
కోమటిరెడ్డి వెంకటరెడ్డి (ఫైల్)
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నిర్వహించబోయే.. దళిత గిరిజన సభను వాయిదావేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటరీ కమిటీ పర్యటన సందర్భంగా సభకు హజరు కాలేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
ఆగస్టు 21 తర్వాత ఎప్పుడు సభ పెట్టినా హాజరయ్యేందుకు అభ్యంతరంలేదని కోమటిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవసభ వాయిదాపడే అవకాశం ఉందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment