివరణ ఇచ్చారు. అయినా ఆయనపై మహిళలు శాంతించడం లేదు. కాగా,నవలా రచయితగా ఉన్న హ్యకుట అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి జపాన్ కన్జర్వేటివ్ పార్టీలో చేరి చట్టసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. -
వయనాడ్లో ప్రియాంకం
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భారీ విజయంతో బోణీ కొట్టారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో అనివార్యమైన వయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో 6,22,338 ఓట్లు సాధించారు. కాగా తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరి కన్నా 4,10,931 ఓట్లు ఎక్కువ సాధించారు.ప్రియాంకతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అత్యధికంగా 6,47,445 ఓట్లు సాధించడం విశేషం. ఆనాడు రాహుల్ 3,64,422 ఓట్ల తేడాతో గెలిస్తే శనివారం ప్రియాంక అంతకుమించిన మెజారిటీతో జయకేతనం ఎగరేయడం గమనార్హం. వయనాడ్లో గెలిచిన తర్వాత ప్రియాంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఢిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వయనాడ్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘ఎక్స్’వేదికగా వయనాడ్ ఓటర్లకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియతమ సోదరసోదరీమణులారా.. వయనాడ్లో మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయా. రాబోయే రోజుల్లో ఈ గెలుపు మీ విజయమని మీరు భావించేలా పనిచేస్తా. మీ కోసం నేను పోరాడతా. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నా. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా తల్లి సోనియా, భర్త రాబర్ట్, రత్నాల్లాంటి పిల్లలు రైహాన్, మిరాయా... మీరు నాకు ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదు. నా సోదరుడు రాహుల్.. నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి. నాకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు’’అని ప్రియాంక వ్యాఖ్యానించారు. తన విజయం కోసం కృషిచేసిన యూడీఎఫ్ కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలు, వలంటీర్లకు రుణపడి ఉన్నానని ప్రియాంక అన్నారు. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికల వేళ వయనాడ్లో 74 శాతంగా నమోదైన పోలింగ్ ఈసారి నవంబర్ ఉప ఎన్నికల్లో 65 శాతానికి తగ్గింది. ప్రియాంకతో పోటీపడిన సత్యన్ మోకెరికి 2,11,407 ఓట్లు, బీజేపీ నాయకురాలు నవ్యా హరిదాస్కు కేవలం 1,09,939 ఓట్లు పడ్డాయి. నిఖార్సయిన నేత సోదరుడితో కలిసి ప్రచారవేదికల్లో సరదాగా సంభాషించినా, తండ్రి మరణం, తల్లి నిర్వేదంపై మనసుకు హత్తుకునేలా మాట్లాడి, ప్రజాసమస్యలపై గళమెత్తి తనలోని నిఖార్సయిన రాజకీయనేత పార్శా్యలను అద్భుతంగా ఆవిష్కరించి ఓటర్ల మనసును చూరగొన్నారు. తాజా లోక్సభ ఎన్నికల్లో పార్టీ 99 సీట్లు సాధించడంలో ప్రియాంక కృషి కూడా ఉంది. ‘‘ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తేమోగానీ రాజకీయాలకు కొత్తకాదు’’అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ ప్రాచుర్యం పొందాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2019 జనవరిలో ఉత్తరప్రదేశ్ తూర్పు రీజియన్ ఎన్నికల ప్రచారబాధ్యతలను మోశారు. మొత్తం రాష్ట్రానికి జనరల్ సెక్రటరీ(ఇన్చార్జ్)గానూ పనిచేశారు. 1972 జనవరి 12న జని్మంచిన ప్రియాంక ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ పాఠశాలల్లో చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్ర పట్టా పొందారు. బుద్దుని బోధనలపై పీజీ చేశారు. My dearest sisters and brothers of Wayanad, I am overwhelmed with gratitude for the trust you have placed in me. I will make sure that over time, you truly feel this victory has been your victory and the person you chose to represent you understands your hopes and dreams and…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024ఎట్టకేలకు లోక్సభకు పార్టీ ప్రచారకర్త నుంచి పార్లమెంట్దాకా 52 ఏళ్ల ప్రియాంక స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగించారు. టీనేజర్గా ఉన్నపుడు తండ్రి ప్రధాని హోదాలో పార్లమెంట్లో ప్రసంగిస్తున్నపుడు పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు తల్లి సోనియా, సోదరుడు రాహుల్తో కలిసి పార్లమెంట్ మెట్లు ఎక్కబోతున్నారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో కాంగ్రెస్ హవా కొనసాగినా ప్రియాంక ఏనాడూ తేరగా పదవులు తీసుకోలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఓటర్ల మెప్పుపొందాకే రాజ్యాంగబద్ధ హోదాకు అర్హురాలినని ఆనాడే చెప్పారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాసరే ఏనాడూ పదవులు తీసుకోలేదు. నెహ్రూ–గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్లోకి అడుగుపెట్టిన 10వ సభ్యురాలుగా ప్రియాంక నిలిచారు. ఆమె కంటే ముందు వారి కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాం«దీ, ఫిరోజ్ గాం«దీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాం«దీ, సోనియా గాం«దీ, మేనకా గాం«దీ, రాహుల్ గాం«దీ, వరుణ్ గాంధీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో అధికారంలోలేని ప్రస్తుత తరుణంలో సోదరుడు రాహుల్తో కలసి పార్లమెంట్ వేదికగా ప్రజా గొంతుకను బలంగా వినిపించాల్సిన తరుణం వచ్చింది. -
వక్ఫ్ జేపీసీలో గొడవ.. టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
సాక్షి,ఢిల్లీ:వక్ఫ్ చట్ట సవరణపై ఏర్పాటైన జేపిసీ సమావేశంలో గొడవ జరిగింది. గొడవకు కారణమైన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ కళ్యాణ్బెనర్జీపై సస్పెన్షన్ వేటు వేశారు. వచ్చే సమావేశానికి రాకుండా చైర్మన్ జగదాంబికా పాల్ ఆయనను సస్పెండ్ చేశారు.మంగళవారం(అక్టోబర్ 22) జరిగిన జేపీసీ సమావేశంలో బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో టేబుల్పై గాజుగ్లాసును కళ్యాణ్బెనర్జీ పగులగొట్టారు.దీంతో ఆయన చేతి వేళ్లకు గాయాలయ్యాయి.ఆయనకు వైద్యులు నాలుగు కుట్లు వేశారు.కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన వక్ఫ్ చట్టాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఈ కమిటీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష, అధికార సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలతో పాటు గొడవలు జరగడం సర్వసాధారణంగా మారింది. ఇదీ చదవండి: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: ఉదయనిధి -
పవన్.. మీకిది తగునా?: తిరుపతి ఎంపీ గురుమూర్తి
సాక్షి,తిరుపతి : ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నల వర్షం కురిపించారు. సర్వశక్తిమంతుడిని రాజకీయాల్లోకి లాగినందుకు .. సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబును తప్పుబట్టింది. సున్నితమైన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు.. బహిరంగ సభ నిర్వహించడం న్యాయమని మీరు అనుకుంటున్నారా?భక్తులను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా?’అని గురు మూర్తి ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. -
రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్.కృష్ణయ్య రాజీనామా
సాక్షి,న్యూఢిల్లీ:రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు.కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో ఆయన స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ స్రెటేరియట్ మంగళవారం(సెప్టెంబర్24) నోటిఫై చేసింది. బీసీ సంఘం జాతీయ నేతగా ఉన్న ఆర్.కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాపై కృష్ణయ్య స్పందించలేదు. -
అస్థిరత ఏర్పడినప్పుడల్లా... హిందువులే టార్గెట్
అంటారియో: బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న హింసపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులతో సహా మతపరమైన మైనారిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ఆయన ఎత్తిచూపారు. కెనడా పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు. బంగ్లాలో అస్థిరత ఏర్పడినప్పుడల్లా ఈ సమూహాలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా అవుతున్నారని, ఎక్కువగా హింసకు గురవుతున్నారని వాపోయారు. 1971లో బంగ్లాకు స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచీ జనాభాలో మతపరమైన మైనారిటీల సంఖ్య భారీగా తగ్గిందని వెల్లడించారు. కెనేడియన్ హిందువులు బంగ్లాదేశ్లోని తమ బంధువులు, ఆస్తుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని ఆర్య తెలిపారు. దీనిపై అవగాహన కలి్పంచేందుకు సెపె్టంబర్ 23న కెనడా పార్లమెంట్ ముందు ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్తో సంబంధాలున్న కెనేడియన్ బౌద్ధులు, క్రిస్టియన్ల కుటుంబాలు కూడా ఇందులో పాల్గొంటాయని తెలిపారు. హిందువులపై దాడులు బంగ్లాదేశ్లో ఇటీవలి తిరుగుబాటు తర్వాత దేశవ్యాప్తంగా హింస చెలరేగడం తెలిసిందే. దేశవ్యాప్తంగా 27 జిల్లాల్లో హిందువులు దాడులను ఎదుర్కొంటున్నారు. హిందూ దేవాలయాలను భారీగా టార్గెట్ చేశారు. ప్రార్థనా మందిరాలతో సహా మతపరమైన మైనారిటీలను ప్రత్యేక లక్ష్యంగా చేసుకున్నట్టు బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ అంగీకరించింది. దీనికితోడు రాజీనామా చేసి దేశం వీడిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులను హతమార్చడం, వారి ఇళ్లకు నిప్పు పెట్టడం వంటివి పెద్దపెట్టున జరిగాయి. మైనారిటీలు, ఇతరులపై జరుగుతున్న హింసపై విచారణకు ఐరాస మానవ హక్కుల నిజ నిర్ధారణ బృందం తాజాగా ఢాకా చేరుకుంది. ఎవరీ ఆర్య? ఎంపీ చంద్ర ఆర్య కర్ణాటకకు చెందినవారు. రెండేళ్ల క్రితం కెనడా పార్లమెంటులో తన మాతృభాష కన్నడలో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. అంటారియోలోని నేపియాన్ ఎలక్టోరల్ జిల్లాకు కెనడా హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్నాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన ఆర్య కెనడా రాజకీయాల్లో పనిచేస్తూనే తన భారత మూలాలతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. -
మా గొంతు ఎవ్వరూ నొక్కలేరు
శ్రీనగర్: ‘జమ్మూకశ్మీర్ ప్రజలు శాంతిని ఆకాంక్షిస్తున్నారు. అదీ వారి అభీష్టం ప్రకారమే. కేంద్రం ఆంక్షలకు లోబడి మాత్రం కాదు’ అని ఆవామీ ఇత్తెహాద్ పార్టీ(ఏఐపీ) చీఫ్, లోక్సభ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ స్పష్టం చేశారు. ఉగ్ర నిధుల కేసులో తిహార్ జైల్లో ఉన్న ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే. గురువారం ఐదేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీనగర్ చేరుకున్న ఎంపీ రషీద్.. విమానాశ్రయంలో కాలు మోపిన వెంటనే మోకాళ్లపై వంగి నుదుటితో నేలను తాకి, బయటకు వచ్చారు. తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ‘మా కంటే వేరెవరికీ కశ్మీర్లో శాంతితో అవసరం లేదని ప్రధాని మోదీకి చెప్పదల్చుకున్నా. అయితే, మేం పెట్టే షరతులకు లోబడే శాంతి నెలకొనాలి తప్ప కేంద్రం విధించే ఆంక్షలకు లోబడి కాదు. మాక్కావాల్సింది గౌరవంతో కూడిన శాంతి ఒక్కటే. శ్మశాన నిశ్శబ్దంతో కూడిన శాంతి కాదు’ అని అన్నారు. ‘సత్యం మాతోనే ఉంది. నరేంద్ర మోదీ, అమిత్ షా.. ఎవరైనా కానీ మా గొంతు నొక్కలేరు. మేం యాచించడం లేదు. మనుషుల్లా చూడండని కోరుతున్నాం. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడుతూ మోదీ ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న తీసుకున్న నిర్ణయాన్ని మేం ఒప్పుకోం. ఇంజనీర్ రషీద్ను తిహార్ జైలుకు పంపినా, మరెక్కడికి పంపినా విజయం మాదే’ అని చెప్పారు.ఇండియా కూటమికి మద్దతిస్తాం..అయితేజమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి తాము మద్దతిస్తామని రషీద్ చెప్పారు. అయితే, ఇండియా కూటమికేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామని ముందుగా హామీ ఇవ్వాలన్నారు. అలాంటి హామీ ఇస్తే మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆ కూటమి అభ్యర్థులకే ఓటేస్తామని ప్రతిజ్ఞ చేస్తారన్నారు. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలన్న కల నెరవేరాలంటే ముందుగా కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలని సూచించారు.‘మేం భారత్ శత్రువులం కాదు, అదే సమయంలో పాకిస్తాన్కు మిత్రులమూ కాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఆర్టికల్ 370ని సాధించుకోవాలనే వారు ఇళ్లలో కూర్చుని ప్రకటనలిస్తే చాలదు. లాల్చౌక్లో నిరసనలు చేపట్టి, లాఠీచార్జీలను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలు ఆ పని చేయలేదు’ అని వ్యాఖ్యానించారు. -
బీజేడీ నుంచి ఎంపీ బహిష్కరణ.. కాసేపటికే బీజేపీలోకి
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న కారణంతో రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్ను మాజీసీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేపీ) పార్టీ నుంచి బహిష్కరించింది. ఎంపీ సుజీత్ కుమార్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, ఈ బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేపీ చీఫ్ నవీన్ పట్నాయక్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. తనను రాజ్యసభకు పంపిన పార్టీని, కలహండి జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను అతను నెరవేర్చడంలో విఫలమయ్యాడని ఉత్తర్వుల్లో పేర్కొంది.దీంతో సుజీత్కుమార్ వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుజీత్ కుమార్ రాజీనామా లేఖను భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కఢ్ ఆమోదించారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ ఒడిశా ఇన్ఛార్జ్ విజయపాల్ సింగ్ తోమర్, ఎంపీ భర్తృహరి మహతాబ్, పార్టీ సీనియర్ నేతల సమక్షంలో సుజీత్ కుమార్ కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుమార్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా, 2036 నాటికి ఒడిశాను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కృషి, ఆయన దృక్పథానికి ఆకర్షితుడై తాను కాషాయ పార్టీలో చేరానని చెప్పారు.‘నాకు దేశమే ప్రథమం. నేషన్ ఫస్ట్ అనేది నా ఫిలాసఫీ. నేను చాలా సంవత్సరాలు విదేశాల్లో నివసించాను . యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థల కోసం పనిచేశాను. దేశ అభివృద్ధి కోసం 2011లో భారతదేశానికి తిరిగి వచ్చాను.ఒడిశాలోని కలహండి జిల్లా అనేక అవినీతి కారణంగా అభివృద్ధి చెందలేదని నేను. ఇందులో జిల్లాకు చెందిన పలువురు బీజేడీ నాయకుల హస్తం ఉంది. ఈ విషయాన్ని బీజేడీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. అందుకే బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నాను.’ అని పేర్కొన్నారు. BJD expels party leader Sujeet Kumar for "anti-party activities."He resigned from Rajya Sabha and his resignation has been accepted by Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar. pic.twitter.com/asjLLxpnOw— ANI (@ANI) September 6, 2024 -
డీఎంకే ఎంపీకి 900 కోట్ల ఈడీ జరిమానా!
చెన్నై : డీఎంకే ఎంపీ జగత్రక్షకన్కు భారీ షాకిచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఆయనకు ఏకంగా రూ.908 కోట్ల జరిమానా విధించింది. ఇప్పటికే ఈ కేసులో కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇప్పుడు భారీ ఫైన్తో చర్యలు తీసుకుంది.ఫెమా నిబంధనలు ఉల్లంఘన కేసులో బుధవారం ఈడీ అధికారులు తమిళనాడులో వ్యాపారవేత్త, డీఎంకే ఎంపీ జగత్రక్షకన్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిపారు. ఫెమా చట్టం సెక్షన్ 37ఏ కింద రూ.89.19 కోట్ల విలువైన ఆస్తుల్ని సీజ్ చేయడంతో పాటు రూ.908 కోట్లు జరిమానా విధించినట్లు ఎక్స్ వేదికగా ఈడీ వెల్లడించింది. ED, Gurugram has provisionally attached assets worth Rs. 294.19 Crore in the form of Lands, Buildings, Flats and FDR under the provisions of the PMLA, 2002 in the case of M/s Sunstar Overseas Ltd. & Others.— ED (@dir_ed) August 28, 2024జగత్రక్షకన్ ఎవరు?జగత్రక్షకన్ తమిళనాడు డీఎంకే అరక్కోణం లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పాటు పలు రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్పై ఈడీ కేసు అయితే డిసెంబర్ 1,2021లో డీఎంకే ఎంపీ జగత్రక్షకన్, అతని కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలు ఫెమాలోని సెక్షన్ 16 కింద నిబంధనల ఉల్లంఘించినట్లు ఫిర్యాదు అందినట్లు ఈడీ తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా తాము విచారణ చేపట్టామని, విచారణలో జగత్రక్షకన్పై ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ భారీ మొత్తంలో ఫైన్ విధించినట్లు ఈడీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. -
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇపుడు రాజ్యసభ ఎంపీ!
రాజ్యసభ, ఎంపీ, రచయిత సుధానారాయణమూర్తి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ఒక్కోసారి తన వ్యక్తిగత విషయాలను జోడిస్తూ, మరికొన్ని అవగాహన కల్పించే అంశాలను తన అభిమానులతో కూడా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన చిన్నప్పటి ఫోటో ఒకటి ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.‘‘ఈ ఫోటో నాకు సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు హుబ్లీలోని ఒక స్టూడియోలో తీసింది. ఆ సమయంలో, మేము షిగ్గావ్లో ఉండేవాళ్లం, కానీ అక్కడ స్టూడియోలు లేనందున, మేము ఈ ఫోటో కోసం హుబ్లీకి వెళ్లాం’’ అంటూ సుధామూర్తి తన బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు.This picture was taken in a studio in Hubli when I was around 1 year old. At the time, we were living in Shiggaon, but since there were no studios there, we travelled to Hubli for this photograph. pic.twitter.com/YjhjJ3Aw5L— Smt. Sudha Murty (@SmtSudhaMurty) July 30, 2024 -
ఎంపీ మహువా మొయిత్రాపై మళ్లీ కేసు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై తాజాగా మరో క్రిమినల్ కేసు నమోదైంది. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చీఫ్ రేఖాశర్మపై దూషణపూర్వక వ్యాఖ్యలు చేసినందుకుగాను మహువా మొయిత్రాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్స్(ట్విటర్)లో తమపై చేసిన వ్యాఖ్యలకుగాను మహువా మీద మహిళా కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల హత్రాస్ తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని రేఖాశర్మ సందర్శించిన వీడియోపై మహువా మొయిత్రా ఎక్స్(ట్విటర్)లో వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆ వీడియోలో రేఖాశర్మకు ఆమె సహాయకుడు గొడుగు పట్టడంపై ఓ నెటిజన్ స్పందించారు. రేఖాశర్మ ఆమె గొడుగు ఆమె సొంతగా ఎందుకు పట్టుకోలేపోతున్నారని ఆ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి రేఖాశర్మ ఆమె బాస్ పైజామా ఊడిపోకుండా పట్టుకునే పనిలో బిజీగా ఉండటం వల్లే గొడుగు పట్టుకోలేకపోతుందని మహువా వివాదాస్పద కామెంట్స్ పోస్ట్ చేశారు. మహువా మొయిత్రా గత లోక్సభలో తన ఎంపీ పదవి నుంచి సస్పెన్షన్కు గురై ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
Amritpal Singh-Engineer Rashid: జైలు నుంచి గెలుపు.. ఎంపీలుగా ప్రమాణం
జైలు నుంచి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే నేత అమృత్పాల్ సింగ్ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.. తనతో పాటు జమ్ముకశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ కూడా ఇవాళ లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.అమృత్పాల్ సింగ్ ఫిబ్రవరి 23న అరెస్టైన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అస్సాంలోని ధిబ్రూగఢ్ జైలు నుంచి పెరోల్పై నేరుగా ఢిల్లీకి వెళ్లిన ఆయన 18వ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక రషీద్ ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీచేసి విజయం సాధించచారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. -
అమృత్పాల్ సింగ్కు పెరోల్.. జులై 5న ఎంపీగా ప్రమాణం
ఖలిస్థానీ ఉగ్రవాది, వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్పాల్ సింగ్ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని డిబ్రూగఢ్లో జైల్లో ఉన్న అమృత్పాల్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని ఖదూర్సా హిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారానికి బుధవారం స్పీకర్ను కలిసి అనుమతి కోరినట్లు ఫరీద్కోట ఎంపీ సరభ్జీత్ సింగ్ ఖల్సా వెల్లడించారు. లోక్సభలో కాకుండా.. స్పీకర్ ఛాంబర్లో జులై 5న ప్రమాణం చేసేందుకు ఓం బిర్లా అనుమతి ఇచ్చారని తెలిపారు. అతడికి ఐదవ తేదీ నుంచి నాలుగురోజులకు పేరోల్ లభించినట్లు చెప్పారు. ఇక అదే రోజు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో నిందితుడిగా ఉన్న బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ప్రమాణ స్వీకారం కూడా ఉండనుంది. -
ఎంపీగా ప్రమాణ స్వీకారానికి.. రషీద్ ఇంజినీర్కు ఎన్ఐఏ అనుమతి
న్యూఢిల్లీ: జైలులో ఉండి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర ఎంపీ షేక్ రషీద్ ఇంజినీర్కు లోక్సభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనుమతించింది. దీంతో ఈ నెల అయిదవ తేదీన రషీద్ లోక్సభ సభ్యుడిగా పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్ఐఏ ఆయనకు కొన్ని షరతులు విధించింది.నూతన ఎంపీ మీడియాతో మాట్లాడకూడదని పేర్కొంది. కాగా షరతులకు సంబంధించి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జూలై 2న తుదితీర్పు ఇవ్వనుంది. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని రషీద్ ఇంజినీర్ తరపు లాయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్ఐఏ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.షేక్ అబ్దుల్ రషీద్ ఎవరు?జమ్మూకాశ్మీర్కు చెందిన షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ రషీద్ ఇంజినీర్.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఇంజనీర్ రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చారనే ఆరోపణలతో యూఏపీఏ చట్టం కింద ఎన్ఐఏ 2019లో ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఆయన కుమారుడు అబ్రర్ రషీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అబ్దుల్ రషీద్ జమ్మూ కాశ్మీర్ అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2008 మరియు 2014లో గెలుపొందిన జమ్మూ కశ్మీర్లోని లాంగేట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 లోక్సభ ఎన్నికలలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. -
ఆ తమిళ ఎంపీకి తెలుగుపై ఎందుకంత ప్రేమ?
తమిళనాడుకు చెందిన ఒక ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ సమావేశాల రెండో రోజు లోక్సభలో ఇది చోటు చేసుకుంది. ఇంతకీ ఆయన తెలుగులో ఎందు ప్రమాణం చేశారు? ఆయనకు తెలుగుతో ఉన్న అనుబంధం ఏమిటి?పార్లమెంట్ సమావేశాల రెండవ రోజున కొత్తగా ఎంపీకైన ఎంపీలలోని పలువులు తమ ప్రాంతీయ భాషలలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందిన ఎంపీ కే గోపినాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఒక రాష్ట్రానికి చెందిన ఎంపీ మరొక రాష్ట్రపు మాతృ భాషలో ప్రమాణ స్వీకారం చేయడం ఏమిటా? అని అందరూ అతనిని ఆసక్తిగా గమనించారు. ఎంపీ గోపినాథ్ ఓ చేతితో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం చివరిలో జై తమిళనాడు అని తమిళంలో నినదిస్తూ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ గోపీనాథ్ తెలుగు కుటుంబానికి చెందిన వారు. కృష్ణగిరి జిల్లా హోసూరు ఆయన స్వస్థలం. గోపీనాథ్ విద్యాభ్యాసం తెలుగులో కొనసాగింది. 2001, 2006, 2011లలో హోసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. తమిళనాడులో ఏర్పడిన తెలుగు భాషా సమస్యలతో పాటు, అక్కడి తెలుగు వారి కోసం ఎంపీ గోపీనాథ్ పోరాడారు. తమిళనాడు అసెంబ్లీలోనూ ఆయన పలుమార్లు తెలుగులో ప్రసంగించారు. మాతృభాషపై ఎనలేని మమకారమున్న గోపీనాథ్ మరోమారు పార్లమెంటులోనూ తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు.కృష్ణగిరి జిల్లా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతుంది. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్కు అతి సమీపంలో ఉంది. దీంతో ఇక్కడి ప్రజలు తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషలను కూడా మాట్లాడుతారు. కాగా గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత కూడా అసెంబ్లీలో తెలుగులో ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వివిధ సందర్భాల్లో వైరల్ అవుతుంటుంది. .@INCTamilNadu MP K. Gopinath from the Krishnagiri constituency surprised everyone by taking his oath in #Telugu. pic.twitter.com/ooGgVDg4VH— South First (@TheSouthfirst) June 25, 2024 -
రాజ్యాంగం చేతబూని ఎంపీగా ప్రమాణం
న్యూఢిల్లీ: 18వ లోక్సభ ప్రత్యేక సమావేశాల్లో రెండో రోజు మంగళవారం పలు పార్టీల సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాం«దీ, సమాజ్వాదీ పార్టీ సభ్యులు అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, బీజేపీ సభ్యుడు ఓం బిర్లా, బీజేపీ సభ్యురాలు హేమామాలిని, డీఎంకే నేత కనిమొళి, కేంద్ర మంత్రులు నారాయణ్ రాణే, ఎన్సీపీ(ఎస్పీ) నేత సుప్రియా సూలే, శివసేన(ఉద్ధవ్) సభ్యుడు అరవింద్ సావంత్ తదితరులు లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.రాహుల్ గాం«దీ, అఖిలేశ్ యాదవ్ సహా పలువు ప్రతిపక్ష సభ్యులు రాజ్యాంగ ప్రతిని చేతబూని ప్రమాణం చేయడం విశేషం. ప్రమాణ స్వీకారం అనంతరం రాహుల్ గాంధీ ‘జైహింద్, జై సంవిధాన్’ అంటూ నినదించారు. స్వతంత్ర సభ్యుడు రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ‘నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి’ అని రాసి ఉన్న టి–షర్టును ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ సమాజ్ పార్టీ(కాన్షీరామ్) ఎంపీ చంద్రశేఖర్ ప్రమాణం చేసిన తర్వాత ‘జైభీమ్, జైభారత్, జై సంవిధాన్, జైమండల్, జైజోహార్, జైజవాన్, జైకిసాన్’ అని నినాదాలు చేశారు. -
చేతిలో రాజ్యాంగం.. ఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణం
కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం .. తొలి 18వ లోక్సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.. సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆయనతో ప్రమాణం చేయించారు. చిన్న రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఇంగ్లీష్లో ఆయన ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. చివరలో జైహింద్, జై సంవిధాన్ అని నినదించారు. ప్రమాణం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు భారత్ జోడో అంటూ నినాదాలు చేశారు.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుని రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ ఉత్తర ప్రదేశ్లోని రాయ్బరేలి, కేరళలోని వయనాడ్.. రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీచేసి విజయం సాధించారు. అనంతరం ఆయన వయనాడ్ను వదులుకొని రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.కేరళలోని వయనాడ్ స్థానానికి ఆయన చేసిన రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక వయనాడ్ నుంచి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ బరిలో నిలవనున్నారు.ఈరోజుతో ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తి కానుంది. బుధవారం స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేశ్ పోటీ పడుతున్నారు. -
ఆ ఎంపీ మాతృభాషలో ప్రమాణం ఎందుకు చేయలేకపోయారు?
18వ లోక్సభలో భాషా సాంస్కృతిక వైవిధ్యం కనిపించింది. పలువురు ఎంపీలు తమ మాతృభాషలో ప్రమాణం చేశారు. అయితే తన భాష అయిన భోజ్పురిలో ప్రమాణం చేయలేకపోయినందుకు బీహార్లోని సారణ్కు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ విచారం వ్యక్తం చేశారు.లోక్సభలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ ఒరియాలతో సహా పలు భారతీయ భాషల్లో ప్రమాణం చేశారు. ఎంపీలు ఇంగ్లీషులో లేదా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో దేనిలోనైనా ప్రమాణం చేయవచ్చు. అయితే భోజ్పురి భాషకు ఎనిమిదవ షెడ్యూల్ జాబితాలో స్థానం దక్కలేదు. రాజీవ్ ప్రతాప్ రూడీ భోజ్పురిలో ప్రమాణం చేయకపోవడానికి కారణం ఇదే. ఎంపీలు మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని రూడీ అన్నారు.ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీహార్లోని తూర్పు చంపారన్కు చెందిన బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ అధ్యక్షత వహించారు. కాగా రాజీవ్ ప్రతాప్ సింగ్ రూడీ హిందీలో ప్రమాణం చేశారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్యపై రాజీవ్ ప్రతాప్ రూడీ విజయం సాధించారు. -
బీజేపీ రాముడు నన్ను ఆశీర్వదించాడు: సమాజ్వాదీ ఎంపీ
యూపీలోని అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ తాజాగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. సమాజ్ వాదీ పార్టీ నేత అయిన ఎంపీ అవధేష్ ప్రసాద్ తాను రాముని దయతో ఎంపీగా ఎన్నికయ్యానని అన్నారు. రాముణ్ణి తీసుకొచ్చింది తామేనని బీజేపీ చెబుతున్నప్పటికీ, రాముని ఆశీస్సులు తనకే అందాయని అవధేష్ అన్నారు.అయోధ్య ఎవరి వారసత్వం కాదని, ఇది శ్రీరాముని జన్మ భూమి అని, తామే నిజమైన రామభక్తులమని అవధేష్ పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు.. అహంకారులను ఓడించారని అన్నారు. నీట్ పరీక్షల గురించి మాట్లాడిన ఆయన బీజేపీ ప్రభుత్వం లీక్లు లేకుండా ఏ పరీక్షనూ నిర్వహించలేకపోతున్నదన్నారు.అయోధ్య ఎంపీగా ఎన్నికైన తర్వాత అవధేష్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 5,54,289 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్కు 4,99,722 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి సచ్చిదానంద్ పాండే 46,407 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. -
ప్రతి ఇంటికి మంచి చేశాం.. వైఎస్సార్సీపీ ఎంపీలతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వసుంధరా రాజేను మెచ్చుకున్న కాంగ్రెస్ ఎంపీ
ఒక పార్టీకి చెందిన నేత మరో పార్టీ నేతను మెచ్చుకుంటే అది ఆసక్తికరంగా మారుతుంది. దీనివెనుక ఏదో పెద్ద కారణమే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. సరిగ్గా ఇటువంటిదే రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.రాజస్థాన్లోని చురు నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన రాహుల్ కశ్వాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ మహిళా నేత వసుంధరా రాజేకు వీరాభిమానినని పేర్కొన్నారు. ఆమెను తాను నూటికి నూరు శాతం అభిమానిస్తానని అన్నారు. బీజేపీని వీడిన తర్వాత కూడా తనకు వసుంధర రాజేపై పూర్తి గౌరవం ఉందని అన్నారు. రాజస్థాన్లో వసుంధరకు అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, ఆమె అద్భుతమైన నాయకురాలని పేర్కొన్నారు.తామంతా వసుంధర నాయకత్వంలో ముందుకు సాగామని, ఆమె రాష్ట్రానికి పలువురు సమర్థవంతమైన నేతలను అందించారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు తాము వేర్వేరు పార్టీలలో ఉన్నామని, ప్రతిపక్ష ఎంపీగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని రాహుల్ తెలిపారు. ఇదిలావుండగా రాహుల్ బీజేపీ నేత రాజేంద్ర రాథోడ్ తీరుపై విరుచుకుపడ్డారు. ఆయన పలువురి రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారారని ఆరోపించారు.తనకు లోక్సభ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి టిక్కెట్ రాకపోవడానికి రాజేంద్రే కారణమని ఆరోపించారు. రాథోడ్ మొండి వైఖరికి వ్యతిరేకంగా తాను గళం విప్పానన్నారు. కాగా లోక్సభ ఎన్నికల్లో రాహుల్ కశ్వాన్కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆగ్రహించిన ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. తదనంతరం చురు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. -
‘‘వయనాడ్, రాయ్బరేలీలో ఏది వదులుకోవాలి’’
తిరువనంతపురం: వయనాడ్, రాయ్బరేలీలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలో తెలియడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ అన్నారు. బుధవారం(జూన్12) కేరళలోని మల్లప్పురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్గాంధీ మాట్లాడారు. ‘నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏమైనా కానీ.. వయనాడ్, రాయ్బరేలీల్లో ఒక నియోజకవర్గానికే నేను ఎంపీగా ఉండాలి. నా నిర్ణయంతో రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’అని రాహుల్ వ్యాఖ్యానించారు. రెండింటిలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలనే అంశంపై రాహుల్ పార్టీ పెద్దలకు ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం. ఎంపీగా రెండు చోట్ల విజయం సాధించిన అనంతరం తొలిసారి బుధవారం కేరళలో రాహుల్ పర్యటించారు. -
ఆ సీట్లలో గెలిస్తే కేంద్రమంత్రులే!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుల్లో కొన్నేళ్లుగా బలపడిన సెంటిమెంట్ ఈసారి లోక్సభ ఎన్నికల్లోనూ నిజమైంది. గత ముప్పై ఏళ్లుగా ఉమ్మడి ఏపీలో, ఇప్పుడు తెలంగాణలోనూ ఈ సెంటిమెంట్ బలపడుతూ వస్తోంది. ఉమ్మడి ఏపీలోని సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ, సీహెచ్.విద్యాసాగరరావు, నరసాపురం నుంచి గెలిచిన రెబెల్స్టార్ యూవీ కృష్ణంరాజు గతంలో వాజ్పేయి కేబినెట్లో సహాయమంత్రులుగా పనిచేశారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ నుంచి గెలిచిన దత్తాత్రేయ కేంద్ర సహాయమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత గవర్నర్గా నియమితులయ్యారు.2019 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచిన జి.కిషన్రెడ్డి తొలుత మోదీ కేబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవిని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రిగా కేబినెట్ హోదా పొందారు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచే గెలిచి తిరిగి మోదీ కేబినెట్లో ఈ దఫా బొగ్గు, గనులశాఖ మంత్రి అయ్యారు. ఇక గతంలో కరీంనగర్ నుంచి గెలిచిన విద్యాసాగరరావు వాజ్పేయి కేబినెట్లో కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇప్పుడు కరీంనగర్ నుంచి రెండోసారి గెలుపొందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం తాజాగా మోదీ మంత్రివర్గంలో అదే పదవిని పొందారు. ఉమ్మడి ఏపీలోని నరసాపురం నుంచి గెలిచిన సినీ హీరో కృష్ణంరాజుకు కేంద్ర సహాయమంత్రి పదవి దక్కగా, 2024 ఎన్నికల్లో బీజేపీ టికెట్పై గెలిచిన శ్రీనివాసవర్మకు మోదీ కేబినెట్లో గ్రామీణ సహాయమంత్రి శాఖ లభించింది.ఎప్పుడూ అవే స్థానాలకు పదవులా? గతంలో మాదిరిగానే సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలకే మళ్లీ పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈసారైనా తెలంగాణలోని వెనకబడిన జిల్లాలైన మహబూబ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాలకు మోదీ కేబినెట్లో చాన్స్ లభిస్తుందేమోననే ఆశాభావం వ్యక్తమైంది. కానీ మళ్లీ సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలకే చోటు లభించడంతో కొందరు నిరుత్సాహపడటం కొసమెరుపు. -
‘నాన్నే నా ప్రాణం’.. చిరాగ్ భావోద్వేగ పోస్ట్
బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ మూడోసారి ఎంపీగా ఎన్నికై, తొలిసారి మోదీ కేబినెట్లో మంత్రి అయ్యారు. మోదీ 3.0 క్యాబినెట్లో చిరాగ్ పాశ్వాన్కు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖను కేటాయించారు. చిరాగ్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఒకప్పుడు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖలను చేపట్టారు. తాజాగా చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ను గుర్తుచేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగంతో కూడిన పోస్ట్ను షేర్ చేశారు.ఈ పోస్టుకు తన తండ్రికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలను జతచేశారు. నాడు రాష్ట్రపతి భవన్లో రామ్ విలాస్ పాశ్వాన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫొటోను చిరాగ్ పోస్ట్ చేశారు. అలాగే తాను తన తండ్రితో ఉన్నప్పటి ఫొటోలను కూడా షేర్ చేశారు. వీడియోలో రామ్ విలాస్ పాశ్వాన్ రికార్డ్ చేసిన వాయిస్ ప్లే అవుతుంది. అలాగే ఇదే వీడియోలో చిరాగ్ మాట్లాడుతూ ఈ దీపం(చిరాగ్) దేశానికి, ప్రపంచానికి వెలుగు నిచ్చేదిగా మారినందుకు సంతోషిస్తున్నాను’ అని పేర్కొన్నారు.చిరాగ్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు మూడు కోట్ల మంది వీక్షించగా, 11 లక్షల మంది లైక్ చేశారు. అదే సమయంలో చిరాగ్ను ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో బీహార్ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కొందరు పేర్కొన్నారు. -
కెనడా ఎంపీ.. కన్నడలో ప్రమాణం
ఒట్టావా: ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిలో చాలా మంది తమ మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్లో ప్రమాణస్వీకారం చేసే రోజులివి. మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలుగా ఎన్నికైన వాళ్లు మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేయడం, ప్రసంగించడం తరచుగా చూస్తుంటాం. కానీ కెనడాలో ఎంపీగా ఎన్నికైన ప్రవాస కన్నడిగుడు చంద్రఆర్య అక్కడి పార్లమెంటులో కన్నడ భాషలో ప్రమాణస్వీకారం చేసి మాతృభాషపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. చంద్రఆర్య కన్నడలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సహచర ఎంపీలు ఆయనను సీట్లలో నుంచి లేచి అభినందించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఎంత ఎదిగినా ఎక్కడికి వెళ్లినా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మరచిపోవద్దని నెటిజన్లు చంద్ర ఆర్య వీడియోనుద్దేశించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. pic.twitter.com/lYW3RDH4vO— Harish Itagi (@HarishSItagi) June 9, 2024 -
ఈసారి లోక్సభలో ముస్లిం ఎంపీలు ఎందరు?
దేశంలోని అన్ని రంగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం కనిపిస్తుంది. రాజకీయాల్లోనూ దీనికి మినహాయింపేమీ లేదు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీచేసిన ముస్లిం అభ్యర్థులలో ఎందరు విజయం సాధించారు? వీరిలో ఏ పార్టీకి లేదా కూటమికి చెందినవారు ఎందరున్నారు?2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 24 మంది ముస్లిం అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య ఈ ఏడాది రెండుకు తగ్గింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, వీరిలో ఒక్క ఎంపీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి చెందినవారు లేరు. ఈ 24 మంది లోక్సభ ఎంపీలలో 21 మంది ఇండియా అలయన్స్కు చెందిన వారే కావడం విశేషం.ఈ జాబితాలో తొమ్మిది మంది ముస్లిం ఎంపీలతో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ముస్లిం ఎంపీలు ఉన్నారు. నలుగురు ముస్లిం ఎంపీలు సమాజ్వాదీ పార్టీకి, ఇద్దరు ఇండియన్ ముస్లిం లీగ్కు, ఒకరు నేషనల్ కాన్ఫరెన్స్కు చెందినవారున్నారు. అలాగే అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎంకు చెందిన ముస్లిం ఎంపీ. ఇద్దరు ముస్లిం ఎంపీలు స్వతంత్రులుగా ఎన్నికయ్యారు.ఈసారి లోక్సభలో ముస్లింల వాటా కేవలం 4.42 శాతానికి తగ్గింది. 1980 లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా 49 మంది ముస్లిం ఎంపీలు విజయం సాధించారు. 1984 లోక్సభ ఎన్నికల్లో 45 మంది ముస్లిం ఎంపీలుగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లిం ఎంపీల సంఖ్య 40కి మించలేదు. 2014లో 11 ప్రధాన పార్టీలు మొత్తం 82 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టాయి. వీరిలో 16 మంది అభ్యర్థులు విజయం సాధించారు. 2019లో ఈ పార్టీలు 115 మంది అభ్యర్థులను నిలబెట్టగా, అప్పుడు 16 మంది అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. -
బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కీలక విషయాలు
-
వలపు వల విసిరి.. చర్మం వలిచి.. ముక్కలుగా నరికి
కోల్కతా: బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనపై వలపు వల(హనీ ట్రాప్) విసిరి కోల్కతాకు రప్పించి, దారుణంగా హత్య చేసి, చర్మం వలిచి ముక్కలు ముక్కలుగా నరికినట్లు తేలింది. వలపు వల విసిరిన యువతిని బంగ్లాదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను శిలాంతి రెహమాన్గా గుర్తించారు. బంగ్లాదేశ్ జాతీయురాలైన శిలాంతి ప్రధాన నిందితుడు, అమెరికా పౌరుడైన అఖ్తరుజమాన్ షహీన్కు ప్రియురాలు అని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. కోల్కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో అక్తరుజమాన్ అద్దె ఇంట్లో ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శిలాంతి రెహమాన్ కోల్తాలోనే ఉన్నట్లు వెల్లడయ్యింది. మరో నిందితుడు అమానుల్లా అమన్తో కలిసి ఈ నెల 15న బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లిపోయింది. తన మిత్రుడు అన్వరుల్ అజీమ్ అనర్ను బంగ్లాదేశ్ నుంచి కోల్కతాకు రప్పించడానికి ప్రధాన నిందితుడు అఖ్తరుజమాన్ తన ప్రియురాలు శిలాంతిని ప్రయోగించినట్లు పోలీసులు తేల్చారు. అన్వరుల్ అజీమ్ అనర్, అఖ్తరుజమాన్ మధ్య ఆర్థికరమైన వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. అక్రమంగా దేశంలోకి చొరబడి హత్యాకాండ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ను చంపడానికి నిందితులు పక్కా పథకం వేశారు. జంతువులను వధించడంలో అనుభవం ఉన్న మాంసం వ్యాపారి జిహాద్ హవల్దార్ను బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు రప్పించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డాడు. కొంతకాలం ముంబైలో తలదాచుకున్నాడు. పథకం ప్రకారం హత్యకు రెండు నెలల ముందు కోల్కతాకు చేరుకున్నాడు. అఖ్తరుజమాన్ అద్దె ఇంట్లో అన్వరుల్ అజీమ్ను ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడు. -
Md Anwarul Azim Anwar: బెంగాల్లో బంగ్లా ఎంపీ హత్య
కోల్కతా/ఢాకా: చికిత్స కోసం భారత్కు వచ్చిన బంగ్లాదేశ్కు చెందిన ఆవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ దారుణ హత్యకు గురయ్యారు. కోల్కతాలోని న్యూటౌన్ లగ్జరీ అపార్ట్మెంట్లో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. నిందితులు, హత్యకు గల కారణాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బంగ్లా సీనియర్ నేత హత్యోదంతాన్ని ఇరుదేశాల ప్రభు త్వాలు సీరియస్గా తీసుకు న్నాయి. పశ్చిమబెంగాల్ సీఐడీ విభాగం ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ముగ్గు్గరు నిందితులను ఢాకాలోని వరీ ప్రాంతంలో అరెస్ట్చేశారు. కోల్కతాకొచ్చి కనిపించకుండాపోయి..మే 12వ తేదీన ఎంపీ అన్వర్ నార్త్ కోల్కతాలోని బారానగర్లో తనకు పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్ ఇంటికి వచ్చారు. మే 13వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి అన్వర్ బయటకు వెళ్లారు. రాత్రి భోజనానికి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో గోపాల్కు అనుమానమొచ్చింది. అయితే అత్యవసర పని మీద ఢిల్లీకి వెళ్తున్నానని, వీఐపీలను కలబోతున్నానని వాట్సాప్ సందేశాలు వచ్చాయి. తర్వాత మే 17వ తేదీదాకా ఆయన నుంచి ఎలాంటి మెసేజ్లు, ఫోన్కాల్స్ రాకపోవడంతో మే 18వ తేదీన మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్ ఫోన్ జాడను కనిపెట్టే పనిలో పడ్డారు. మే 13న అన్వర్ చివరిసారిగా సంజీబ్ ఘోష్కు చెందిన అపార్ట్మెంట్లో లోపలికి ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళతో వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. మే 15, 17 తేదీల్లో ఆ గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు, మహిళ ఆ అపార్ట్మెంట్ నుంచి బయటికొచ్చారుగానీ అన్వర్ రాలేదు. అన్వర్ మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఎక్కడో పడేసి ఉంటారని సీఐడీ ఐజీ అఖిలేశ్ అనుమానం వ్యక్తంచేశారు. -
ఆ అవార్డు వస్తే సంతోషిస్తా: నటి కంగనా
దేశంలో ప్రస్తుతం 2024 లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా, కొన్ని స్థానాలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ రంగంలోకి దిగారు.తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నటిగా తనకు అనేక జాతీయ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు వచ్చినా, రాబోయే కాలంలో మండీ ప్రాంత అభివృద్ధే తనకు ముఖ్యమని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను కృషి చేస్తానని, అప్పుడు తనకు ‘ఎంపీ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వస్తే చాలా సంతోషిస్తానని తెలిపారు. భవిష్యత్తులో తనకు ఏదైనా మంత్రిత్వ శాఖ లేదా ఏదైనా పెద్ద పదవి అప్పగిస్తే బాధ్యతగా నెరవేరుస్తానని అన్నారు. తాను ముందుగా మండి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.కంగనా తన సినిమా ప్రాజెక్ట్ల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని, తన కొత్త సినిమా ‘ఎమర్జెన్సీ’ త్వరలోనే విడుదల కాబోతున్నదని కంగనా తెలిపారు. ఎన్నికల ప్రచారం కారణంగా తాను హీరో ఆర్ మాధవన్తో చేస్తున్న సినిమాకు గ్యాప్ ఇచ్చానని తెలిపారు. దానిని తిరిగి ప్రారంభించాల్సి ఉందని, అలాగే మరో మూడునాలుగు సినిమాలకు సైన్ చేశానని తెలిపారు.యాపిల్ పండించే రైతుల గురించి కంగనా మాట్లాడుతూ, వారికి కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యాపిల్ ధరల పెంపు తదితర విషయాలపై అధికార యంత్రాంగంతో చర్చించాల్సి ఉందన్నారు. బీజేపీ అభ్యర్థిగా సొంత వాగ్దానాలు చేయకూడదని పార్టీ ఆదేశించిందన్నారు. -
బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో పలు ఆసక్తికర వైనాలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి ఉదంతం గుజరాత్లో చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని గుజరాత్కు చెందిన బీజేపీ ఎంపీ ఆరోపించిన నేపధ్యంలో ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.వీరిద్దరూ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భరూచ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నర్మదా జిల్లాలోని దేడియాపాడలో బీజేపీకి చెందిన భరూచ్ ఎంపీ మన్సుఖ్ వాసవా, ఆప్ ఎమ్మెల్యే చైత్ర వాసవా మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.జనం మధ్యలో ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరగడాన్ని వీడియోలో చూడవచ్చు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం ఇద్దరు నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేష్ యాదవ్ తెలిపారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. బీజేపీ ఎంపీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఆప్ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించిన దరిమిలా ఈ వివాదం చోటుచేసుకుంది. મારી ગેર હાજરી ના 6 માસમાં થયેલ કામગીરી મનરેગા માં 22 cr, વિકાસશીલ તાલુકા જોગવાઈ 4 cr, આદિ આદર્શગામ 68 cr,નલ સે જલ યોજનામાં 40 cr, SBM 2 cr,F. R.A માં 3.90 cr ના આયોજન બાબતે ડેડીયાપાડા TDO સાથે ચર્ચા કરતાની સાથે જ મનસુખ વસાવા અને ભાજપ ના હોદ્દેદારો ને 420 વોલ્ટનો કરંટ લાગતા 1/2 pic.twitter.com/FRPFFmbRWN— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) May 18, 2024 -
విదేశాల నుంచి ఆప్ ఎంపీ .. సీఎం కేజ్రీవాల్తో భేటీ
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. ఆయన గత కొన్ని నెలలుగా బ్రిటన్లో ఉన్నారు. అక్కడ ఆయనకు కంటి శస్త్రచికిత్స జరిగింది. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో రాఘవ్ చద్దా ఇక్కడ లేరు. రాఘవ్ చద్దా గైర్హాజరుపై ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నాయి.ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతల్లో రాఘవ్ చద్దా ఒకరు. ఆయన బహిరంగ వేదికలపై పార్టీకి మద్దతుగా మాట్లాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు బ్రిటన్ వెళ్లారు. ఆ దరిమిలా ఆమ్ ఆద్మీ పార్టీ పలు సమస్యలను ఎదుర్కొంది. మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనిపై పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.ఆమ్ ఆద్మీ పార్టీలో గందరగోళం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రాఘవ్ చద్దా విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఇటీవల రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం పీఏ విభవ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను తనను కొట్టారని, సీఎం సభలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.కాగా స్వాతి ఇదంతా బీజేపీ డైరెక్షన్లో చేస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. స్వాతి మలివాల్ సీఎం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని, వారిని బెదిరించారని ఆప్ నేత అతిషి ఆరోపించారు. -
‘భారత్ చంద్రుడిపై అడుగు పెడితే.. మనం మాత్రం’
ఇస్లామాబాద్: భారత దేశం చంద్రుడి మీద అడుతుపెడుతుంటే.. కరాచీలో తెరిచి ఉన్న ముగురు కాలువలో పడి చిన్నారులు మృతి చెందిన వార్తలను పాక్ చూస్తోందని ఆ దేశ ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన నేషనల్ అసెంబ్లీ సమావేశంలో ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్థాన్ (MQM-P) ఎంపీ సయ్యద్ ముస్తఫా ప్రసంగించారు.‘‘కరాచీ పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక పక్క ప్రపం దేశాలు చంద్రుడిపైకి వెళ్తుంటే.. కరాచీ మాత్రం తెరిచిన ఉన్న మురుగు కాలువల్లో చిన్నారులు పడిపోయి మృతి చెందిన వార్తలతో నిలుస్తోంది. భారత్ చంద్రుడి అడుగుపెట్టిందన్న రెండు సెకండ్లకు కరాచీలో ఇటువంటి ఘటనకు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక.. కరాచీ స్వచ్ఛమైన నీరు దొరకటం లేదు.سید مصطفیٰ کمال نے ببانگ دہل کراچی کا مقدمہ پارلیمنٹ میں کھلے الفاظ میں پیش کیا۔ سنئے#Pakistan #Sindh #Karachi #MQMP #PTI #PPP #President #AsifAliZardari #Bilawal #MustafaKamal #Nation #NationalAssembly #Parliament pic.twitter.com/7B8wKPIYP7— Syed Mustafa Kamal (@KamalMQM) May 15, 2024మరోవైపు.. మొత్తం 2.6 కోట్ల మంది చిన్నారుల్లో 70 లక్షల మంది పిల్లలు అసలు పాఠశాలకు వెళ్లటం లేదు. కరాచీ పాకిస్తాన్కి ఆదాయం ఇచ్చే ఇంజన్ లాంటి నగరం. ఇక్కడ రెండు సముద్రపు పోర్టులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు మొత్తం పాకిస్తాన్కి కరాచీ గేట్వే వంటిది. అటువంటి కరాచీ నగరంలోనే స్వచ్ఛమైన నీరు లభించటం లేదు. నీటి కోసం ట్యాంకర్ మాఫియా నడుస్తోంది’’ అని సయ్యద్ విమర్శలు చేశారు. సయ్యద్ చేసిన వ్యాఖ్యలు ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఇక..పాకిస్థాన్ను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్.. విస్తరించిన రుణ సౌకర్యంలో భాగంగా ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్(ఐఎంఎఫ్) వద్ద రుణం కోరుతోంది. -
తమిళనాడు ఎంపీ మృతి
చెన్నై: తమిళనాడు ఎంపీ ఎం.సెల్వరాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.నాగపట్నం ప్రస్తుత ఎంపీగా ఉన్న 67 ఏళ్ల ఎం. సెల్వరాజ్కి గతంలో కిడ్నీ మార్పిడి జరిగింది. రైతు, సామాజిక కార్యకర్త అయిన సెల్వరాజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో అత్యంత సీనియర్ నేత. నాలుగు సార్లు ఎంపీగా పనిచేశారు. 1989, 1996, 1998, 2019లో ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు.ఎంపీ ఎం.సెల్వరాజ్ మృతికి సీపీఐ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఆయనను ఆదర్శప్రాయమైన నేతగా అభివర్ణించింది. తిరువారూర్ జిల్లాలోని సీతమల్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ తెలిపింది. కాగా ఈసారి నాగపట్నం నియోజకవర్గం నుంచి వి.సెల్వరాజ్ను సీపీఐ బరిలోకి దింపింది. -
Delhi court: బ్రిజ్ భూషణ్పై అభియోగాలు నమోదు చేయండి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలను నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. తమను వేధించారంటూ ఐదుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా తగు ఆధారాలున్నట్లు కోర్టు తెలిపింది. కేసులు నమోదు చేయాల్సిందిగా అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్(ఏసీఎంఎం) ప్రియాంకా రాజ్పుత్ ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో సహ నిందితుడు, డబ్ల్యూఎఫ్ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్పైనా అభియోగాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్పై ఆరో మహిళా మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలకు తగు ఆధారాలు లేనందున ఆమె పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. కోర్టు ఈనెల 21న అధికారికంగా అభియోగాలను నమోదు చేయనుంది. -
నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
లక్నో: దేశంలో సాధారణ ఎన్నికల వేళ చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల పర్వంలో పలువురు నేతలు ప్రజలకు వినోదం పంచుతుంటారు. ఇలాంటి కోవకే చెందిన ఒక నేత నామినేషన్ దాఖలుకు గడువు మించిపోతున్నా ప్రచార కార్యక్రమంలో పాల్గొని చివరి నిమిషంలో పరుగందుకున్నారు.దాదాపు 100 మీటర్ల దూరం పరుగులు పెట్టి చివరకు గడువు లోపల నామినేషన్ ఫైల్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ డేరియా నియోజకవర్గంలో గురువారం జరిగింది. ఇక్కడి బీజేపీ అభ్యర్థి త్రిపాఠి తన నామినేషన్కు ముందు జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య హాజరయ్యారు. దీంతో ఆ ప్రోగ్రామ్ బిజీలో ఉండిపోయి తన నామినేషన్నే రిస్కులో పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే చివరి 15 నిమిషాల్లో ఎలాగోలా పరుగెత్తి నామినేషన్ ఫైల్ చేయగలిగారు. 54 ఏళ్ల త్రిపాఠి తన కాలేజీ రోజుల్లో మంచి రన్నర్గా పేరుతెచ్చుకున్నారు. అది ప్రస్తుత ఎన్నికల్లో ఇలా ఆయనకు కలిసి రావడం విశేషం. ‘ఐఐటీలో చదివే రోజుల్లో నేను మంచి రన్నర్ను అది ఇప్పుడు నాకు గడువులోపల నామినేషన్ వేసేందుకు కలిసి వచ్చింది’అని త్రిపాఠి చెప్పారు. -
పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు!
దేశంలో లోక్సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్నాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్లు 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ తొమ్మిది స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈసారి అన్ని రాజకీయ పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీకి దిగడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పంజాబ్లోని హోషియార్పూర్ స్థానంలో పోటీపై ఎక్కడాలేని ఆసక్తి నెలకొంది. ఇక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాయి.హోషియార్పూర్ సిట్టింగ్ ఎంపీ సోమ్ప్రకాష్ భార్య అనితా ప్రకాష్ను భారతీయ జనతా పార్టీ ఎన్నికల పోరులో నిలిపింది. కాంగ్రెస్ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన డాక్టర్ రాజ్కుమార్ చబ్బేవాల్ను ఆ పార్టీ రంగంలోకి దింపింది. శిరోమణి అకాలీదళ్ మాజీ మంత్రి సోహన్ సింగ్ తాండల్ను, కాంగ్రెస్ పార్టీ యామినీ గోమర్ను తమ అభ్యర్థులుగా నిలబెట్టాయి.ఈ లోక్సభ నియోజకవర్గంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత ఏడు ఎన్నికల్లో హోషియార్పూర్ ఓటర్లు ప్రతీసారి ఎంపీని మారుస్తూనే ఉన్నారు. ఒక్క కమల్ చౌదరి మాత్రమే నాలుగుసార్లు ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులు కూడా కొత్తవారే కావడం విశేషం.గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ చబ్బెవాల్ ఈసారి ఆప్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. 2014లో ఇదే స్థానంలో ఆప్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన యామినీ గోమర్ను ఈసారి కాంగ్రెస్ తన అభ్యర్థిగా నిలబెట్టింది. గత లోక్సభ ఎన్నికల్లో హోషియార్పూర్ స్థానంలో బీజేపీకి చెందిన సోమ్ప్రకాష్ 48,530 ఓట్ల తేడాతో డాక్టర్ చబ్బెవాల్పై విజయం సాధించారు. సోమ్ప్రకాష్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం అతని భార్య అనితా సోమ్ప్రకాష్ బీజేపీ నుండి ఎన్నికల బరిలోకి దిగారు. హోషియార్పూర్లో అభ్యర్థులు పార్టీలను మార్చేస్తున్నట్లుగానే.. ఓటర్లు కూడా ప్రతీ ఎన్నికల్లోనూ ఎంపీలను మార్చేస్తుండటం విశేషం. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్
బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలోనే పార్టీ ఈ చర్యలు తీసుకుంది. ఇటీవల ఆయనపై లైంగిక ఆరోపణలు రాగా, కన్నడనాట రాజకీయంగా పెను దుమారం రేగింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. మంగళవారం జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో జేడీఎస్.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజ్వల్ సస్పెన్షన్ ముందు ఆయన బాబాయ్, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి డీకే శివకుమర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. అసభ్యకరమైన వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా? అందులో ఉన్నది అతడేననే ఆధారం ఏంటి?. అయినా సరే తాము నైతికత ఆధారంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక.. ప్రజ్వల్కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది.లోక్సభ ఎన్నికల వేళ రాజకీయంగా ఈ వ్యవహారం దుమారం రేగటంతో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కోర్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని సోమవారం జేడీఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
17 ఎంపీ సీట్లకు 893 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అ సెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో నామినేషన్ల దాఖలుకు గడువు గురువారంతో ముగిసింది. ఈ నెల నుంచి 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, చివరి రోజు గురువారం నాటికి 17 లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 24 మంది అభ్యర్థులు మొత్తం 50 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. శుక్రవా రం నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 29తో ముగియనుంది. మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణతో సహా దేశంలోని 543 లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్లను జూన్ 4న లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో.. అత్యధికంగా మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో 114 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్, హైదరాబాద్లలో చెరో 57 మంది, నల్లగొండలో 56 మంది, మెదక్లో 54 మంది, కరీంనగర్లో 53 మంది, వరంగల్లో 58 మంది, ఖమ్మంలో 45 మంది, మహబూబ్ నగర్లో 42 మంది, నిజామాబాద్లో 42 మంది జహీరాబాద్లో 40 మంది నాగర్ కర్నూల్లో 34 మంది, మహబూబాబాద్లో 30 మంది, ఆదిలాబాద్లో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
బీజేపీ ఎంపీ మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్వీర్ డైలర్ బుధవారం(ఏప్రిల్24)గుండె పోటుతో మరణించారు. డైలర్కు ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వలేదు.2017లో ఎమ్మెల్యేగా గెలిచిన డైలర్ తర్వాత 2019లో ఎంపీగా గెలిచి పార్లమెంట్కు వెళ్లారు. డైలర్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. -
స్వామీ బ్రహ్మానంద్ ఎవరు? ఎంపీ స్థాయికి ఎలా చేరారు?
దేశంలో 18వ లోక్సభకు ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు (80) కలిగిన ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశ రాజకీయాల్లో సాధువుల ప్రవేశం 90వ దశకంలో రామమందిర ఉద్యమం నుంచి ప్రారంభమైంది. ఇది నేటికీ కొనసాగుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా లోక్సభ సభ్యునిగా ఎన్నికైన స్వామి బ్రహ్మానంద్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి బ్రహ్మానంద్ గోసంరక్షణ కోసం పాటుపడ్డారు. పార్లమెంటులో కూడా ఈ అంశంపై చర్చించారు. స్వాతంత్య్రానంతరం 1951-52లో తొలి సాధారణ ఎన్నికలు జరిగాయి. గోరఖ్నాథ్ పీఠానికి చెందిన మహంత్ దిగ్విజయ్నాథ్ 1952,1957 ఎన్నికలలో హిందూ మహాసభ నుండి పోటీ చేసినప్పటికీ, కాంగ్రెస్ ముందు సత్తా చాటలేకపోయారు. 1966లో స్వామి బ్రహ్మానంద్ స్వామి కర్పాత్రి మహారాజ్తో కలిసి లక్షలాది సాధువులతో కలసి గోహత్యను నిషేధించాలనే ఉద్యమాన్ని చేపట్టారు. దీనిపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ ఉద్యమ నేపధ్యంలో అప్పటి ప్రభుత్వం స్వామి బ్రహ్మానంద్ను అరెస్టు చేసి, జైలుకు తరలించింది. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల్లోకి రావాలని ఆయనను పలువురు కోరారు. దీంతో ఆయన జన్ సంఘ్లో చేరడం ద్వారా రాజకీయాల్లోకి కాలుమోపారు. 1967లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ లోక్సభ స్థానం నుండి స్వామి బ్రహ్మానంద్ పోటీ చేసి విజయం సాధించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక సాధు సన్యాసి లోక్సభ సభ్యునిగా ఎన్నికవడం అదే తొలిసారి. తరువాతి కాలంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ 1967లో బ్యాంకుల జాతీయకరణ అంశాన్ని లేవనెత్తినప్పుడు, స్వామి బ్రహ్మానంద్ అందుకు మద్దతుగా నిలిచారు. దీంతో జన్సంఫ్కు, స్వామి స్వామి బ్రహ్మానంద్కు మధ్య దూరం పెరిగింది. 1971 లోక్సభ ఎన్నికల్లో హమీర్పూర్ నుండి స్వామి బ్రహ్మానంద్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఈ విధంగా ఆయన రెండోసారి ఎంపీ అయ్యారు. -
BRS: వరంగల్ ఎంపీ అభ్యర్థి.. ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా హన్మకొండ జెడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్కుమార్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం( ఏప్రిల్ 12)అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. వరంగల్ అభ్యర్థిని నిర్ణయించేందుకు జిల్లా నేతలతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్లో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీకి ఇటీవలే పార్టీని వీడిన స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కూడా పిలుపు అందడంతో వరంగల్ నుంచి ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం ఒక దశలో ఊపందుకుంది. చివరకు సుధీర్కుమార్ను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియ్యం కావ్య కాంగ్రెస్లోకి వెళ్లడంతో బీఆర్ఎస్ తాజాగా మళ్లీ అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్కు ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరూ బీఆర్ఎస్ను ఇటీవల వీడి టికెట్ తీసుకున్న వారే కావడం గమనార్హం. దీంతో బీఆర్ఎస్కు తమ పార్టీ నుంచి వెళ్లిన వారిపైనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బీజేపీ నుంచి వర్థన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుంచి స్టేషన్ ఘన్పూర్ కడియం కావ్య బరిలో ఉన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్లో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. కడియం -
ఆ ‘ఆప్’ నేతలు ఎక్కడ? నిరసనలకు ఎందుకు దూరం?
లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటం పార్టీకి పెద్ద సమస్యగా పరిణమించింది. సీఎంను జైలుకు పంపడాన్ని నిరసిస్తూ పార్టీ చేపడుతున్న నిరసన ప్రదర్శనలకు కొందరు పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీలోని మొత్తం 10 మంది ఎంపీల్లో ముగ్గురు పార్టీ కోసం తమ గొంతు వినిపిస్తుండగా, ఏడుగురు ఎంపీలు ఏమయ్యారో ఎవరికీ తెలియడం లేదు. కాగా ఆప్కి చెందిన ఏకైక లోక్సభ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ బీజేపీలో చేరారు. ఈ విషయమై ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చిన పార్టీ నేత సంజయ్సింగ్ను ప్రశ్నించగా, ఈ అంశాన్ని పార్టీ పరిశీలిస్తుందని చెప్పారు. ఇతనితోపాటు ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్, ఎన్డీ గుప్తా నిరసన ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే పార్టీలో ఇంత జరుగుతున్నా ముఖం చాటేస్తున్న కొందరు కీలక నేతలున్నారు. రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పంజాబ్కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా గత నెలలో కంటి ఆపరేషన్ కోసం లండన్ వెళ్లారు. ఆయన మార్చి చివరిలో తిరిగి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ లండన్లోనే ఉన్నారని సమాచారం. మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్టు చేసిన తర్వాత రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. స్వాతి మలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కూడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తన సోదరి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెకు అండగా ఉండేందుకు అక్కడే కొన్నాళ్లు ఉండాల్సివస్తున్నదని స్వాతి మలివాల్ తెలిపారు. మలివాల్ ఆప్ పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హర్భజన్ సింగ్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పంజాబ్ ఆప్ ఎంపీ అయినప్పటి పార్టీ కార్యకలాపాల్లో అప్పుడప్పుడు పాల్గొంటున్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై కూడా హర్బజన్ స్పందించలేదు. ఆప్ నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారా? అని మీడియా ప్రశ్నించగా అందుకు సమాధానం చెప్పేందుకు హర్బజన్ నిరాకరించారు. అశోక్ కుమార్ మిట్టల్ పంజాబ్కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, ఆప్ ఎంపీ అయిన మిట్టల్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ నిరసనల గురించి మాట్లాడే అధికారం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. ఏం చేయాలో పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, ఇటీవల పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు. సంజీవ్ అరోరా పంజాబ్కు చెందిన మరో ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా సీఎం కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మార్చి 24న కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ను కలుసుకున్నారు. అయితే, రాంలీలా మైదాన్లో జరిగిన నిరసనల్లో ఆయన పాల్గొనలేదు. లూథియానాలో పార్టీ అసైన్మెంట్తో బిజీగా ఉన్నందున నిరసనలకు హాజరు కాలేకపోయానని అరోరా తెలిపారు. బల్వీర్ సింగ్ పంజాబ్కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ బల్వీర్ సింగ్ కూడా పార్టీ నిరసన ప్రదర్శనల్లో కనిపించలేదు. ఆయనను గైర్హాజరు గురించి ప్రశ్నించగా తాను తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నానని, పార్టీ ఆదేశిస్తే నిరసనల్లో పాల్గొంటానని తెలిపారు. -
ఇండియా కూటమికి ఎదురుదెబ్బలు?
లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురు దెబ్బల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఇండియా కూటమి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎంపీలోని ప్రముఖ ఖజురహో స్థానం నుండి ఇండియా అలయన్స్కు చెందిన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి మీరా దీప్ నారాయణ్ యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ ఖజురహో లోక్సభ స్థానాన్ని సమాజ్వాదీ పార్టీకి కేటాయించింది. ఇప్పుడు సమాజ్వాదీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం ఇండియా కూటమికి నష్టమని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీడి శర్మ ఖజురహో స్థానం నుండి గిలిచి ఎంపీ అయ్యారు. ఈ విధంగా చూస్తే ఎన్నికలకు ముందే ఇండియా కూటమి ఒక స్థానాన్ని కోల్పోయినట్లయ్యింది. ఇండియా అలయన్స్ అభ్యర్థి మీరా దీప్ నారాయణ్ యాదవ్ సహా నలుగురి నామినేషన్ పత్రాలు రద్దయ్యాయి. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పన్నా సురేష్ కుమార్ ఈ విషయమై మాట్లాడుతూ ఎస్పీ అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ పత్రాలలో సంతకాలు లేవన్నారు. అలాగే ఓటరు జాబితా కాపీ కూడా లేదన్నారు. పలు కారణాలతో ఖజురహో లోక్సభ నియోజకవర్గం నుంచి మొత్తం నలుగురి నామినేషన్ పత్రాలు రద్దయ్యాయని తెలిపారు. ఖజురహో సీటుకు సంబంధించి సమాజ్వాదీ పార్టీ ఇద్దరు అభ్యర్థులను మార్చింది. మొదట మనోజ్ యాదవ్కు టికెట్ ఇచ్చింది. రెండు రోజుల తర్వాత మనోజ్ యాదవ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే మీరా యాదవ్ను లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఇప్పుడు మీరా యాదవ్ నామినేషన్ రద్దు కావడంతో కాంగ్రెస్, ఎస్పీల ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. -
కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక బీజేపీ సీనియర్ కుట్ర
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో అవకతవకల కేసులో బీజేపీ సీనియర్ నేత ఒకరు కుట్ర పన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేసులో అప్రూవర్గా మారిన మాగుంట రాఘవ్పై ఒత్తిడి చేసి కేజ్రీవాల్కు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా చేశారని శుక్రవారం ఢిల్లీలో పత్రికాసమావేశంలో సంజయ్ చెప్పారు. ఇదే కేసులో చాలా వారాలపాటు జ్యుడీíÙయల్ కస్టడీలో ఉండి సంజయ్ రెండు రోజుల క్రితమే బెయిల్పై విడుదలైన సంగతి విదితమే. ‘‘ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని లోక్సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై బీజేపీ ఒత్తిడి చేసింది. అందుకు ఆయన ఒప్పకోలేదు. దీంతో ఆయన కుమారుడు మాగుంట రాఘవ్ను లక్ష్యంగా చేసుకుని అరెస్ట్చేశారు. పలుమార్లు అధికారులు ప్రశ్నించడంతో మాగుంట రాఘవ్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. ఇలా పెద్ద కుట్రలో భాగమయ్యారు. ఢిల్లీ సీఎంను కటకటాల వెనక్కి పంపడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది’ అని సంజయ్ అన్నారు. -
అనకాపల్లి చోడవరంలో కూటమి అభ్యర్థి సీఎం రమేష్ దాదాగిరి
-
వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తరఫున వరంగల్ ఎంపీ స్థానానికి బలమైన అభ్యర్థిని బరిలో దించేదిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. బీఆర్ ఎస్ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొని తన తండ్రి కడియం శ్రీహ రితో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి చెంది, బీఆర్ ఎస్ అధికారం కోల్పోగానే పార్టీకి దూరమైన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో బీఆర్ఎస్ వర్గా లు సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలిసింది. అయితే తన అనుచరులతో భేటీ అయిన తర్వాత తిరిగి పార్టీలోకి రావడంపై స్పష్టత ఇస్తానని రాజ య్య చెప్పినట్టు సమాచారం. ఓ వైపు రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకొని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడంపై కసరత్తు చేస్తూనే, మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాలను కేసీఆర్ అన్వేషిస్తున్నట్టు సమా చారం. పార్టీ తరపున టికెట్ ఆశించిన బోడ డిన్న, నిరంజన్, జింక రమేశ్ తదితరులు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు హనుమ కొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు పెద్ది స్వప్న తదితరుల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఇదిలాఉంటే తన అను చరులతో కడియం శ్రీహరి శనివారం హైదరాబా ద్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా స్టేషన్ఘనపూర్ నేతలతో నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసింది. -
TN: పురుగుల మందు తాగిన ఎంపీ కన్నుమూత
చెన్నై: లోక్సభ ఎన్నికల కోసం ఆ సిట్టింగ్ ఎంపీకి సీటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించారు ఆయన కుటుంబ సభ్యులు. అయినా మృత్యువు ఆయన్ని వదల్లేదు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూశారు. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) పార్టీ ఎంపీ గణేశమూర్తి గురువారం ఉదయం 5.05 గంటలకు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మార్చి 24వ తేదీన గణేశమూర్తి ఆత్మహత్య ప్రయత్నం చేయగా.. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. #UPDATE | MDMK MP from Erode, Ganesamoorthy passed away at 5:05 am today due to cardiac arrest. He was hospitalised on March 24 after allegedly attempting suicide. #TamilNadu https://t.co/tGQAZoRuD2 — ANI (@ANI) March 28, 2024 డీఎంకే పార్టీతో పొత్తులో భాగంగా ఈసారి ఈరోడ్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కేటాయించక పోవడంతో మనస్తాపం చెందారాయన. పరుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆయన గురువారం ఉదయం కార్డియాక్ అరెస్ట్కు గురై మృతి చెందారు. 2019లోక్సభ ఎన్నికల్లో ఈరోడ్ పార్లమెంట్ స్థానం నుంచి గణేశమూర్తి డీఎంకే టికెట్పై గెలుపొందారు. ఆయన మృతి వార్త తెలియగానే అనుచరులు స్థానికంగా బంద్కు పిలుపు ఇచ్చారు. రాజకీయ నేపథ్యం: 1947 జూన్లో జన్మించిన గణేశమూర్తి.. 1993 నుంచి ఎండీఎంకే పార్టీలోనే ఉన్నారు. ఆయన 1998లో తొలిసారి పళని పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019లో లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో భాగంగా ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం దక్కింది. దీంతో ఇక్కడ దాదాపు 2 లక్షల భారీ మేజార్టీతో గెలుపొందారు. -
103 మంది సిట్టింగులకు... ఈసారి నో టికెట్
లోక్సభ ఎన్నికల్లో ఘనవిజయంపై కన్నేసిన అధికార బీజేపీ అందుకోసం తీవ్రస్థాయి కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా టికెట్ల కేటాయింపులో నిర్మొహమాటంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటోంది. గెలుపు అవకాశాలు లేవనుకుంటే ఎవరినైనా పక్కన పెట్టేస్తోంది. ఎంతటి సీనియర్లయినా, ఎంత జనాదరణ ఉన్నా పట్టించుకోవడం లేదు. ఆ క్రమంలో మొత్తం 290 మంది సిట్టింగ్ ఎంపీల్లో ఇప్పటికే ఏకంగా 103 మందికి బీజేపీ టికెట్ నిరాకరించింది...! బీజేపీ ఇప్పటిదాకా ఆరు విడతల్లో 405 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు కూడా రాకముందే మార్చి 2న ఏకంగా 195 మందితో తొలి జాబితాను ప్రకటించడం తెలిసిందే. విపక్ష ఇండియా కూటమి పొత్తులపై, పారీ్టల మధ్య సీట్ల సర్దుబాటుపై ఓవైపు మల్లగుల్లాలు సాగుతుండగానే భారీ జాబితా వెలువరించి దూకుడు కనబరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తదితర కేంద్ర మంత్రులు అందులో చోటుచేసుకున్నారు. తొలి జాబితాలో 33 మంది సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి చూపింది. ఇక 72 మందితో ప్రకటించిన రెండో జాబితాలో ఏకంగా 30 మంది సిట్టింగులపై వేటు పడింది! మూడో జాబితాలో 9 మంది, నాలుగో జాబితాలో 15 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. తర్వాత మార్చి 24న 111 మందితో ప్రకటించిన ఐదో జాబితాలోనైతే 37 మంది సిట్టింగులకు టికెట్లు గల్లంతయ్యాయి! తాజాగా మంగళవారం ప్రకటించిన మూడు స్థానాల్లోనూ సిట్టింగులను పక్కన పెట్టి ఇతరులకు టికెట్లిచ్చింది. వీరిలో కేంద్ర మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్ కూడా ఉండటం విశేషం. ఈ లెక్కన ఇప్పటికే మూడో వంతుకు పైగా, అంటే 34 శాతం మంది బీజేపీ సిట్టింగులను టికెట్లు దక్కలేదు. మరో 30 నుంచి 40 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దించేలా కని్పస్తోంది. వాటిలోనూ మరింతమంది సిట్టింగులను మార్చడం ఖాయమంటున్నారు! 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా 282 మంది బీజేపీ సిట్టింగుల్లో 119 మందికి టికెట్లివ్వలేదు. అంటే ఏకంగా 42 శాతం మందిని మార్చేసింది! తద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను విజయవంతంగా అధిగమించగలిగామన్నది బీజేపీ అగ్ర నాయకత్వం అభిప్రాయం. అందుకే ఇప్పుడూ అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. టికెట్లు దక్కని ప్రముఖులు హర్షవర్ధన్, వరుణ్గాందీ, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, వీకే సింగ్, అనంత్కుమార్ హెగ్డే, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, అశ్వినీ చౌబే, ప్రతాప్ సింహ... ఇలా ఈసారి టికెట్ల దక్కని బీజేపీ సిట్టింగుల్లో పలువురు సీనియర్లు, ప్రముఖులున్నారు. వీరిలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అయితే పార్టీ నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురై ఏకంగా రాజకీయాలకే గుడ్బై చెప్పేశారు. ఇక ప్రజ్ఞాసింగ్, రమేశ్ బిదురి, అనంత్కుమార్ హెడ్గే, పర్వేష్ సాహిబ్సింగ్ వంటి ఎంపీలపై వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా వేటు పడింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాధిక శరత్కుమార్కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో బాలీవుడ్తో పాటు దక్షిణాది హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. ఇటీవలే కంగనా రనౌత్కు సైతం బీజేపీ లోక్సభ సీటును కేటాయించింది. అంతకుముందే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్కు బీజేపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆమె తమిళనాడులోని విరుధునగర్ నుంచి పోటీలో నిలిచారు. ఈ నేపథ్యంలో రాధిక శరత్కుమార్ ఆస్తులపై చర్చ మొదలైంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసేవారు అఫిడవిట్లో తప్పనిసరిగా ఆస్తులు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే తొలి దశ పోలింగ్కు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా విరుధునగర్ నుంచి పోటీ చేస్తున్న రాధిక నామినేషన్ దాఖలు చేసింది. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులను ప్రస్తావించారు. తన మొత్తం ఆస్తుల విలువను రూ.53.45 కోట్లుగా పేర్కొన్నారు. తన వద్ద ప్రస్తుతం రూ.33.01 లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులతో కలిపి రూ.27.05 కోట్ల చరాస్తులున్నట్లు రాధిక నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. రూ.26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. రాధిక భర్త, నటుడు ఆర్. శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. -
ఎంపీ సీట్ పై జీవీఎల్ కామెంట్స్
-
జేడీయూ సిట్టింగ్ ఎంపీలకు మొండిచెయ్యి?
లోక్సభ ఎన్నికలకు బీహార్లోని జనతాదళ్యునైటెడ్ (జేడీయూ) అభ్యర్థుల పేర్లు ఇవేనంటూ కొన్ని లీకులు బయటకు వస్తున్నాయి. వీటి ప్రకారం చూస్తే ఈ ఎన్నికల్లో జేడీయూ పాతవారికి చెక్ పెట్టి, కొత్తవారికి అవకాశం కల్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ టిక్కెట్లు దక్కనివారిలో కొంతమంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారని సమాచారం. సీట్ల పంపకంలో జేడీయూ తమ సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లకు కోతపెట్టి, వాటిని మిత్ర పక్షాలకు కట్టబెట్టినట్లు సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం సీట్ల పంపకంలో కరకట్ ఎంపీ మహాబలి సింగ్, గయ ఎంపీ విజయ్ మాంఝీ, సివాన్ ఎంపీ కవితా సింగ్, సీతామర్హి ఎంపీ సునీల్ కుమార్ పింటూలకు టిక్కెట్లు దక్కలేదని తెలుస్తోంది. అయితే శివహార్ నుంచి లవ్లీ ఆనంద్, సీతామర్హి నుంచి దేవేశ్ చంద్ర ఠాకూర్, శివన్ నుంచి రాజలక్ష్మి కుష్వాహా, కిషన్గంజ్ నుంచి మాస్టర్ ముజాహిద్ పేర్లను జేడీయూ ఖరారు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీహార్లో జేడీయూకు 16 సీట్లు దక్కాయి. వాల్మీకినగర్ నుండి సునీల్ కుమార్, భాగల్పూర్ నుండి అజయ్ మండల్, మాధేపురా నుండి దినేష్ చంద్ర యాదవ్, ఝంఝార్పూర్ నుండి రాంప్రీత్ మండల్, సుపాల్ నుండి దిలేశ్వర్ కామత్, జెహానాబాద్ నుండి చండేశ్వర్ చంద్రవంశీ తదితరులు జేడీయూ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
భువనగిరి ఎంపీ టికెట్ అడగడం లేదు
మునుగోడు: భువనగిరి ఎంపీ టికెట్ తన భార్య లక్ష్మికి అడుగుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులో విలేకరులతో మాట్లాడారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా, వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో వస్తున్న వార్తలు నిజం కాదని, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే గిట్టనివారు తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తే బాగుటుందని తాను పలుమార్లు చెప్పానని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. కోమటిరెడ్డి కుటుంబం పదవుల కోసం పాకులాడదని, తన భార్య లక్ష్మి కూడా పోటీచేసేందుకు సుముఖంగా లేదని చెప్పారు. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల్లో.. తమ కుటుంబం నుంచి పోటీచేస్తేనే గెలుస్తామని రిపోర్టు వస్తే..అధిష్టానం పోటీచేయాలని పట్టుబడితే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఎప్పుడూ విభేదాలు ఉండవు తన సోదరుడు మంత్రి వెంకట్రెడ్డికి, తన మధ్య విభేదా లు ఉన్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తమ మధ్య ఏ ఒక్క రోజూ ఎడబాటు ఉండదన్నారు. ఇద్దరం కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడని, తాను సూర్యాపేటకు వెళ్తే.. ఒక్క రోజు కూడా బయట తిరగలేడన్నారు. ఆలస్యమైనా తనకు మంత్రి పదవి వస్తుందని, ఆ నమ్మకం ఉందని రాజగోపాల్రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో చౌటుప్పల్, నారాయణపురం ఎంపీపీలు తాడూరి వెంకట్ రెడ్డి, గుత్తా ఉమాదేవి, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. -
రేపు బీజేపీ తుది జాబితా!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా శనివారం వెలువడే అవకాశాలున్నాయి. ఢిల్లీలో శుక్రవారం జరగాల్సిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం మరుసటి రోజుకు వాయిదా పడినట్టు సమాచారం. తెలంగాణ విషయాని కొస్తే..వరంగల్, ఖమ్మం ఎంపీ సెగ్మెంట్లకు బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్కు వరంగల్ ఖరారు కాగా, ఇక అది ప్రకటించడమే తరువాయి అని సమాచారం. ఖమ్మం నుంచి ఎవరిని బరిలో దింపాలనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మాజీ సీఎం జలగం వెంగళరావు తనయుడు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పేరును పరిశీలనలోకి తీసుకున్నా... పోటీకి ఓ బీఆర్ఎస్ ఎంపీ ఆసక్తి కనబరుస్తుండడంతో ఆయనకే ఈ సీటు దక్కే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి ఖరారైన నల్లగొండ ఎంపీ సీటుతో పాటు ఒకట్రెండు స్థానాల్లో అభ్యర్థుల మార్పు జరగొచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు పోటీ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తుండడంతో, ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థి కంటే సదరునేత మెరుగైన వాడిగా భావిస్తే నల్లగొండ అభ్యర్థి మార్పు కూడా ఉంటుందంటున్నారు. తుది జాబితా ప్రకటన ఒకరోజు వాయిదా పడడంతో ఎన్నికల వ్యూహాల ఖరారుకు శనివారం నిర్వహించాల్సిన సమావేశం ఆదివా రానికి వాయిదా పడినట్టు తెలిసింది. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్చార్జ్లు, జిల్లా అధ్యక్షులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వికేంద్రీకరణ వ్యూహం... బీజేపీ అగ్రనేత అమిత్షా ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెరుగైన ఫలితాల సాధనకు వికేంద్రీకరణ వ్యూహం పార్టీ అమలు చేస్తోంది. ఇక్కడా పోలింగ్బూత్లే కేంద్రంగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇటీవల ఎల్బీ స్టేడియంలో దాదాపు 30వేల మంది పోలింగ్బూత్ కమిటీల అధ్యక్షులు, ఆపై మండల, జిల్లాస్థాయి అధ్యక్షులతో అమిత్షా సమావేశమైన సందర్భంగా పలు సూచనలు చేశారు. ఇందుకు అనుగుణంగా పోలింగ్బూత్లే కేంద్రంగా ఎన్నికల కార్యకలా పాలపై పార్టీ ప్రత్యేకదృష్టి కేంద్రీకరిస్తోంది. ఒక్కో పోలింగ్బూత్ పరిధిలో దాదాపుగా 24 పనులు క్రమం తప్పకుండా చేయాలని అమిత్షా ఆదేశించినట్టు తెలిసింది. ప్రధాన పార్టీల కంటే ముందుగానే లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మిగతా పార్టీలకన్నా బీజేపీనే ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఓ విడత ముందస్తు ప్రచారం పూర్తిచేయడం దీనినే సూచిస్తోంది. తెలంగాణలో నాలుగో విడత పోలింగ్ మే 13న ఉన్నందున, ఆ దశ ఎన్నికలప్పుడు మోదీ, అమిత్షా, నడ్డా, ఇతర ముఖ్యనేతల విస్తృత ప్రచారం నిమిత్తం రాష్ట్రానికి వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. -
ఆ రెండూ ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చే యగా..పెండింగ్లో ఉన్న వరంగల్, ఖమ్మం అభ్యర్థుల విషయంలో ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. వరంగల్ ఎంపీ సీటు బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్కు ఖరారైనట్టు సమాచారం. మరోవైపు ఖమ్మం సీటు కోసం పలువురు ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేరును నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన ఓ ఎంపీ ఖమ్మం టికెట్ కోసం ఢిల్లీస్థాయిలో పెద్దెత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో తాను టీడీపీలో ఉన్నందున, ఇప్పుడు ఏపీలో టీడీపీ–బీజేపీల మధ్య పొత్తు దృష్ట్యా, ఖమ్మంలో తనకు టీడీపీ శ్రేణులు సహకరిస్తాయని, తప్పకుండా గెలుస్తానంటూ బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఆయన నిమగ్నమైనట్టు చెబుతున్నారు. దీంతో ఖమ్మం విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శానంపూడికి ఖాయమేనా? నల్లగొండ సీటును బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఇప్పటికే ప్రకటించారు. కానీ తనకు టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి ని మార్చడం కుదరదని కొందరు అంటుంటే, గెలుపు ఖాయమనుకుంటే అభ్యర్థి ని మార్చేందుకు నాయకత్వం వెనుకాడదని కొందరు అంటున్నారు. 22వ తేదీన జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవచ్చునని పార్టీ నేతలు చెబుతున్నారు. 23న అభ్యర్థులతో కిషన్రెడ్డి సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఈ నెల 23న పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. శనివారం నాటి కల్లా 17 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యే అవకాశాలు ఉండడంతో వారితో ఈ భేటీ జరపనున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. -
ప్రతిఒక్కరూ రజాకార్ సినిమా చూడండి : ఎంపీ బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో నిజామాబాద్–ఖమ్మం వరకు ఎన్హెచ్–563, ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ, రైలు మార్గాల నిర్మాణం, టర్మరిక్ బోర్డు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నిధులు.. ఇలా ఎన్నో ఇచ్చాం.. వచ్చే పదేళ్లలో తెలంగాణ ప్రగతిపై ఫోకస్ చేసి, మరెన్నో ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో రోడ్లు, రైలు, గోదాంలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు. రాష్ట్రంతోపాటు ఉమ్మడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ కోసం బీజేపీని గెలిపించాలని, అబ్ కీ బార్ 400 పార్ అని పిలుపునిచ్చారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో రైతులను, సంక్షేమ పథకాలతో మహిళలను, రుణాలిచ్చి యువతను ఆదుకున్నామని తెలిపారు. పసుపు మద్దతు ధర, టర్మరిక్ బోర్డు ఏర్పాటు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి, ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణకు రూ.6,400 కోట్లు వెచ్చించామన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరును ఎండగట్టారు. ఆ పార్టీలు తెరచాటు మిత్రులని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ అగ్రనాయకులు లక్ష్మణ్, సత్యనారాయణరావు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, నిర్మల్ ఎమ్మెల్యే పరమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. రజాకార్ సినిమా చూడండి వీరులను కన్న గడ్డ జగిత్యాలలో పీఎఫ్ఐ లుచ్చాగాళ్లు అడ్డా పెట్టి, పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే వాళ్లకు ఆర్థికసాయం చేస్తున్న వాళ్లను వదిలేద్దామా? నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు జగిత్యాల సొంతం. రాముని పేరు చెబితే కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు గజగజ వణుకుతున్నరు. దేశ ప్రజల భాగస్వామ్యంతో అయోధ్యలో రాముని గుడిని కట్టింది బీజేపీయే. మా పార్టీ బరాబర్ శ్రీరాముని పేరుతో ఎన్నికల్లోకి వెళ్తుంది. మీకు దమ్ముంటే బాబర్ పేరుతో ఓట్లడగండి. తెలంగాణ ప్రజాలారా... ప్రతిఒక్కరూ రజాకార్ సినిమా చూడండి. నిజాం సమాధి వద్ద మోకరిల్లిన కేసీఆర్, ఒవైసీ సోదరులను కట్టేసి, ఈ సినిమా చూపించండి. – ఎంపీ బండి సంజయ్ ఐదో ఆర్థిక శక్తిగా మన దేశం ప్రధాని మోదీ వల్లే మన దేశం ప్రపంచ దేశాల్లో బలమైన ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది. మయన్మార్, పాకిస్తాన్ లాంటి దేశాలను దారికి తెచ్చిన ఘనత ఆయనదే. మోదీ వల్లే దేశంలో సుస్థిరత, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతాయి. ఇటీవల సీఏఏ అమలు చేశారు. త్వరలో ఎన్ఆర్సీ, యూసీసీ కోడ్ను కూడా అమలు చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. – ఎంపీ ధర్మపురి అర్వింద్ దేశ ప్రజలందరూ ప్రధాని కుటుంబమే ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం లేదంటున్న విపక్షాలకు సిగ్గులేదు. దేశ ప్రజలందరూ ఆయన కుటుంబమే. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో తెలంగాణ నుంచి బీజేపీ తరఫున అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచి, ప్రధానికి కానుకగా ఇద్దాం. పదేళ్ల యూపీఏ హయాంలో జరగని స్కాం లేదు. బీఆర్ఎస్ కాళేశ్వరం నుంచి కరెంటు వరకు అవినీతిమయం చేసింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేక చేతులెత్తేసింది. – ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత -
కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో..? కొనసాగుతున్న ఉత్కంఠ!
సాక్షి, ఆదిలాబాద్: లోక్సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతుంది. పలువురి పేర్లు వినబడుతున్నప్పటికీ పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివాసీ నేతనే బరిలోకి దించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే జరిగితే ఈ టికెట్పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్కు నిరాశ తప్పదని అంటున్నారు. కాగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును రంగంలోకి దించాలని అధిష్టానం ఆసక్తితో ఉన్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికలతోనే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన ఆయన ఇప్పుడే పార్లమెంట్కు పోటీ చేసే విషయంలో ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయన పోటీకి ముందుకు రాకపోతే ఆశావహుల్లో ఎవరికై నా టికెట్ లభించవచ్చనే చర్చ సాగుతోంది. ఆశావహుల ముమ్మర యత్నాలు.. కాంగ్రెస్ టికెట్ కోసం 22 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, ఎల్ఐసీ ఉద్యోగానికి ఇటీవలే రాజీనామా చేసి పార్టీలో చేరిన కోవ దౌలత్రావు మొకాశి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్లో క్రియాశీలకంగా ఉన్న మర్సుకోల సరస్వతి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి ఆసిఫాబాద్ టికెట్ను ఆశించిన ఆమె దక్కకపోవడంతో పార్టీ వీడారు. తాజాగా ఆమె పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ర్యాండమ్ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఆదివాసీలకే టికెట్ ఇవ్వాలని మెజార్టీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆదివాసీ అభ్యర్థికే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే నియోజకవర్గాల ఇన్చార్జీల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేయగా ఆశావహుల్లోని ఓ అధికారి పేరు ఎక్కువ మంది చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఈ విషయంలో సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. అపాయింట్మెంట్ ఫిక్స్ అనే ప్రచారం.. బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే శనివారం సీఎం రేవంత్రెడ్డితో ఆయన అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదనేది స్పష్టమవుతోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. మరోపక్క ఎన్నికల నోటిఫికేషన్ నేడు రానుంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ఎంపికను త్వరగా ముగించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇవి చదవండి: కాంగ్రెస్లోకి మాజీ ఎంపీ జితేందర్రెడ్డి -
రాజ్యసభ ఎంపీగా 'సుధామూర్తి' ప్రమాణ స్వీకారం
ఇంజనీర్ నుంచి పరోపకారిగా మారి ఎంతోమందికి సహాయం చేస్తున్న'సుధామూర్తి' ఈ రోజు (గురువారం) తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హౌస్లోని తన ఛాంబర్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్, రచయిత్రి సుధామూర్తి పిల్లల కోసం అనేక పుస్తకాలను రచించింది. కన్నడ, ఇంగ్లీష్ సాహిత్యానికి ఆమె చేసిన కృషికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారంలభించింది. అంతే కాకుండా ఈమెను 2006లో పద్మశ్రీ, 2023లో పద్మ భూషణ్ అవార్డులు వరించాయి. గత శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. TELCOతో పనిచేసిన మొదటి మహిళా ఇంజనీర్ అయిన సుధామూర్తి.. నేడు వేలకోట్ల సామ్రాజ్యంగా మారిన ఇన్ఫోసిస్ ప్రారంభానికి ప్రధాన కారకురాలు కూడా. #WATCH | Author and philanthropist Sudha Murty, nominated to the Rajya Sabha by President Droupadi Murmu, takes oath as a member of the Upper House of Parliament, in the presence of House Chairman Jagdeep Dhankhar Infosys founder Narayan Murty and Union Minister Piyush Goyal… pic.twitter.com/vN8wqXCleB — ANI (@ANI) March 14, 2024 -
బీజేపీకి బిగ్ షాక్
లోక్సభ ఎన్నికల ముందర బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ బ్రిజేందర్ సింగ్ Brijendra Singh(51) ఆదివారం బీజేపీకి రాజీనామా ప్రకటించారు. రాజీనామా ప్రకటించిన కొన్నిగంటలకే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయారు. హర్యానా రాజకీయ దిగ్గజం, కేంద్ర మాజీ మంత్రి చౌద్రీ బీరేందర్ సింగ్(77) తనయుడే ఈ బ్రిజేందర్ సింగ్. హర్యానా హిసార్ పార్లమెంటరీ స్థానం నుంచి బ్రిజేందర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముందుగా తన రాజీనామాను ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారాయన. I have resigned from the primary membership of BJP,due to compelling political reasons. I extend gratitude to the party, National President Sh. JP Nadda, Prime Minister Sh. Narendra Modi, & Sh Amit Shah for giving me the opportunity to serve as the Member of Parliament for Hisar. — Brijendra Singh (@BrijendraSpeaks) March 10, 2024 ఆ తర్వాత బ్రిజేందర్ సింగ్.. ఖర్గేతోపాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజకీయ, సైద్ధాంతిక విబేధాల వల్లే తాను బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరినట్లు మీడియాకు బ్రిజేందర్ తెలియజేశారు. రైతుల ఆందోళన, రెజ్లర్ల నిరసనలు.. ఇలా చాలాకారణాలు ఉన్నాయని చెప్పారాయన. అలాగే.. కాంగ్రెస్ చేరిక సంతోషాన్ని ఇస్తోందని బ్రిజేందర్ చెప్పారు. గతంలో 42 ఏళ్ల పాటు కాంగ్రెస్తో అనుబంధం కొనసాగించిన బీరేందర్ సింగ్.. 2014లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక ఆయన తనయుడైన బ్రిజేందర్ 1998లో సివిల్స్ 9వ ర్యాంకర్. ఐఏఎస్ అధికారిగా 21 ఏళ్లపాటు సొంత రాష్ట్రానికి సేవలు అందించిన బ్రిజేందర్ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హిసార్ ఎంపీగా.. పార్లమెంట్లో పలు కమిటీలకు సైతం బ్రిజేందర్ పని చేశారు. తండ్రి బీరేందర్తో బ్రిజేందర్ జాట్ కమ్యూనిటీకి చెందిన బ్రిజేందర్ కుటుంబానికి ముందు తరాల నుంచే హర్యానా రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. దీంతో కాంగ్రెస్లో చేరి ఆయన పోటీ చేయొచ్చని తెలుస్తోంది. -
ఏమిటి నేను చేసిన నేరం? బీజేపీ ఎంపీ తీవ్ర ఆవేదన!
భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. రాజస్థాన్లోని చురు లోక్సభ స్థానం నుంచి కొత్త వ్యక్తి దేవేంద్ర ఝజారియాకు టిక్కెట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం చురు ఎంపీగా ఉన్న రాహుల్ కశ్వాన్.. తనను తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికలకు తన చురు స్థానం నుంచి మరో అభ్యర్థిని బీజేపీ బరిలోకి దించగా రాహుల్ కశ్వాన్ సోషల్ మీడియాలో తన స్పందనను తెలియజేశారు. కస్వాన్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. "నా నేరం ఏమిటి? నేను నిజాయితీగా లేనా? కష్టపడి పనిచేయలేదా? విధేయుడిని కాదా? నేను ఏమి కళంకం తెచ్చాను? చురు లోక్సభలో పనిచేయలేదా? ఏదైనా పొరపాటు జరిగిందా?" అంటూ ప్రశ్నలు సంధించారు. "ప్రధానమంత్రి అన్ని పథకాల అమలులో నేను ముందంజలో ఉన్నాను. ఇంకా ఏమి కావాలి? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా మౌనమే వినిపిస్తోంది. ఎవరూ సమాధానం చెప్పలేక పోతున్నారు" అంటూ వాపోయారు. అయితే రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమని, టిక్కెట్ దక్కలేదన్న నైరాశ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. కాగా రాహుల్ కస్వాన్ తండ్రి రామ్ సింగ్ కూడా చురు నుంచి బీజేపీ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే రాహుల్ తల్లి కమలా కశ్వాన్ కూడా సాదుల్పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా చేశారు. రానున్న లోక్సభ ఎన్నికలకు రాజస్థాన్లోని 25 స్థానాలకు గాను 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు నలుగురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. -
‘స్వాగతం’.. సుప్రీంకోర్టు తీర్పును ప్రశంసించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: లంచాల కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులు లేవంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ‘స్వాగతం.. సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది.’ అని కొనియాడారు. ఇకపై దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు కొనసాగుతాయని, సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు సుప్రీం తీర్పునకు సంబంధించిన కథనాన్ని కూడా జత చేశారు. కాగా లంచాల కేసులో ప్రజా ప్రతినిధులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే, ఎంపీలు లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. 1998లో పీవీ నరసింహారావు కేసులో అయిదుగురు జడ్జీల తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. పార్లమెంట్, శాసనసభలో లంచాలు తీసుకొనిలో ప్రసంగాలు చేయడం. ఓటు వేసే ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. లంచం కేసుల్లో ప్రజా ప్రతినిధులకు రాజ్యాంగ రక్షణ కల్పించలేమని తేల్చిచెప్పింది. చదవండి: సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో ముఖ్యాంశాలు -
Up: అశ్లీల వీడియో వైరల్.. పోలీసులకు ఎంపీ ఫిర్యాదు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బారాబంకి బీజేపీ ఎంపీ ఉపేంద్రసింగ్ రావత్కు సంబంధించి నకిలీదీగా భావిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. తాజాగా బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలోనూ రావత్కు బారాబంకి లోక్సభ నియోజకవర్గం నుంచి మళ్లీ టికెట్ దక్కింది. ఈ జాబితా ప్రకటించిన వెంటనే రావత్ను పోలి ఉన్న వ్యక్తి బెడ్పై ఒక అమ్మాయితో అశ్లీల స్థితిలో లిక్కర్ గ్లాసు చేతిలో పట్టుకుని ఉన్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వీడియో వచ్చిన కొద్దిసేపటికే వైరల్గా మారింది. అయితే ఈ వీడియోలో ఉన్నది తాను కాదని ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేశారని ఎంపీ కొత్వాలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వీడియోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్ను తప్పించి ఉపేంద్రసింగ్ రావత్కు బీజేపీ హైకమాండ్ టికెటివ్వగా ఆయన గెలిచారు. తాజాగా రెండోసారి ఉపేంద్రకు పార్టీ టికెట్ ప్రకటించింది. ఇదీ చదవండి.. ఈడీకి కేజ్రీవాల్ ఎనిమిదో‘సారి’ -
లోక్సభ ఎన్నికల వేళ.. బీఎస్పీకి షాక్
లక్నో: బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) ఎంపీ రితేష్ పాండే బీఎస్పీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మామావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసినట్లు ఎంపీ రితేష్ పాండే.. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ నుంచి లోక్సభ బీఎస్పీ ఎంపీగా ప్రాతినిధ్యం వస్తున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన బీఎస్పీ రాజీనామా చేయటంతో బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. बहुजन समाज पार्टी की प्राथमिक सदस्यता से त्यागपत्र pic.twitter.com/yUzVIBaDQ9 — Ritesh Pandey (@mpriteshpandey) February 25, 2024 ఉత్తరప్రదేశ్ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించిన బీఎస్పీ పార్టీ నేతలు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ‘చాలా కాలంగా నాకు పార్టీలో ఎటువంటి గుర్తింపు లభించటం లేదు. పార్టీ సమావేశాల్లో కూడా నాకు సీనియర్ నేతలు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అయనా.. నా నియోజకర్గం ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతూ ఉన్నా. ఇక పార్టీని నా సేవలు అవసరం లేదని భావిస్తున్నా. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’ అని ఎంపీ రితేష్ పాండే తెలిపారు. మరోవైపు ఎంపీ రితేష్ పాండే బీజేపీ చేరుతారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. 10 రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసిన పాండే.. ఒక సోషల్ మీడియా పోస్ట్లో మోదీని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారని చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరిన రితేష్ పాండే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్సీ)కి రాజీనామా చేసిన అంబేద్కర్ నగర్ లోక్సభ నియోజకవర్గ ఎంపీ రితేష్ పాండే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీలో చేరారు. -
UK:మేయర్పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంపీ సస్పెండ్
లండన్: బ్రిటన్ అధికార కన్జర్వేటివ్ పార్టీ.. తన సొంతపార్టీ ఎంపీ, మాజీ డిప్యూటీ చైర్మన్పై సస్పెన్షన్ వేటు వేసింది. లండన్ మేయర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ లీ అండర్సన్ను ప్రధానమంత్రి రిషి సునాక్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం కన్జర్వేటివ్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. లండన్ మేయర్ సాదిక్ ఖాన్పై ఇస్లామిస్టుల ప్రభావం ఉందని, వారి నియంత్రణలో ఆయన ఉన్నారని ఓ టీవీ ఇంటర్వ్యూలో ఎంపీ లీ అండర్సన్ అన్నారు. దీంతో అయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాన మంత్రి రిషి సునాక్తో పాటు పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు జాత్యహంకార పూరితమైనవి అని వెంటనే క్షమాపణలు చేప్పాలని పెద్దఎత్తన డిమాండ్ చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి లీ అండర్సన్ నిరాకరించారు. ‘లండన్ మేయర్పై లీ ఆండర్సన్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపన చెప్పడానికి నిరాకరించారు. దీంతో పార్టీ చీఫ్ విప్.. ఆయన్ను ఎంపీ పదవిపై సప్పెన్షన్ విధించారు’ అని అధికార ప్రతినిధి టోరీ శాసనసభ్యుడు సైమన్ హార్ట్ తెలిపారు. ఇక.. ఇజ్రాయెల్ దేశం.. గాజాపై దాడులు చేయటం ప్రారంభించినప్పటి నుంచి బ్రిటన్లో ఇస్లాంపై ద్వేషం, యూదులపై వ్యతిరేకమైన సంఘటనలు చోటు చేసుకోవటం పెరిగినట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్లో రేవంత్ కొత్త పోకడలు!
ఆశావహులు దరఖాస్తులు సమర్పించాలి. ఆ అప్లికేషన్లను ఎన్నికల కమిటీలు పరిశీలించాలి. కొన్ని పేర్లను ఫైనలైజ్ చేయాలి. వాటిని అధిష్టానానికి మరోసారి జల్లెడ పట్టాలి. వడపోసిన జాబితాను అధిష్టానం ఓకే చేయాలి. ఆ తర్వాతే పార్టీ పెద్దలు అభ్యర్థుల పేర్లను స్వయంగా ప్రకటించాలి. ఇది ఏ ఎన్నికల సమయంలో అయినా.. అభ్యర్థుల ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అవలంభించే విధానం. కానీ, తెలంగాణలో ఆ సిస్టమ్కు బ్రేక్ పడింది!. తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా? అధిష్టానాన్ని కూడా లెక్క చేయకుండా రేవంత్రెడ్డి కాంగ్రెస్లో కొత్త పోకడలకు పోతున్నారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. తాజాగా.. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి పేరును సీఎం హోదాలో రేవంత్ రెడ్డి(పీసీసీ చీఫ్ కూడా) ప్రకటించడం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రమేయం లేకుండానే రేవంత్ అభ్యర్థుల జాబితాపై ప్రకటన చేయడం ఏంటని? అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాక మునుపే తెలంగాణ కాంగ్రెస్ తరఫున తొలి అభ్యర్థి ప్రకటన వెలువడింది. బుధవారం కొడంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్.. కోస్గి సభలో మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి పేరును ప్రకటించారు. ఒక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 50వేలకు తగ్గకుండా వంశీకి మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారాయన. సాధారణంగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో చర్చించాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. కానీ.. ఇలాగేనా చేసేది? .. ఓ బహిరంగసభలో అభ్యర్థిని రేవంత్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో అధిష్టానం అంటే లెక్కే లేనట్లు వ్యవహరిస్తున్నారని సీనియర్లు భావిస్తున్నారు. దరఖాస్తుల సమర్పణ.. వాటి పరిశీలన.. కమిటీల చర్చోపచర్చలు.. ఇన్ని జరగాల్సి ఉండగా.. అవేం పట్టన్నట్లు ఒక అభ్యర్థిని ప్రకటించడంతో రేవంత్ తీరుపై సీనియర్లు గుర్రుమంటున్నారు. మొన్నీమధ్యే.. రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనను చివరి రోజు వరకు కాంగ్రెస్ నాన్చింది. ఇందులోనూ రేవంత్ హస్తం ఉందనే అభిప్రాయానికి ఇప్పుడు సీనియర్లు వచ్చారు. ఎంపీ అభ్యర్థులను కూడా జిల్లా వారీగా రేవంత్రెడ్డి ఇలాగే ప్రకటిస్తారా? అంటూ గుసగుసలాడుకుంటుకున్నారు. అయితే.. ఈ విషయంలో రేవంత్ తొందర పడలేదని.. హైకమాండ్ డైరెక్షన్లోనే అంతా నడుస్తోందని ఢిల్లీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రేవంత్ ప్రకటన వెనుక ఆయన! మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం కోసం కాంగ్రెస్లో సీనియర్లు అర్జీలు పెట్టుకున్నారు. అందులో మన్నె జీవన్రెడ్డి, కొత్త కోట సీతాదయాకర్ లాంటివాళ్లు ఉన్నారు. అయినా గానీ.. వంశీచంద్రెడ్డికి ఎలా సీటు ప్రకటించారనే డౌట్లు లేవనెత్తారు కొందరు. అయితే రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయడం వెనుక.. ఢిల్లీ నుంచి మద్ధతు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన చేయాలని ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్కు హైకమాండ్ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం.. రాహుల్ గాంధీ అనే చర్చా పార్టీలో జరుగుతోంది. పార్టీలో యువరక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చాలాకాలంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా బల్మూరీ వెంకట్కు, రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్కు అవకాశం దక్కినట్లు స్పష్టం అవుతోంది. అలాగే.. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నేతగా ఉన్న టైంలో రాహుల్తో వంశీకి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. వీటన్నింటికి తోడు.. జోడో యాత్ర సమయంలోనూ రాహుల్ వెంటే వంశీ నడిచారు. ఈ పరిణామాలన్నీ వంశీకి అనుకూలించాయనే చెప్పొచ్చు. ఇక అధిష్టానం సూచనలతోనే రాబోయే రోజుల్లోనూ మరికొందరి పేర్లను ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. -
బీజేపీ గూటికి మనీశ్ తివారీ?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ బీజేపీ కండువా కప్పుకుంటారని, ఆ పార్టీ తరఫున పంజాబ్లోని లూధియానా లోక్సభ స్థానం బరిలో దిగుతారని ఆదివారం వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ పుకార్లంటూ తివారీ కార్యాలయం ఖండించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుౖడు కమల్నాథ్ తన కుమారుడు, ఎంపీ నకుల్తో పాటు బీజేపీ గూటికి చేరనున్నారంటూ కూడా వార్తలొస్తుండటం తెలిసిందే. ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై ప్రశ్నించగా ‘ఏమైనా ఉంటే మీకే మొదట చెబుతా’నంటూ దాటవేశారు! -
టీఎంసీకి షాక్.. ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా
కోల్కతా: సార్వత్రిక ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నటి, టీఎంసీ నేత మిమీ చక్రవర్తి తన లోక్సభ ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన నియోజకవర్గంలో స్థానిక పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు స్థానిక నేతలతో విభేదాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో జాదవ్పూర్ స్థానం నుంచి మిమీ చక్రవర్తి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. తన రాజీనామా లేఖను టీఎంసీ అధినేతి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అందజేశారు. అయితే ఆమె సీఎం ఆమోదించలేదు. ప్రొటోకాల్ ప్రకారం లోక్సభ ఎంపీ రాజీనామాను స్పీకర్కు సమర్పించాలి. ఇంకా లోక్సభ స్పీకర్కు రాజీనామాను అందజేయ్యకపోవడంతో ఇది అధికారిక రాజీనామాగా పరిగణించకపోవచ్చు. -
అందరి గురి మల్కాజిగిరి!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు పదును పెట్టింది. పార్టీ ముఖ్యులతో ముమ్మర చర్చలు జరుపుతోంది. శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఢిల్లీ నివాసంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కె.లక్ష్మణ్, డీకే అరుణ, మురళీధర్ రావు, బండి సంజయ్, ఈటల రాజేందర్, గరికపాటి మోహన్రావు, జితేందర్ రెడ్డి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అందిన దరఖాస్తులను పరిశీలించారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి ఐదుగురి పేర్లు పరిగణనలోకి తీసుకున్నారు. మల్కాజిగిరి స్థానానికి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. తనకున్న ప్రజాదరణ, రాజకీయ అనుభవాన్ని దృష్టిలోపెట్టుకుని మల్కాజిగిరి సీటు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇదే సీటును ఆశిస్తున్న మురళీధర్రావు.. దశాబ్దాలుగా తనకున్న జాతీయ స్థాయి అనుభవం, పార్టీకి అంకిత భావంతో పనిచేయడం పరిగణనలోకి తీసుకుని పోటీకి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నట్లు సమాచారం. మాజీ ఎంపీ చాడా సురేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్రెడ్డి కూడా ఈ సీటును కోరుతున్నారు. ఈ సీటుపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో దీనిపై నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగించినట్లు తెలిసింది. మరోవైపు జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని జైపాల్రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, ఆలె భాస్కర్, మురళీగౌడ్ భావిస్తుండగా, మహబూబ్నగర్ నుంచి పోటీకి డీకే అరుణ, జితేందర్రెడ్డి, శాంతకుమార్ బరిలో ఉన్నారు. త్వరలో అభ్యర్థుల ప్రకటన: కిషన్రెడ్డి అధిష్టానంతో చర్చించిన తర్వాత త్వరలోనే ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని సమావేశానంతరం కిషన్రెడ్డి మీడియాకు చెప్పారు. తొలి జాబితాలోనే వీలైనన్ని ఎక్కువ పేర్లు ప్రకటిస్తామన్నారు. తమ పార్టీకి రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా ఉందని, గ్రామ స్థాయిలో పార్టీలో చేరికల కోసం 25 మంది యువకులు, మహిళలు, రైతులతో కమిటీలు వేస్తామన్నారు. దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారిన బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోని ఆఫీస్కు తాళం వేశారని, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంటుందని విమర్శించారు. -
‘ఆప్’ నేతల ఇళ్లపై ఈడీ దాడులు
మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. మంగళవారం ఈడీ బృందం పదికిపైగా ప్రదేశాలలో తనిఖీలు జరిపింది. ఢిల్లీ జల్బోర్డు అవినీతి కేసులో ఈడీ ఈ దాడులను చేపట్టింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ఇంట్లో ఈడీ సోదాలు జరిపింది. వాటర్ బోర్డు మాజీ సభ్యుడు శలభ్ కుమార్ ఆస్తులపై కూడా దాడులు జరిగాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఎన్డీ గుప్తా నివాసంలో ప్రస్తుతం ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఇదిలావుండగా ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన రిటైర్డ్ డీజేబీ చీఫ్ ఇంజనీర్ జగదీష్ అరోరా, కాంట్రాక్టర్ అనిల్ అగర్వాల్ల ఈడీ కస్టడీని మరో ఐదు రోజుల పాటు పొడిగించారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఢిల్లీ జల్ బోర్డుకు విద్యుదయస్కాంత ప్రవాహ మీటర్ల సరఫరాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జగదీష్ అరోరా, అనిల్ అగర్వాల్లు అరెస్టయ్యారు. ఐదు రోజుల కస్టడీ గడువు ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరి రిమాండ్ను పొడిగించాలని ఈడీ కోరగా, అందుకు అంగీకరించిన కోర్టు ఇద్దరి రిమాండ్ను ఐదు రోజుల పాటు పొడిగించింది. గత ఏడాది నవంబర్ 18, 2023న కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా విలేకరుల సమావేశంలో ఢిల్లీ జల్ బోర్డులో రూ.3,237 కోట్ల కుంభకోణం జరిగినట్లు పేర్కొన్నారు. 2018-19 నుండి 2022-23 మధ్య బోర్డు ఆర్థిక వ్యయానికి సంబంధించిన సమాచారం దాచిందని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో బోర్డులో అనేక ఆర్థిక అవకతవకలు వెలుగు చూశాయి. -
బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తా
కుషాయిగూడ: తాను బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ మేయర్ బొంతు రాంమోహన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాను మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీ‹Ùరావుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వారికి కాకుండా ఉద్యమ నాయకులు, పార్టీ అభ్యున్నతి కోసం అహరి్నశలు కష్టపడ్డవారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు. నగర మేయర్గా గ్రేటర్ అభివృద్దితో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. అధిష్టానం తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కలి్పస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
17 సీట్లు.. 306 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్లో లోక్సభ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ల కోసం టీపీసీసీ దరఖాస్తులను ఆహ్వానించగా గడువు ముగిసే సమయానికి 306 దరఖాస్తులు వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. తొలి రెండు రోజుల్లో 41 దరఖాస్తులు రాగా శుక్రవారం 100 దరఖాస్తులు, శనివారం ఏకంగా 165 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, నల్లగొండ స్థానాలకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. శనివారం దరఖాస్తు చేసుకున్న ప్రముఖుల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ (ఖమ్మం), చెన్నూరు ఎమ్మెల్యే జి. వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ, రేవంత్రెడ్డి సన్నిహితుడు పటేల్ రమేశ్రెడ్డి (నల్లగొండ), టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్ (భువనగిరి), రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరుడు పిడమర్తి రవి (వరంగల్), టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు (మెదక్), సీనియర్ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం (కరీంనగర్) తదితరులున్నారు. బరిలోకి బంధుగణం.. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న లోక్సభ స్థానాలకు పార్టీలోని ముఖ్య నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా స్థానాల్లో మంత్రులు, ఇతర ముఖ్య నేతల బంధువులు, వారి సన్నిహితులు రంగంలోకి దిగారు. దరఖాస్తుదారుల్లో గడ్డం వంశీ, ఊట్ల వరప్రసాద్, గోమాస శ్రీనివాస్, పెరిక శ్యామ్ (పెద్దపల్లి), సిరిసిల్ల రాజయ్య, మోత్కుపల్లి నర్సింహులు, సర్వే సత్యనారాయణ, నమిండ్ల శ్రీనివాస్ (వరంగల్), మల్లు రవి, ఎస్. సంపత్కుమార్ (నాగర్కర్నూల్), కుందూరు రఘువీర్, పటేల్ రమేశ్రెడ్డి (నల్లగొండ), చామల కిరణ్, కోమటిరెడ్డి పవన్, కుంభం కీర్తిరెడ్డి, చనగాని దయాకర్, పున్నా కైలాశ్నేత (భువనగిరి), జగ్గారెడ్డి, సోమేశ్వరరెడ్డి (మెదక్), బండ్ల గణేశ్, దిలీప్ కుమార్, హరివర్ధన్రెడ్డి, సర్వే సత్యనారాయణ (మల్కాజిగిరి), బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ (మహబూబాబాద్), వి. హనుమంతరావు, రేణుకాచౌదరి, మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్రెడ్డి, వి.వి. రాజేంద్రప్రసాద్ (ఖమ్మం) ఉన్నారు. దరఖాస్తుల గడువు ముగియడంతో ఈ నెల 6లోగా టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశమై వాటిని షార్ట్లిస్టు చేస్తుందని, ఆ జాబితాను ఏఐసీసీ నియమించిన తెలంగాణ స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తుందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. -
ఖమ్మం రేసులో డిప్యూటీ సీఎం భార్య.. ఎంపీ టికెట్కు దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం ఎంపీ టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆమె గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం నుంచి సోనియాగాంధీ, ప్రియాంకను పోటీ చేయాలని కోరామన్నారు. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని.. వారు పోటీ చేయకుంటే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు ఆమె తెలిపారు. దాదాపు 20 ఏళ్లుగా ఖమ్మం ప్రజలతో కలిసి పనిచేస్తున్నామని, వారి ఒత్తిడి మేరకే ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని, తెలంగాణలో అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్త చేశారు. దేశంలో రాహుల్ ప్రధాని కావడం ఖాయమని నందిని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీల నుంచి పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని పలు లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇదీ చదవండి: టీ కాంగ్రెస్లో ఒక్క ఛాన్స్ ప్లీజ్!