AP: ఈవీఎంల మార్పిడి జరిగిందా? | Suspected That EVMs Have Been Changed In AP Elections 2024 | Sakshi
Sakshi News home page

AP: ఈవీఎంల మార్పిడి జరిగిందా?

Published Wed, Jun 5 2024 10:00 AM | Last Updated on Wed, Jun 5 2024 10:21 AM

Suspected That EVMs Have Been Changed In AP Elections 2024

రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్య­బద్ధంగా జరగ­లేదని, బూటకపు ఎన్నికలు జరిగా­యని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు చెల్లెం ఆనందప్రకాష్‌ చెప్పారు.

ప్రజాస్వామ్యంలో చీకటి ఎన్నికలు

ఈసీ, కేంద్ర ప్రభుత్వ పాత్రలపై అనుమానం

సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని విచారణకు ఆదేశాలివ్వాలి

రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు ఆనందప్రకాష్‌

పాలకొల్లు అర్బన్‌: రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్య­బద్ధంగా జరగ­లేదని, బూటకపు ఎన్నికలు జరిగా­యని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు చెల్లెం ఆనందప్రకాష్‌ చెప్పారు. వీటిని చీకట్లో జరిగిన ఎన్నికలుగా పరిగణించాలన్నారు. ఎన్నికల కమిషన్‌పై న్యా­య­సమీక్ష జరపాలని డిమాండ్‌ చేశా­రు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్ని­కల కమిషన్‌ కుట్ర చేసి­నట్లు అనుమా­నా­లు వ్యక్తమవు­తు­న్నా­యని పే­ర్కొ­న్నారు. తక్షణం ఎన్నికలను రీకాల్‌ చేసి తిరిగి బ్యాలెట్‌ ఎన్ని­కలు నిర్వహించాలని కోరారు.

ఆయన మంగళవారం పశ్చి­మ­గో­దా­వరి జిల్లా పాల­కొల్లు మండలం యా­ళ్ల­వానిగరువులో విలేకరు­లతో మాట్లా­డా­రు. సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకుని ఈవీఎంలపై విచారణ చేపట్టాలని కోరారు. ఓటమి భయంతో కూటమి కట్టిన టీడీపీ అభ్యర్థులకు వేల మెజార్టీ రావడం, బీజేపీ పోటీచేసిన రెండుచోట్ల లక్షల్లో మెజార్టీ రావడం, జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోను విజయం సాధించడం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చెందుతుందని ముందే పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో వారికి కలిసి వచ్చిన పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు అర్థమవుతోందన్నారు.

ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారని, ఇదే విషయాన్ని మెజార్టీ సర్వేసంస్థలు వెల్లడించాయని చెప్పారు. సీఎం జగన్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలందరికీ మేలు చేశారన్నారు. లక్షలాదిమంది ఓటర్లున్న వైఎస్సార్‌సీ­పీకి కేవలం ప్రతిపక్ష హోదాకు తక్కు­వగా అసెంబ్లీ సీట్లు దక్కడం వెనుక భారీ కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ ముందు నుంచి వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా పనిచేసిందన్నారు. తనపై కేసు నమో­దు చేసిందన్నారు. తాను ప్రచారంలో పాల్గొనలేదని ఆధారాలతో సహా వివరణ ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement