తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు!.. ఈ వెకిలి పనులేంటి? కేటీఆర్‌ ఫైర్‌ | KTR Slams Congress Government Over Telangana State Emblem, More Details Inside | Sakshi
Sakshi News home page

ఈ వెకిలి పనులు ఏంటి? కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? కేటీఆర్‌ ఆగ్రహం

Aug 27 2024 10:35 AM | Updated on Aug 27 2024 12:23 PM

KTr Slams Congress Government Over Telangana State emblem

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుపై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. కొత్త చిహ్నాన్ని ఎప్పుడు, ఎవరూ ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా? అని నిలదీశారు. రాష్ట్రలో అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా అంటూ సీఎస్‌ శాంతి కుమారిని ప్రశ్నించారు.

ఈ మేరకు ఎక్స్‌లో స్పందిస్తూ.. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా? అసలు ఎం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా తెలంగాణ సీఎస్‌ గారు?. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్‌లతో ఈ వెకిలి పనులు ఏంటి? 

కాక‌తీయ కళా‌తో‌రణం, చార్మినార్‌ లేని రాజ‌ము‌ద్రతో గ్రేటర్‌ వరం‌గల్‌ కార్పొ‌రే‌షన్‌ ప్రధాన కార్యా‌లయం ఎదుట అధి‌కా‌రులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

 అసలు ఎం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా 
@TelanganaCS
గారు?

 

తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన 
కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి ?

కాక‌తీయ కళా‌తో‌రణం, చార్మినార్‌ లేని రాజ‌ము‌ద్రతో గ్రేటర్‌ వరం‌గల్‌ కార్పొ‌రే‌షన్‌ ప్రధాన కార్యా‌లయం ఎదుట అధి‌కా‌రులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది.

ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు?

ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement