
సాక్షి, కరీంగనర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్పందించారు. హుజూరాబాద్లో నైతిక విజయం తనదే అన్నారు. ఈ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. విద్యార్థి నాయకుడు వెంకట్ని బలిపశువును చేశాయని గెల్లు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఫలితంపై కేటీఆర్, హరీశ్రావు కూడా స్పందించారు.
(చదవండి: హుజూరాబాద్లో ఓటమి.. వైరలవుతోన్న కేటీఆర్ ట్వీట్)
ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 24వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెల్లు శ్రీనివాస్పై విజయం సాధించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ కేవలం 3000పైచిలుకు ఓట్లకే పరిమితం అయ్యింది.
చదవండి: Huzurabad Bypoll Results: బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు: హరీశ్ రావు
Comments
Please login to add a commentAdd a comment