result
-
ఈ రోడ్లో డీఎంకే ముందంజ
ఈ రోడ్: తమిళనాడులోని ఈ రోడ్ (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్ ఓట్లు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలోని ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ ఓట్ల లెక్కింపులో డీఎంకే అభ్యర్థి చంద్రకుమార్ ముందంజలో ఉన్నారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 51 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈరోడ్ (తూర్పు) అసెంబ్లీ స్థానం 20028లో డీలిమిటేషన్ తర్వాత ఏర్పడింది. అప్పటి నుండి ఈ నియోజకవర్గంలో ఏడుపార్లు ఎన్నికలు జరిగాయి, వాటిలో మూడు లోక్సభ ఎన్నికలు కాగా 2023 ఫిబ్రవరిలో ఉప ఎన్నిక జరిగింది. ఈరోడ్ పార్లమెంటరీ సీటులోని అసెంబ్లీ సెగ్మెంట్ 2014, 2019, 2024లో ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికలన్నింటిలోనూ ఏఐడీఎంకే అభ్యర్థులను నిలబెట్టింది. 2016 డిసెంబర్లో పార్టీ అధినేత జయలలిత మరణం తర్వాతే అన్నాడీఎంకే పరాజయాలను ఎదుర్కొంటూ వస్తోంది. ఇక డీఎంకే విషయానికొస్తే, ఆ పార్టీ 2011, 2016లో రెండుసార్లు ఆ స్థానానికి పోటీ చేసి ఓడిపోయింది. ఈసారి ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థి వీసీ చంద్రకుమార్ 2011లో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే ఈరోడ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్టికెట్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. కాగా ఈ ఏడాది మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి జులై 1న ఫలితాలు వెల్లడించారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలను యూపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. త్వరలో న్యూ ఢిల్లీలోని షాజహాన్ రోడ్లోని ధోల్పూర్ హౌస్లో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ ఇంటర్వ్యూలో ఎంపికైన వారిని ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక చేస్తారు. -
ఉప ఎన్నికల్లో అధికార పార్టీల హవా
న్యూఢిల్లీ: పదమూడు రాష్ట్రాల్లో 46 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే కైవసం చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు తమ స్థానాలను మళ్లీ గెల్చుకున్నాయి. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది. అత్యధికంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు 26 చోట్ల గెలిచాయి. ఇవి గతంలో పోలిస్తే అదనంగా తొమ్మిది స్థానాల్లో గెలవడం విశేషం. కాంగ్రెస్ ఏడు చోట్ల గెలిచింది. గతంలో గెలిచిన స్థానాల్లో ఆరింటిని చేజార్చుకుంది. పశ్చిమబెంగాల్లో ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. ఐదు స్థానాలను నిలబెట్టుకున్న టీఎంసీ ఈసారి మదారిహాట్ను బీజేపీ నుంచి లాగేసుకుంది. కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో జూనియర్ వైద్యురాలి రేప్, హత్యోదంతం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైనాసరే ఆ అంశం రాష్ట్రంలో టీఎంసీ హవాను ఆపలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మూడు చోట్ల, సమాజ్వాదీ పార్టీ రెండు చోట్ల గెలిచాయి. కేరళలో ఎల్డీఎఫ్ కూటమిలోని సీపీఐ(ఎం) పార్టీ, రాజస్థాన్లో భారత్ ఆదివాసీ పార్టీ(బీఏపీ) పార్టీ ఒక్కో స్థానంలో జయకేతనం ఎగరేశాయి. యూపీలో బీజేపీ హవా ఉత్తరప్రదేశ్లో 9 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా అధికార బీజేపీ ఆరు చోట్ల విజయం సాధించింది. రాష్ట్రంలోని కుందార్కీ, ఘజియాబాద్, ఖేర్, ఫూల్పూర్, ఖతేహరీ, మఝావాన్లో బీజేపీ గెలిచింది. కర్హాల్, సిషామావూలలో సమాజ్వాదీ పార్టీ, మీరాపూర్లో రాష్ట్రీయ లోక్దళ్ విజయం సాధించాయి. కుందార్కీ స్థానంలో 12 మంది పోటీచేస్తే అందులో 11 మంది ముస్లిం అభ్యర్థులే. ఈ 11 మంది అభ్యర్థుల్ని వెనక్కి నెట్టి ఏకైక హిందూ అభ్యరి్థ, బీజేపీ నేత రామ్వీర్ సింగ్ ఏకంగా 1,44,791 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం విశేషం. 1993 నుంచి చూస్తే ఈ స్థానంలో బీజేపీ గెలవడం ఇదే తొలిసారి. ఖతేహరీలోనూ 1991 తర్వాత బీజేపీకి తొలిసారిగా విజయం దక్కింది. రెండూ క్రాంతికారీకే సిక్కింలోని రెండు స్థానాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా గెల్చుకుంది. రాజస్థాన్లో అధికార బీజేపీ ఏడింటికిగాను ఐదు చోట్ల జయపతాకం ఎగరేసింది. అస్సాంలోని ఐదు స్థానాలనూ బీజేపీ, దాని మిత్రపక్షాలే గెల్చుకున్నాయి. బీజేపీ మూడు చోట్ల, అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ(యునైటెడ్) ఒక్క స్థానంలో గెలిచాయి. పంజాబ్లోని నాలుగు స్థానాల్లో మూడింటిని ఆమ్ ఆద్మీ పార్టీ తన వశంచేసుకుంది. బిహార్లోని నాలుగు స్థానాలకుగాను రెండు చోట్ల బీజేపీ, ఒక చోట హిందుస్తానీ ఆవామ్ మోర్చా, మరో చోట జనతాదళ్(యునైటెడ్) గెలిచాయి. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్కిశోర్కు చెందిన జన్సురాజ్ పార్టీ అభ్యర్థులు దాదాపు అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. కర్ణాటకలోని మొత్తం మూడు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ అభ్యర్థి మన్ప్రీత్ సింగ్ బాదల్ గిద్దెర్బహాలో ఓడారు, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సతీమణి అమృత, గుర్దాస్పూర్ ఎంపీ సుఖ్జీందర్ రంధావా భార్య జతీందర్ కౌర్ సైతం ఓడారు. ఇది కూడా చదవండి: By Election Results: ఆసక్తికరంగా ఉప ఎన్నికల ఫలితాలు -
Pulwama Assembly: పుల్వామాలో గట్టి పోటీ
పుల్వామా: నేడు(సోమవారం) హర్యానాతో పాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. జమ్ముకశ్మీర్లోని 90 నియోజకవర్గాల్లో పుల్వామా అసెంబ్లీ స్థానం ఒకటి. పుల్వామా అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గంలో భాగం. ఈసారి పుల్వామా సీటుపై గట్టి పోటీ నెలకొంది.నేషనల్ కాన్ఫరెన్స్ పుల్వామా సీటు నుంచి మహ్మద్ ఖలీల్ బంద్ను నిలబెట్టింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ వాహిద్ పారాకు టిక్కెట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండడంతో ఈ సీటు నేషనల్ కాన్ఫరెన్స్ ఖాతాలో చేరింది. ఈ స్థానానికి 1962లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ మాత్రమే ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తున్నాయి.ఈ సీటుపై బీజేపీ నేటికీ ఖాతా తెరవలేదు.2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పీడీపీకి చెందిన మహ్మద్ ఖలీల్ విజయం సాధించారు. పుల్వామా జిల్లా మొత్తం జనాభా 5.60 లక్షలు. జిల్లా పరిపాలనా కేంద్రం శ్రీనగర్కు 31 కిలోమీటర్ల దూరంలో పుల్వామాలో ఉంది. జిల్లాలో 85.65శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో, 14.35శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. ఈ ప్రాంతం వరితో పాటు నాణ్యమైన కుంకుమపువ్వు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది.ఇది కూడా చదవండి: Haryana Election Result : ఈ నేతల ఫలితంపైనే అందరి దృష్టి -
Haryana Election Result : ఈ నేతల ఫలితంపైనే అందరి దృష్టి
చండీగఢ్: హర్యానాలోని మొత్తం 90 లోక్సభ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరిగింది. నేడు(మంగళవారం) ఆయా స్థానాల ఫలితాలు వెల్లడికానున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? లేక బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందా? అనేది నేడు తేలనుంది. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అదేవిధంగా బరిలో ఉన్న పలువురు బడా నేతల ఫలితంపై అందరి దృష్టి నిలిచింది.భూపేంద్ర సింగ్ హుడాహర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా గర్హి సంప్లా కిలోయ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సీటుపై ఆయనకు గట్టి పట్టు ఉంది. హుడా రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్కు మెజారిటీ వస్తే సీఎం పదవికి ఆయనే బలమైన పోటీదారుగా భావిస్తున్నారు.నాయబ్ సింగ్ సైనీమనోహర్ లాల్ ఖట్టర్ను హర్యానా నుండి ఢిల్లీకి పంపిన తరువాత, బీజేపీ నాయబ్ సింగ్ సైనీకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. ఆయన కురుక్షేత్రలోని లాడ్వా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్కు చెందిన మేవా సింగ్ పోటీనిస్తున్నారు. గత ఎన్నికల్లో మేవా సింగ్ లాడ్వా స్థానం నుంచి గెలుపొందారు.అనిల్ విజ్హర్యానా బీజేపీలో విజ్ కీలక నేతగా గుర్తింపు పొందారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన విజ్ అంబాలా కాంట్ అభ్యర్థి. 1967 నుంచి 2019 వరకు పంజాబీ వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.దుష్యంత్ చౌతాలాఉచానా స్థానం నుంచి జేజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా పోటీ చేస్తున్నారు. గతంలో ఐదేళ్ల పాటు ఆయన బీజేపీ ప్రభుత్వంతో జతకట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల పంపకంపై ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో పొత్తు తెగిపోయింది. 2019లో ఉచానా స్థానం నుంచి దుష్యంత్ చౌతాలా గెలుపొందారు.వినేష్ ఫోగట్పారిస్ ఒలింపిక్స్ 2024 నుండి తిరిగి వచ్చిన తరువాత, వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. జులనా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫోగట్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. వినేష్పై బీజేపీ తరపున మాజీ పైలట్ యోగేష్ బైరాగి పోటీ చేస్తున్నారు.సావిత్రి జిందాల్దేశంలోనే అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హిసార్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె హర్యానాలోని కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ తల్లి. సావిత్రి జిందాల్ హర్యానాలో మంత్రిగా కూడా పనిచేశారు.ఇది కూడా చదవండి: కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు -
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల
సాక్షి ,హైదరాబాద్ : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్స్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 2.45లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 👉తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం ఈ లింక్ను క్లిక్ చేయండి డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తక్కువ సమయంలో ఫలితాలు ఇచ్చాం 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుంది దసరాలోపు ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు ఇస్తాం 56 రోజుల్లో డీఎస్సీ విడుదల చేశాం మేం అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం గత సర్కార్ విద్యా వ్యవస్థను నిర్విర్యం చేసింది 10ఏళ్లలో 7వేల టీచర్ పోస్ట్లు మాత్రమే భర్తీ చేశారు పోస్టుల వారీగా చూస్తే..పోస్టుల వారీగా చూస్తే.. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. -
హిమాచల్ ఉప ఎన్నికల్లో సీఎం భార్య విజయం
దేశంలోని ఏడు రాష్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జూలై 10న ఎన్నికలు జరగగా, నేడు(శనివారం) ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రా ఉపఎన్నికకు సంబంధించిన ఫలితం వెలువడింది.ఇక్కడి నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య, కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ స్థానానికి సంబంధించిన 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. హిమాచల్ ప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో డెహ్రా స్థానం ఫలితం మొదట వెలువడింది. -
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఎస్సీ బోర్డు శుక్రవారం విడుదల చేసింది.ఈ ఫలితాల్లో 73.0శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మార్చి 18న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2తో ముగిశాయి. ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు.అయితే వార్షిక పరీక్షల్లో పెయిలైన ఫెయిలైన విద్యార్ధులకు ఎస్ఎస్ఈ బోర్డు జూన్ 03 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా.. తాజాగా ఆ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆ ఫలితాల్ని https://results.sakshieducation.com/ డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. -
రేపే టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : రేపు (ఏప్రిల్ 28న) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించారు.తెలంగాణలో మార్చి 18న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2తో ముగిశాయి. ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు.ఇక ఏప్రిల్ 30న విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన విద్యార్ధులకు ఎస్ఎస్ఈ బోర్డు జూన్ 03 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షా ఫలితాలను అధికారులు రేపు విడుదల చేయనున్నారు. ఫలితాలను వెబ్సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చు. -
ఏపీ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2024 విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జూన్ 26 తేదీ (బుధవారం) రాత్రి 8:00 గంటలకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు విడుదల చేశారు. మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల్లో మొత్తం 1,61,877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలున్నారని అధికారులు తెలిపారు. ఇక విడుదలైన ఈ పరీక్షా ఫలితాల్లో 62.21 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి -
నీట్ పరీక్షా ఫలితాలు.. కోర్టులో విద్యార్ధినికి చుక్కెదురు
ఢిల్లీ: ఇటీవల ఓ విద్యార్ధిని తన నీట్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ చిరిగిందని, ఫలితంగా మార్కులు తక్కువ వచ్చాయని అలహాబాద్ హైకోర్టులో జూన్ 12న పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఓఎంఆర్ షీట్ను పరిశీలించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆ పిటిషన్పై జస్టీస్ రాజేస్ సింగ్ చౌహాన్ ధర్మాసనం జూన్ 18న విచారణ చేపట్టింది. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ అవతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది.ఈ తరుణంలో నీట్ పరీక్ష రాసిన ఆయుషి పటేల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నీట్ పరీక్షను జాతీయ పరీక్ష మండలి (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఫలితాల్ని విడుదల చేస్తోంది. అయితే ఈ జూన్ 4న విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఆయేషాకు 335 మార్కులు వచ్చాయి. ఆ మార్కులపై విద్యార్ధిని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆన్సర్ కీ ఆధారంగా తనకు 715 మార్కులు వస్తాయని, కానీ వేరే అప్లికేషన్ నంబర్తో విడుదలైన పరీక్ష ఫలితాల్లో కేవలం 335 మార్కులే వచ్చాయని అలహదాబాద్ కోర్టులో వాపోయారు. ఎన్టీఏ ఓఎంఆర్ చించేసిందిఅంతేకాదు జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైన, తన ఫలితాలు వెలువడడంలో జాప్యం జరిగిందని తెలిపింది. తొలుత నీట్ ఫలితాలు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఓఎంఆర్ షీట్ చిరిగిపోయిందని ఎన్టీఏ ఆమెకు మెయిల్ చేసినట్లు తెలిపింది. ఓఎంఆర్ షీట్ను ఉద్దేశపూర్వకంగా చింపేసిందని ఎన్టీఏపై ఆయుషి ఆరోపణలు గుప్పించింది. తన ఓఎంఆర్ షీట్ను మరోసారి పరిశీలించాలని అన్నారు. అంతేకాదు ఎన్టీఏపై విచారణ చేపట్టాలని, త్వరలో జరగాల్సిన అడ్మిషన్ కౌన్సిలింగ్ జరపకుండా నిలిపి వేయాలని కోరారు. నకిలీ పత్రాలు సమర్పించిఅయితే, కోర్టు ఆదేశాలతో ఎన్టీఏ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ను సమర్పించింది. ఆ ఓఎంఆర్ షీట్ చిరిగిపోలేదు. విద్యార్ధిని నకిలీ ఓఎంఆర్ షీట్ను కోర్టుకు సమర్పించినట్లు నిర్దారణకు వచ్చింది. అందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎన్టీఏను ఆపలేమని కోర్టు పేర్కొంది. పిటిషన్ ఉపసంహరణఎన్టీఏ సైతం ఆయుషిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తన ప్రతిపాదనను కోర్టు ముందు ఉంచింది. అయితే వరుస పరిణామాలతో ఆయుషి తరుపు న్యాయవాది తాను దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కోరగా అందుకు కోర్టు అంగీకరించింది. NEET जैसी परीक्षाओं में लाखों बच्चे मेहनत से तैयारी करते हैं और अपनी जिंदगी के सबसे कीमती पल इस तैयारी में लगाते हैं। पूरा परिवार इस प्रयास में अपनी श्रद्धा और शक्ति डालता है। लेकिन साल दर साल इन परीक्षाओं में पेपर लीक, रिजल्ट से जुड़ी गड़बड़ियाँ सामने आई हैं।क्या परीक्षा कराने… pic.twitter.com/mcHwsVb4IH— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 10, 2024ప్రియాంక గాంధీ సైతంఇక ఆయేషీ పటేల్ తనకు అన్యాయం జరిగిందంటూ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి, పేపర్ లీకేజీలు, అవకతవకలపై చర్య తీసుకోవాలని కోరారు. ఆయుషి పటేల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో బీజేపీ నేతలు ప్రియాంక గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు, అసత్యాల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోన్నారు. -
ఎగ్జిట్ పోల్స్పై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు
2024 లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే విపక్షాల ఇండియా కూటమి కూడా తమకు మంచి మెజారిటీ వస్తుందని చెబుతోంది.తాజాగా ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక ప్రకటనలో స్పందించారు. రేపు రానున్న ఎన్నికల ఫలితాలను ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సవాల్ చేస్తున్నాయని అన్నారు. ఫలితాల కోసం వేచి చూడాల్సిందేనని సోనియా అన్నారు.. జస్ట్ వెయిట్ అండ్ సీ.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఫలితాలు వస్తాయనే పూర్తి ఆశతో ఉన్నామని సోనియా గాంధీ పేర్కొన్నారు.ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) మొత్తం 543 లోక్సభ స్థానాల్లో 371 నుండి 401 స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. దీనిలో బీజేపీకి 319 నుంచి 338 సీట్లు వస్తాయని అంచనా. ఇదే జరిగితే పార్లమెంటులో ఎన్డీఏ దాదాపు మూడు వంతుల మెజారిటీకి చేరుకుంటుంది. VIDEO | “We have to wait. Just wait and see. We are very hopeful that our results are completely the opposite to what the exit polls are showing,” says Congress leader Sonia Gandhi.Lok Sabha elections 2024 results will be declared tomorrow. #LSPolls2024WithPTI… pic.twitter.com/xIElzUjJ8P— Press Trust of India (@PTI_News) June 3, 2024 -
బీథోవెన్ డీఎన్ఏలో అంతుచిక్కని రహస్యాలు?
జర్మనీకి చెందిన అలనాటి స్వరకర్త లుడ్విగ్ వాన్ బీథోవెన్ సింఫనీ, పియానో, వయెలెన్ మొదలైన వాటితో మ్యూజిక్ కంపోజ్ చేయడంలో ఎంతో పేరొందారు. తాజాగా ఆయన జుట్టు నుంచి సేకరించిన డిఎన్ఏపై జరిపిన విశ్లేషణ అతనికి సంబంధించిన పలు రహస్యాలను వెల్లడించింది. బీథోవెన్ దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ 1827లో కన్నుమూశారు. అతను వినికిడి లోపం, కాలేయ వ్యాధి, ఉదర సంబంధిత వ్యాధులు, అతిసారంతో బాధపడ్డాడు. బీథోవెన్ తన చివరి రోజుల్లో తన మూలాల గురించి జనానికి సవివరంగా తెలియజేయమని తన సోదరులను కోరారు. డీఎన్ఏ విశ్లేషణ కోసం.. జర్మనీ, యూకేల నుండి వచ్చిన పరిశోధకుల బృందం బీథోవెన్ జుట్టుకు సంబంధించిన డీఎన్ఏను విశ్లేషించింది. బీథోవెన్ డీఎన్ఏని అతని బంధువులుగా భావిస్తున్నవారి డీఎన్ఏతో సరిపోల్చారు. అలాగే అతని ఇప్పుటి బంధువులు ఎవరో తెలుసుకునేందుకు పలు రికార్డులను కూడా పరిశీలించారు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో మృతి బీథోవెన్ జుట్టు నమూనాలలో ఒకటి బీథోవెన్కి చెందినది కాదని, గుర్తు తెలియని మహిళ నుండి వచ్చినదని పరిశోధకులు కనుగొన్నారు. బీథోవెన్ మరణం బహుశా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల సంభవించి ఉండవచ్చునని కూడా వారు కనుగొన్నారు. హెపటైటిస్ వ్యాధి అతని కాలేయాన్ని దెబ్బతీసింది. ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపింది. బీథోవెన్ విషప్రయోగం వల్ల మరణించారనే మునుపటి నమ్మకానికి విరుద్ధమైన ఫలితం వచ్చింది. తండ్రులు వేరా? బీథోవెన్కు చెందిన ‘వై’ క్రోమోజోమ్ అతని తండ్రి తరపు బంధువులతో సరిపోలడం లేదని పరిశోధకులు కనుగొన్నారు. అతని వంశవృక్షంలో తండ్రులు వేరుగా ఉండే అవకాశం ఉందని ఉందని కూడా వారు తెలిపారు. అంటే అతని పూర్వీకులలో ఒకరు వారి వంశానికి చెందిన తండ్రి కాకుండా వేరే వ్యక్తి అయివుంటాడని, అతని ద్వారా బీథోవెన్ జన్మించి ఉండవచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు. -
పాక్ ప్రధాని పదవికి నవాజ్ రెండు ప్లాన్లు?
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక అంచనాకు వచ్చాయి. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థులకు భారీ ప్రజా మద్దతు లభించింది. పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు 99 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ‘నూన్ లీగ్’గా పేరొందిన నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’కి చెందిన 71 మంది ఎంపీల విజయంతో ఇది అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పాక్లో సంకీర్ణం ఏర్పడే పరిస్థితులు తలెత్తడంతో నవాజ్ షరీఫ్ తాజాగా రెండు ప్లాన్ను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్లాన్ ‘ఏ’ నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన సోదరుడు పాకిస్తాన్ మాజీ ప్రధాని షాబాజ్ షరీఫ్ను సహాయకునిగా నియమించారు. ఇతను ఇప్పటికే ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టోతో మంతనాలు జరిపారు. వీరు లాహోర్లోని షరీఫ్ కుటుంబాన్ని కలుసుకోనున్నారు. దీనితోపాటు నవాజ్ షరీఫ్ మరికొన్ని పార్టీలతో మ్యాజిక్ ఫిగర్ రాబట్టేందుకు చర్చలు జరుపుతున్నారని సమాచారం. ప్లాన్ ‘బి’ మరోవైపు నవాజ్ షరీఫ్ 60 మంది స్వతంత్ర ఎంపీలతో టచ్లో ఉన్నారని ఇమ్రాన్ ఖాన్కు మద్దతు ఇస్తున్న స్వతంత్ర ఎంపీలు తెలిపారు. వీరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు నవాజ్, ఆయన కుమార్తె మరియం నవాజ్ ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. -
పోలింగ్ మధ్యలోనే వెలువడిన ఫలితాలు?
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. అయితే ఇంతలోనే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండవ స్థానంలో ఉంటుందని, ఆ తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్ ఉంటుందని ఒక నివేదిక వెల్లడించింది. పోలీసు వర్గాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, కార్మిక సంఘాలు, వివిధ రంగాలకు చెందిన నిపుణుల ఇంటర్వ్యూల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా పాక్ ఎన్నికల ఫలితాలపై ఒక నివేదిక బయటకు వచ్చింది. ఈ రిపోర్టులోని వివరాలను ఒక పాక్ అధికారి మీడియా ముందు వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం నవాజ్ షరీఫ్కు చెందిన పీఎంఎస్- ఎన్ 115 నుండి 132 జాతీయ అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఫలితంగా నవాజ్ షరీఫ్ నూతనప్రభుత్వాన్ని సాధారణ మెజారిటీతోనే ఒంటరిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పంజాబ్ అసెంబ్లీలో నవాజ్ షరీఫ్ పార్టీకి పూర్తి మెజారిటీ లభిస్తుందని ఈ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో నవాజ్ షరీఫ్ పార్టీ ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్లలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అగ్రగామిగా అవతరించనుంది. అయితే సింధ్ ప్రావిన్స్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఈ ఎన్నికల్లో పీపీపీకి 35 నుంచి 40 సీట్లు వస్తాయని, పీటీఐ స్వతంత్ర అభ్యర్థులకు 23 నుంచి 29 సీట్లు రావచ్చనే అంచనాలున్నాయి. అలాగే ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్కు 12-14 సీట్లు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లామ్కు 6-8 సీట్లు, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (క్వైద్), ఇస్తేకామ్-ఏ-పాకిస్థాన్ పార్టీకి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. -
ఇంటర్లోనే ఇలా ఎందుకు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఎందుకు తక్కువగా ఉంటుందనే విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. 2024లో జరిగబోయే పరీక్షల్లో దీనిని అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎక్కువగా ఏ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్నారు? వారికి రివిజన్ చేయడం ఎలా? అనే అంశాలపై జిల్లాల వారీగా నివేదికలు కోరారు. రెసిడెన్షియల్, గురుకులాల్లో మంచి ఫలితాలు వస్తున్నా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. కోవిడ్ తర్వాత 70 శాతం రిజల్ట్ కష్టంగా ఉందని గుర్తించారు. మెరుగైన ఫలితాలు సాధించే సిబ్బందిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. కారణాలేంటి? 2023లో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ 4,33,082 మంది విద్యార్థులు రాయగా, వీరిలో 2,72,280 మంది ఉత్తీర్ణులయ్యారు. 63 శాతం రిజల్ట్ వచ్చింది. ద్వితీయ సంవత్సరంలో 4,19,267 మంది పరీక్ష రాస్తే, 2,65,584 (63 శాతం) పాసయ్యారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్ సెకండియర్లో కనీసం 50 శాతం కూడా పాసవ్వలేదు. జగిత్యాల (23శాతం), సూర్యాపేట (30శాతం), సిద్ధిపేట (34శాతం), నిర్మల్ (49శాతం) జిల్లాలు ఈ కోవలో ఉన్నాయి. పెద్దపల్లి, నల్లగొండ, వరంగల్, మహబూబ్బాద్, కరీంనగర్, వనపర్తి, జనగాం, జిల్లాల్లో 48 శాతం లోపే ఫలితాలొచ్చాయి. నారాయణపేట (100శాతం) మినహా మరే ఇతర జిల్లాలోనూ 75 శాతం ఫలితాలు కనిపించలేదు. 68 శాతం ఫలితాలు ప్రైవేటు కాలేజీల్లో ఉంటుంటే, ప్రభుత్వ కాలేజీల్లో 32 శాతం మించడం లేదు. ఈ పరిస్థితికి గల కారణాలపై ఇంటర్ అధికారులు దృష్టి పెట్టారు. సకాలంలో సిలబస్ పూర్తి కాకపోవడమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. రివిజన్ ఏమాత్రం జరగడం లేదని తెలుసుకున్నారు. జనవరి రెండోవారంలో సిలబస్ పూర్తి చేసి, మిగతా రోజుల్లో రివిజన్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. సీఈసీ...హెచ్ఈసీలోనే ఎక్కువ ► విద్యార్థులు ఎక్కువగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోనే చేరుతున్నారు. సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో తక్కువగా చేరినా, వారిలోనూ చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ► గత ఏడాది సీఈసీలో 98 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే అందులో 37 వేల మంది (37 శాతం) మాత్రమే 2023లో ఉత్తీర్ణులయ్యారు. ► బైపీసీ గ్రూపులో లక్ష మంది పరీక్ష రాస్తే, 64 వేల మంది (64.14) పాసయ్యారు. ► హెచ్ఈసీలో 11,294 మంది పరీక్ష రాస్తే, 3,408 మంది (30.18 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ రిజల్ట్స్ ఇలా ఉంటే.. సెకండియర్లో ఫలితాలు మరీ తగ్గుతున్నాయి. ► ఎంపీసీలో గరిష్టంగా 72 శాతం, బైపీసీలో 67 శాతం ఫలితాలు ఉంటే, హెచ్ఈసీలో 46 శాతం సీఈసీలో 47 శాతం ఉంటోంది. హెచ్ఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఫస్టియర్లో సరిగా బోధన జరగడం లేదని బోర్డు అధికారులు గుర్తించారు. ఈ రెండు గ్రూపులు ఎక్కువగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనే ఉంటున్నాయి. ఈసారి మెరుగైన ఫలితాల దిశగా క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆన్లైన్లో విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 411 ఉద్యోగాల గానూ ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. 57,923 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. వీరిలో 31,193 తుది పరీక్షరాశారు. అక్టోబరు 14, 15 తేదీల్లో తుది రాత పరీక్ష నిర్వహించారు. బుధవారం ఏపీ ఎస్ఎల్పీర్బీ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
భార్యను ఓడించిన భర్త.. అన్నను మట్టికరిపించిన చెల్లి!
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భారీ పరాజయాలతో పాటు పలు ఆసక్తికర ఫలితాలు కూడా చోటు చేసుకున్నాయి. రాజస్థాన్లో ఓ సీటులో భార్యను భర్త ఓడించగా, మరోచోట అల్లుడు, మామ.. ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇంకో సీటులో అన్నదమ్ములిద్దరూ ఓటమి పాలయ్యారు. రాజస్థాన్లోని సీకార్ జిల్లాలో గల దంతారామ్గఢ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వీరేంద్ర సింగ్ విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా ఆయన భార్య రీటా సింగ్ జేజేపీ నుంచి పోటీ చేశారు. వీరేంద్ర సింగ్ తన భార్యను ఓడించారు. వీరేంద్ర సింగ్ గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈయన పీసీసీ మాజీ చీఫ్ నారాయణ్ సింగ్ కుమారుడు. మార్వార్ ప్రాంతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రిచ్పాల్ మిర్ధా కుమారుడు విజయపాల్ మిర్ధా.. దేగానా నుంచి, మరో కుమారుడు ఖిన్వ్సర్ నుంచి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేశారు. అయితే వీరిద్దరూ ఓటమి పాలయ్యారు. ఇంతకంటే విచిత్రమైన ఉదంతం ధోల్పూర్లో చోటుచేసుకుంది. ధోల్పూర్లో కాంగ్రెస్కు చెందిన శోభారాణి కుష్వాహా.. బీజేపీ అభ్యర్థి, తన సోదరుడు శివచరణ్ కుష్వాహపై విజయం సాధించారు. జైపూర్లోని ఫూలేరా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ గుర్తుపై గెలుపొందిన విద్యాధర్ చౌదరి అల్లుడు శైలేష్ సింగ్, దీగ్ కుమ్హెర్ నుంచి బీజేపీ టికెట్పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. రాజస్థాన్లో 199 స్థానాలకు నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 115, కాంగ్రెస్కు 70 సీట్లు వచ్చాయి. 14 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర అభ్యర్థులు విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇది కూడా చదవండి: 17 రాష్ట్రాల్లో కాషాయ దళం.. దూసుకుపోతున్న మోదీ మ్యాజిక్! -
చీకటి వెలుగులు
విశాల విశ్వంలో సృష్టి సమస్తం ద్వంద్వాలమయం. ఈ ప్రపంచం ద్వంద్వాలమయం. లోకంలో వెలుగు చీకట్లుంటాయి. నిప్పూ నీరూ ఉంటాయి. తీపి చేదులుంటాయి. రేయింబగళ్లు ఉంటాయి. ఎండా వానా ఉంటాయి. శీతోష్ణాలుంటాయి. శిశిర వసంతాలుంటాయి. జీవితంలో సుఖదుఃఖాలు ఉంటాయి. ఆశ నిరాశలు ఉంటాయి. శాంతి అశాంతులు ఉంటాయి. గెలుపు ఓటములు ఉంటాయి. ఉత్థాన పతనాలు ఉంటాయి. మన వేదాంతం ఎంతగా అద్వైత సిద్ధాంత బోధ చేస్తున్నా, మానవమాత్రులైన వారెవరూ ద్వంద్వాతీతులు కారు, కాలేరు. మనుషులకు మాత్రమే కాదు, ఈ భూమ్మీద పుట్టిన ప్రతి జీవిలోనూ ఆడా మగా ఉంటాయి. ప్రతి జీవికీ చావుపుట్టుకలు ఉంటాయి. ప్రతి జీవితానికీ ఆద్యంతాలుంటాయి. ద్వంద్వబంధురమైన సృష్టి ప్రకృతి సహజం. సృష్టిలో ఇన్ని ద్వంద్వాలే లేకుంటే, ప్రకృతికి ఇంతటి సౌందర్యమెక్కడిది? జీవితానికి ఇంతటి వైవిధ్యమెక్కడిది? అద్వైతం అందమైన భావన. ఆధ్యాత్మిక ప్రవచనాల్లో ‘బ్రహ్మ సత్యం... జగన్మిథ్య’ అనే అద్వైత బోధను ఆలకించేటప్పుడు తన్మయత్వంతో కాసేపు ఓలలాడవచ్చేమో గాని, అది క్షణికమే! ఆ తర్వాత మిథ్యా మైకం నుంచి బయటపడ్డాక మనమింకా ద్వంద్వాల వలయంలోనే ఉన్నామన్న సంగతి ఎరుకపడటానికి ఎంతోసేపు పట్టదు. ‘మనకు రెండు కళ్లు, రెండు కాళ్లున్నట్లే ద్వంద్వాలన్నీ మన జీవితంలో భాగమే!’ అన్నాడు కార్లోస్ సాంటానా. అలాగని అతడేమీ తత్త్వవేత్త కాదు, వేదాంతి కాదు, కనీసం ప్రవచనకర్తయినా కాదు గాని, వారెవరికీ లేని ఎరుక అతడికి ఉంది. కార్లోస్ సాంటానా అమెరికన్ గిటారిస్ట్. అయినా, సృష్టిలోని ద్వంద్వాలను అర్థం చేసుకోవడానికి తత్త్వవేత్తలో, వేదాంతులో, ప్రవచనకర్తలో కానక్కర్లేదు... ఇసుమంత ఇంగితమున్న మనుషులైతే చాలు! ద్వంద్వాలు మన వెలుపలే కాదు, మన లోపల కూడా ఉన్నాయి. ద్వంద్వాల నడుమ నిత్యసంఘర్షణే ప్రకృతి ధర్మం. ‘మానవ జీవితమే మహాభారతం/ అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం’ అన్న ఆరుద్ర మాటలు ఇందుకు చిన్న ఉదాహరణ. మన జీవితాలను నిర్దేశించేవి జ్ఞానా జ్ఞానాలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, ఉచితానుచితాలు, రాగద్వేషాలు, నీతి అవినీతి వంటి ద్వంద్వాలే! విశ్వానికి మూలం తొలుత ఏకపదార్థమేనని, కాలక్రమంలో అది ద్వంద్వాలుగా విడిపోయిందని పాశ్చాత్య తత్త్వవేత్తల్లో కొందరి భావన. సృష్ట్యాదిలో ప్రపంచమంతా జలమయమై ఉండేదని మన పురాణాల కథనం. గ్రీకు తత్త్వవేత్త థేలీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. థేలీస్ అభిప్రాయాన్ని అతడి శిష్యుడు అనగ్జిమాండర్ ఖండించాడు. ‘ఏదో ఒక అనిశ్చిత, అనిర్దిష్ట, అజ్ఞాత పదార్థం సమస్త స్థలాన్నీ ఆవరించి ఉండేది. అది అనంతం, అనశ్వరం’ అని అనగ్జిమాండర్ అన్నాడు. సృష్టికి మూలమైన పదార్థం ద్వంద్వాతీతమైనదో కాదో ఇప్పటికీ ఎవరికీ తెలీదు గాని, మన చుట్టూ ఉన్న ద్వంద్వాలు, మన లోపలున్న ద్వంద్వాలు అందరికీ అనుభవపూర్వకమే! జీవితంలో అడుగడుగునా తారసపడే ద్వంద్వాలే మన జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. ఎంతటి వారైనా జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాలను అతిక్రమించలేరు. వాటి ఉనికిని గుర్తించకుండా ఉండలేదు. వాటికి అతీతంగా బతకలేరు. కాబట్టి మనం ద్వంద్వాలను నిర్ద్వంద్వంగా అంగీకరించక తప్పదు. లోకంలో కొందరు మనుషులు మంచివాళ్లుగా, మహానుభావులుగా చలామణీ అవుతారు. కొందరు దుర్మార్గులుగా, చెడ్డవాళ్లుగా పేరుమోస్తారు. నిజానికి ఎవరూ పూర్తిగా మంచివాళ్లుగా గాని, పూర్తిగా చెడ్డవాళ్లుగా గాని ఉండరు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, వాటికి స్పందించే తీరుతెన్నులే మనుషుల మంచిచెడులను బయటపెడతాయి. అందుకే ‘మనుషులందరూ మంచి చెడుల సమ్మేళనాలే’ అన్నాడు స్కాటిష్ రచయిత రాబర్ట్ లూయీ స్టీవెన్సన్. ‘కృతా కృతేచ ద్వంద్వాని కదా శాంతాని కస్యవా/ ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్ భవ త్యాగపరో వ్రతీ’ అని అష్టావక్రుడు జనక మహారాజుకు చెప్పాడు. కృతాకృత కర్మకలాపాలు, సుఖదుఃఖాది ద్వంద్వాలు శాంతించినప్పుడు భక్తుడు సంశయరహితుడై జ్ఞాని అవుతాడని, అప్పుడు వైరాగ్య వ్రతం చేయకున్నా త్యాగపరాయణుడవుతాడని ఈ శ్లోకానికి అర్థం. జనకుడికి అష్టావక్రుడు చేసిన ఈ వేదాంత బోధ ‘అష్టావక్రగీత’గా ప్రసిద్ధి పొందింది. అష్టావక్రుడు తన గీతబోధలో ద్వంద్వాల ఉనికిని నిరాకరించలేదు. కాకుంటే, అవి శాంతించాలన్నాడు. ద్వంద్వాల మధ్య సమతుల్యతను సాధించినప్పుడే అవి శాంతిస్తాయి. సుఖదుఃఖాలు, రాగద్వేషాల వంటి సహజాతి సహజమైన ద్వంద్వాలకు కొంత మోతాదుకు మించి స్పందించడం మానవ స్వభావం. ద్వంద్వాల ప్రభావాన్ని సమానంగా స్వీకరించి, ఆత్మావలోకనం చేసుకోగల సామర్థ్యమే స్థితప్రజ్ఞ! కాకపోతే, మనుషుల్లో స్థితప్రజ్ఞులు అరుదు. ముఖ్యంగా ప్రజల మధ్య గడిపే రాజకీయ నేతల్లో, సినీతారల్లో మరీ అరుదు. ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో జయాపజయాలు సర్వసాధారణాలు. ప్రజామోదం పొందిన వారు ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తారు. ప్రజాదరణ కొరవడిన వారు పరాజితులవుతారు. గెలుపొందిన వారు ‘అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమనుకొని ’ విర్రవీగితే మాత్రం తర్వాతి ఎన్నికల్లో పర్యవసానాన్ని చవిచూడక తప్పదు. పరాజితులు ఇంతే తమ కర్మమ నుకుని కుంగిపోయినా, తమను ఆదరించని ప్రజలను నిందించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఘనవిజయాలు సాధించినప్పుడు బాధ్యతలను గుర్తెరిగి అప్రమత్తంగా ప్రవర్తించాలి. అపజయాలు ఎదురైనప్పుడు ఆత్మవిమర్శ చేసుకుని, లోపాలను సవరించుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ఎన్నికల క్రతువులో ఘనవిజయాలూ శాశ్వతం కావు, అపజయాలూ శాశ్వతం కావు. శాశ్వతం కానివని తెలిసి తెలిసి ఫలితాలను తలకెక్కించుకుంటేనే ప్రమాదం. -
ఈసారయినా డిపాజిట్ దక్కించుకోవాలి సార్!
ఈసారయినా డిపాజిట్ దక్కించుకోవాలి సార్! -
ఊరూవాడా.. రిజల్ట్పై అటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జనం దృష్టి అంతా ఫలితాలపైనే పడింది. ఊరూవాడా పల్లెపట్నం ఎక్కడ చూసినా.. చిన్నాపెద్దా ఎవరిని కదిలించినా ఉత్కంఠ కనిపిస్తోంది. ఎవరెవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ప్రభుత్వం ఏర్పాటు చేసేదెవరు? కేసీఆర్, కేటీఆర్, రేవంత్, ఈటల వంటి ప్రముఖ నేతల్లో ఎవరెవరికి ఎలాంటి ఫలితం ఎదురవుతుందన్న చర్చ కూడా సాగుతోంది. పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీల నుంచి హోటళ్లలో, బస్టాండ్లలో పిచ్చాపాటీ దాకా ఎక్కడ నలుగురు కలసినా ఇదే తీరు. చివరికి ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో పరిచయస్తులు కనిపించినా ఎలక్షన్ల ప్రస్తావన రాకుండా ఉండటం లేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులపై విస్తృత విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల హీట్ కనిపిస్తోంది. పందెం కాస్తావా? పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చలు సాగుతుంటే.. వివిధ పార్టీల అభిమానుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కనిపిస్తున్నాయి. మేం గెలుస్తామంటే, మేం గెలుస్తామంటూ అభ్యర్థులు, పార్టీల తరఫున సరదా పందేలూ జరుగుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయని, ఇప్పటికే రంగ ప్రవేశం చేసిన బుకీలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, సోషల్మీడియా గ్రూపుల్లో హడావుడి చేస్తున్నారని తెలిసింది. సీఎం ఎవరవుతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై రూ.లక్షల్లోనే బెట్టింగులు సాగుతున్నాయి. కర్ణాటక, ఏపీ వంటి పొరుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. అక్కడి వారూ బెట్టింగ్లు కడుతున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో జోరుజోరుగా.. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎన్నికల ఫలితాల అంచనాలు, విశ్లేషణలు పోటెత్తుతున్నాయి. ఎక్కడ ఫలితాలు ఎలా ఉంటాయనే అంచనాలు, ఊహాగానాలు క్షణం తీరిక లేకుండా పోస్టు అవుతున్నాయి. ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ వచ్చిందంటే చాలు చేతిలోకి తీసుకుని చెక్చేసుకుంటున్నారు. రాజకీయ పోస్టులను చదవడమే కాదు.. వాటిపై తమ అభిప్రాయాలు, అంచనాలనూ రిప్లైలో ఇస్తున్నారు. తమకు నచ్చినవాటిని ఆయా ప్లాట్ఫామ్లపై, గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. దీంతో ఎవరు గెలుస్తారన్నది, ఎవరు ఓడుతారన్నది గందరగోళంగా మారిపోయింది. -
కామారెడ్డి కింగ్ ఎవరో.?!
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి కింగ్ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీకి దిగారు. వీళ్లిద్దరికీ స్థానికుడైన జడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. కేసీఆర్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నేతలు, రేవంత్రెడ్డి గెలుస్తాడంటూ కాంగ్రెస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. కేసీఆర్ తరఫున కేటీఆర్ ఎన్నికల బాధ్యతలు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గత నెల 9 న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసి అదే రోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కేసీఆర్ తరపున ఎన్నికల బాధ్యతలను మంత్రి కేటీఆర్ నిర్వహించారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను ఎమ్మెల్సీ షేరి సుభాష్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేపట్టారు. అలాగే మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, నాయకులు కర్నె ప్రభాకర్, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, బాలమల్లు, బాల్క సుమన్, అయాచితం శ్రీధర్ తదితరులు ప్రచారంలో ఉధృతంగా పాల్గొన్నారు. రేవంత్కి అండగా వచ్చిన రాహుల్, కర్ణాటక సీఎం గత నెల 10న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అదే రోజు ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేశారు. రేవంత్రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభలో పాల్గొన్నారు. 26న కామారెడ్డిలో నిర్వహించి బహిరంగ సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. కేవీఆర్ కోసం వచ్చిన ప్రధాని మోదీ ఇద్దరు వీఐపీల మధ్య స్థానిక నేతగా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. గత నెల 25న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. గత నెల 4న జిల్లా కేంద్రంలో జరిగిన బైక్ర్యాలీ, సభల్లో బీజేపీ రా్రష్్టర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఫలితంపై ఉత్కంఠ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్ది గంటల్లో షురూ అయి, మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మూడు పార్టీల నేతల్లోనూ గెలుపు ధీమా కనిపిస్తోంది. పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఎవరిలెక్కలు వారు వేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా తమ పార్టీకి వచ్చే ఓట్లపై కూడికలు, తీసివేతలు చేసి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయం ఎవరిని వరిస్తుందన్నది కాసేపట్లో తేలిపోనుంది. -
సరదాగా డీఎన్ఏ టెస్టు... షాకిచ్చిన రిపోర్టు!
ఒక యూరోపియన్ మహిళ తన సోదరీమణులతో కలిసి సరదాగా ఇంట్లోనే డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకుంది. అయితే వాటి ఫలితాలు తన జీవితంలో ఎంతటి దారుణమైన పరిణామాలకు దారితీస్తాయో ఆమె గ్రహించలేకపోయింది. తన తల్లిదండ్రులు ఇన్నాళ్లూ ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారని ఆమె ఊహించలేకపోయింది. ఈ మహిళ తన గుర్తింపును వెల్లడించకుండా సోషల్ మీడియా సైట్ రెడ్డిట్లో ఒక వివరణాత్మక పోస్ట్ పెట్టింది. దానిలో ఆమె.. ‘నేను, నా సిస్టర్స్ సరదాగా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకున్నాం. ఒక కిట్ సాయంతో డిఎన్ఏ టెస్టు చేయించుకున్నాం. ఆ పరీక్ష ఫలితాలు రాగానే గుండె బద్ధలయ్యే నిజం వెలుగు చూసింది. డీఎన్ఏ పరీక్ష ఫలితాలలో తన అన్నలు, అక్కాచెల్లెళ్లకు పూర్తి బంధుత్వం ఉందని, తానుమాత్రం ఒంటరినని తేలిందని ఆ మహిళ చెప్పింది. కాగా ఆమె సోదరి తమ తల్లిదండ్రులతో ఈ విషయమై మాట్లాడాలని నిర్ణయించుకుంది. అయితే తల్లిదండ్రులు ఆ డిఎన్ఏ ఫలితాలు నిజం కాదని అన్నారు. అయితే ఆమె తండ్రి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని కోరాడు. తల్లి ఈ విషయంలో తనకేమీ పట్టనట్టు వ్యవహరించింది. అయితే ఎట్టకేలకు తండ్రి నిజాన్ని చెప్పాడు. అయితే ఆమె ఎప్పటికీ తన కుమార్తెనేనని అన్నాడు. ఇంతకాలం తన తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచిపెట్టడంపై ఆ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనను తల్లిదండ్రులు పెంచిన విధానంలో ఏదో తేడా కనిపించడంతో తనకు వేరే తండ్రి ఉన్నడని అనుకునేదానినని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె తల్లితో నాటి పరిస్థితిని చర్చించాలనుకుంటోంది. అయితే తల్లి తనకు ఏమీ తెలియదని అంటోంది. కాగా ఆ మహిళ తన జీవసంబంధమైన తండ్రిని గుర్తించగలిగింది. అయితే ఇప్పుడు తాను ఏమి చేయాలంటూ ఆమె రెడ్డిట్ యూజర్స్ను కోరింది. ఇది కూడా చదవండి: పాక్పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
సింధు ప్రజల ముఖ ఆకృతి ఎలా ఉండేది? శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఏమి తేలింది?
సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజల ముఖాలు ఎటువంటి ఆకృతిలో ఉండేవనే ఇన్నాళ్ల సందేహాలకు ఇప్పుడు తెరపడింది. తాజాగా పరిశోధకులు సింధూ ప్రజల ముఖాకృతి ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేశారు. సింధూ నాగరిత నాటి ఒక స్మశానవాటికలో లభ్యమైన రెండు పుర్రెల ఆధారంగా వాటి ముఖాలకు ఆకృతి తీసుకువచ్చి, లోకం ముందు ఉంచారు. ఈ ఫొటో ఇప్పుడు ఎంతో ఆసకికరంగా మారింది. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో సింధు లోయ నాగరికత ఒకటి. ఈ నాగరికత క్రీ.పూ. 3300 నుండి 2500 వరకు కొనసాగింది. ప్రముఖ పత్రిక నేచర్లో ప్రచురితమైన పరిశోధనా వ్యాసంలోని వివరాల ప్రకారం సింధు లోయ నాగరికత 8000 సంవత్సరాల పురాతనమైనది. భారతదేశ చరిత్ర హరప్పా నాగరికతగా పేరొందినప్పటికీ, అది కూడా సింధు లోయ నాగరికతతో పాటు ప్రారంభమయ్యిందని చరిత్ర చెబుతోంది. మొహెంజొదారో, కలిబంగా, లోథాల్, ధోలావీరా, రాఖీగర్హి మొదలైనవి హరప్పా, సింధు లోయ నాగరికతలకు ప్రధాన కేంద్రాలుగా పరిగణిస్తారు. సింధు లోయ నాగరికతకు చెందిన పురాతన నగరం 2014లో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని భిర్దానాలో కనుగొన్నారు. దీని స్థాపన సుమారు క్రీ.పూ. 7570 నాటిదని చెబుతారు. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సింధు లోయ నాగరికత అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత అని అంటారు. సింధు లోయ నాగరికతను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే సింధూ ప్రజల ముఖ రూపాన్ని గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలేవీ నేటివరకూ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. అయితే తాజాగా పూరాతత్వ పరిశోధకులు క్రీ.పూ. 2273, 2616 నాటిదిగా అంచనా వేసిన సింధునాగరికత స్మశానవాటిక రాఖీగర్హి లో పరిశోధినలు సాగించారు. ఈ నేపధ్యంలో రాఖీగర్హిలో లభ్యమైన రెండు పుర్రెల కంప్యూటెడ్ టోమోగ్రఫీ డేటాను ఉపయోగించి క్రానియోఫేషియల్ రీకన్స్ట్రక్షన్ (సీఎఫ్ఆర్) విధానం ద్వారా సుమారు 4500 సంవత్సరాల క్రితం ఖననం చేసిన సింధు నాగరితక వ్యక్తులకు చెందిన ముఖాలను విజయవంతంగా పునర్నిర్మించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సింధు నాగరికుల ముఖ స్వరూపాన్ని అంచనావేసేందుకు శాస్త్రీయంగా జరిగిన మొదటి ప్రయత్నం ఇదేనని వారు పేర్కొన్నారు. ఈ వివరాలను అనాటమికల్ సైన్స్ ఇంటర్నేషనల్ వాల్యూమ్- 95లో శాస్త్రవేత్తలు జూన్ లీ, వసంత్ షిండే, డాంగ్ హూన్ షిన్ షోలు పొందుపరిచారు. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
నాలుగు రోజులకే నా సినిమా ఎత్తేశారు: జగపతి బాబు కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ఇటీవలే రుద్రంగి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మమతా మోహన్దాస్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. జూలై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు రుద్రంగి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీ రిజల్ట్ తనను తీవ్రంగా నిరాశపర్చిందని అన్నారు. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన సంగతి తెలిసిందే. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. ఈ సినిమా రిజల్ట్పై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇది చదవండి : చంద్రబాబు అరెస్ట్.. సినిమా వాళ్లు స్పందించడం సరికాదు: సురేశ్ బాబు) జగపతి బాబు మాట్లాడుతూ.. 'రుద్రంగి కథ నచ్చడంతో రెమ్యునరేషన్ తగ్గించుకుని సినిమా చేశా, కానీ సినిమా నిర్మాత ఎమ్మెల్యే అయినా సరిగా ప్రమోషన్స్ చేయలేదు. సినిమా బాగా రావాలనే తపన వారిలో కనిపించలేదు. అందుకే నాలుగు రోజుల్లోనే రుద్రంగి సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారు. దీంతో నా సినిమా దిక్కులేని అనాథలా మారిపోయింది. ఎనిమిది కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. నా రేంజ్ కాకపోయినా సినిమా చేశఆను. కానీ నేను సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయమని సలహా ఇచ్చాను కూడా. అవేమీ నిర్మాత పట్టించుకోలేదు.' అని అన్నారు. రిజల్ట్ ఎలా వచ్చినా.. ఈ సినిమా నా కెరీర్లో బెస్ట్ మూవీ అన్నారు. ప్రస్తుతం జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించారు. -
సెప్టెంబర్ మూడోవారంలో ‘కానిస్టేబుల్’ ఫలితాలు?
సాక్షి, హైదరాబాద్: ‘కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితా’ సెప్టెంబర్ మూడోవారంలో విడుదల కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడిపై పోలీస్ నియామక మండలి కసరత్తు ముమ్మరం చేసింది. పోలీస్శాఖలోని వివిధ విభాగాలు, జైళ్లశాఖ, అగ్నిమాపకశాఖ, రవాణా, ఎక్సైజ్శాఖల్లో కలిపి మొత్తం 16,929 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే తుదిరాత పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలు మే 30న పోలీస్ నియామకమండలి వెల్లడించడం తెలిసిందే. జూన్ 1వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. గత కొన్ని రిక్రూట్మెంట్ల మాదిరిగానే ఈసారి కూడా ముందుగానే ఎస్ఐ పోస్టుల తుది ఎంపిక జాబితాను బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారి నియామక ప్రక్రియ తుదిదశలో ఉంది. ప్రస్తుతం ఎస్బీ ఎంక్వైరీ, మెడికల్ టెస్ట్ నడుస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఎస్ఐల శిక్షణ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు కానిస్టేబుల్ ఫలితాలపై దృష్టి సారించారు. మొత్తం 1,01,600 మంది అభ్యర్థులు తుది అర్హత సాధించిన వారిలో ఉన్నారు. వీరికి సంబంధించిన అన్ని రికార్డులు, ఆయా జోన్లు, పోలీస్, రెవెన్యూ జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తుది పోటీలో ఉన్న వారిలో ప్రతి ఆరుగురు అభ్యర్థుల్లో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తం ప్రక్రియ ముగిసేందుకు మరో మూడు నుంచి నాలుగు వారాలు సమయం పడుతుంది. -
ఏపీ, ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
-
పరీక్షలు ముగిశాయి.. ఫలితాలే తరువాయి..
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లోని వివిధ తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలు, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షల నిర్వహణ ఈనెల 10తో ముగిసిఇంది. నాలుగు సొసైటీల పరిధిలో అర్హత పరీక్షలన్నీ ముగియడంతో ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మైనార్టీ గురుకుల సొసైటీ మినహా టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్, టీఎంఆర్ఈఐఎస్, టీఎస్ఆర్ఈఐఎస్లు ఐదోతరగతితో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాయి. వీటితో పాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలకు సొసైటీలు వేర్వేరుగా అర్హత పరీక్షలు నిర్వహించాయి. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సైతం ఏ సొసైటీకా సొసైటీ అర్హత పరీక్షలు ముగిశాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలోని సైనిక పాఠశాలల్లో ప్రవేశాలు, బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అగ్రికల్చర్ డిగ్రీ, ఫ్యాషన్ టెక్నాలజీ డిగ్రీ ప్రవేశాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(ఈఎంఆర్ఎస్)లో ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేకంగా సెట్ నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలన్నీ వరుసగా విడుదల చేసేందుకు ఆయా సొసైటీలు సన్నద్ధమయ్యాయి. అర్హత పరీక్షల ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేసేందుకు గురుకుల సొసైటీలు సన్నద్ధమవుతున్నాయి. ముందుగా పాఠశాలల్లో ప్రవేశాల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఐదో తరగతి అడ్మిషన్లకు నిర్వహించిన వీటీజీసెట్–2023 ఫలితాలను వచ్చే వారాంతంలో విడుదల చేయనున్నారు. -
పని చెయ్యడం ఒక వేడుక
ఫలితం రావడానికి పనిచెయ్యడం ప్రాతిపదిక. ప్రయత్నం పని చెయ్యడానికి ప్రాతిపదిక. ఏ పరిణామానికైనా ప్రయత్నం, పని చెయ్యడం ఉండాలి. ప్రయత్నంతో పని చెయ్యడానికి మనిషి పూనుకోవాలి; ప్రయోజనకరమైన ఫలితాలను సాధించాలి. ‘తప్పులు జరుగుతాయన్న భయంతో పని మొదలు పెట్టక΄ోవడం చెడ్డవాడి లక్షణం; అజీర్ణం అవుతుందనే భయంవల్ల భ్రాంతిలో ఎవరు భోజనాన్ని వదిలేస్తారు? అని హితోపదేశం మాట. తప్పులు జరుగుతాయని పని చెయ్యక΄ోవడం నేరం. పని చెయ్యడం గురించి ఓషో ఇలా చె΄్పారు... జీవితం అన్నది బాధ్యతలతో మాత్రం పని చెయ్యడమా? లేదా వేడుకలోపాలుపంచుకోవడమా? పని చెయ్యడం మాత్రమే జీవితం అయితే జీవితం ఇబ్బందికరమైనదై ఇరుకైందిగా మారి΄ోతుంది. బరువెక్కిన హృదయంతో జీవించాల్సి వస్తుంది. కృష్ణుడు పని చెయ్యడం మాత్రమే బాధ్యత గా జీవించినవాడు కాదు. జీవితాన్ని ఒక వేడుకగా; ఒక ఉత్సవంగా మార్చుకున్నవాడు. జీవితం ఇంట్లో చదువుకునేపాఠం కాదు. జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చుకోవడం వల్ల ఎవరూ జీవితాన్ని కోల్పోవడం లేదు. పని చెయ్యి; ఆ పనిని వేడుకలాగా మార్చెయ్యి. అప్పుడు పని కూడా ఆటపాటల సంకలనంగా మారి΄ోతుంది. అందువల్ల చిన్నపని కూడా నిండుగా ఉంటుంది. పని సౌందర్యాత్మకం అవుతుంది. పనికి బానిసలుగా మారినవాళ్ల గురించి మీకు తెలిసి ఉంటుంది. పని చెయ్యడం కోసం జీవించేవాళ్లు ఉద్రిక్తతలో జీవించాల్సి వస్తుంది. పని పిచ్చివాళ్లైనవాళ్లు జీవించడాన్ని ఒక కర్మాగారంగా మార్చేసు కుంటున్నారు.‘చెయ్యి లేదా చచ్చి΄ో‘ అని ఘోషిస్తున్నారు. పని చెయ్యడం తప్పితే మరో కోణం వాళ్లకు తెలీదు. వాస్తవానికి వాళ్లకు పని చెయ్యడానికి ప్రయోజనం ఏమిటో తెలియదు. జీవితం అన్నది ఒక వేడుక. మనం పని చెయ్యడం నాట్యం చేస్తున్నట్టు ఉండాలి. పని చెయ్యడం ద్వారా వేడుకను తీసుకురావాలి. కఠినమైన జీవితాన్ని తలుచుకుంటూ ఉంటేపాడడానికీ, ఆడడానికీ, వేడుక చేసుకోవడానికీ సమయం లేకుండా ΄ోతుంది. జీవితం ఇంటికీ, కార్యాలయానికీ మధ్యలో ఆగి΄ోతుంది. ఈ రెండు ప్రదేశాల మధ్యలో ముళ్లకంచెను ఏర్పరుచుకుని మానసికంగా మీరు బాధకు గురి అవుతున్నారు. ఒకరోజున జీవితంలో విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవించాలని మీరు అనుకుంటారు. కానీ ఆ రోజు రాదు; పని పిచ్చివాళ్లు ఎప్పటికీ జీవితాన్ని వేడుక చేసుకోరు. కృష్ణుడు జీవితాన్ని ఉత్సవంగా మార్చుకున్నాడు. పువ్వులు, పక్షులు, ఆకాశ తారలు జీవితాన్ని వేడుక చేసుకుంటున్నాయి. మనిషి తప్పితే జీవరాశులన్నీ జీవితాన్ని వేడుక చేసుకుంటున్నాయి. పువ్వులు ఎందుకు పూస్తూ ఉన్నాయి? అని అడగండి. తారలు ఎందుకు ఆకాశంలో తేలుతున్నాయి? అని అడగండి. గాలి ఎందుకు ఒంటరిగా వీస్తోంది? అని అడగండి. సూర్యుడికి కింద జీవిస్తున్నవి అన్నీ వేడుక చేసుకుంటున్నాయి. ప్రపంచమే వేడుక చేసుకుంటోంది. మనిషి కూడా ప్రపంచంలో భాగమే అని కృష్ణుడు చెబుతున్నాడు; వేడుక చేసుకోండి అని చెబుతున్నాడు. ఏ పనీ చెయ్యకుండా వేడుక చేసుకోమని కృష్ణుడు చెప్పలేదు. గాలి పని చెయ్యకుండా వీచడం లేదు. తార ఒకేచోట నుంచుని వేడుక చేసుకోవడంలేదు. అది కదులుతూనే ఉంది. పువ్వులు పుయ్యడం కూడా పనే. అయితే వీటికి పని చెయ్యడం ముఖ్యం కాదు. వేడుక ముఖ్యం. వేడుక ముందు ఉంటుంది అదే సమయంలో అవి తమ బాధ్యతల్ని కూడా నెరవేరుస్తాయి. వేడుకకు కొనసాగింపే పని; జీవితమే ఒక ఉత్సవం. పని చెయ్యడంలోని సౌందర్యాన్ని, పని చెయ్యడంవల్ల సత్ఫలితాన్ని మనిషి సొంతం చేసుకోవాలి. పని చేస్తూ మనిషి తన జీవితాన్ని ఉత్సవం చేసుకోవాలి. – శ్రీకాంత్ జయంతి -
మునుగోడు రిజల్ట్ పై ఐపీఎల్ తరహాలో బెట్టింగ్
-
Munugode ByElection: ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో చివరి కొన్ని గంటల్లో పోలైన ఓట్లు ఎవరికి పడ్డాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆ ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో ఆ ఓట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల తరువాత 37,665 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలింగ్ ఊపందుకున్నా సాయంత్రం 5 గంటల తరువాత అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. అవి తమకు పడ్డాయంటే తమకే పడ్డాయంటూ అభ్యర్థులు, ఆయా పార్టీల వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసే వరకు లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్నిచోట్ల రాత్రి 9 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. యువత, మహిళలే ఎక్కువ.. గురువారం ఉదయం వేళలో ఎక్కువ మంది వృద్ధులు, మధ్య వయస్కులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాతే ఎక్కువ మంది మహిళలు, యువత, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలింగ్లో పాల్గొన్నారు. 5 గంటల సమయంలో కూడా ఎక్కువ మంది మహిళలు, యువతే వచ్చి లైన్లలో నిల్చున్నారు. రాత్రి 9 గంటల వరకు కూడా వారే పోలింగ్లో పాల్గొన్నారు. వీరంతా ఎవరికి ఓట్లు వేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఆలస్యం అందుకే.. సాధారణంగా ఇతర ప్రాంతాల వారు ఉదయమే వచ్చి పోలింగ్లో పాల్గొని వెళ్లిపోతారు. అయితే చాలామంది ఆలస్యంగా నియోజకవర్గానికి చేరు కోగా, ఉదయమే వచ్చినవారిలో కూడా చాలామంది సాయంత్రం వరకు వేచి ఉన్నట్లు తెలిసింది. మరోవైపు రెండో విడత డబ్బులు పంచుతారన్న ఆలోచనతో చాలా మంది గ్రామాల్లోనే ఆగిపోయినట్లు సమాచారం. అవి అందాకే పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. ఇంకోవైపు కొందరు ఓటర్లు ఒక పార్టీ నుంచి తమకు డబ్బులు అందలేదంటూ గొడవలకు దిగారు. అవి అందిన తర్వాత సాయంత్రం ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందనుకుంటే.. ఏ పార్టీ అభ్యర్థికైనా లక్ష ఓట్లు మించి పోలైతేనే గెలుపొందే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తే మాత్రం అంత అవసరం లేదని, 90 వేల వరకు వచ్చిన అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. రూ.10 వేల నుంచి లక్షల్లో.. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికలో గెలిచేదెవరన్నదానిపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీకి అనుకూలంగా ఉండటం, పోలింగ్ రోజు సాయంత్రం మహిళలు, యువత అధిక సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడాన్ని పరిగణనలోకి తీసుకుని బెట్టింగ్లను కొనసాగిస్తున్నారు. కొంతమంది టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని, మరికొంత మంది బీజేపీ అభ్యర్థి గెలుస్తారని పందేలు కాస్తుండగా.. మరికొందరు కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలవచ్చనే అంచనాలతో బెట్టింగ్ కాస్తున్నారు. రూ.10 వేలు మొదలుకొని రూ.లక్షల్లో బెట్టింగ్లు కాస్తున్నట్లు తెలిసింది. తెల్లవారుజామున స్ట్రాంగ్ రూమ్లకు.. పోలింగ్ రాత్రి 9 గంటల వరకు కొనసాగిన నేపథ్యంలో చివరి ఈవీఎంలు శుక్రవారం తెల్లవారుజామున 4.55 గంటలకు స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయి. నల్లగొండ ఆర్జాలబావిలోని ఎఫ్సీఐ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో ఈవీఎంలను భద్రపరిచారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: ఎంత పనైపాయే.. అయ్యో కళ్యాణ్! -
పొలిటికల్ కారిడార్ : కాంగ్రెస్ కు చావో రేవో అన్నట్లుగా మారిన మునుగోడు
-
అత్యధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరో తెలుసా?
దేశానికి 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. 21న ఓట్ల లెక్కింపు జరిగింది. ద్రౌపది ముర్ము తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలపై విహంగ వీక్షణం.. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ సేవలు అందించారు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం. అంతేకాదు అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. కాగా, 1950 జనవరి 26న రాజేంద్రప్రసాద్ను రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం 1952లో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. స్వతంత్ర భారత మొట్ట మొదటి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1962లో రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జాకిర్ హుస్సేన్ 1967లో మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దురదృష్టవశాత్తు పదవీలో ఉండగానే 1969, మే 3న ఆయన కన్నుమూశారు. జాకిర్ హుస్సేన్ మరణంతో 1969లో జరిగిన ఎన్నికల్లో వరాహగిరి వేంకటగిరి నాలుగో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన తొలి రాష్ట్రపతిగా ఆయన చరిత్ర కెక్కారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.. భారత ఐదో రాష్ట్రపతిగా పనిచేశారు. పదవిలో ఉండగానే 1977, ఫిబ్రవరి 11న మరణించారు. ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవిని దక్కించుకున్న ఘనత నీలం సంజీవరెడ్డికి దక్కింది. 1977 నాటి ఎన్నికల్లో పోటీలో ఉన్న 37 మందిలో సంజీవరెడ్డి నామినేషన్ మినహా మరెవరిదీ చెల్లకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జ్ఞానీ జైల్ సింగ్ 1982లో దేశానికి 7వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన ఏకైక సిక్కుగా ఆయన ఖ్యాతికెక్కారు. ఆర్. వెంకట్రామన్ దేశానికి 8వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన హయాంలోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమైంది. శంకర్దయాళ్ శర్మ 1992లో దేశానికి 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగానూ సేవలు అందించారు. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మొదటి ప్రెసిడెంట్గా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్గా పేరుగాంచిన ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి 11వ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించారు. ప్రజల రాష్ట్రపతిగా మెలిగిన ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని సామాన్యులకు చేరువ చేశారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. అంతకుముందు ఆమె రాజస్థాన్ గవర్నర్గా పనిచేశారు. రాష్ట్రపతి పనిచేసిన కాలంలో ఆమె పలు రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012లో ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం పొందిన ఆరుగురు రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు. ప్రణబ్ హయాంలోనే రాష్ట్రపతి భవన్ ట్విటర్ ఖాతా ప్రారంభమైంది. దేశానికి రెండో దళిత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అంతకుముందు బిహార్ రాష్ట్రానికి గవర్నర్గా ఆయన పనిచేశారు. ఈ ఏడాది జూలై 24తో రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. (క్లిక్: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!) -
నెలాఖరుకల్లా గురుకుల సెట్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలు నిర్వహించిన గురుకుల సొసైటీలు ఇప్పుడు ఫలితాల ప్రకటన, అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఐదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. ఒకట్రెండు సొసైటీల్లో బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి నాలుగైదు రోజుల్లో పరీక్ష పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా అన్నిరకాల ప్రవేశపరీక్షల ఫలితాలు ప్రకటించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫలితాల ప్రకటన తర్వాత వెంటనే అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నాయి. జూలై నెలాఖరుకు ప్రవేశాల ప్రక్రియను కొలిక్కి తెచ్చి, అవసరమున్న కేటగిరీల్లో రెండు, మూడోవిడత కౌన్సెలింగ్ నిర్వహించి పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. -
ఇంటర్‘నెట్’ స్టడీతో ఫస్టియర్ ఫట్..!
సాక్షి, హైదరాబాద్: అదిగో.. ఇదిగో.. అంటూ ఫలితాల విషయంలో విద్యార్థులను హైరానా పెట్టిన ఇంటర్ బోర్డు ఎట్టకేలకు గురువారం ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేసింది. ఒకేషనల్స్తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు 4,59,242 మంది విద్యార్థులు హాజరవగా 2,24,012 (49 శాతం) మందే పాసయ్యారు. ఫలితాల్లో బాలికలు ముందు వరుసలో నిలిచారు. బాలికలు 56 శాతం మంది, బాలురు 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మేడ్చల్లో అత్యధికంగా 63 శాతం మంది, మెదక్లో అతి తక్కువగా 20 శాతం మంది పాసయ్యారు. అన్ని గ్రూపుల్లోనూ అత్యధిక మార్కులు ప్రైవేటు సంస్థలకే దక్కాయి. అరకొర విద్యాబోధన సాగిన ప్రభుత్వ కాలేజీలు గరిష్ట మార్కుల్లో ప్రైవేటుతో పోటీ పడలేకపోయాయి. ‘ఏ’ గ్రేడ్ ఉత్తీర్ణులే ఎక్కువ పాసైన విద్యార్థుల్లో 75 శాతానికి పైగా మార్కులను (ఏ గ్రేడ్) సాధించినవాళ్లే ఎక్కువున్నారు. మొత్తం 1,15,358 మంది ‘ఏ’ గ్రేడ్ సాధించారు. ఎంపీసీ విద్యార్థులు 1,58,139 మంది పరీక్ష రాస్తే 61 శాతం, బైపీసీలో 1,05,585 మంది రాస్తే 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ గ్రూపులో ప్రభుత్వ కాలేజీల్లో గరిష్ట మార్కు 466 కాగా, ప్రైవేటు కాలేజీల్లో 467. బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపుల్లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. ఏడాది మొత్తం సంక్షేమ హాస్టళ్లు తెరవకపోవడంతో అక్కడ గరిష్ట మార్కులు ప్రభుత్వ కాలేజీల కన్నా తక్కువగా వచ్చాయి. ఒకేషనల్ కోర్సుల్లో ప్రభుత్వ కాలేజీల్లోనే ఉత్తీర్ణత ఎక్కువుంది. మొత్తం 49,331 మంది ఒకేషనల్ పరీక్షకు హాజరైతే 24,226 (49 శాతం) మంది ఉతీర్ణలయ్యారు. ఇందులో బాలికలు 62 శాతం ఉన్నారు. చప్పుడు లేకుండా.. ఇంటర్ బోర్డు మీడియాకు కనీస సమాచారం ఇవ్వకుండా మధ్యాహ్నం 3 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా ఫలితాలను వెబ్సైట్లో పెట్టేసింది. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే మరీ తక్కువగా ఉండటంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చడీచప్పుడు లేకుండా ఫలితాలు వెల్లడించింది. ఆన్లైన్ చదువులు విద్యార్థులకు అర్థం కాకపోవడం, ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు సక్రమంగా ఆ సదుపా యం అందుబాటులో లేకపోవడంతో కొన్ని వర్గాలు ఆందోళన చెందినట్టే ఉత్తీర్ణత 49 శాతం దాటలేదు. అనుక్షణం ఉత్కంఠగానే.. మొదటి ఏడాది ఇంటర్ పరీక్షలు ఈ ఏడాది అనుక్షణం ఉత్కంఠగానే సాగాయి. మార్చిలో జరగాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. తొలుత అందరినీ రెండో ఏడాదికి ప్రమోట్ చేశారు. థర్డ్ వేవ్ ఆందోళనలతో ఫస్టియర్ పరీక్షలు అనివార్యమని బోర్డు భావించింది. సెప్టెంబర్ నుంచి ఇదే టెన్షన్. చివరకు అక్టోబర్, నవంబర్లో పరీక్షలు జరిగాయి. రీ వెరిఫికేషన్కు 22 వరకు చాన్స్ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారా మార్కులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఐడీ, పాస్వర్డ్ సంబంధిత కాలేజీలకు పంపినట్టు బోర్డు తెలిపింది. తప్పులుంటే ప్రిన్సిపాల్స్ ద్వారా బోర్డుకు ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలంది. -
ఎన్నిక ఏదైనా తిరుగులేని వైఎస్సార్సీపీ
-
హుజూరాబాద్లో నైతిక విజయం నాదే: గెల్లు శ్రీనివాస్
-
హుజూరాబాద్లో నైతిక విజయం నాదే: గెల్లు శ్రీనివాస్
సాక్షి, కరీంగనర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్పందించారు. హుజూరాబాద్లో నైతిక విజయం తనదే అన్నారు. ఈ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. విద్యార్థి నాయకుడు వెంకట్ని బలిపశువును చేశాయని గెల్లు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఫలితంపై కేటీఆర్, హరీశ్రావు కూడా స్పందించారు. (చదవండి: హుజూరాబాద్లో ఓటమి.. వైరలవుతోన్న కేటీఆర్ ట్వీట్) ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 24వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెల్లు శ్రీనివాస్పై విజయం సాధించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ కేవలం 3000పైచిలుకు ఓట్లకే పరిమితం అయ్యింది. చదవండి: Huzurabad Bypoll Results: బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు: హరీశ్ రావు -
హుజూరాబాద్ ఉప ఎన్నిక: పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ఆధిక్యం
-
ఏపీఈఏపీ సెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్
-
ఏపీఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రేపటి నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి సురేష్ తెలిపారు. మొదటి ర్యాంకు- చందం విష్ణు వివేక్(తూర్పుగోదావరి- కోరుకొండ) రెండో ర్యాంకు- శ్రీనివాస కార్తికేయ(అనంతపురం) మూడో ర్యాంకు- బొల్లినేని విశ్వాస్రావు(హన్మకొండ) (ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Andhra Pradesh: ‘స్కిల్’ఫుల్ కోర్సులు ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ -
ఏందీ కిరికిరి: ఒకటి పాజిటివ్.. మరొకటి నెగిటివ్
బోయిన్పల్లి గిరిజన సంక్షేమ వసతిగృహానికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థి అకస్మాత్తుగా జ్వరం, ఆయాసంతో బాధపడుతుండటంతో అనుమానం వచ్చి శనివారం ఉదయం కోవిడ్ టెస్ట్ చేయించగా, పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ విద్యార్థికి సన్నిహితంగా ఉన్న హాస్టల్లోని మరో 103 మంది విద్యార్థులు, హాస్టల్ సిబ్బందికి అదే రోజు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేశారు. వీరిలో 36 మంది విద్యార్థులు సహా నలుగురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ తర్వాత అదే రోజు వారందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించగా, వీరిలో పదో తరగతి విద్యార్థి(16), ఒక వర్కర్(55) మినహా మిగిలిన వారందరికీ నెగిటివ్ వచ్చింది. దీంతో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల నాణ్యత, పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ నిర్ధారణ కోసం ప్రభుత్వం సరఫరా చేసిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతూ వైరస్ నిర్ధారణ కోసం వచ్చిన బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. వైరస్ లేనివారికి ఉన్నట్లు...ఉన్న వారికి లేనట్లు రిపోర్టులు వస్తుండటంతో ఇటు వైద్యులే కాకుండా అటు బాధితులు ఆందోళన చెందుతున్నారు. బోయిన్పల్లి గిరిజన సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు నిర్వహించిన యాంటిజన్ టెస్టులు, జారీ చేసిన రిపోర్టులే ఇందుకు నిదర్శనం. తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థలో పనిచేస్తున్న కొంత మంది అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను పరిశీలించకుండా నాసిరకం కిట్లను కొనుగోలు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని పలువురు సీనియర్ వైద్యులు ఆరోపిస్తున్నారు. వైరస్ విస్తరణకు ఈ తప్పుడు రిపోర్టులు కూడా ఓ కారణమని చెబుతున్నారు. ప్రశ్నార్థకంగా ర్యాపిడ్ కిట్ల నాణ్యత.. నిజానికి కోవిడ్ నిర్ధారణలో ఆర్టీపీసీఆర్ను గోల్డెన్ స్టాండర్డ్గా భావిస్తారు. ఇందులో వైరస్ నిర్ధారణకు 24 గంటలకుపైగా సమయం పడుతుంది. అదే ర్యాపిడ్ యాంటిజెన్లో అరగంటలోనే ఫలితం తేలుతుంది. సత్వర వైరస్ నిర్ధారణ, చికిత్సల కోసం ప్రభుత్వం ఈ కిట్ల వైపు మొగ్గుచూపింది. నగరంలో ప్రస్తుతం 20 ప్రభుత్వ, 60 ప్రైవేటు కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ చేస్తున్నారు. ఒక్కో సెంటర్లో రోజుకు సగటున 25 పరీక్షలు చేస్తుండగా, ప్రస్తుతం 404 టెస్టులకు సంబంధించిన రిపోర్టులు వెయిటింగ్లో ఉన్నాయి. ఇక హైదరాబాద్లో 97, మేడ్చల్లో 88, రంగారెడ్డిలో 60 పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. ఒక్కో సెంటర్లో రోజుకు సగటున 50 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, ఆయాసం వంటి కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ రావడం సహజమే. ఇలాంటి వారికి వైద్యులు ఖచ్చితత్వం కోసం ఆర్టీపీసీఆర్ను సిఫార్సు చేసి, ఆ రిపోర్ట్ ఆధారంగా వైరస్ను నిర్ధారిస్తారు. నిజానికి యాంటిజెన్లో పాజిటివ్ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్లోనూ పాజిటివ్ రావాలి. కానీ బోయిన్పల్లి గిరిజన సం క్షేమ వసతి గృహంలో నిర్వహించిన క్యాంపులో పాజిటివ్ వచ్చిన వారిలో, ఇద్దరికి మినహా అందరికీ ఆ తర్వాత నెగిటివ్ రావడం వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా కిట్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మార్చింది. ఒక్క రోజే 300కుపైగా కేసులు.. ఒక వైపు కిట్ల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతుండగా...మరో వైపు గ్రేటర్లో చాపకిందినీరులా వైరస్ విస్తరిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. తాజాగా సోమవారం కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఆగస్టు తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కూకట్పల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో 47, కుత్బుల్లాపూర్లో 22, సరూర్నగర్లో 27, ముసారంబాగ్లో 7, ముషీరాబాద్లో 16, గచ్చిబౌలిలో 19, ఉప్పల్లో 26, అంబర్పేటలో 29, గోల్కొండలో 13, మేడ్చల్లో 25, సుభాష్నగర్లో 10, అల్వాల్ లో 7, మల్కజ్గిరిలో 27, వనస్థలిపు రం ఏరియా ఆస్పత్రిలో 30, ఘోషామహల్లో 9, సనత్నగర్లో 2, మలక్పేట్లో 4, బంజారాహిల్స్లో 3, ఆమన్నగర్లో 3, మల్లాపూర్లో 3, కాప్రాలో 11, యునానీ ఆస్పత్రిలో 2 పాజిటివ్ కేసుల చొప్పున నమోదు కావడం గమనార్హం. ఇవేకాకుండా ప్రైవేటు డయాగ్నోస్టిక్స్లోనూ కేసుల సంఖ్య భారీగానే నమోదైనట్లు తెలిసింది. గ్రేటర్లో కరోనా కేసులు ఇలా.. తేదీ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి 16 29 41 10 17 35 21 12 18 47 20 29 19 75 32 31 20 81 34 64 21 91 28 37 చదవండి: కరోనా కట్టడికి 15 రోజుల ప్రచార కార్యక్రమాలు -
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
-
బీజేపీకి కర్ణాటక కిక్కు
ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతున్న కాంగ్రెస్కు సోమవారం వెలువడిన కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లోనూ అదే పునరావృతం అయింది. ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో కేవలం రెండే దక్కడంతో ఈ పరాజయానికి నైతికబాధ్యత వహించి కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు రాజీనామా చేశారు. అంచనా లకు మించి 12 స్థానాలు గెల్చుకున్న బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. అభ్యర్థుల ఎంపికనూ, ప్రచార బాధ్యతల్ని తన భుజస్కంధాలపై వేసుకున్న ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికలు రాజకీయంగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. మహారాష్ట్రలో ఊహించనివిధంగా కూటమి భాగస్వామి శివసేన విప క్షాలతో చేతులు కలిపి తమకు అధికారం దక్కకుండా చేసింది. పైగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్లో ఇంకా మూడు దశలు పూర్తి కావలసి ఉంది. అక్కడ పాత మిత్రుల్ని వదిలించుకుని ఒంట రిగా బరిలోకి దిగాల్సివచ్చింది. ఇలాంటి సమయంలో అంచనాలను మించి ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీకి జవసత్వాలనిచ్చింది. కర్ణాటకలో నిరుడు మే నెలలో జరిగిన శాసనసభ ఎన్ని కల్లో ఈ 15 స్థానాల్లో పన్నెండింటిని కాంగ్రెస్ గెల్చుకోగా, మూడుచోట్ల జేడీఎస్ విజయం సాధిం చింది. వీరు, వీరితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరానికి ఫిరాయించడంతో 14 నెలల పాటు పాలించిన హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం మొన్న జూలైలో కుప్పకూలింది. మరో రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల పిటిషన్లు పెండింగ్లో ఉన్నందువల్ల వాటికి ఉపఎన్నికలు జరగలేదు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో తమకు గరిష్టంగా 9 స్థానాలు రావొచ్చునని బీజేపీ అంచనా వేసుకుంది. కానీ ఫలితాలు దాని అంచనాలను మించాయి. పైగా జేడీఎస్కు కంచుకోట అయిన ఓల్డ్ మైసూరు ప్రాంతంలోని మాండ్యా జిల్లాలో తొలిసారి బీజేపీ విజ యకేతనం ఎగరేసింది. అక్కడ కృష్ణరాజపేటె స్థానం తన ఖాతాలో వేసుకుంది. జేడీఎస్కు దన్నుగా ఉండే వొక్కళిగ జనాభా అధికంగా ఉన్న స్థానమిది. 224మంది సభ్యులుండే కర్ణాటక శాసనసభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస మెజారిటీ 113. ఇప్పటికే బీజేపీకి 105 స్థానా లుండగా, ఉప ఎన్నికల తర్వాత దాని బలం 117కి చేరుకుంది. ఫిరాయింపు రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటారని, అందువల్ల ఫిరాయింపుల కార ణంగా సభ్యత్వం కోల్పోయి, బరిలో నిలిచిన వారంతా ఓటమి పాలవుతారని రాజ్యాంగ నైతికతను కోరుకునే వారంతా ఆశించారు. ఈ ఫిరాయింపులతో అధికారం పోగొట్టుకున్న కాంగ్రెస్, జేడీఎస్లు సైతం అలాగే కోరుకున్నాయి. జనమంతా ఫిరాయింపుదార్లకు గట్టిగా బుద్ధి చెబుతారని భావిం చాయి. అయితే ప్రజలు కేవలం ఫిరాయింపుల అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని భావించడం దురాశ. ఈ ఫిరాయింపుల కారణంగా పతనమైన కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అంతక్రితం 14 నెలలపాటు ఎలా పాలించిందో కూడా వారు అంచనా వేసుకున్నారు. ఆ 14 నెలలూ రెండు పార్టీలూ పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడమే సరిపోయింది. రెండు మూడు సందర్భాల్లో అప్పటి సీఎం కుమారస్వామి కంటతడి పెట్టారు. ఏం చేద్దామనుకున్నా తనకు అడ్డంకులు ఎదురవు తున్నాయని ఆయన వాపోయారు. కేవలం బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం కోసం కలవడం తప్ప రాజకీయంగా ఆ రెండు పార్టీలూ ఒక ఉమ్మడి ఎజెండా రూపొందించుకోలేక పోయాయి. వరస వివాదాల్లో ఆ పార్టీలు తలమునకలై ఉండగా ఉపాధి లేమి, కరువుకాటకాలు రాష్ట్రాన్ని పీల్చిపిప్పి చేశాయి. వీటన్నిటినీ ప్రజలు మరిచిపోలేదు. కనుకనే ఫిరాయింపుదార్ల అనైతిక రాజకీయాల గురించి ఎంత ప్రచారం చేసినా వారు పట్టించుకోలేదు. బీజేపీ ప్రచారం చేసిన సుస్థిర పాలన, అభివృద్ధికే వారు ఓటేశారు. ఉదాహరణకు కృష్ణరాజపేటె స్థానం నుంచి నిరుడు తమ పార్టీ అభ్యర్థిగా గెలిచి బీజేపీకి ఫిరాయించిన నారాయణగౌడపై జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గట్టిగా ప్రచారం చేశారు. రాజకీయంగా తమ గొంతు కోసిన ఆయనను చిత్తుగా ఓడించాలని ఎంతో ఉద్వేగంతో పిలుపునిచ్చారు. కానీ జనం నారాయణగౌడకే పట్టంగట్టారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెల్గాం జిల్లాలో గెలుపుపై బీజేపీ నేతల్లోనే అనుమానాలున్నాయి. పొరుగు రాష్ట్రంలోని పరిణామాలు ఈ ఉప ఎన్నికలపై ప్రభావాన్ని చూపుతాయని వారు భావించారు. కానీ అక్కడ కూడా విజయం సాధించడం వారిని ఉత్సాహపరిచింది. ఈ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి యడియూరప్పకు రాజకీయంగా ఊపిరిపోశాయి. నిజానికి ఆయన ఒకరకంగా గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నారు. 75 ఏళ్లు దాటిన నేతలు ముఖ్య పదవుల నుంచి వైదొలగాలన్న సూత్రానికి విరుద్ధంగా బీజేపీ ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టక తప్ప లేదు. ఫిరాయింపుదార్లందరికీ టికెట్లివ్వడానికి అధిష్టానం సుముఖంగా లేదన్న వార్తలొచ్చాయి. కానీ యడియూరప్ప పట్టుబట్టి పార్టీ టిక్కెట్లు వచ్చేలా చేశారు. పైగా గెలిస్తే వీరికి మంత్రి పదవులు ఇస్తామని కూడా ప్రచారసభల్లో చెప్పారు. అది ఎంతవరకూ సాధ్యమో చూడాల్సివుంది. పార్టీ కేంద్ర నాయకులెవ్వరూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో మాత్రమే కాదు... దేశంలో కూడా పార్టీ ప్రతిష్టను యడియూరప్ప పెంచగలి గారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ను మరింత కుంగదీసే ప్రమాదం ఉంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిస్తేజంగా ఉండటం, రాష్ట్రంలో పార్టీ సారథులు రాజీనామాలు చేయడం నైతికంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలను కుంగదీస్తుంది. రాజకీయంగా తమ భవిష్యత్తేమిటన్న గాభరా కలిగిస్తుంది. ఇప్పుడు సుస్థిర మెజారిటీ లభించింది గనుక బీజేపీ ప్రభుత్వం ఇక పాలనపై దృష్టి పెట్టాలి. ఆంతరంగిక కలహాల్లో తలమునకలైతే ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్లకు ఎదురైన చేదు అనుభవమే మున్ముందు బీజేపీకి కూడా తప్పకపోవచ్చు. -
విశాఖ గ్రామ వాలంటరీ ఫలితాల విడుదల
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జీవీఎంసీ జోన్-4 కార్యాలయం పరిధిలో ఇటీవల నిర్వహించిన గ్రామ వాలంటీర్ల పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఎంపికయిన అభ్యర్థుల జాబితాను ఉదయం జోనల్ కార్యాలయ ఆవరణలో నోటీస్బోర్డులో పెట్టారు. జోన్-4 పరిధిలో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు మొత్తం 5,330 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని విశాఖపట్నం జీవీఎంసీ జోన్-4 కమిషనర్ సింహాచలం వెల్లడించారు. 3,700 మంది మౌఖిక పరీక్షకు హాజరు కాగా 1,623 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. 2,181 మంది గ్రామ వాలంటీర్లుగా ఎంపికయినట్లు తెలిపారు. ఫలితాల కోసం కార్యాలయానికి పెద్దసంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. -
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
-
ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో 24 గంటల్లో వెలువడనుండగా, గెలుపోటములపై అభ్యర్థుల లెక్కలు మాత్రం తేలడం లేదు. గత ఎన్నికలతో పోలిస్తే 8.1శాతం మేర పోలింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలిస్తుందోననే కోణంలో రెండు రోజులుగా అభ్యర్థులు ఎడతెగని కసరత్తు చేస్తున్నారు. పురుషులతో పోటీగా మహిళలు ఓటింగ్లో పాల్గొనడంపై చర్చ జరుగుతోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉండడాన్ని ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ, గెలుపోటములపై అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 81.94శాతం పోలింగ్ నమోదైంది. 2014 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 8.1శాతం ఓట్లు అదనంగా పోలయ్యాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం గణనీయంగా పెరగ్గా అందోలు నియోజకవర్గం పరిధిలో ఈ పెరుగుదల ఏకంగా 10.19శాతంగా నమోదు కావడం గమనార్హం. శుక్రవారం సాయంత్రం పోలింగ్ గడువు ముగిసిన మరుక్షణం నుంచే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు బూత్ల వారీ ఓట్ల వివరాలు సేకరించారు. బూత్ స్థాయిలో తమకు అనుకూలంగా, ప్రతికూలంగా ఉండే ఓట్ల సంఖ్యపై అభ్యర్థులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. అయినా సంతృప్తి చెందని అభ్యర్థులు తమ నియోజకవర్గం పరిధిలో ఓ వైపు వివిధ వర్గాల నుంచి ఓటింగ్ సరళిపై వివరాలు సేకరిస్తూనే, విభిన్న కోణాల్లో పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా పోలింగ్కు సంబంధిం చిన మూడు అంశాలు పార్టీలు, అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగడం, పురుష ఓటర్లకు దీటుగా మహిళలు పోలింగ్లో పాల్గొనడం, గ్రామీణ బూత్లలో పెరిగిన పోలింగ్ శాతంపై అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ మూడు అంశాలు తమ ఫలితాన్ని ఎంత మేర ప్రభావితం చేస్తాయనే అంశంపై లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో పాటు పోలింగ్ బూత్ స్థాయిలో మద్యం, డబ్బు పంపిణీ ఎంత మేర ప్రభావం చూపుతుందనే కోణంలోనూ ఆయా పార్టీల నేతలు అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత? మహా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస తరఫున పోటీ చేసిన అభ్యర్థులు.. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా పనిచేసిందని లెక్కలు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల వ్యక్తిగత పనితీరు తమకు భారీగా లాభిస్తుందనే అంచనాలో కూటమి అభ్యర్థులు కనిపిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాలు, తెలంగాణవాదం, చేసిన పనితీరు, ప్రచారంలో సమన్వయం, భారీ బహిరంగ సభలు తమకు కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నడుమ త్రిముఖ పోటీ జరిగినట్లు పోలింగ్ సరళి వెల్లడిస్తోంది. కొన్ని బూత్లలో టీఆర్ఎస్, కాంగ్రెస్, మరికొన్ని చోట్ల టీఆర్ఎస్, బీజేపీ నడుమ పోరుగా కనిపించింది. సుమారు 15వేల ఓటు బ్యాంకు కలిగిన టీడీపీ మహా కూటమిలో భాగస్వామిగా ఉండడంతో, ఓటు బదిలీ ఎంత మేర జరిగిందనే అంశంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల రాజకీయ మనుగడకు ఎన్నికల ఫలితాలు గీటురాయి కానున్నాయి. అందోలు నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడం, గత ఎన్నికలతో పోలిస్తే 10.19శాతం అదనంగా ఓట్లు పోలవడం టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ పోటీ చేసినా బూత్ స్థాయిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ నువ్వా నేనా అనే రీతిలో పోలింగ్ నడిచింది. మహిళా ఓటర్లు ఇక్కడ ఫలితాన్ని నిర్దేశించే సూచనలు కనిపిస్తున్నాయి. జహీరాబాద్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ ప్రధానంగా పోటీ సాగినా, బీజేపీ అభ్యర్థి గణనీయమైన ఓట్లు సాధించే పరిస్థితి కనిపిస్తోంది. ఝరాసంగం మినహా ఇతర మండలాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమ పోటీ కేంద్రీకృతమైనట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు మొగ్గు చూపిన యువత ఈసారి బీజేపీ వైపు మళ్లినట్లు కనిపిస్తుండడం, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై అభ్యర్థులు ఎవరికి వారుగా లెక్కలు వేసుకుంటున్నా, గ్రామీణ బూత్లలో ఓటింగ్ శాతం పెరగడంతో టీఆర్ఎస్లో ధీమా కనిపిస్తోంది. సంగారెడ్డి పట్టణ ఓటర్ల నాడి అంతుబట్టక పోవడం కొంత ఉత్కంఠ రేపుతున్నా, మైనారిటీ ఓటర్లు ఎటు మొగ్గు చూపి ఉంటారనే అంశం కీలకంగా మారింది. క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు ఓ పార్టీకి అనుకూలంగా పోలవుతాయని భావించినా, ఆ మేరకు పడినట్లు కనిపించడం లేదు. పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ప్రచార హడావుడి సృష్టించినా, చివరి నిమిషంలో టికెట్ ఖరారు కావడంతో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ కేంద్రీకృతమైంది. రామచంద్రాపురం, అమీన్పూర్ మండలాలు, పటాన్చెరు పట్టణ బూత్లతో ఇరు పార్టీల నడుమ గట్టి పోటీ కనిపించింది. -
ఎన్ని'కల' పందెం కాస్కో..!
సాక్షి, కొత్తకోట: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈనెల 11న వెలువడే ఫలితాలపై రూ.లక్షల బెట్టింగ్ నడుస్తోంది. జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్పోల్ సర్వేలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండగా, ఒక్క లగడపాటి ఎగ్జిట్పోల్ సర్వే మాత్రం మహాకూటమికి సానుకూలంగా ఉందని చెప్పడం అందరిలోనూ ఉత్కంఠ రేపింది. గతంలో జరిపిన లగడపాటి సర్వేలు చాలా మేరకు విజయవంతమవడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత అలజడి నెలకొంది. దీంతో నేషనల్ ఎగ్జిట్పోల్స్పై నమ్మకం ఉంచుతూ కొందరు బెట్టింగులకు దిగుతున్నారు. ఈ క్రమంలో దేవరకద్ర నియోజకవర్గంలో బెట్టింగు రాయుళ్లు సైతం ఫుల్ జోష్లో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులకు మించిన స్థాయిలో ఓటింగ్ జరిగిన తీరునూ అంచనా వేస్తూ పందేలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొత్తకోట పట్టణంతో పాటు దేవరకద్ర, భూత్పూర్, అడ్డాకుల, చిన్నచింతకుంట మండల కేంద్రాలతో పాటు మదనాపురం, మూసాపేట వంటి మారుమూల ప్రాంతాలకు ఈ జాఢ్యం అంటుకుంది. ఈ క్రమంలో కొందరు లాభపడటం.. మరికొందరు నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితాలపై బెట్టింగ్ల తీరు ఎన్నికలు ఎంతో రసవత్తరంగా ముగిశాయి. ఆయా రాజకీయ పార్టీలు రూ.కోట్లు ఖర్చుచేశాయి. డబ్బు, మద్యం ఏరులై పారింది. దీంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ప్రచారం మొదలుకుని పోలింగ్ వరకు పందెం కాస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా.. మహాకూటమి వస్తుందా.. లేక హంగ్ ఏర్పడనుందా.. అంటూ పందెం కాస్తున్నారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడా.. లేక మహాకూటమి అభ్యర్థి గెలుస్తాడా.. బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయనే కోణంలో బెట్టింగులు కాస్తున్నారు. ఇవీ కాకుండా బెట్టింగ్ రాయళ్లు ఇంకొంచెం ముందుకెళ్లి ఆయా పట్టణాల్లో తమ నాయకుడికే అత్యధిక ఓట్లు వస్తాయని పందెం కాస్తున్నారు. దీంతో పాటు ఏ మండలం ఎవరికి ఎంత లీడ్ ఇస్తుందో చెబుతున్నారు. పల్లెల్లో బెట్టింగ్ భూతం ఎన్నికలకు ముందు దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా కొత్తకోట, దేవరకద్ర మండలాల్లో బెట్టింగ్ కాసినట్లు సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాత జాతీయ ఎగ్జిట్ పోల్ సర్వేలు, లగడపాటి సర్వేలు పూర్తిస్థాయిలో వ్యతిరేకంగా ఉండటంతో బెట్టింగ్ల స్థాయి పట్టణాల నుంచి పల్లెలకు పాకింది. దీంతో ఆయా మండలాల్లో కీలక నేతలు ఉండే గ్రామాల్లో కార్యకర్తల బెట్టింగ్ల జోరు ఊపందుకుంది. బెటింగ్ రాయుళ్ల ఆశలు నెరవేరాలంటే ఈనెల 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. స్వేహపూర్వకంగా గెలుపోటములు ఏ పోటీలోనైనా గెలుపోటములు స్వేహపూర్వకంగా ఉండాలి. అంతేగాని కొట్లాటలు, పోట్లాట వరకు వెళ్లకూడదు. ఫలితాలపై ఉత్కంఠ ఉండటం సహజమే. కానీ ఈ నెపంతో పందెం కాసి డబ్బు పోగొట్టుకోవడం మంచిది కాదు. ఆయా పార్టీల వారిలో ఎవరి ధీమా వారికే ఉంటుంది. ప్రస్తుతం ఓటర్లు పూర్తి అవగాహనతో ఓటు వేస్తున్నారు. వారి నాడి ఎవరికి అంతుచిక్కడం లేదు. – రవికాంత్రావు, ఎస్ఐ, కొత్తకోట -
రంగారెడ్డిలో ఫలితంపై ఉత్కంఠ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రజాతీర్పుపై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ప్రక్రియ ముగియడమే తరువాయి.. వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అభ్యర్థుల గుండెల్లో దడను పెంచాయి. పోలింగ్ సరళిని బట్టి ఫలితాలను విశ్లేషిస్తున్న రాజకీయ పరిశీలకులు.. ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపారనే దానిపై భిన్న వాదనలు వినిపించారు. జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రజానాడి అంతుచిక్కకపోయినా అభ్యర్థులు మాత్రం గెలుపుమాదేననే ధీమాతో ఉన్నారు. పోలింగ్బూత్ల వారీగా నమోదైన ఓటింగ్ శాతాన్ని విశ్లేషించుకుంటున్న అభ్యర్థులు కూడికలు, తీసివేతలు చేస్తున్నారు. పార్టీవర్గాల నుంచి సేకరించిన సమాచారంతో మదింపు చేస్తున్నారు. ఏయే వర్గాలు పార్టీకి అండగా నిలిచాయి, ఎవరు వెన్నుపోటు పోడిచారనేదానిపైనా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఐదు గంటలకు పోలింగ్ ముగియడమే తరువాయి.. పార్టీ ఏజెంట్లను సంప్రదించిన ముఖ్యనేతలు పోలింగ్ పూర్తి చేసుకొని చేవెళ్ల ప్రభుత్వ కళాశాలకు ఈవీఎంలతో చేరుకున్న సిబ్బంది uమొదటి పేజీ తరువాయి పోలింగ్ స్టేషన్ల వారీగా దక్కే ఓట్లపై అంచనాలు వేశారు. అభ్యర్థుల లెక్కలు ఇలా ఉండగా.. ఎగ్జిట్ పోల్స్ మాత్రం పార్టీలకు కునుకులేకుండా చేశాయి. గెలిచేదెవరిదానిపై తలోరకంగా సర్వే ఫలితాలు ఇవ్వడం కలవరపడేలా చేసింది. నువ్వా నేనా! కొడంగల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫలితం కూడా దాదాపుగా అలాగే ఉండబోతోంది. ఇక తాండూరులో మంత్రి మహేందర్రెడ్డి తొలిసారి చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. చావో రేవో తేల్చుకోవాలని బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్రెడ్డితో మహేందర్కు ముచ్చెమటలు పట్టాయి. తాండూరులోనూ ఇరుపార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. అదృష్టం ఎవరిని వరించినా.. స్వల్ప ఓట్ల తేడాతోనే గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది. పరిగిలో తాజా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి మహేశ్రెడ్డి నుంచి గట్టిపోటీ ఎదురైంది. చేవెళ్లలోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య రసవత్తర పోరు జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యదే పైచేయిగా కనిపిస్తోంది. వికారాబాద్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థుల నడుమ ముక్కోణపు పోటీ జరిగినా.. తుది పోరులో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులే రంగంలో నిలిచినట్లు తెలుస్తోంది. షాద్నగర్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పోటీ ఉత్కంఠను తలపిస్తోంది. షాద్నగర్లో టీఆర్ఎస్కు ఎంఐఎం, టీడీపీలు గట్టి పోటీనిచ్చాయి. టీడీపీ, టీఆర్ఎస్లు భారీగా ఓట్లను చీల్చుకుంటే మజ్లిస్ బయటపడ్డా ఆశ్చర్యం లేదు. ఇక ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు కొంత అనుకూల పవనాలు వీచినట్లు పొలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. కల్వకుర్తిలో త్రిముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ ఢీ అంటే ఢీ అనే రీతిలో సమరం సాగడం.. 84శాతం పోలింగ్ నమోదు కావడంతో అనూహ్య ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తోంది. గ్రామాల్లో ‘కారు’ దౌడ్ గ్రామీణ ఓటర్లు మరోసారి గులాబీ పార్టీకి మద్దతు పలికినట్లు పోలింగ్ సరళిని బట్టి స్పష్టమవుతోంది. ముఖ్యంగా రైతులు, వృద్ధులు, మైనార్టీలు టీఆర్ఎస్ను ఆదరించినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో పరిగి, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, తాండూరు, కల్వకుర్తిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ గణనీయ ఓట్లు సాధించినట్లు ఆయా వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత టీఆర్ఎస్ పనితీరుపై పెదవివిరిచారు. దీని ప్రభావం 11న వెలువడే ఎన్నికల ఫలితాల్లో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. -
మాస్ కాపీయింగ్కు తెరపడేనా?
సాక్షి, ముదినేపల్లి రూరల్: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధించేందుకు విద్యాశాఖ ప్రభుత్వ స్కూళ్లల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే మార్చిలో జరగబోయే పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేపట్టారు. కేవలం పరీక్షా కేంద్రాల మార్పు వల్లే మాస్ కాపీయింగ్ నిరోధించడం ఏమేరకు సాధ్యపడుతుందనేది నియోజకవర్గంలోని ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తమ ఫలితాల కోసం అడ్డదారులు ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు ప్రభుత్వస్కూళ్లలోనూ, ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలోని కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. ఇన్విజిలేటర్లు, డీవోలు, సీఎస్లుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఫలితాల కోసం ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులతో కుమ్మక్కై మాస్కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేరుకే చట్టం పరీక్షల్లో కాపీయింగ్ నిరోధించేందుకు విద్యాశాఖ యాక్ట్ 25 అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యార్థి మాస్కాపీయింగ్ చేస్తు పట్టుబడితే విద్యార్థితో పాటు ఇన్విజిలేటర్, చీఫ్ సూపరెంటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంది. వీరిని విధుల నుంచి తప్పించడంతో పాటు జరిమానా, సస్పెన్షన్, జైలు శిక్ష విధించాలి. అయితే ఈ చట్టం పేరుకే తప్ప ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదు. దీని ప్రకారం ఇప్పటి వరకు ఏ ఒక్క ఉపాధ్యాయుడిని బాధ్యుడిని చేయలేదంటే మాస్కాపీయింగ్ లేనట్లా? లేక చట్టాన్ని సక్రమంగా అమలుచేయడం లేదో అర్థంకాని పరిస్థితి. దీన్ని అమలు చేయాల్సిన స్క్వాడ్ అధికారులే మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తూ యాక్ట్ 25ను అపహాçస్యం చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. అధికారుల ఒత్తిడి విద్యార్థుల సామర్థ్యాలతో పనిలేకుండా పది పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా అధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడం ఆనవాయితీగా మారింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫలితాల సాధన కోసం మాస్కాపీయింగ్ను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నట్లు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలనే ఒత్తిడి ఉన్నంత కాలం పరీక్షా కేంద్రాలు ఏవిధంగా మార్పు చేసినా మాస్కాపీయింగ్కు తెరపడదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. -
ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష.. అందరూ ఫెయిల్!
పనాజి : అకౌంటెంట్ పోస్టుల నియామకాల కోసం గోవా ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో ఒక్కరు కూడా అర్హత సాధించకపోవడం ప్రస్తుతం చర్చనీయాశంమైంది. సుమారు 8వేల మంది గ్రాడ్యుయేట్లు ఈ పరీక్ష రాయగా.. వీరిలో ఏ ఒక్కరికి 100కు కనీసం 50 మార్కులు రాలేదు. ఈ ఏడాది జనవరి 7న నిర్వహించిన ఈ పరీక్షలో ఒక్కరు కూడా కనీస మార్కులు సాధించలేదని డైరెక్టరేట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది అక్టోబర్లో 80 పోస్టులు నియమాకాల కోసం ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసింది. ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అకౌంట్స్ సంబంధిత ప్రశ్నలతో 100 మార్కులకు ఐదు గంటల సమయంతో జనవరిలో పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి మౌఖిక ఇంటర్వ్యూల ద్వారా తుది జాబితాను ఎంపికచేస్తామని నోటీఫికేషన్లో పేర్కొంది. కానీ ఏ ఒక్కరు అర్హత సాధించకపోవడంతో అధికారులు నిశ్చేష్టులయ్యారు. ఇక ఫలితాలను ఆలస్యం చేయడాన్ని గోవా ఆమ్ఆద్మీ పార్టీ నేత ప్రదీప్ పద్గోనకర్ తప్పుబట్టారు. 8000 మంది అభ్యర్థుల్లో ఏ ఒక్కరు అర్హత సాధించకపోవడం రాష్ట్రంలోని పతానవస్థలో ఉన్న విద్యావిధానానికి అద్దం పడుతోందని విమర్శించారు. -
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..
సాక్షి, న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలను శనివారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 13,336 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. సివిల్ మెయిన్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి 600 మంది ఎంపికయ్యారు. -
నేడు ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాలను శుక్రవారం విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఇంటర్ బోర్డు కార్యాలయ ఆవరణలో ఉదయం 9 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 14వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,63,546 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,55,635 మంది ఫస్టియర్ కాగా.. 5,07,911 మంది సెకండియర్ విద్యార్థులున్నారు. ‘టీఎస్బీఐఈ సర్వీసెస్’ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ కాలేజీల వారీ ఫలితాలను తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి http://admi.tsbie.cgg.gov. in వెబ్సైట్లో పొందవచ్చు. ఫలితాలకోసం www.sakshi.com www.sakshieducation.com https://tsbie.cgg.gov.in www.bie.telangana.gov.in www.exam.bie.telangana.gov.in http://results.cgg.gov.in http://bie.tg.nic.in http://examresults.ts.nic.in -
గుజరాత్లో ఓడినా.. రాహుల్ హీరోనే!
సాక్షి, న్యూఢిల్లీ : నువ్వా-నేనా అన్న రీతిలో ఎన్నికల ప్రచారం.. బీజేపీ-కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ విమర్శలు.. వెరసి గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. తిరిగి పాగా ఎగరవేయాలని కమలం.. రెండు దశాబ్దాల తర్వాత జెండా ఎగరవేయాలని హస్తం పార్టీలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఈ తరుణంలో గుజరాత్ ఎన్నికల ఫలితాలు.. రాహుల్ పగ్గాలపై నేపథ్యంలో ఎలాంటి ప్రభావం చూపుతాయి? అన్నది చూద్దాం. గుజరాత్ ఎన్నికల ప్రచారం మొదలయిన సమయంలో పటీదార్ నేత హర్దిక్ పటేల్ బీజేపీకి ముఖ్య ప్రత్యర్థిగా కనిపించాడు. కానీ, ఎప్పడైతే ప్రచార పర్వం ఊపందుకుందో క్రమక్రమంగా హర్దిక్ తెర వెనక్కి వెళ్లిపోయి.. రాహుల్ గాంధీ వైపునకు అందరి చూపు మళ్లింది. పోటాపోటీ ప్రచారం.. మోదీ అండ్ బీజేపీపై రాహుల్ సహేతుక విమర్శలతో అది ముందుకు సాగింది. గెలిచినా.. ఓడినా... ఒకవేళ గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే అది ఖచ్ఛితంగా రాహుల్ విజయమే అవుతుంది. ఎందుకంటే కురువృద్ధ పార్టీ తరపున ముందుండి ప్రచారం నిర్వహించింది ఒకే ఒక్కడు కాబట్టి. రైతులు, వ్యాపారస్థులు, గిరిజనులు ఇలా అన్ని వర్గాల వారితో ముఖాముఖి, సభలు నిర్వహించి సమస్యలు తెలుసుకుంటూ వారితో రాహుల్ మమేకం అయ్యాడు. సోషల్ మీడియాలో కూడా ప్రధాని విధానాలను ఎండగడుతూ ముందుకు సాగాడు. ఈ తరుణంలో గుజరాత్ గెలుపు కాంగ్రెస్కు మనోధైర్యం నింపటం ఖాయం. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీదే గెలుపని కోడై కూస్తున్న వేళ.. నిజంగానే కాంగ్రెస్ ఓడిపోతే రాహుల్ నాయకత్వానికి మచ్చగా మిగిలిపోదా? అంటే.. అలాంటిదేం ఉండబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలు ఏంటంటే... 2012 ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ కు 9 శాతం ఓట్లు తక్కువగా పోల్ అయ్యాయి. కానీ, ఈసారి కాంగ్రెస్కు అనుకూలంగా కాస్త ఓటింగ్ శాతం పెరిగిందని సర్వేలే చెబుతున్నాయి. సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ లో కాంగ్రెస్ దూసుకుపోవటం ఖాయమన్న సంకేతాలు అందించాయి. అదే జరిగితే బీజేపీకి ఊహించని రీతిలో పెద్ద దెబ్బే తగులుతుంది. రాహుల్ మేనియా.. బీజేపీలో భయం నరేంద్ర మోదీ గుజరాత్కు 12 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. గుజరాత్ మోడల్ కు తానే కారణమంటూ ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు స్వయంగా ఇప్పుడు ఆయనే ప్రజల్లోకి వెళ్లటం ఒకరకంగా రాహుల్ కారణంగానే అన్న సంకేతాలు అందించాయి. పైగా మోదీ తీవ్ర విమర్శలకు దిగిన తరుణంలో.. రాహుల్ మాత్రం చాలా ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా.. కేవలం ప్రజా సమస్యలపైనే ప్రభుత్వాలను నిలదీశాడు. ఆలయ దర్శన విషయంలోనూ వచ్చిన విమర్శలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఎన్నికలకు ముందు కమలం నేతలు, కార్యకర్తల్లో నిరుత్సాహం పెరిగిపోవటం.. తొలిసారి సోషల్ మీడియా ప్రచారం ద్వారా కాంగ్రెస్ పార్టీ హైలెట్ కావటం.. తదితర పరిణామాలు కమలాన్ని కలవరపాటుకు గురిచేశాయి. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా.. ఓడినా... భవిష్యత్తులో రాహుల్ దూకుడుకు కళ్లెం వేయటం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బ్లాక్ మ్యాజిక్
-
పదిలో నూరు శాతం ఫలితాలు సాధించాలి
ఎంఈఓలు, హెచ్ఎంలకు డీఈఓ సూచన ఏలూరు(ఆర్ఆర్పేట): ఈ ఏడాది పదవ తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేలా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.ఎస్.గంగాభవాని సూచించారు. సోమవారం ఏలూరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఒలతో స్థానిక సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ప్రతీ రోజూ సాయంత్రం ఒక గంట అదనంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. 8వ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే ప్లేఫీల్డ్స్కి ప్రధానోపాధ్యాయులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఏలూరు డీవైఈఓ ఉదయ కుమార్ మాట్లాడుతూ 10వ తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ఈ నెల 10వ తేదీ నుండి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, తరగతి గదులను ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని, వారాంతపు సమీక్షలు నిర్వహించి, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలపై తగు సలహాలు ఇవ్వాలని సూచించారు. అలాగే బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రతీ పాఠశాలలో కిచెన్గార్డెన్లు ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజన పథకానికి కూరగాయలు పండించాలన్నారు. అనంతరం రిటైర్డ్ డీవైఈఓ ఏడీవీ ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏలూరు డివిజన్లోని మండల విద్యాశాఖాధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
జిల్లాకు ఇంటర్లో మూడు, పదిలో 5వ స్థానాలు భానుగుడి(కాకినాడ): ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఆపాస్) ద్వారా పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలు శుక్రవారం విడుదలయినట్లు జిల్లా కో ఆర్డినేటర్ కొమ్మన జనార్దనరావు తెలిపారు. జిల్లాలో పదోతరగతికి సంబంధించి 7,355 మంది పరీక్షలు రాస్తే 4,690 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా జిల్లా 63.77 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానంలో నిలిచిందన్నారు. ఇంటర్వీుడియట్లో 9,089 మంది పరీక్షలకు హాజరవగా 6,440 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. 70.85 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 3వ స్థానంలో నిలిచిందన్నారు. పదోతరగతి రీకౌంటింగ్కు రూ.100, ఇంటరీ్మడియట్ రీకౌంటింగ్కు రూ.200 చెల్లించాలని, రీవెరిఫికేషన్, ఫొటోస్టాట్ కాపీ ఇచ్చేం దుకు రూ.1000 ఏపీ ఆ¯ŒSలై¯ŒS ద్వారా ఈ నెల 5 నుంచి 15 లోగా చెల్లించాలని సూచించారు. సెప్టెంబరులో నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు పదోతరగతి సబ్జెక్టు ఒక్కింటికి రూ.100, ఇంటరీ్మడియట్ సబ్జెక్టు ఒక్కింటికి రూ.150, ఇంటరీ్మడియట్ ప్రాక్టికల్ పేపర్ ఒక్కింటికి రూ.100 చొప్పున ఏపీ ఆ¯ŒSలై¯ŒS ద్వారా ఫీజులు చెల్లించే జూలై 6నుంచి 20 వరకు చెల్లించవచ్చన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతిలో 34,362 మంది, ఇంటరీ్మడియట్లో 31,961 మంది ఉత్తీర్ణులైనట్లు డీఈవో ఎస్.అబ్రహం పేర్కొన్నారు. 6 నుంచి 9 వరకు డీఈఈ సెట్ భానుగుడి(కాకినాడ సిటీ) : డీఈఈ సెట్–2017 ఈ నెల 6 నుంచి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ ఎంట్ర¯Œ్స టెస్ట్గా(సిబెట్) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీఈవో ఎస్.అబ్రహాం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు ’డీఈఈసీఈటీఏపీ.జీవోవీ.ఇ¯ŒS’ వెబ్సైట్ ద్వారా హాల్టికెట్ల ఈనెల 1నుంచి పొందవచ్చన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల సూరంపాలెం, రాజమండ్రి శ్రీప్రకాష్ విద్యానికేతన్, రాజమండ్రి సీఎస్ఆర్ ఆ¯ŒSలై¯ŒSఅకాడమీ, భట్లపాలెం బీవీసీ ఇ¯ŒSస్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ అండ్ సై¯Œ్స, రైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, భూపాలపట్నం, రాజమండ్రి, బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల ఓడలరేవులలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది 11582 మంది పరీక్ష రాస్తున్నారన్నారు. ఉదయం రాసే అభ్యర్థులు 9 గంటలకు, మధాహ్నం రాసే అభ్యర్థులు 1.30 గంటలకు పరీక్షా కేంద్రాల వద్ద హాజరవ్వాలన్నారు. -
బాలురదే హవా
► ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి ► ఇంజనీరింగ్ విభాగం టాప్–10 బాలురే.. అగ్రికల్చర్లోనూ వారిదే హవా ► ఇంజనీరింగ్లో 74.75 శాతం, అగ్రికల్చర్–ఫార్మసీలో 86.49 శాతం అర్హులు ► రేపటి నుంచి ఓఎంఆర్ షీట్ల డౌన్లోడ్.. 27 వరకు ‘చాలెంజ్’కు అవకాశం ► ఈనెల 28 నుంచి ర్యాంకు కార్డుల డౌన్లోడ్ ► వచ్చే నెల రెండో వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్ ► టీ ఎంసెట్లో ప్రతిభ చూపిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎంసెట్ –2017లో బాలురు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం టాప్–10 ర్యాంకులన్నీ బాలురకే లభించగా.. అగ్రికల్చర్, ఫార్మసీలోనూ టాప్–10లో ఏడు ర్యాంకులను వారే సాధించారు. మొత్తంగా ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 74.75 శాతం, అగ్రికల్చర్–ఫార్మసీలో 86.49 శాతం మంది అర్హత సాధించారు. ఇక రెండు కేటగిరీల్లోనూ టాప్–10 ర్యాంకుల్లో సగం వరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సాధించారు. ఈనెల 12న నిర్వహించిన ఎంసెట్–2017 ర్యాంకులను సోమవారం జేఎన్టీయూహెచ్లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ ‘కీ’లో ఎలాంటి తప్పులూ లేవని.. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి ఈ విషయాన్ని తేల్చిందని చెప్పారు. ఎంసెట్ స్కోర్కు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ తుది ర్యాంకులను ఖరారు చేసినట్లు తెలిపారు. ఇంటర్ ఫెయిలై.. టీ ఎంసెట్కు మొత్తంగా 2,20,248 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ కోసం 1,41,136 మంది దరఖాస్తు చేసుకోగా.. 93.46 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్–ఫార్మసీ కోసం 79,033 మంది దరఖాస్తు చేసుకోగా.. 92.99 శాతం హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,11,092 మంది (74.75 శాతం), అగ్రికల్చర్–ఫార్మసీ విభాగంలో 70,721 మంది (86.49 శాతం) అర్హత సాధించారు. ఇక దాదాపు 22 వేల మంది విద్యార్థులు ఎంసెట్లో అర్హత సాధించినా ఇంటర్లో ఫెయిలైన కారణంగా ర్యాంకులు పొందలేకపోయారు. మరో 3,222 మంది విద్యార్థుల ఇంటర్ మార్కుల వివరాలు అందజేయకపోవడంతో వారికి ర్యాంకులను ప్రకటించలేదు. టాప్ ర్యాంకులు ఏపీ విద్యార్థులకే! ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన గోరంట్ల జయంత్ హర్ష మొదటి ర్యాంకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లారి రామ్ప్రసాద్ 2వ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్–ఫార్మసీ విభాగంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కడిమిశెట్టి వీఎన్వీఎస్ నేస్తంరెడ్డి మొదటి ర్యాంకు, ప్రకాశం జిల్లాకు చెందిన గొల్లమూడి ప్రదీత్ సుందర్ 2వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఒక్కరికీ ‘ఫుల్’మార్కులు రాలేదు 160 మార్కులకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షలో ఒక్క విద్యార్థికి కూడా పూర్తిగా 160 మార్కులు లభించలేదు. ఇంజనీరింగ్లో టాప్ మార్కులు 156కాగా.. ఇద్దరు విద్యార్థులే ఈ స్థాయి మార్కులు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో గరిష్ట మార్కులైన 153 మార్కులను ఇద్దరు విద్యార్థులు సాధించారు. గణితంలో ఐదుగురికి 80/80 ఇంజనీరింగ్ విభాగంలోని గణితం సబ్జెక్టులో 80 మార్కులకుగాను పూర్తిగా 80 మార్కులను ఐదుగురు విద్యార్థులు సాధించారు. ఫిజిక్స్లోనూ ఐదుగురు విద్యార్థులు 40 మార్కులకు 40 మార్కులను పొందారు. కెమిస్ట్రీలో 40 మార్కులకుగాను గరిష్టంగా 39 మార్కులను నలుగురు విద్యార్థులు సాధించారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలోని బయాలజీలో 80కి 80 మార్కులు పదిమంది విద్యార్థులకు లభించాయి. ఫిజిక్స్లో 40కి గాను గరిష్టంగా 38 మార్కులను ముగ్గురు విద్యార్థులు సాధించారు. కెమిస్ట్రీలోనూ గరిష్టంగా 38 మార్కులను ఒకే విద్యార్థి సాధించారు. అభ్యంతరాలుంటే ‘ఛాలెంజ్’! విద్యార్థులు తమ ఓఎంఆర్ జవాబు పత్రాలను ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు ఎంసెట్ వెబ్సైట్ ( ్ఛ్చఝఛ్ఛ్టి. ్టటఛిజ్ఛి. ్చఛి. జీn) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. వాటిలో ఏమైనా తేడాలు, అభ్యంతరాలుంటే ఛాలెంజ్ చేసేందుకు అవకాశం కల్పించారు. సాధారణ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.2 వేలు చెల్లించి ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఛాలెంజ్ చేయవచ్చు. ఈ నెల 28వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ర్యాంకులు అటూ ఇటూ! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు చాలా మంది ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఎంసెట్ పరీక్షలు రాశారు. వారిలో కొందరు తెలంగాణలో టాప్ ర్యాంకుల్లో నిలవగా, ఏపీలో తక్కువ ర్యాంకు లభించింది. మరికొందరికి ఏపీలో ఎక్కువ ర్యాంకు రాగా.. తెలంగాణలో తక్కువ ర్యాంకు వచ్చింది. ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్లో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థికి టీఎంసెట్లో ఐదో ర్యాంకు వచ్చింది. అదే టీ ఎంసెట్ ఇంజనీరింగ్లో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఏపీ ఎంసెట్లో 4వ ర్యాంకు లభించడం గమనార్హం. అగ్రికల్చర్–ఫార్మసీలోనూ ఇలాగే ఉంది. టీ ఎంసెట్ అగ్రికల్చర్–ఫార్మసీలో ఒకటో ర్యాంకు సాధించిన విద్యార్థి.. ఏపీ ఎంసెట్లో టాప్–10 ర్యాంకుల్లో లేకపోవడం గమనార్హం. ఇలా అనేక మంది విద్యార్థుల ర్యాంకులు తారుమారు అయ్యాయి. -
ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
– మార్కులు తక్కువొచ్చాయని ఒకరు – ఫెయిల్ అయ్యానని మరొకరు – ఇరువురి పరిస్థితి సీరియస్ – కర్నూలుకు తరలింపు ఇంటర్ ఫలితాలు ఇద్దరు విద్యార్థుల మనస్సులను గాయపరిచాయి. గురువారం వెలువడిన పరీక్షా ఫలితాలు జీర్ణించుకోలేక ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, ఫెయిల్ అయ్యానని మరొకరు బలవన్మరణానికి ప్రయత్నించారు. ఈ రెండు సంఘటనలు మండల పరిధిలోని వేర్వేరు గ్రామాల్లో చోటుచేసుకున్నాయి. కోవెలకుంట్ల: మండల పరిధిలోని గుళ్లదూర్తి గ్రామానికి చెందిన గంగన్న, సుదర్శనమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. గంగన్న ఉయ్యాలవాడ మండలంలో వెలుగు కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్నాడు. కూతురు అల్లూరు సుమలత నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర బైపీసీ చదువుతోంది. ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో ఫెయిల్ అయినట్లు తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకుంది. స్థానికులు మంటలు ఆర్పి 108 అంబులెన్స్లో కోవెలకుంట్ల ఆస్పత్రికి తరలించారు. 70శాతం శరీరభాగాలు కాలిపోవడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్కులు తక్కువ వచ్చాయని.. మండలంలోని గుంజలపాడు గ్రామానికి చెందిన రాజారెడ్డికి ఇద్దరు కుమారులు సంతానం. పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. రెండో కుమారుడు సతీష్రెడ్డి కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర బైపీసీ చదువుతున్నాడు. ఫలితాలు విడుదల కానుండటంతో తండ్రితోపాటు కోవెలకుంట్లకు వచ్చాడు. ఇంటర్ ఫలితాల్లో 420 మార్కులు రావడంతో తన స్నేహితుడికంటే మార్కులు తక్కువ వచ్చాయని మనోవేదనకు గురయ్యాడు. తాను తర్వాత వస్తానని తండ్రిని ఆటో ఎక్కించి పంపాడు. క్రిమి సంహారక గుళికలు మింగి బైక్పై ఇంటికి చేరుకుని వాంతులు చేసుకోవడంతో గమనించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ పేర్కొన్నారు. -
ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా పనిచేద్దాం
- పది పరీక్షలపై డీఈఓ తాహెరా సుల్తానా - రోజుకు రెండు హైస్కూల్స్ విజిట్ - కోడ్ వల్ల బయోమెట్రిక్ తాత్కాలిక వాయిదా కర్నూలు సిటీ: వచ్చే నెల17వ తేదీ నుంచి జరుగునున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా పని చేయాలని డీఈఓ తాహెరా సూల్తానా ఎంఈఓలను ఆదేశించారు. స్థానిక ఎస్ఎస్ఏ సమావేశ మందిరంలో గురువారం డిజాస్టర్ మేనేజ్మెంట్, పదవ తరగతి పరీక్షలు, బయోమెట్రిక్ తదితర అంశాలపై డీఈఓ మండల విద్యాధికారులతో సమీక్షించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి ఒక్కరూ అవగహన కలిగి ఉండాలన్నారు. ఈ ఏడాది నుంచి పదవ తరగతి పరీక్షలు నూతన విధానంలో జరుగనున్నాయని, ఈ మేరకు విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉందన్నారు. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. మండల విద్యాధికారులు ప్రతి రోజు కనీసం రెండు హైస్కూళ్లను విజిట్ చేసి, అక్కడి విద్యార్థులతో మాట్లాడి సమస్యలుంటే పరిష్కరించాలన్నారు. ఇటీవల కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో బయెమెట్రిక్ హాజరు గురించి వివరించారని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపరు. కోడ్ ముగిసిన తరువాత దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆమె ఎంఈఓలకు సూచించారు. -
పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి
–హెచ్ఎంలతో డీఈఓ రవీంద్రనాథరెడ్డి గూడూరు: పదోతరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.రవీంద్రనా«ద్రెడ్డి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో గూడూరు, సి.బెళగల్ మండలాల జెడ్పీ, మోడల్, కస్తూర్బా పాఠశాలల హెచ్ఎంలతో ఆయన సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా హెచ్ఎంతో పదోతరగతి విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి తక్కువ గ్రేడ్ ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఫలితాలు తక్కువ వస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. సమావేశంలో విదా్యశాఖ డిప్యూటీ ఈఓ తాహెరాసుల్తాన, డీసీఈబీ ఓంకార్యాదవ్, ఇన్చార్జి ఎంఈఓ నాగభూపాల్నాయుడు పాల్గొన్నారు. -
మితభాషి ఉర్జిత్
దేశ ప్రజలపై ఉత్పాతంలా వచ్చిపడిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పూర్వాపరా లేమిటో, దాని పర్యవసానాలేమిటో తెలుసుకుందామని ఎంతో ఆశతో ఎదురు చూసినవారికి బుధవారం జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం అసంతృప్తి కలిగించి ఉంటుంది. నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు గురించి ప్రకటించడం... మరికొన్ని గంటల్లో అమల్లోకి రావడం, ఆ మరుసటి రోజు నుంచి ఏటీఎంల ముందూ, బ్యాంకుల ముందూ పడిగాపులు పడటం మినహా సామాన్య పౌరులకు ఏం జరిగిందో, జరుగుతున్నదో అర్ధంకాలేదు. చాలా సందేహా లకు ఈనాటికీ జవాబులేదు. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సవాళ్లు విసురుకున్నారు. దేశ ప్రజలంతా ఈ నిర్ణయాన్ని వేనోళ్ల కీర్తిస్తున్నారని మోదీ మొదలుకొని కింది స్థాయి బీజేపీ నేతల వరకూ చెబితే... ఇది అనాలోచిత నిర్ణయమని విపక్షాలన్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనైనా ప్రభుత్వం దీనిపై సవివరమైన ప్రకటన చేస్తుందని, విపక్షాలు ఆ దిశగా ఒత్తిడి తెస్తాయని ఆశించినవారు ఆ సమావేశాల తంతు చూసి దిగ్భ్రమచెందారు. మొదలైన దగ్గర నుంచి ముగిసేవరకూ అవి వాయిదాల్లోనే గడిచిపోయాయి. ఇన్నాళ్లకు ఆర్ధిక శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ కమిటీ వంతు వచ్చింది. ఈ కమిటీ ముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అసలు హాజరవుతారా లేదా అన్న సందేహాలు చాలామందికొచ్చాయి. అయితే ఆయన, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కమిటీ సభ్యులడిగిన ప్రశ్నలకు జవాబులూ ఇచ్చారు. కానీ అవి సభ్యుల్ని సంతృప్తి పరచలేదని అంటున్నారు. సమయం సరిపోకపోవడంతో మరోసారి కూడా వారిని కమిటీ ముందుకు పిలుస్తారని చెబుతున్నారు. వాస్తవానికి ఇదే విషయంపై ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) కూడా ఈ నెల 20న సమావేశం కాబోతోంది. దానికి కూడా ఉర్జిత్ హాజరుకావలసి ఉంటుంది. స్థాయీ సంఘాలకు విపక్ష సభ్యుల నేతృత్వం ఉన్నప్పుడు... ఆ సంఘాలు సమీక్షించే అంశాలు సంచలనాత్మకమైనవి అయినప్పుడు ప్రశ్నలెప్పుడూ విచ్చుకత్తు ల్లాగే ఉంటాయి. సూటి ప్రశ్నకు సూటి జవాబు రాని స్థితి సాధారణంగా రెండు సందర్భాల్లో ఉంటుంది. సంధించిన ప్రశ్నకు జవాబు లేకపోవడంవల్ల లేదా జవాబివ్వడానికి పరిమితులు అడ్డొచ్చినప్పుడు నోరు పెగలదు. ఇచ్చే సమాధానం మరిన్ని ప్రశ్నలకు దారితీసే ప్రమాదం ఉంటే ఇక చెప్పనవసరమే లేదు. ఏ అవస్థ వల్ల ఉర్జిత్ సవివరమైన జవాబివ్వలేకపోయారో లేదా అరకొరగా ఇచ్చి ఊరు కున్నారో ఆయనే స్వయంగా చెబితే తప్ప ప్రజలకు తెలిసే అవకాశం లేదు. నిజానికి ఆయన జవాబివ్వని ప్రశ్నలేవీ జటిలమైనవి కాదు. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి ఎంత నగదు తిరిగొచ్చిందన్న ప్రశ్నకు సాధారణ బ్యాంకు ఉద్యోగి జవాబు చెప్పలేకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇన్ని నెలల తర్వాత కూడా ఉర్జిత్ పటేల్ చెప్పలేకపోవడం అయోమయాన్ని కలిగిస్తుంది. తిరిగొచ్చిన నోట్ల విలువను మరోసారి లెక్కేయమని కింది బ్యాంకులకు రిజర్వ్బ్యాంక్ సూచిం చినట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. అందువల్లే జవాబు ఇవ్వలేకపోతే ఆ సంగతి కమిటీకి చెప్పడంవల్ల కలిగే నష్టమేమిటో అర్ధంకాదు. ఎప్పటికల్లా బ్యాంకింగ్ కార్య కలాపాలు సాధారణ స్థితికి చేరతాయన్న ప్రశ్న కూడా ఇటువంటిదే. ఈ రెండు అంశాలూ నిజానికి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నవి. వాటికి కనీసం స్థాయీ సంఘంలోనైనా జవాబులు రాకపోతే ఏమనుకోవాలి? ఉర్జిత్ ఆమాత్రం ఆలోచించ లేకపోయారా? స్థాయీ సంఘం సమావేశంలో ఉర్జిత్ నుంచి విస్పష్టమైన జవాబులు వచ్చి ఉంటే ఆయన పతాక శీర్షికలకు ఎక్కేవారు. ఆయనిచ్చిన వివరణలపై చానెళ్ల చర్చలు హోరెత్తేవి. కానీ ఆయనకు అలాంటి ఆసక్తి ఉన్నట్టు లేదు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మాత్రం అనుకోకుండా వార్తలకెక్కారు. మౌన మునిగా పేరుబడిన ఆయన కీలక సమయాల్లో చురుగ్గా ఉండగలనని, సమర్ధుడైన మధ్యవర్తిగా వ్యవ హరించి పరిస్థితిని చక్కదిద్దగలనని నిరూపించారు. సభ్యులు కటువుగా మాట్లాడు తుంటే రాజ్యాంగపరమైన సంస్థగా ఆర్బీఐని గౌరవించాల్సిన అవసరం ఉన్నదని హితవు పలకడమే కాక, ఒక ప్రశ్నకు ఇరకాటంలో పడిన ఉర్జిత్ను ఉద్దేశించి ‘దానికి మీరు జవాబు ఇవ్వనవసరం లేదు’ అని ఊరడించారట! ఉర్జిత్ను ఒకప్పుడు రిజర్వ్బ్యాంకుకు తీసుకొచ్చింది తానేనన్న ఆపేక్ష వల్లనో, ఆర్బీఐకి తాను సైతం గవర్నర్గా పనిచేసి ఉండటంవల్ల ఏర్పడిన సెంటిమెంటు వల్లనో మన్మోహన్లో కద లిక వచ్చి ఉంటుంది. ఈ సందర్భంగా మన పార్లమెంటరీ కమిటీల పనితీరు గురించి మాట్లాడు కోవాలి. ప్రజాపద్దుల కమిటీ ఉండటమన్న సంప్రదాయం బ్రిటిష్వారి కాలంలోనే మొదలుకాగా, వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కమిటీలు 1993 నుంచి మన దేశంలో అమల్లోకి వచ్చాయి. వీటిని అమెరికా ప్రతినిధుల సభ కమిటీలతో, బ్రిటన్ పార్లమెంటు కమిటీలతో పోల్చవచ్చు. అయితే ఆ రెండుచోట్లా కమిటీలు పారదర్శకంగా పనిచేస్తాయి. ఆ కమిటీ సమావేశాలకు పౌరులు హాజరుకావొచ్చు. వాటి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. భవిష్యత్తులో ఎవరైనా చూడటానికి వీలుగా ఆ రికార్డుల్ని భద్రపరుస్తారు. ఆ రెండు దేశాల్లోని కమిటీల తరహాలోనే మన కమిటీలు కూడా పనిచేస్తాయి. ప్రభుత్వ విధానాల్లోని లొసుగులను వెలికి తీస్తాయి. అందుకోసం ఎవరినైనా పిలుస్తాయి. ఏ పత్రాన్నయినా తమ ముందుంచ మని కోరతాయి. కానీ ఈ కార్యకలాపాలన్నీ గోప్యంగా జరుగుతాయి. ఇది సబబేనా? అమెరికా, బ్రిటన్ తరహాలో కమిటీలు పనిచేస్తే ప్రభుత్వ నిర్ణయాల్లోని మంచిచెడ్డలు పౌరులకు తెలుస్తాయి. కమిటీల ముందు నీళ్లు నమిలేవారి ఆంత ర్యాలు బయటపడతాయి. ప్రజల నిఘా ఉంటే కమిటీల పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని చెప్పుకుంటాం. కానీ వాటి అనుబంధ సంఘాలు ఆ సంస్కృతికి అనుగుణంగా లేకపోవడం వింత కాదా? పార దర్శకత ప్రజాస్వామ్యానికి బలమే తప్ప విఘాతం కాదని గుర్తించడం అవసరం. అందుకనుగుణంగా మార్పులు చేయడం తప్పనిసరి. -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో అమ్మాయిల హావా
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల సెమిస్టర్ పరీక్షల్లో అమ్మాయిలు సత్తా చాటారు. గతేడాది నవంబరులో నిర్వహించిన మొదటి, మూడవ సెమిస్టర్, సíప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శుక్రవారం ఆర్యూ వీసీ వై.నరసింహులు, రిజిస్ట్రార్ అమర్నాథ్ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షలకు 16,944 మంది విద్యార్థులకుగాను 9743 మంది, మూడవ సెమిస్టర్ పరీక్షల్లో 14,410 మందికిగాను 8088 మంది ఉత్తీర్ణులయ్యారు. సఫ్లిమెంటరీ పరీక్షల్లో 14,692 మంది విద్యార్థులు హాజరైతే 8139 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఠీఠీఠీ.టuజు.్చఛి.జీn, ట్ఛటu ్టట.టuజు.్చఛి.జీn, ఆయా కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గర ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు ఆర్యూ సీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు - బీఏలో అబ్బాయిలు 1838లో 992 మంది, అమ్మాయిలు 573కుగాను 425 మంది ఉత్తీర్ణులయ్యారు. బీబీఏలో అబ్బాయిలు 193కుగాను 105, అమ్మాయిలు 135కు 115 మంది, బీసీఏలో అబ్బాయిలు 128కిగాను 50, అమ్మాయిలు 39లో 30 మంది ఉత్తీర్ణులయ్యారు. బీకామ్లో అబ్బాయిలు 4443లో 2042, అమ్మాయిలు 1626లో 1195, బీఎస్సీలో అబ్బాయిలు 4231లో 2032, అమ్మాయిలు 3766లో 2747 మంది ఉత్తీర్ణులయ్యారు. మూడో సెమిస్టర్.. - బీఏలో అబ్బాయిలు 1588లో 739 మంది, అమ్మాయిలు 659లో 428, బీబీఏలో అబ్బాయిలు 160లో 126 మంది, అమ్మాయిలు 118లో 115 మంది పాసయ్యారు. బీసీఏలో అబ్బాయిలు 34లో 16, అమ్మాయిలు 15లో 09 మంది, బీకామ్లో అబ్బాయిలు 3864లో 1311, అమ్మాయిలు 1642 మందిలో 1064, బీఎస్సీలో అబ్బాయిలు 3340లో 1806, అమ్మాయిలు 2975లో 2408 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. -
ప్రగతి లేకుంటే వేటు
- మరుగుదొడ్డి నిర్మాణాలపై కలెక్టర్ హెచ్చరిక - కార్యక్రమంపై అధికారులు, సిబ్బందితో సమీక్ష - కృష్ణగిరి మండలంలో సీఆర్పీలందరూ తొలగింపు కర్నూలు(అర్బన్): మరుగుదొడ్డి నిర్మాణాల్లో ప్రగతి చూపని సీఆర్పీలపై వేటు తప్పదని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హెచ్చరించారు. ఏపీఓ, ఏపీడీ, ఏఈల పనితీరు అసంతృప్తిగా ఉన్నందునా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక సునయన ఆడిటోరియంలో శుక్రవారం బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలను తీర్చిదిద్దుట, పూర్తయిన మరుగుదొడ్ల వివరాలు, పెండింగ్ గురించి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నవంబర్ 14వ తేదీన జరిగిన సమీక్షలో నెల గడువు కోరగా అనుమంతించామని, డిసెంబర్ 14 పూర్తయినా లక్ష్యం సాధించలేక పోయారంటూ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 31 నాటికి లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలన్నారు. కృష్ణగిరి మండలంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో పురోగతి బాగాలేని కారణంగా సీఆర్పీలందరిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. ఇకపై అక్కడ మరుగుదొడ్డి నిర్మాణ పనులను ఏపీడీ, ఏపీఓలు చేపడతారని, వారితోనే సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఏపీడీ, ఏపీఓ ఒక్కో గ్రామంలో కూర్చొని చిత్తశుద్ధితో పనులు చేయించగలిగితే త్వరతిగతిన పనులు పూర్తవుతాయన్నారు. పనుల పరిశీలనకు ఇండిపెండెంట్ టీములను ఏర్పాటు చేశామని, వారి నివేదికల ఆధారంగా సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. తక్కువ ప్రగతి ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందని చెప్పిన కలెక్టర్.. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలను తమకు అందించాలని ఆదేశించారు. పూర్తయిన మరుగుదొడ్ల వివరాలను ఏరోజుకారోజు ఆప్డేట్ చేయాలన్నారు. సిబ్బంది పనితీరుకు సంబంధించి ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా విభజించి విడివిడిగా క్యాడర్ వారీగా నివేదికలను సిద్ధం చేసి కార్యాలయ నోట్ను తమకు అందించాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ డా. సీహెచ్ పుల్లారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబు పాల్గొన్నారు. -
ఫలితాల కోసం బీఈడీ విద్యార్థుల ధర్నా
ఏఎన్యూ: పరీక్షా ఫలితాల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన బీఈడీ విద్యార్థులు గురువారం యూనివర్సిటీ పరిపాలనా భవన్లోని రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఫలితాల విడుదలలో జాప్యం వల్ల తాము ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ మూడవ తేదీన తమకు పలు ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఉన్నాయని బీఈడీ సర్టిఫికెట్లు లేకపోతే తాము ఆ అవకాశాలను కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. బీఈడీ సర్టిఫికెట్ల కోసం ఎన్నిసార్లు యూనివర్సిటీ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని సాదుల్లా హుస్సేన్ బీఈడీ కాలేజ్లో 2013–14, 2014–15 విద్యాసంవత్సరాల్లో 50 మంది వరకు విద్యార్థులు అడ్మిషన్ పొంది కోర్సు చదివారు. వారి అడ్మిషన్లకు యూనివర్సిటీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి లేదని వారికి యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించలేదు. దీంతో కళాశాల యాజమాన్యంతో పాటు సాదుల్లా బీఈడీ కాలేజీలో 2014–15 బ్యాచ్లో బీఈడీ చదివిన విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి పరీక్షలు నిర్వహించమని యూనివర్సిటీకి సూచించింది. దానికి సంబంధించి ప్రభుత్వం జీఓను కూడా జారీ చేసింది. దాని ఆధారంగా ఆ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన యూనివర్సిటీ అధికారులు కళాశాల అఫ్లియేషన్ ఫీజు బకాయి ఉందని పరీక్షా ఫలితాలను నిలిపివేశారు. తరువాత పలితాలు విడుదల చేయమని కోర్టు సూచించింది. ఉన్నత విద్యాశాఖ కూడా జీఓను జారీ చేయడంతో ఫలితాల విడుదల అంశంపై యూనివర్సిటీ అధికారులు న్యాయ సలహా కోరారు. ఈ ప్రక్రియతో ఫలితాల విడుదల ఆలస్యం అవుతుండడంతో తమ ఫలితాలు విడుదల చేయాలని ఈనెల 26వ తేదీన ఇతర రాష్ట్రాల విద్యార్థులు యూనివర్సిటీకి వచ్చి ఉన్నతాధికారులను కోరారు. ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయకపోవడంతో గురువారం ధర్నాకు దిగారు. రిజిస్ట్రార్ కె.జాన్పాల్ విద్యార్థులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఫలితాలు విడుదల చేస్తాం : రిజిస్ట్రార్ దీనిపై రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్పాల్ను వివరణ కోరగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం సాయంత్రంలోగా ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. కళాశాల ఫీజుల చెల్లింపు తదితర అంశాల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ప్రొవిజినల్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని ఓడీ( ఒరిజినల్ డిగ్రీ)లను నిలిపివేస్తామని తెలిపారు. -
కవిత్వంతో ప్రజల్లో చైతన్యం
గన్ఫౌండ్రీ: శాంతియుత పోరాటాలతో ఫలితం రానప్పుడు ప్రజలు హింసాత్మక పంథా ఎంచుకుంటారని తన కవితల ద్వారా చెప్పిన వ్యక్తి కాళోజీ అని విరసం నేత వరవరరావు అన్నారు. తన కవితలతో ప్రజల్లో చైతన్యం కలిగించారని చెప్పారు. సోమవారం నిజాం కళాశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆధ్వర్యంలో కాళోజీ స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. వరవరరావు కీలక ఉపన్యాసం చేస్తూ కాళోజీ చిన్న నాటి నుంచే ప్రజల తరపున కవిత్వాలు రాసే వారని అన్నా రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని భాషా దినోత్సవంగా నిర్వహించడం ఆనందకరమన్నారు. పలుకుబడుల భాషను పూర్తి స్థాయిలో తీసుకువచ్చినప్పుడు ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామన్నారు. ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ వర్సిటీలో మరిన్ని ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ప్రవేశపెట్టిన కాళోజీ బంగారు పతకాన్ని బీఏ తెలుగులో అత్యధిక మార్కులు సాధించిన ప్రకాశ్ అనే విద్యార్థికి ప్రదానం చేశారు. నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సయ్యద్ రెహమాన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్, నిజాం కళాశాల తెలుగుశాఖ ప్రొఫెసర్లు కాసీం, డాక్టర్ విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అరుణ కూసుమంచి : బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆ శాఖ కమిషనర్ అరుణ కోరారు. కూసుమంచిలోని సమీకృత వసతి గృహాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహం ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల ప్రగతిని.. వసతులను పరిశీలించారు. అనంతరం కమిషన ర్ మాట్లాడుతూ ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని బాగా చదుకోవాలన్నారు. బీసీ విద్యార్థుల కోసం రాష్ట్రంలో ఇప్పటివరకు 18 రెసిడెన్షియల్ స్కూళ్లు, 3 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో స్టడీ సర్కిల్ ఏర్పాటు జరుగుతుందని అన్నారు. ఈ విద్యాసంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది మెరిట్ విద్యార్థులను గుర్తించి.. వారు ప్రభుత్వ ఖర్చుతో ఉన్నత చదువులు చదివేందుకు, ఉపాధి అవకాశాలు పొందేందుకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. బీసీ వసతి గృహాల్లో హరితహారం కింద 30వేల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. అనంతరం వసతి గృహ విద్యార్థులకు హరితహారంపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించగా.. విజేతలైన వారికి కమిషనర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ఈడీ ఆంజనేయశర్మ, వసతి గృహం ప్రత్యేకాధికారి ఈదయ్య తదితరులు పాల్గొన్నారు. -
బ్రెగ్జిట్ వైపే బ్రిటన్ ప్రజల మొగ్గు!
లండన్: బ్రిగ్జిట్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఐరోపా సమాఖ్య(ఈయూ)లో బ్రిటన్ కొనసాగాలా వద్ద అనే దానిపై నిర్వహించిన రెఫరెండం కౌంటింగ్ కొనసాగుతోంది. బ్రిటన్ వాసులు ఎటువైపు మొగ్గు చూపారో మరికాసేపట్లో తేలనుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో సండర్లాండ్, కోవెంట్రి, కోల్బస్టర్ ఓటర్లు ఈయూ నుంచి విడిపోవడానికి మొగ్గు చూపారు. ఇక గ్తాస్గో, లివర్ పూల్, లండన్ ఓటర్లు మాత్రం ఈయూలో కలిసే ఉండాలని తేల్చారు. పూర్తి ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. మొత్తం 382 కౌంటింగ్ ఏరియాలలో ఇప్పటివరకూ 171 చోట్ల ఫలితాలు వెలువడగా.. 51.3 శాతం మంది ప్రజలు విడిపోవాలని, 48.7 శాతం ప్రజలు కలిసుండాలని తీర్పు ఇచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. కలిసుండాలి, విడిపోవాలనే ఓటర్ల మధ్య కేవలం రెండు శాతం మాత్రమే తేడా ఉండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎర్లీ ట్రెండ్స్ బ్రెగ్జిట్కు అనుకూలంగా ఉండటంతో పౌండ్ విలువ భారీగా పతనమైంది. -
పాలేరు ఫలితం నేడే
♦ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం ♦ 18 రౌండ్లలో కౌంటింగ్కు ఏర్పాట్లు ♦ 10 గంటలకల్లా అభ్యర్థుల భవితవ్యం తేలే అవకాశం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పాలేరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఖమ్మంలోని పత్తి మార్కెట్ యార్డు ప్రాంగణంలో గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలవగా... ప్రధానంగా అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ మధ్య పోటీ నెలకొంది. 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో పాలేరులో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన ఓటింగ్లో మొత్తం 1,90,351 ఓట్లకు 1,71,061 ఓట్లు (89.87 శాతం) పోలయ్యాయి. గురువారం ఖమ్మం పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డులో ఈ ఓట్ల లెక్కింపు జరుగనుంది. 243 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 243 ఈవీఎంలను 14 టేబుళ్లపై ఉంచి.. 66 మంది సిబ్బంది 18 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేస్తారు. -
నేడు ఏపీ టెన్త్ ఫలితాలు
హైదరాబాద్: ఏపీ టెన్త్ 2016 ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ హాలులో ఉదయం 10 గంటలకు రాష్ట్ర మానవవనరుల అభివద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3046 కేంద్రాల్లో జరిగిన ఈపరీక్షకు 6,57,595 మంది విద్యార్ధులు హాజరు కాగా వీరిలో బాలురు 343040 మంది, బాలికలు 314555 మంది ఉన్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6,21,517 మంది కాగా ప్రైవేటు విద్యార్థులు 36,078 మంది ఉన్నారు. ఓరియెంటల్ ఎస్సెస్సీ పరీక్షకు 2047 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి ఏపీ ఆన్లైన్ సహకారంతో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లతో ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్ధులు తమ పరీక్ష ఫలితాలను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈఏపీ.ఓఆర్జీ’ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. దీంతో పాటు ‘సాక్షి ఎడ్యుకేషన్ డాట్కామ్’, బింగ్ డాట్కామ్, నోయువర్రిజల్ట్సు డాట్కామ్, కెరీర్లాంజ్ డాట్ఇన్, విద్యాసమాచారం డాట్కామ్, పాస్ఆర్ఫెయిల్ డాట్ఇన్, ఇండియా రిజల్ట్సు డాట్కామ్, విద్యావిజన్ డాట్కామ్, గో రిజల్ట్సు డాట్నెట్, విద్యాటుడే డాట్ఇన్, జాగరణ్జోష్ డాట్కామ్ తదితర వెబ్సైట్ల ద్వారా కూడా విద్యార్ధులు తమ పదో తరగతి ఫలితాలను తెలుసుకోవచ్చని వివరించారు. వాయిస్ రికార్డర్ మోడ్ ద్వారా, ఎస్ఎంస్ ద్వారా కూడా విద్యార్ధులు ఫలితాలు తెలుసుకొనే ఏర్పాట్లు చేశారు. వాయిస్ రికార్డర్ మోడ్ కోసం 58888 నెంబర్కు లేదా స్టార్588యాష్కు కాల్ చేయవచ్చన్నారు. ఎస్ఎంఎస్కోసం ఏపీ10(స్పేస్)రోల్నెంబర్ను టైప్ చేసి 58888కు ఎస్ఎంఎస్ చేయవచ్చని ప్రసన్నకుమార్ తెలిపారు. -
11న తెలంగాణ టెన్త్ ఫలితాలు
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల తేదీని మార్చినట్టు సమాచారం. ఈ నెల 12 న విడుదల కానున్నట్టు ముందు ప్రకటించిన అధికారులు తర్వాత ఫలితాల విడుదల తేదీని ఈ నెల 11 కు మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 11 న ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘ఖేడ్’ టీఆర్ఎస్ కైవసం
నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం ♦ 53,625 ఓట్ల మెజారిటీతో భూపాల్రెడ్డి గెలుపు ♦ రెండో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్.. టీడీపీ డిపాజిట్ గల్లంతు నారాయణఖేడ్: నారాయణఖేడ్ శాసనసభ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డి 53,625 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిట్టింగ్ సీటు కోల్పోయిన కాంగ్రెస్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. టీడీపీ డిపాజిట్ గల్లంతయింది. ఈనెల 13న నారాయణఖేడ్ ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో మొత్తం 1,88,373 ఓట్లకుగాను 1,54,912 ఓట్లు పోలైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగింది. నారాయణఖేడ్ మండలంలో జూకల్ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తంగా 21 రౌండ్లలో ఓట్లు లెక్కించగా... చివరి రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డి 93,076 ఓట్లు పొంది విజయం సాధించారు. ఈ అసెంబ్లీ స్థానం చరిత్రలోనే ఓ అభ్యర్థి ఇన్ని ఓట్లు సాధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ళ సంజీవరెడ్డికి 39,451 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఎం.విజయపాల్రెడ్డి కేవలం 14,787 ఓట్లను పొంది డిపాజిట్ కోల్పోయారు. స్వతంత్ర అభ్యర్థులు జాజుల భాస్కర్ 5,377 ఓట్లు, బోరంచ సంగారెడ్డి 509, ఐ.మాదప్ప 235, ముదిరాజ్ వెంకటేశం 291, మురళీ గోవింద్ 333 ఓట్ల పొందారు. నోటాకు 853 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం మంత్రి హరీశ్రావు చేసిన కృషి ఫలించింది. ఈ ఫలితాన్ని బుధవారం నాటి సీఎం కేసీఆర్ పుట్టినరోజుకు కానుకగా ఇద్దామంటూ హరీశ్రావు ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. సీఎంకు కానుక: భూపాల్రెడ్డి తన గెలుపును సీఎం కేసీఆర్కు పుట్టిన రోజు కానుకగా అందజేస్తున్నట్టు నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా గెలిచిన ఎం.భూపాల్రెడ్డి అన్నా రు. మంగళవారం ఖేడ్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి హరీశ్రావు సహకారంతో ఈ అపూర్వ విజయం సాధ్యమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి నియోజకవర్గాన్ని బంగారు ఖేడ్గా మారుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. మాట నిలబెట్టుకుందాం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపాల్రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. భూపాల్రెడ్డి మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ను అధికారిక నివాసంలో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టాలని మెదక్ జిల్లా నాయకులకు సూచించారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతలను తీసుకోవాలని మంత్రి హరీశ్రావుకు సూచించారు. రౌండ్లవారీగా మూడు పార్టీలకు పోలైన ఓట్లు, ఆధిక్యత వివరాలు.. రౌండ్ నెంబర్ టీఆర్ఎస్ ఆధిక్యం కాంగ్రెస్ టీడీపీ 1 3,922 1,952 1,970 701 2 3990 2,003 1,987 832 3 4,730 3,347 1,383 1,608 4 4,635 2,360 2,275 712 5 4,387 1,903 2,484 1,043 6 4,024 2,590 1,434 664 7 4,529 3,211 1,318 1,110 8 4,429 2,606 1,823 793 9 4,863 2,558 2305 295 10 4,558 2,781 1,777 551 11 5,008 2,582 2,426 735 12 5,032 3,301 1,731 635 13 5,399 3,370 2,029 415 14 5,669 4,098 1,571 331 15 5,129 3,044 2085 580 16 3,774 2,393 1381 614 17 4,555 2,243 2,312 761 18 3,374 1,151 2,223 1,128 19 5,199 3,120 2,079 463 20 4,484 2,491 1,993 485 21 1384 519 865 105 మొత్తం 93,076 53,625 39,451 14,787 -
టీఆర్ఎస్కు అరుదైన విజయం
సాక్షి, హైదరాబాద్: సానుభూతి పవనాలతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాల్సిన నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అది కూడా ఏకంగా 53 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం అరుదైన విజయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నారాయణఖేడ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. తమ సిట్టింగ్ స్థానమైన ఇక్కడ కిష్టారెడ్డి కుమారుడినే బరిలోకి దింపితే సానుభూతి పవనాలతో విజయం సాధించవచ్చని కాంగ్రెస్ భావించింది. కానీ కాంగ్రెస్కు కంచుకోట అయిన ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు మంత్రి హరీశ్రావు పన్నిన వ్యూహం విజయవంతమై.. గులాబీ జెండా ఎగిరింది. ఈ ఉప ఎన్నికలో 50 వేల మెజారిటీ సాధిస్తామని నామినేషన్ల రోజే చెప్పిన హరీశ్రావు... అదే రీతిన ప్రచారం నిర్వహించి అనుకున్నది సాధించారు. మధ్యలో రెండు రోజులు మినహా నారాయణఖేడ్లోనే బసచేసి ఊరూరా తిరిగారు. నారాయణఖేడ్ను అభివృద్ధి చేసి చూపిస్తానని మాటిచ్చి ప్రజల మద్దతు కూడగట్టారు. సానుభూతిని అధిగమించి.. ఇప్పటివరకు ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో జరిగిన దాదాపు అన్ని ఉప ఎన్నికల్లోనూ ఆయా పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు. సానుభూతిని దృష్టిలో పెట్టుకుని ఏ రాజకీయ పార్టీ అయినా మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తుంటాయి. నారాయణఖేడ్లో కాంగ్రెస్ పార్టీ అదే పని చేసింది. కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డికి టికెట్ ఇచ్చింది. గత 30 ఏళ్లలో ఇలా జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులే విజయం సాధించారు. కానీ ఇప్పుడు నారాయణఖేడ్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అంతేకాదు కాంగ్రెస్పై భారీ ఆధిక్యం సాధించడాన్ని రాజకీయ పరిశీలకులు అరుదైన విజయంగా అభివర్ణిస్తున్నారు. -
గెలుపు కోసం యజ్ఞం
కాన్పూర్: చిన్న పొరపాటుకు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రాజకీయాల్లో. అందుకే వీలైన అన్ని దారుల్లోనూ విజయం కోసం పరిశ్రమిస్తుంటారు రాజకీయనేతలు. ఆ క్రమంలోనే బిహార్ ఎన్నికల్లో నేడు ఓటరు తీర్పు వెలువడనుండటంతో ఫలితాలు తమకే అనుకూలంగా రావాలని యజ్ఞం మొదలుపెట్టారు బీజేపీ శ్రేణులు. పక్కరాష్ట్రం బీజేపీలో తమ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించాలని ఉత్తరప్రదేశ్ కమళదళాలు ఆదివారం ఉదయం యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. కాన్పూర్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొంన్నారు. -
సివిల్స్లోనూ అమ్మాయిలు టాప్ లేపారు
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2014 ఫలితాల్లో అమ్మాయిలు అసాధారణ ప్రతిభ కనబరిచారు. దేశంలోని అత్యున్నత ప్రభుత్వ సర్వీసు నియామకాలకు సంబంధించిన సివిల్స్ పరీక్షల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఈ ఏడాది మొదటి అయిదు ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులను అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. ఇరా సింఘాల్ మొదటి ర్యాంకు సాధించగా, రేణు రాజ్, నిధి గుప్తా, వందనా రావ్ వరుసగా 2, 3, 4 ర్యాంకులలో నిలిచారు. ఓవరాల్ ఐదో ర్యాంకు సాధించిన సుహర్ష భగత్.. పురుషుల్లో ప్రథమస్థానంలో నిలిచాడు. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చూడొచ్చు. ఇక తెలుగు విద్యార్థులు సాకేత్ రాజా 14వ ర్యాంకు, లక్ష్మీకాంత్ రెడ్డి 21వ ర్యాంకు పొందారు. గత ఆగస్టు 24న 2,137 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయగా, వారిలో 1,236 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. నిజానికి దేశవ్యాప్తంగా 1,364 సివిల్ సర్వెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఆ సఖ్య కంటే తక్కువ మంది అభ్యర్థులు తుది దశకు ఎంపిక కావడం గమనార్హం. -
టీఎస్ ఐసెట్-15 పలితాలు విడుదల
91.4 శాతం మంది ఉత్తీర్ణత అడ్మిషన్లకు జూలై 11న నోటిఫికేషన్ జూలై 17 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 25న సీట్ల అలాట్మెంట్ కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గతనెల 22న నిర్వహించిన టీఎస్ ఐసెట్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల అయ్యాయి. కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 63,490 మంది ఐసెట్ రాయగా, అందులో 58,037మంది (91.41 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పురుషుల విభాగంలో 90.79 శాతం, మహిళల విభాగంలో 92,42 శాతం ఉత్తీర్ణులైనట్లు పాపిరెడ్డి వివరించారు. ఐసెట్ షెడ్యూల్..: ఐసెట్ -2015 అడ్మిషన్ల నోటిఫికేషన్ను జూలై 11న వెలువడుతుం దని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. జూలై 17నుంచి అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. జూలై 18నుంచి 22 వతేదీ వరకు అభ్యర్థులు అప్షన్లు ఇచ్చుకోవాలని, జూలై 25న సీట్ల అలాట్మెంట్ ఉంటుందన్నారు డబ్ల్యూడబ్ల్యూడబ్లూటీఐసెట్.ఓఆర్జీలో ఫలితాలు అందుబాటులో ఉంటాయని పాపిరెడ్డి వివరించారు. ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ మాట్లాడుతూ గతేడాది తెలంగాణలో ఎంబీఏలో 50 వేల సీట్లు, ఎంసీఏలో 15 వేల సీట్లు ఉన్నాయని వివరించారు. యూనివర్సిటీల పరిధిలో అఫ్లియేషన్ కలిగి ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ఎన్ని అనేది .. సీట్లు సంఖ్య కచ్చితంగా జులైలో ఇచ్చే అడ్మిషన్ల నోటిఫికేషన్ నాటికి ఉన్నత విద్యామండలి వెల్లడించనున్నదని ఆయన తెలిపారు. యూనివర్సిటీల పరిధిలో ఐసెట్లో ఉత్తీర్ణత వివరాలు పేరు ర్యాంక్ మార్కులు కృష్ణచైతన్య కొల్లు, కృష్ణాజిల్లా 1 178 సీహెచ్ ఎన్.ఎ.చంద్ర, హైదరాబాద్ 2 162 పోకూరి రాఘవేంద్ర, రంగారెడ్డి 3 160 -
టీఎస్ లాసెట్-2015 ఫలితాలు విడుదల
మూడేళ్ల లా కోర్సులో 85.20% ఉత్తీర్ణత ఐదేళ్ల లా కోర్సులో 82.87 % ఎల్ఎల్ఎం పీజీ సెట్లో 95.95% కేయూక్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలోని ఎల్ఎల్బీ మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులు, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాలకు గత నెల 19న నిర్వహించిన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ సెట్ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు ఫలితాల సీడీలను విడుదల చేశారు. కేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్ మూడేళ్ల కోర్సులో 13,507 మంది అభ్యర్థులకు గాను 11,680 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 9,951మంది అభ్యర్థులు ఉత్తీర్ణత (85.20 శాతం) సాధించారు. పురుషుల విభాగంలో 9,324 మంది పరీక్షకు హాజరుకాగా, 8,165 మంది ఉత్తీర్ణత (87.57శాతం) పొందారు. మహిళల విభాగంలో 2,356 మంది పరీక్షకు హాజరు కాగా, 1,786 మంది (75.81శాతం) ఉత్తీర్ణులయ్యూరు. ఐదేళ్ల లా కోర్సులో...: ఐదేళ్ల లాకోర్సులో 4,257మంది అభ్యర్థులకు 3,695 మంది పరీక్షకు హాజరుకాగా... ఇందులో 3,062 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత (82.87 శాతం) సాధించారు. పురుషుల విభాగంలో 85.65శాతం, మహిళల విభాగంలో 73.88 శాతం ఉత్తీర్ణత పొందారు. పీజీ లా సెట్లో...: ఎల్ఎల్ఎం పీజీ సెట్లో రాష్ట్రవ్యాప్తంగా రెండు రీజియన్ల సెంటర్ల పరిధిలో (హైదరాబాద్, వరంగల్ ) 1,584 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, 1,328 మంది ఉత్తీర్ణత (95.95 శాతం) సాధించారు. పురుషుల విభాగంలో 96.01 శాతం, మహిళల విభాగంలో 95.80 శాతం ఉత్తీర్ణులయ్యూరు. పీజీ లాసెట్లో హైదరాబాద్కు చెందిన జీవీ.సుబ్రమణ్యన్ 79 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు. ఆయన 60 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం విశేషం. అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సు, ఎల్ఎల్ఎం పీజీసెట్కు అడ్మిషన్ల నోటిఫికేషన్ను జూలై 20న విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 26 నుంచి 29 వరకు ఉంటుందన్నారు. లాసెట్ ఫలితాల్లో మూడేళ్లు, ఐదేళ్ల, ఎల్ఎల్ఎం పీజీ సెట్లో ర్యాంకులు సాధించినవారు లాసెట్ మూడేళ్ల కోర్సులో... పేరు ర్యాంక్ మార్కులు వీజీ.సతీష్ పసుమర్తి, రంగారెడ్డి 1 102 చంద్రశేఖర్ ఆర్, కరీంనగర్ 2 101 దేవేందర్రెడ్డి తిరుగుడు, నల్లగొండ 3 98 లాసెట్ ఐదేళ్ల కోర్సులో ర్యాంకర్లు.... సుదగాని రాజు, నల్లగొండ 1 101 లకమ్ నర్సింహ రావు, నల్లగొండ 2 99 రాంబాబు మోటె, నల్గొండ 3 97 ఎల్ఎల్ఎం పీజీసెట్లో ర్యాంకర్లు... రజత్ బెనర్జీ, రంగారెడ్డి 1 83 జి.వి సుబ్రమణ్యం, హైదరాబాద్ 2 79 మిధున్ కుమార్ ఎ, రంగారెడ్డి 3 76 -
డీఎస్సీ ఫలితాలు విడుదల
సాక్షి, విశాఖపట్నం: డీఎస్సీ-2014(టెట్ కమ్ టీఆర్టీ)లో 37.57 శాతం మంది అర్హత సాధించారు. డీఎస్సీ-2014 ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో మంగళవారం విడుదల చేశారు. 10,313 టీచర్ పోస్టుల భర్తీకోసం గత నెల తొమ్మిదో తేదీ నుంచి మూడ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 2,560 పరీక్ష కేంద్రాల్లో డీఎస్సీని నిర్వహించడం తెలిసిందే. పరీక్షలకు 3,68,161 మంది హాజరవగా.. 1,38,344 మంది(37.57 శాతం) అర్హత సాధించారు. ఓసీ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం చొప్పున అర్హత మార్కులుగా నిర్ణయించారు. మార్కుల వివరాలను హాల్టికెట్ ప్రకారం.. జ్ట్టిఞట://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీలో చూడవచ్చు. ఓఎంఆర్ షీట్ ప్రింటెడ్ కాపీని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ నెల 4 నుంచి జూలై 3వ తేదీ వరకూ రూ.20 చెల్లించి మీసేవ కేంద్రాల్లో పొందవచ్చు. అలాగే పుట్టినతేదీ, కులం, ఎక్స్సర్వీస్మెన్, టెట్ వెయిటేజీ, పీహెచ్ కేటగిరి వివరాల్లో మార్పుచేర్పులుంటే ఈనెల 3 నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా వెబ్సైట్ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించారు. కొంతమందికి నిరీక్షణ: 2,192 మంది ఫలితాలను విత్హెల్డ్లో ఉంచారు. కోర్టు నుంచి వెలువడే ఆదేశాలననుసరించి 2,187 మంది ఫలితాలను తర్వాత వెల్లడిస్తారు. అలాగే సర్టిఫికెట్లలో తేడా ఉన్న వివరాలను పరిశీలించేందుకు ఐదుగురి ఫలితాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఆయా అభ్యర్థులు హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఈనెల 6వ తేదీలోగా సంప్రదించాలి. 9వ తేదీకల్లా జాబితాలు సిద్ధం: రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితాను 9వ తేదీకల్లా రూపొందిస్తారు. ఆన్లైన్లో ర్యాంక్కార్డును అభ్యర్థులు అదే రోజు పొందవచ్చు. ఆ ప్రకారం 15వ తేదీకల్లా టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. ఫలితాల్లోనూ గందరగోళం డీఎస్సీ-2014 ఫైనల్ ‘కీ’లో 13 తప్పులను గుర్తించి సవరించిన పాఠశాల విద్యాశాఖ... మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లోనూ పాత ఒరవడినే కొనసాగించింది. అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య విషయంలోనూ తేడా కనిపించింది. -
సీబీఎస్ఈలోనూ వాళ్లదే పైచేయి!
సీబీఎస్ఈ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 97.32 శాతం మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతంలో కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలదే పైచేయి అయ్యింది. అమ్మాయిలు 97.82 శాతం క్వాలిఫై కాగా, అబ్బాయిలు 96.98 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 2014లో వచ్చిన ఫలితాల కంటే ఈసారి 1.55 శాతం తగ్గాయి. తిరువనంతపురం రీజియన్లో అత్యధికంగా 99.77 శాతం మంది క్వాలిఫై అయ్యారు. మొత్తం 13,73,853 మంది పరీక్షలకు హాజరయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 3.37 శాతం ఎక్కువ. ఫలితాలకోసం cbseresults.nic.in లేదా cbse.nic.in వెబ్సైట్లకు లాగిన్ కావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే.. ఎక్కువ మంది ఈ సైట్ కోసం ప్రయత్నిస్తుండటంతో వెబ్ సైట్ డౌన్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఎవరు ప్రయత్నించినా.. కనెక్షన్ ఫెయిల్డ్ అనో మరొకటో మెసేజ్ వస్తోందని గగ్గోలు పెడుతున్నారు.