
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని నిడదవోలు టీడీపీలో వర్గపోరు పీక్ స్టేజ్కు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే శేషారావు, కుందల సత్యనారాయణ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఈ ఘటన జరగడం విశేషం.
వివరాల ప్రకారం.. నిడదవోలు నియోజకవర్గంలో చంద్రబాబు యాత్ర పారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడకు వస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే శేషారావు, కుందల సత్యనారాయణ వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. చంద్రబాబుకు స్వాగతం పలికే విషయంపై వాదనలకు దిగారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు కల్పించుకుని వారికి సర్దిచెప్పడంతో ఈ వ్యవహరం సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment