nidadavole
-
నిడదవోలులో మానసిక దివ్యాంగులకు అండగా నాట్స్
అమెరికాలో తెలుగు వారికి పలుసార్లు అండగా నిలిచిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నిడదవోలు మండలం రావిమెట్లలో హృదయాలయం మానసిక దివ్యాంగుల పాఠశాలకు నాట్స్ తన వంతు చేయూత అందించింది. ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ఈ పాఠశాలను సందర్శించారు. మానసిక దివ్యాంగుల చదువుకు వినియోగించే మెటీరియల్ కోసం 50 వేల రూపాయలను నాట్స్ అందించింది. హోప్ ఫర్ స్పందన సహకారంతో గత కొంత కాలంగా నాట్స్ మానసిక దివ్యాంగులకు చేయూత అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. సమాజంలో మానసిక దివ్యాంగులకు మానవత్వంతో ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన బాధ్యత ఉందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి అన్నారు. నాట్స్ మానసిక దివ్యాంగులకు అండగా నిలిచేందుకు తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. దివ్యాంగుల కోసం నాట్స్తో కలిసి పనిచేస్తున్న హోఫ్ ఫర్ స్పందనకు నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సింగపూర్లో భారత సంతతి వ్యక్తి మృతి..వాటర్ ట్యాంక్ని క్లీన్ చేస్తుండగా..) -
సీఎం వైఎస్ జగన్ సభకు తరలివచ్చిన జనసంద్రం
-
నిడదవోలులో వివాహ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్
-
నిడదవోలు: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
నిడదవోలు(తూ.గో. జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పర్యటనకు బయల్దేరివెళ్లిన సీఎం జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి నిడదవోలుకు బయల్దేరి వెళ్లిన సీఎం జగన్కు సుబ్బరాజుపేట హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ సుదీర్ కుమార్లు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గం.లకు వివాహ రిసెప్షన్ వేదికకు చేరుకున్న సీఎం జగన్.. వధూవరులను ఆశీర్వదించారు. హోం మంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వేణుగోపాల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు జక్కం పూడి రాజా, ఎంపీ మర్గాని భరత్ , పలువురు ప్రజా ప్రతినిధులు వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. \ -
తూర్పుగోదావరిలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
సాక్షి, నిడదవోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్కు సీఎం హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు నిడుదవోలు చేరుకుంటారు. 11 గంటలకు నిడుదవోలు గాంధీనగర్లో సెయింట్ ఆంబ్రోస్ గ్రౌండ్స్లో జరగనున్న ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్కు సీఎం హాజరుకానున్నారు. అనంతరం 11.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: దుష్టచతుష్టయానికి దత్తపుత్రుడు జతకలిశాడు: సీఎం జగన్ -
బాబు పర్యటన వేళ టీడీపీలో వర్గపోరు.. తన్నుకున్నంత పనిచేశారు!
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని నిడదవోలు టీడీపీలో వర్గపోరు పీక్ స్టేజ్కు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే శేషారావు, కుందల సత్యనారాయణ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఈ ఘటన జరగడం విశేషం. వివరాల ప్రకారం.. నిడదవోలు నియోజకవర్గంలో చంద్రబాబు యాత్ర పారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడకు వస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే శేషారావు, కుందల సత్యనారాయణ వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. చంద్రబాబుకు స్వాగతం పలికే విషయంపై వాదనలకు దిగారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు కల్పించుకుని వారికి సర్దిచెప్పడంతో ఈ వ్యవహరం సద్దుమణిగింది. -
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు టీడీపీలో వర్గపోరు
-
టీడీపీ బినామీలు గో బ్యాక్.. వికేంద్రీకరణ ముద్దు అంటూ నినాదాలు
సాక్షి, నిడదవోలు: అమరావతి పాదయాత్రకు తూర్పుగోదావరిలోని నిడదవోలులో నిరసన సెగ తగిలింది. కాగా, నిడదవోలులో పాదయాత్రకు వ్యతిరేకంగా ప్రజలు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రా స్టేట్ ముద్దు అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. టీడీపీ బినామీలు గో బ్యాక్ అంటూ ప్రజా సంఘాల నిరసన తెలిపాయి. వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య చిచ్చు వద్దంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. మూడు రాజధానులకే మా మద్దతు అంటూ ప్రజా సంఘాల నేతలు నినాదాలు చేశారు. -
అమరావతి పాదయాత్రకు రెండో రోజూ నిరసన సెగలు
-
సీఎం జగన్ది అభివృద్ధి.. మరి చంద్రబాబుది?
సాక్షి, తూర్పు గోదావరి: నిడదవోలు నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల మహాపాదయాత్రకు.. అక్కడ కూడా నిరసనే స్వాగతం పలికింది. అమరావతి రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్ర స్టేట్ ముద్దు అంటూ వివిధ స్లొగన్స్ తో పోస్టర్లు ఏర్పాటు చేశారు నాయకులు. జగన్(సీఎం జగన్ను ఉద్దేశించి..)ది స్టేట్ గురించి ఆలోచన అని, చంద్రబాబుది(ప్రతిపక్ష నేత చంద్రబాబు) రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన అని అందులో పేర్కొన్నారు. జగన్ కోరుకొనేది అందరి అభివృద్ధి అయితే.. చంద్రబాబు కోరుకునేది అస్మదీయుల అభివృద్ధి అని, జగన్ది సమైక్యవాదం అని, చంద్రబాబుది భ్రమరావతి నినాదం అని, జగన్ది అభివృద్ధి మంత్రం అయితే.. చంద్రబాబుది రాజకీయ కుతంత్రం అని.. ఇలా అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా.. జై అమరావతి నినాదానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను ఖుల్లాగా ప్రచురించారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా నిడదవోలులో రౌండ్ టేబుల్ సమావేశం
-
గ్రహ శకలం కనుగొన్న విద్యార్థిని.. అరుదైన రికార్డు సొంతం
నిడదవోలు(తూర్పుగోదావరి జిల్లా): నిడదవోలుకి చెందిన పదో తరగతి విద్యార్థి కుంచాల కైవల్యరెడ్డి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ముఖ్యమైన ఆ్రస్టాయిడ్ బెల్ట్లో గ్రహ శకలం 2021 సీఎం37ను కనుగొన్నది. నాసా భాగస్వామ్య సంస్థ అయిన అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన క్యాంపెయిన్లో ఈ గ్రహశకలాన్ని కనిపెట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ సంబంధిత ధ్రువీకరణపత్రాన్ని కైవల్యకు అందజేసింది. చదవండి: మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే.. పాన్స్టార్స్ టెలిస్కోప్ సాయంతో తీసిన అంతరిక్ష ఛాయా చిత్రాలను ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించి విశ్లేషించడం ద్వారా ఈ గ్రహశకలాన్ని గుర్తించినట్లు కైవల్య తెలిపింది. ఢిల్లీకి చెందిన స్వచ్ఛంధ సంస్థ స్పేస్పోర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సమీర్ సత్యదేవ్ వద్ద కైవల్యరెడ్డి శిక్షణ తీసుకుని ‘గామా’ టీం పేరు తో శకలాన్ని గుర్తించింది. గతంలో కైవల్య 2020 పీఎస్ 24 అనే మెయిన్ బెల్ట్లో ఉన్న గ్రహశకలాన్ని కనుగొనడంతో సీఎం వైఎస్ జగన్ ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు. రెండో గ్రహశకలం కనుగొన్న కైవల్యని తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి అభినందించారు. -
నిడదవోలులో బ్లాక్ ఫంగస్ లక్షణాలు
సాక్షి, పశ్చిమ గోదావరి: నిడదవోలులో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. సమాచారం ప్రకారం..15 రోజుల క్రితం బాధితుడు కరోనా నుంచి కోలుకున్నాడు. కాగా ఏలూరు ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన సమయానికే బాధితుడు కన్నువాపుగా ఉండేది. అయితే గత వారం రోజులుగా కన్నువాపు పెరుగుతుండడంతో రాజమండ్రి, విశాఖ ఆస్పత్రుల్లో పరీక్షలు చేసుకోగా ఫంగస్ లక్షణాలుగా నిర్థారణ అయ్యింది. ఈ వాపు కన్నుతో పాటు, ముక్కు, మెదడుకు వ్యాపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ( చదవండి: ఏలూరు ఆంధ్రా హాస్పిటల్పై క్రిమినల్ కేసు ) -
తల్లి రెండో భర్త లైంగిక వేధింపులే కారణమా..?
పశ్చిమగోదావరి , నిడదవోలు : పట్టణంలో పాటిమీద సెంటర్లో పాత ట్రెజరరీ వీధిలో దుర్రు ప్రియ బాంధవి(20)అనే విద్యార్థిని సోమవారం ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలో సంచలనం రేపిన ఈ సంఘటనపై విద్యార్థిని తల్లి నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె మరణానికి తన రెండో భర్త ఈగల అప్పలరాజు కారణమని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదులో వివరాలు ఇలా ఉన్నాయి. ప్రియ బాంధవి ఉరి వేసుకుని చనిపోయిందని అప్పలరాజు తన భార్య నాగమణికి సమాచారం ఇచ్చి అక్కడ నుంచి పరారయ్యాడు. ఇంత వరకు అతని ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రియ బాంధవి ప్రస్తుతం తణుకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ రెండో సంవత్సరం చదువుతోంది. పట్టణంలో పాటిమీద సెంటర్లో నివాసం ఉంటున్న దుర్రు నాగమణి భర్త నాగరాజు మృతి చెందగా ఏడేళ్ల క్రితం విశాఖపట్నం గాజువాకకు చెందిన ఈగల అప్పలరాజు అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. నాగమణి మొదటి భర్త నాగరాజుకు ప్రియ బాంధవి జన్మించింది. ఏడేళ్లలో వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భార్యభర్తలు తరచూ గొడవలు పడేవారు. కన్నతల్లికి తీరని కడుపుకోత ఇంటిలో ఉన్న చీటీ పాట ద్వారా వచ్చిన 32,000 రూపాయలను తీసుకుని పట్టణంలో రహస్య ప్రాంతంలో పేకాట ఆడుతున్న అప్పలరాజు అచూకీ తెలుసుకుని తల్లీకూతుళ్లు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో అప్పలరాజు నాగమణిని కొట్టడంతో చనిపోతానని అక్కడ నుంచి ఆటోలో వెళ్లిపోయింది. ప్రియ కూడా అక్కడ నుంచి ఇంటికి తానే వెళ్లిపోయిందా ..ఇంటి దగ్గర ఎవరైనా దింపారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగమణి కొంత దూరం వెళ్లే సరికి తన భర్త ఫోన్ చేసి ప్రియ బాంధవి ఇంటిలో తలుపులు వేసుకుందని చెప్పడంతో నాగమణి తిరిగి వెనక్కి వచ్చేసింది. నేను వచ్చే లోపల ఇదంతా జరిగిపోయిందని, కన్న కూతురిలా చూసుకోవాల్సిన తండ్రి కూతురు వరసైనా ప్రియ బాంధవిని లైంగిక వేధింపులకు గురిచేశాడని, తన కూతురు అనేక సార్లు తనతో మొర పెట్టుకుందని నాగమణి ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయటకు తెలిస్తే తన కూతురు భవి ష్యత్, పరువు నాసనమవుతాయని బయట పెట్ట లేక కడుపులోనే దాచుకున్నానని నాగమణి కన్నీరు మున్నీరవుతోంది. అప్పలరాజు గతంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. తన భర్త ప్రస్తుతం ప రారీలో ఉన్నాడని నాగమణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నాగమణి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు. -
ఇసుక విక్రయదారులపై అధికారుల దాడి
అధిక ధరలు వసూలుపై తొమ్మిది మందిపై కేసులు నాలుగు లారీలు, ఐదు పడవలు సీజ్ నిడదవోలు రూరల్ : గోదావరి నది నుంచి ఇసుకను తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై శనివారం ఉదయం రెవెన్యూ, పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు. మండలంలోని తాళ్లపాలెం, శెట్టిపేట గ్రామాల్లో పడవల ద్వారా ఇసుకను రవాణా చేసి అధిక ధరలకు విక్రయించడంతో పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, సీఐ ఎం.బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేసి ఐదు పడవలు, నాలుగు లారీలు సీజ్ చేశారు. పడవల నుంచి లారీలకు ఇసుకను విక్రయిస్తున్న 9 మందిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై జి.సతీష్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్ ఇసుకను రూ.800కు విక్రయించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేయగా పడవ నిర్వాహకులు మాత్రం యూనిట్ ఇసుకను రూ.1500 పైనే వసూలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. అధిక ధరలకు ఇసుక విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
కాలువలో జారిపడి మహిళ మృతి
నిడదవోలు : నిడదవోలులో గూడెం రైల్వేగేటు సమీపంలోని చెక్పోస్టు వద్ద పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో మంగళవారం కాలుజారి పడి ఓ మహిళ మృతిచెందింది. పట్టణంలోని చర్చిపేటకు చెందిన తూరుగోపు కుమారి (45) అనే మహిళ కాలువ ఒడ్డున బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలోకి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు ఆమెను కాపాడేలోపు మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పిల్లల చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. దీంతో కూలీ పనులు చేసుకుంటూ ఆమె కుటుంబాన్ని పోషిస్తోంది. తల్లి అకాలమరణంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. పట్టణ ఎస్సై జి.సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
కాల్వలోకి దూసుకుపోయిన కారు
ఏలూరు: అదుపుతప్పి కారు కాల్వలోకి దూసుకుపోవడంతో ఇద్దరు మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామం వద్ద ఆదివారం ఉదయం ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాల్వలోకి దూసుకుపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు. మృతులు విజయవాడకు చెందిన కంబాల సాయిరాం, గోపీచంద్గా గుర్తించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
కరెంట్ కాటేసింది
నిడదవోలు రూరల్: నిడదవోలు మండలంలోని శెట్టిపేట శివారులో కాకరపర్రు రెగ్యులేటర్ కాంట్రాక్టర్ వద్ద వాచ్మెన్గా పనిచేస్తున్న ఖమ్మం గోపాలకృష్ణ (66) అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతిచెందినట్టు పట్టణ ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆచంట గ్రామానికి చెందిన గోపాలకృష్ణ ఏడేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం భార్య రాధమ్మతో వచ్చి రెగ్యులేటర్ వద్ద వాచ్మెన్గా చేరాడు. అప్పటినుంచి రెగ్యులేటర్ నిర్మాణానికి వినియోగించే సామాన్లను భద్రంగా చూడటంతో పాటు కాకరపర్రు లాకుల వద్ద పనిచేసే ఇరిగేషన్ సిబ్బందికి చేదోడువాదోడుగా ఉంటూ అక్కడే నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోజుమాదిరిగానే మంగళవారం ఉదయం రెగ్యులేటర్ కార్యాలయం ముందు ఉన్న కొండాలమ్మవారిని దర్శించుకుని లైట్లు ఆపడానికి స్వీచ్ ఆన్చేయగా షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతదేహం వద్ద భార్య రాధమ్మ, బంధువులు గుండెలవిసేలా రోదించారు. గోపాలకృష్ణ మంచి వ్యక్తిని, నమ్మకంతో పనిచేసేవాడని ఇరిగేషన్, రెగ్యులేటర్ కాంట్రాక్టర్లు గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు. లాక్ సూపరింటెండెంట్లు చిక్కాల బ్రహ్మజీ, రాజు, నీటిసంఘం అధ్యక్షుడు బూరుగుపల్లి శ్రీనివాసరావు శవపంచానామ కార్యక్రమాలను పర్యవేక్షించారు. భార్య రాధమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీష్ చెప్పారు. -
సెల్ బ్యాలెన్సుల కోసం సమాధుల తవ్వకం!
నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని 28 వార్డులో ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలోని సమాధులను ధ్వంసం చేసిన కేసులో 10 మంది మైనర్ పిల్లలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆకతాయి తనంతో చేసినట్టు నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక సీఐ కార్యాలయంలో సీఐ ఎం.బాలకృష్ణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. పట్టణంలోని క్రైస్తవ శ్మశాన వాటికలోని సమాధులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కన్వీనర్ పిల్లి డేవిడ్ కుమార్, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు పట్టణ పోలీస్ స్టేష¯ŒSలో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ కేసులో చర్చిపేటకు చెందిన 10 మంది మైనర్ పిల్లలు ఆకతాయితనంతో సమాధులను ధ్వంసం చేసినట్టు గుర్తించామన్నారు. సమాధులు, సమాధులపై శిలువలో ఉన్న ఇనుప ఊచలను స్థానిక పాత ఐర¯ŒS షాపుల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో సెల్ బ్యాలె¯Œ్స వేసుకుని పిల్లలు తప్పుదోవ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతుందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు సీఐ తెలిపారు. ఆకతాయి చిన్నారుల తల్లిదండ్రులను పోలీస్స్టేష¯ŒSకు పిలిపించి వారికి పిల్లల పెంపకం, తీసుకోవాలి్సన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇచ్చారు. పట్టణ ఏస్సై జి.సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. -
మోటార్ సైకిళ్ల దొంగ అరెస్ట్
నిడదవోలు : పట్టణంలోని వివిధ కూడళ్లలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడిన యువకుడిని నిడదవోలు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై జి.సతీష్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పట్టణంలో వైఎస్సార్ కాలనీకి చెందిన కోయి శివప్రసాద్ పట్టణంలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. పట్టణంలోని బసివిరెడ్డిపేట రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర నిడదవోలు–తాడేపలి్లగూడెం రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండగా పాత నేరస్తుడైన కోయి శివప్రసాద్ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకుని విచారించగా మోటార్ సైకిళ్లు దొంగతనం చేసినట్టు తెలిపాడన్నారు. పట్టణంలోని గణపతి సెంటర్లో ఈ నెల 12న డిస్కవరీ నీలంరంగు మోటార్ సైకిల్, అదే రోజు రాత్రి గాంధీనగర్లోని బార్భర్ షాపు తాళం పగులగొట్టి ఎల్ఈడీ టీవీ, షాపు ఎదురుగా ఉన్న హోండా యాక్టివా మోటార్ సైకిల్ను దొంగిలించాడు. రూ.1.30 లక్షల విలువ చేసే మోటార్ సైకిళ్లు, టీవీని స్వాధీనపరుచుకున్నామని చెప్పారు. పోలీస్, క్రైమ్ పార్టీ సిబ్బందిని సీఐ ఎం. బాలకృష్ణ అభినందించారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం రూరల్ : వేర్వేరు చోట్ల చోరీలకు పాల్పడిన ఘటనల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు ఆటోలు, ఏడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ ఎంఆర్ఎల్ఎస్ఎస్.మూర్తి తెలిపారు. మంగళవారం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మోదుగగుంట గ్రామానికి చెందిన దండ్రు వెంకన్నబాబు, దండ్రు దుర్గారావులు ఈ చోరీలకు పాల్పడ్డారన్నారు. పట్టణ శివారు కొండాలమ్మ గుడి వద్ద మంగళవారం అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారన్నారు. వారి వద్ద నుంచి రెండు ఆటోలు, ఏడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.3 లక్షలు ఉంటుందన్నారు. కొవ్వూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ జె.వెంకట్రావు సూచనల మేరకు మోటారు సైకిళ్ల దొంగలపై నిఘా ఏర్పాటు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. సమావేశంలో పట్టణ ఎస్సై చిన్నం ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
నిజంగా.. వానేనా
తాడేపల్లిగూడెం రూరల్ : మండే ఎండలు, ఊపిరిసల్పని ఉక్కపోతలు. ఇలాంటి సమయంలో చల్లని గాలి.. హాయిగొలిపే చినుకు.. ఇంతకన్నా ఏముంది ఓదార్పు. గురువారం రాత్రి ఒక్కసారిగా వర్షం పడి ప్రజలను సేదతీర్చింది. జిల్లాలోని తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పలకరించింది. రాత్రి 7.15 గంటలకు ప్రారంభమైన వర్షం 8 గంటల వరకు పడింది. ఆకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. -
పారిశుద్ధ్య కార్మికులపై దాడి
నిడదవోలు : పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా పందులను పట్టుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులపై పందుల పెంపకందారులు దాడికి పాల్పడిన సంఘటన నిడదవోలులో బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలో పందుల సంచారం ఎక్కువకావడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ పలువురు మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి చర్యలకు ఉపక్రమించారు. ప్రజారోగ్యం దృష్ట్యా పందులను నిర్మూలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో పట్టణంలో సంత వద్ద పందుల సంచారం ఎక్కువగా ఉండటంతో శానిటరీ మేస్త్రీ చంద్రబాబు పర్యవేక్షణలో బుధవారం ఉదయం 6.30 గంటలకు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు పందులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సుమారు 20 మంది పందుల పెంపకందారులు ఇక్కడకు వచ్చి వారిని అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారుల ఆదేశాల ప్రకారమే పందులను పట్టుకుంటున్నామని పారిశుద్ధ్య మేస్త్రి, కార్మికులు చెబుతున్నా వినిపించుకోకుండా పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేశారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు బంగారు సత్తిబాబు, ముత్యాల సాయి, బొచ్చా దుర్గాప్రసాద్ స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి, పట్టణ ఏస్సై ఎస్.సతీష్, కమిషనర్ జి.కృష్ణమోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చైర్మన్ కృష్ణమూర్తి బాధితులను పరామర్శించారు. పందుల నిర్మూలనకు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదని పెంపకందారులను హెచ్చరించారు. సంఘటనపై కమిషనర్ జి.కృష్ణమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన పందుల పెంపకందారులు కోతాడ చిన్నా, జి.సూరిబాబు, గాడా బాలజీపై ఎస్సై జి.సతీష్ కేసు నమోదు చేశారు. -
సహనం.. మన జీవన మార్గం
నిడదవోలు : తన కోపమే తన శత్రువు.. ఏ కార్యమైన శాంతి, సహనంతోనే జయించవచ్చని ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. నిడదవోలు మండలంలోని ఉనకరమిల్లిలో సీతారామ మందిరం వద్ద శ్రీరామనవమి వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పారు. సుమారు గంటపాటు రామాయణంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, రా ముడు, సీత అన్యోన్యత, భక్తిమార్గాలను ప్రబోధించేలా ఆయన ప్రసంగం ఆసాం తం ఆకట్టుకుంది. ఓర్పు, సహనం జీవన మార్గం కావాలని, వీటిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని చెప్పారు. సీతామాత శాంతి, సహనం మార్గాలతో విజయం సాధించిందన్నారు. ఆలయాలకు వెళ్లి పూజలు చేసినంత మాత్రం ఫలితం సిద్ధించదని, మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా చేసిన పూజ సంపూర్ణంగా ఫలితాని్నస్తుందని చెప్పారు. సీతామాతను మహిళలంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చాగంటి ప్రవచనానికి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. -
పింఛను కోసం తిరిగి తిరిగి.. గుండె పగిలి
నిడదవోలు : పింఛను సొమ్ము కోసం మూడు రోజులపాటు బ్యాంకు చుట్టూ తిరిగిన ఓ వృద్ధుడు తన ఖాతాలో ఆ మొత్తం జమ కాలేదని తెలిసి ఆవేదనతో గుండెపోటు గురై మృత్యువాతపడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నిడదవోలు ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న బైపే యేసేబు (75) తనకు రావాల్సిన వృద్ధాప్య పింఛను సొమ్ము కోసం రెండు కిలోమీటర్ల దూరంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మూడు రోజులుగా వెళుతున్నాడు. కాళ్లు లాగుతున్నా గంటలకొద్దీ క్యూలో నిలబడటం, చివరకు పింఛను సొమ్ము జమకాలేదని బ్యాంక్ సిబ్బంది చెప్పడం పరిపాటిగా మారింది. తనకు పింఛను సొమ్ము వస్తుందో రాదో తెలియడం లేదని, బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నానని, నడిచివెళ్లడం, క్యూలో గంటలకొద్దీ నిలబడాల్సి రావడంతో ఆయాసం, ఒగుర్పు వస్తోందని గురువారం రాత్రి కన్నీళ్లు పెట్టుకున్నాడని యేసేబు కుమార్తె రత్నమ్మ వాపోయింది. శుక్రవారం వేకువజామున గుండె పోటుకు గురై మరణించాడని చెప్పింది. యేసేబు భార్య, ఇద్దరు కుమారులు గతంలోనే మరణించాడు. మూడు రోజులపాటు బ్యాంక్ చుట్టూ తిరిగినా పింఛను సొమ్ము రాకపోవడంతో మందులు కొనుక్కోలేకపోయాడని, చివరకు మృత్యువాత పడ్డాడని అతని కుమార్తె కన్నీళ్లు పెట్టుకుంది. -
పశ్చిమడెల్టాకు 5000 క్యూసెక్కుల సాగు నీరు
నిడదవోలు : విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ నుండి పశ్చిమడెల్టా ప్రధాన కాలువకు శుక్రవారం నుంచి 5,000 క్యూసెక్కుల నీటిని తగ్గించి విడుదల చేస్తున్నారు. గురువారం వరకు 7,000 క్యూసెక్కుల విడుదల చేసిన అధికారులు 1,000 క్యూసెక్కులు తగ్గించి విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న మూడు డెల్టాలకు 10,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు3,000 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 2,200 క్యూసెక్కులు వదులుదున్నారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 13.96 మీటర్లు నమెదయ్యంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీల నుండి 25,183 క్యూసెక్కుల మిగులు జలాలలను సముద్రంలోకి వదులుతున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలోని ఏలూరు కాలువకు 865 క్యూసెక్కులు,నరసాపురం కాలువకు 1774, తణుకు కాలువకు 465, ఉండి కాలువకు 1129 క్యూసెక్కులు, అత్తిలి కాలువకు 390 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
నిడదవోలు.. జనం ఘొల్లు
నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని గూడెం రైల్వేగేటు వద్ద ప్రయాణికుల పాట్లు వర్ణనాతీతం. తాడేపల్లిగూడెం–రాజమండ్రికి దగ్గరదారి కావడంతో ఇటుగా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇది రైల్వే మెయిన్ లైన్ కావడబంతో రోజూ 200 రైళ్లు ప్రయాణిస్తున్నాయి. దీంతో సగటున రోజుకు 150 సార్లు రైల్వే గేటు వేస్తున్నారు. రోజూ 200 రైళ్లు నిడదవోలు మీదుగా రోజుకు సుమారు 200 రైళ్లు విజయవాడ, విశాఖ వైపునకు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గేటు వేయాల్సి వస్తోంది. దీంతో రోజుకు సగటున 150 సార్లు గేటు పడుతుంది. ఈ సమయంలో వాహనాల రద్దీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. గేటు పడినప్పుడల్లా కనీసం 20 నిమిషాల సమయం వథా అవుతోంది. గేటు వేసేటప్పుడు, తీసేటప్పుడు కనీసం సిబ్బంది ఎటువంటి హెచ్చరికలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైల్వేగేటును వాహనాలు ఢీకొన్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో రైల్వే సిగ్నల్ వ్యవస్థ దెబ్బతిని గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. దీనికితోడు రైల్వేగేటు తరచుగా మోరాయించడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. కొన్నిసార్లు పట్టణంలో పోలీస్స్టేషన్ వరకు, గేటుకు అవతల బసివిరెడ్డిపేట వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. అధికారులు ప్రతిపాదించిన నమూనా.. సామర్లకోట బ్రిడ్జిని పోలిన నమూనాను అధికారులు ఇక్కడ రూపాందించారు. ప్రస్తుతం ఉన్న రైల్వేగేటుకు విజయవాడ వైపునకు 100 మీటర్ల దూరంలో రైల్వేట్రాక్ పైనుంచి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు రైల్వేట్రాక్ నుంచి సుమారు 95 మీటర్ల పొడవునా ఫోర్ లైన్ బ్రిడ్జికి ప్రతిపాదించారు. దీనిని అనుసంధానం చేస్తూ ఇక్కడ నుంచి పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ సమీపంలోకి, తాడేపల్లిగూడెం వైపు, సమిశ్రగూడెం కాలువ పైకి ఆర్మ్లు నిర్మించాల్సి ఉంది. అయితే ఆర్వోబీ నిర్మాణం కలగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్తగా రూ.135 కోట్ల అంచనాలతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గూడెం గేటు వద్ద ఆర్వోబీ నిర్మిస్తే తప్ప పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదు. -
కోటసత్తెమ్మ వారి ఆదాయం రూ.2.34 లక్షలు
నిడదవోలు : నిడదవోలు కోటసత్తెమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 15 వేల మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద చండీ పారాయణం, చండీహోమంతో పాటు 494 మంది దంపతులచే సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు రాజమండ్రికి చెందిన కలవకొలను హర్షవర్ధన్, నిడదవోలుకు చెందిన ముళ్లపూడి సోమరాజు వారిచే చక్కెర పొంగళి, దేవస్థానం వారిచే పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. అమ్మవారికి ఆదివారం వివిధ రూపాల్లో రూ. 2,34,307 ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి యాళ్ల శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి, అర్చకులు అప్పారావుశర్మ పాల్గొన్నారు. -
మహిళ ఆత్మహత్య
నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని రామ్నగర్లో బుధవారం రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. రామ్నగర్కు చెందిన ఎస్కే నజీమున్నీసా (45) మాససిక స్థితి సరిగ్గా లేకపోవడంతో కొంత కాలంగా మందుల వాడుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి బాత్రూంలోకి వెళ్లి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కుమారుడు షేక్ షబ్బీర్ కూలిపనికి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి మృతిచెంది ఉంది. మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఆమె గతంలో నూతిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై డి.భగావన్ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
నిడదవోలు : పట్టణంలోని పాటిమీద సెంటర్లో ఇండియన్ బ్యాంకు అరుగుపై ఓ వ్యక్తి గురువారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. చాగల్లు మండలం నందిగంపాడు గ్రామానికి చెందిన చాపల కొండయ్య (45) తీ¯Œæమార్ బృందంలో డప్పు వాయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. బుధవారం ఆయన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ వెళ్లాడు. తిరిగి గ్రామానికి బయలుదేరాడు. ఏమైందో ఏమోగానీ గురువారం పట్టణంలోని బ్యాంకు ముందు మృతిచెంది పడి ఉన్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ డి.భగవా¯Œæప్రసాద్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి S భార్య మంగ, ముగ్గురు కుమారులు ఉన్నారు. దళిత సంఘాల రాస్తారోకో కొండయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేయడంలో రెవెన్యూ, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర కన్వీనర్ పిల్లి డేవిడ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రి ముందు దళిత సంఘాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. దీంతో పట్టణ ఎస్ఐ డి.భగవాన్ప్రసాద్ ఆందోళనకారులతో చర్చించారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించవద్దని సూచించడంతో వారు రాస్తారోకోను విరమించారు. ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న కేవీపీఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు. చాపల కొండయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. -
అటు వెళ్లొద్దు
-రేపటి నుంచి నిడదవోలు రైల్వేగేటు మూసివేత - ట్రాక్ మరమ్మతుల కోసం 22 వరకు ఇంతే.. - కానూరు, పెరవలి మీదుగా వాహనాల మళ్లింపు నిడదవోలు : ఉభయ గోదావరి జిల్లాల నడుమ రాకపోకల కోసం ఏర్పాటు చేసిన నిడదవోలు ప్రధాన రైల్వే గేటు శుక్రవారం నుంచి వారం రోజులపాటు మూతపడనుంది. ట్రాక్ మరమ్మతుల నిమిత్తం ఈనెల 16నుంచి 22వ తేదీ వరకు గేటును మూసివేస్తున్నట్టు నిడదవోలు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ వి.సోమేశ్వరరావు బుధవారం తెలిపారు. రెండు నెలలకు ఒకసారి గేటు వద్ద ట్రాక్ మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా, రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరవుతుందనే ఉద్దేశంతో గడచిన ఏడాది కాలంగా మరమ్మతులను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఓవర్ బ్రిడ్జి మంజూరు కాకపోవడంతో ఇప్పుడు ట్రాక్ మరమ్మతులు చేపడుతున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. కానూరు, పెరవలి మీదుగా వాహనాల మళ్లింపు రైల్వే గేటు మూసివేస్తుండటంతో నిడదవోలు మార్గంలో రాజమహేంద్రవరం వైపు వెళ్లే వాహనాలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి తలెత్తింది. తాడేపల్లిగూడెం–రాజమహేంద్రవరం మధ్య ప్రయాణానికి నిడదవోలు మార్గం తక్కువ దూరం కావడంతోపాటు సౌకర్యవంతంగా ఉంటుంది. గేటును మూసివేస్తుండటంతో నిడదవోలు మీదుగా తాడేపల్లిగూడెం వైపు వెళ్లే వాహనాలను సమిశ్రగూడెం, కానూరు, పెరవలి, తణుకు మీదుగా మళ్లిస్తున్నట్టు టౌన్ ఎస్సై డి.భగవాన్ ప్రసాద్ చెప్పారు. తాడేపల్లిగూడెం నుంచి రాజమహేంద్రవరం, కొవ్వూరు వెళ్లే వాహనాలు తణుకు, పెరవలి, కానూరు మీదుగా ప్రయాణించాల్సి ఉందన్నారు. కొన్ని వాహనాలను రావులపాలెం మీదుగా మళ్లిస్తున్నారు. ఆర్టీసీ పికప్ సర్వీసులు రైల్వే గేటు మూసివేస్తుండటంతో ఆర్టీసీ అధికారులు పికప్ సర్వీసుల పేరిట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం నుంచి రాజమహేంద్రవరం వెళ్లే ప్రయాణికులను నిడదవోలు గేటు దగ్గర దించుతారు. ప్రయాణికులు కాలినడకన గేటు దాటి అవతలి వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో నేరుగా రాజమహేంద్రవరం వెళ్లవచ్చు. రాజమహేంద్రవరం వైపు నుంచి తాడేపల్లిగూడెం వచ్చే ప్రయాణికులు సైతం ఇదేవిధంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే గేటు ఇవతలి నుంచి తాడేపల్లిగూడెం వరకు 10, రైల్వే గేటు అవతలి వైపునుంచి రాజమహేంద్రవరం వరకు 10 చొప్పున పికప్ సర్వీసులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ జీఎల్పీవీ సుబ్బారావు తెలిపారు. ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు నడిపేలా చర్యలు చేపట్టామన్నారు. రాజమహేంద్రవరం–తాడేపల్లిగూడెం సర్వీసుల్లో కొన్నిం టిని తణుకు మీదుగా నడిపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిడదవోలు నుంచి ఏలూరు వెళ్లే బస్సులను పంగిడి మీదుగా పంపిస్తామన్నారు. బైక్పై ఇలా వెళ్లొచ్చు.. ద్విచక్ర వాహన చోదకులు, ఆటోలు తాళ్లపాలెం మీదుగా శింగవరం నుంచి నిడదవోలు వచ్చేందుకు రహదారి సదుపాయం ఉంది. ఇది సింగిల్ రోడ్డు మాత్రమే. నిడదవోలు పట్టణం నుంచి కంసాలిపాలెం మీదుగా నందమూరు వెళ్లే రహదారి సింగిల్ రోడ్డు కావడంతో అటువైపు భారీ వాహనాలను నిషేధించినట్టు ఎస్సై భగవాన్ ప్రసాద్ తెలిపారు. ఈ రోడ్డుపై ప్రయాణం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. -
రైలు ఢీకొని వృద్ధురాలి మృతి
నిడదవోలు : రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. యశ్వంత్ పూర్–హౌరా ఎక్స్ప్రెక్ నిడదవోలు స్టేషన్ నుంచి విశాఖ వైపు వెళ్తుడగా చిన్నకాశీరేవు సమీపంలోని రైల్వేట్రాక్ను తైలమ్మ(70) అనే వృద్ధురాలు దాటుతోంది. ఆమెను గమనించిన లోకోపైలట్ సడన్ బ్రేక్ వేశారు. అయినా ఫలితం లేకపోవడంతో రైలు వృద్ధురాలిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన తైలమ్మను స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించింది. తైలమ్మ స్థానిక చర్లసుశీల వృద్ధాశ్రమంలో ఉంటుంది. ఇంజన్లో సమస్య.. 30 నిమిషాలు నిలిచిన రైలు బ్రేక్ వేసిన సమయంలో ఇంజన్లో సమస్య తలెత్తడంతో 30 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో గేటు వేయడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రైల్వే గేటు వద్ద నుంచి పోలీస్స్టేషన్ వరకు, ఇటువైపు శెట్టిపేట వరకు వాహనాలు బారులు తీరాయి. పట్టణ ఎస్ఐ భగవాన్ ప్రసాద్ రైల్వే మేనేజర్ ఆకుల ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్కు వెళుతూ మృత్యు ఒడిలోకి..
కలవచర్ల (నిడదవోలు): ఎంసెట్ కౌన్సెలింగ్కు వెళుతూ ఓ విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన నిడదవోలు మండలంలోని కలవచర్ల గ్రామ శివారున ఉన్న పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన సత్తి నాగదుర్గ శాంతికుమార్ (22) ఇంటర్మీడియెట్ పూర్తిచేశాడు. కాకినాడలో ఎంసెట్ కౌన్సెలింగ్కు వెళ్లేందుకు ఉదయం తన స్నేహితుడు బండారు సారుు నరేంద్రతో కలిసి మోటార్సైకిల్పై బయలుదేరాడు. కలవచర్ల శివారును ఉన్న బంకు వద్ద పెట్రోల్ పోరుుంచుకుని నిడదవోలు వైపుగా బంకులో నుంచి బయటకు వస్తున్నాడు. అదే సమయంలో నిడదవోలు నుంచి పెరవలి మండలం ఖండవల్లివైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో మోటార్సైకిల్ ఎగిరిపడగా నాగదుర్గ శాంతి కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున బండారు సాయినరేంద్ర స్వల్పగాయూలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. నిడదవోలు రైల్వేస్టేషన్ వరకూ మోటార్ సైకిల్పై వచ్చి అక్కడి నుంచి రైలులో కాకినాడ వెళ్దామని వీరు అనుకున్నారు. తమతో సరదాగా మాట్లాడిన శాంతికుమార్ కొద్దిక్షణాల్లోనే దుర్మరణం పాలవ్వడం జీర్ణించుకోలేకపోతున్నామని బంకు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కానూరుకు చెందిన సత్తి సత్యనారాయణ, మంగతాయారు దంపతులకు ముగ్గురు కుమారులలో నాగదుర్గ శాంతి కుమార్ పెద్దవాడు. చిన్నతనంలోనే తం డ్రి సత్యనారాయణ మరణించడంతో శాంతికుమార్ కానూరులో తాతయ్య ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ దుర్ఘటనతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నం టారుు. నిడదవోలు రూరల్ ఎస్సై నరేంద్రకుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుని మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఇసుక ర్యాంపుల్లో అవినీతి కంపు
నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న మూడు ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. డ్వాక్రా మహిళల ముసుగులో ప్రజాప్రతినిధులు, అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ర్యాంపుల్లో నిబంధనలకు గాలికొదులుతూ ఇష్టానుసారంగా దొరికినకాడికి దోచేస్తున్నారు. నిడదవోలు మండలంలో పెండ్యాల, పందలపర్రు ర్యాంపులతో పాటు ఇటీవల ర్యాంపు పనులు చేపట్టిన తీపర్రులో అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. పెండ్యాల ఇసుక ర్యాంపులో రెండు రోజుల క్రితం దొంగ వేబిల్లులతో ఇసుక రవాణా జరుగుతోందని అందిన సమాచారంతో వచ్చిన పోలీసులు లారీలను తనిఖీలు చేశారు. దొంగ వేబిల్లులతో ఇసుక రవాణా చేస్తున్న కొన్ని లారీలనుపట్టుకుని రెవెన్యూ అధికారులకు వేబిల్లులను పంపించారు. అయితే ముందు నుంచి ఇసుక రవాణాకు వత్తాసు పలుకుతూ ఏమి తెలియనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు ఈ బిల్లులు సరైనవేనని సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. రెవెన్యూ అధికారులు పూర్తిగా ఓ ప్రజాప్రనిధి చెప్పుచేతల్లో విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటు ప్రజాప్రతినిధులు, అటు ఇసుక మాఫియా చేతుల్లో నలిగిపోతున్నామని నియోజకవర్గ పరిధిలో పేరు చెప్పడానికి ఇష్టపడని రెవెన్యూ అధికారి ఒకరు వాపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రజాప్రతినిధి ఒత్తిడితో పోలీసులు గుర్తించిన నకిలీ వేబిల్లులను పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఇవి కరెక్టుగానే ఉన్నాయనే తేల్చిచెప్పినట్టు తెలిసింది. నిబంధనలకు నీళ్లు.. ఇసుకకు కాళ్లు నిబంధనల ప్రకారం ఇసుక ర్యాంపుల్లో సాయంత్రం 6 గంటలు దాటాక ఇసుక రవాణా చేయరాదు. కాని రాత్రి, పగలు తేడా లేకుండా రోజుకి ఒక్కో ర్యాంపు నుంచి సుమారు 200 లారీలు వెళుతున్నాయి. అంతే కాకుండా సదరు ప్రజాప్రనిధి అనుచరులు ర్యాంపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాలుగు యూనిట్లకు బిల్లులు తీసుకుని ర్యాంపుల వద్దకు వెళితే అక్కడ కొందరు లారీ డ్రైవర్ల వద్ద అదనంగా సొమ్ము తీసుకుని ఆరు నుంచి, ఎనిమిది యూనిట్లు వేస్తున్నారు. ఇదే ఆంశంపై గతంలో డ్వాక్రా మహిళలు అడ్డుకుని ఇసుక అక్రమ రవాణాను వెలుగులోకి తీసుకువచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు లారీలకు జరిమానాలు విధించారు కూడా. మూడురోజులుగా విజిలెన్స్ తనిఖీలు ఇటీవల నిడదవోలు మండలం పెండ్యాల, పందలపర్రు ర్యాంపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు రావడంతో మూడు రోజులుగా ఇసుక ర్యాంపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మండలంలో పందలపర్రు ఇసుక ర్యాంపులో విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్స్మెంట్ అధికారులు పలు రికార్డులు పరిశీలించారు. పందలపర్రు ర్యాంపులో ఎంత లోతులో ఇసుక తవ్వకాలు జరిగాయి అనే దానిపై కొలతలు చేపట్టారు. ప్రభుత్వం అనుమతించిన సరిహద్దులలో కాకుండా బయట ఇసుక తవ్వకాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. పందలపర్రు ర్యాంపు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 71వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. రికార్డుల్లో మాత్రం 67 వేల క్యూబిక్ మీటర్లు తవ్వినట్టు ఉంది. ర్యాంపులో 4 వేల క్యూబిక్ మీటర్ల తేడా ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత మేర తవ్వడానికి అనుమతులు ఉన్నాయి. సరిహద్దులను దాటి ఏ మేరకు ఇసుక తవ్వకాలు జరిగాయనే దానిపై అధికారులు లెక్కలు తేల్చాల్సి ఉంది. -
జోరుగా వైఎస్సార్సీపీ గడప గడపకు కార్యక్రమం
-
వీధి దీపం.. నిడదవోలుకు శాపం
నిడదవోలు, న్యూస్లైన్ : నిడదవోలు వీధుల్లో వెలుగులు నింపేందుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయూరైంది. నాజూకైన పెద్ద స్తంభాలు.. వాటికి అమర్చిన బల్బులు అలంకారప్రాయంగా మారారుు. మునిసిపల్ యంత్రాంగం వీటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేయడంతో పట్టణంలో ఏ వైపు చూసినా చీకటి రాజ్యమేలుతోంది. గణపతి సెంటర్, గణేష్ చౌక్, వీధి దీపం.. నిడదవోలుకు శాపం ఓవర్ బ్రిడ్జి, రైల్వేస్టేషన్, సంత మార్కెట్, గాంధీ బొమ్మ, బస్టాండ్, రైల్వే గేటు, పాత మునిసిపల్ కార్యాలయం సెంటర్లలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. కూడలి ప్రాంతాల్లోని స్తంభాలకు నాలుగేసి లైట్లు, మిగిలినచోట్ల ఉన్న స్తంభాలకు రెండేసి చొప్పున 94 లైట్లు వేశారు. గణేష్ చౌక్లోలో ఏడాది కాలంగా లైట్లు వెల గడం లేదు. ఈ సెంటర్ వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. లైట్లు పనిచేయకపోవడంతో రాత్రివేళ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారుు. ఈ సెంటర్ మీదుగా రాజ మండ్రి, నరసాపురం, తణుకు, పంగిడి ప్రాం తాల నుంచి వాహనాలు వస్తూపోతుంటారుు. లైటింగ్ లేకపోవడం వల్ల వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. ఓవర్ బ్రిడ్జి సెంటర్లో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్లో ఒక్క దీపం మాత్రమే వెలుగుతోంది. గాంధీ బొమ్మ సెంట ర్లో ఒక్క లైటు కూడా వెలగటం లేదు. రైల్వేస్టేషన్ సెంటర్లో మాత్రం ఒకే ఒక దీపం మిణుకు మిణుకుమంటుండగా, మిగిలినవి పనిచేయడం లేదు. సంత మార్కెట్ సెంటర్లోనూ ఇదే పరిస్థితి. మిగిలిన చోట్ల కూడా ఒకటి, రెండు దీపాలు మినహా వెలగడం లేదు. దీంతో దొంగల భయం అధికమవుతోంది. ఓవర్ బ్రిడ్జి, బస్టాండ్ సెంటర్లలో చీకట్లు కమ్ముకోవడంతో చీకటి కార్యకలాపాలు అధికమవుతున్నారుు. -
‘లడ్డుబాబు’లో లావుగా కనిపిస్తా
నిడదవోలు, న్యూస్లైన్: కామెడీ పాత్రల నుంచి విభిన్నపాత్రల్లో నటించాలనే కోరికతో అల్లరి రవిబాబు దర్శకత్వంలో లడ్డుబాబు సినిమా చేసినట్టు హీరో అల్లరి నరేష్ చెప్పారు. మంగళవారం నిడదవోలులో షూటింగ్లో పాల్గొన్న ఆయన కొంతసేపు విలేకర్లతో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ‘లడ్డుబాబు సినిమాలో నేను పూర్తిగా లావుగా కనిపిస్తా. ఒక మనిషి 250 కేజీల్లో ఎలా ఉంటాడో అదే గెటప్లో కనిసిస్తా. ఆ సినిమా వచ్చేనెలలో విడుదలవుతంది. ఇప్పటివరకు నేను 45 చిత్రాల్లో నటించాను. సొంత సంస్థ ఈవీవీ సినిమా బ్యానర్పై ఆరు చిత్రాల్లో నటించాను. నా 50వ చిత్రం మా బ్యానర్పై నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో చిన్నికృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాను. మంచి కథ, కథనం ఉన్న చిన్న సినిమాలను సైతం తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే స్వామిరారా, ఉయ్యాల జంపాలా వంటి సినిమాలు హిట్ అయ్యాయి. దర్శకునిగా చూడాలనుకున్నారు. నాన్నగారు అన్నయ్య ఆర్యన్ రాజేష్ను హీరోగా, నన్ను దర్శకునిగా చూడాలనుకున్నారు. ప్రస్తుతం అన్నయ్య ప్రొడక్షన్ వ్యవహరాలను చూసుకుంటున్నారు. నాన్నగారికోరిక మేరకు నాలుగేళ్లలో దర్శకత్వం చేపట్టి బయట హీరోలతో చిత్రం నిర్మిస్తా. మాది నిడదవోలు మండలం కోరుమామిడి అని అందరూ అనుకుంటారు. మాది కొవ్వూరు మండలం దొమ్మేరు. నేను పుట్టింది పాలకొల్లులో. సామాజిక సేవ చేయాలనే తలంపుతో తండ్రి సత్యనారాయణ పేరున ట్రస్టు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న’ట్టు నరేష్ వెల్లడించారు. -
త్వరలో దర్శకత్వం చేస్తా
పండించడం ఓ వరమని హాస్యనటుడు ఎర్ర రఘుబాబు అన్నారు. సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు మంగళవారం నిడదవోలు వచ్చిన ఆయన ‘న్యూస్లైన్’తో ముచ్చటించారు. రఘుబాబు మాట్లాడుతూ ‘1991లో గురువు సత్యారెడ్డి దర్శకత్వంలో దొంగలున్నారు.. జాగ్రత్త సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాను. మా తండ్రి గిరిబాబును ఆదర్శంగా తీసుకుని నటనపై ఆసక్తి పెంచుకున్నాను. మంచి నటుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలనే తపనతో కష్టపడి నటుడిగా గుర్తింపు పొందాను. గిరిబాబు కొడుకు కదా అని ఎవరూ పిలిచి అవకాశాలు ఇవ్వలేదు. ఎలాంటి సిఫార్సులు లేకుండా పరిశ్రమలో గుర్తింపు పొందడంతో నాన్న ఎంతో గర్వపడుతున్నారు. ఇప్పటివరకు 253 చిత్రాల్లో నటించాను. తెలుగులో 250, తమిళంలో రెండు, కన్నడంలో ఒక సినిమాలో నటించా. మురారి, ఆది, కబడ్డీ కబడ్డీ, చెన్నకేశవరెడ్డి, బెట్టింగ్ బంగార్రాజు, ఖడ్గం, దిల్, వేదం చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం సునీల్ హీరోగా భీమవరంబుల్లోడు, మోహన్బాబు తనయులతో పాండవులు పాండవులు తుమ్మెద, చార్మి హీరోయిన్గా ప్రతిఘటన-2, రేసుగుర్రం సినిమాల్లో నటిస్తున్నా. త్వరలో ఎన్టీఆర్ రభస, మహేష్ ఆగడు, వీవీ వినాయక్ సినిమాల్లో నటించనున్నాను. హాస్యాన్ని పండించడం నాకు దేవుడిచ్చిన వరం. ఇది అందరికీ సాధ్యపడదు. సినీ పరిశ్రమలో పోటీని తట్టుకుని ప్రతిభ చూపేవారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. కొత్తదనంతో కామెడీను పండిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. పలువురు వీఐపీలు, ఉద్యోగులు, వైద్యులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కామెడీ చిత్రాలు చూస్తున్నారు. దేశంలో ఏ పరిశ్రమలో లేనంత మంది హాస్యనటులు తెలుగు చిత్రసీమలో ఉన్నారు. అన్నీ కలిసి వస్తే త్వరలో దర్శకత్వం చేస్తా. సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రానికి దర్శకత్వం వహించాలన్నదే నా ఆశ’. అని మనసులోని మాటను చెప్పారు. నేటినుంచి పట్టిసీమలో షూటింగ్ అల్లరి నరేష్ హీరోగా ఈ.సత్తిబాబు దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ మంగళవారం నిడదవోలు గాంధీనగర్లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో జరిగింది. హాస్యనటులు రఘుబాబు, ఖయ్యుం, జీవా, రావు రమేష్, భరత్పై కొన్ని హాస్యసన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. చిత్ర కథలో భాగంగా నటులు జీవా వైద్యునిగా, రావు రమేష్, రఘుబాబు రోగులుగా సన్నివేశాలను తెరకెక్కించారు. హాస్యనటుల రాకతో గాంధీనగర్ ప్రాంతంలో సందడి నెలకొంది. షూటింగ్ను తిలకించేందుకు స్థానికులు ఆసక్తి కనబర్చారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు పట్టిసీమలో షూటింగ్ చేస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు.