రెండు నెలలుగా టీడీపీ వేధింపులు: పిఠాపురం మహరాజ కుటుంబం | Kakinada Pithapuram Maharaja Family Harassed By TDP | Sakshi
Sakshi News home page

రెండు నెలలుగా టీడీపీ వేధింపులు: పిఠాపురం మహరాజ కుటుంబం

Published Wed, Jul 31 2024 10:11 AM | Last Updated on Wed, Jul 31 2024 1:49 PM

Kakinada Pithapuram Maharaja Family Harassed By TDP

కాకినాడ, సాక్షి: అధికారం చేపట్టి నాటి నుంచి టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలను కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతల నుంచి సామాన్యుల దాకా కూటమి పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. పిఠాపురం మహారాజ కుటుంబం సైతం వేధింపులకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. 

పిఠాపురం మహారాజా మేనకోడలైన చంద్రలేఖ కుటుంబానికి టీడీపీ నుంచి వేధింపులు ఎదురవుతున్నాయట. తమ ఇంటిని ఖాళీ చేయాలని కొందరు బెదిరిస్తున్నట్లు ఇద్దరు కొడుకులతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. ‘‘1970 నుంచి మా కుటుంబం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న ఇంట్లో మేం ఉంటున్నాం. ఆ ఆస్తి మీద కొందరు కన్నేశారు. ఆ ఇంటిని ఖాళీ చేయాలని, లేకుంటే.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెడతామని బెదిరిస్తున్నారు. 

.. ఈ దౌర్యన్యం వెనుక టీడీపీ నేతల సహకారం ఉంది. అందుకే ఫిర్యాదు చేసినా పోలీసులు సైతం పట్టించుకోవట్లేదు అని చంద్రలేఖ కుమారుడు మాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకోవాలని సోషల్‌ మీడియా ద్వారా కోరాం. మాకు న్యాయం జరగకపోతే చావే శరణ్యం అంటోంది చంద్రలేఖ కుటుంబం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement