పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించాలి: ఆర్‌.కృష్ణయ్య  | Telangana: krishnaiah Speech Over Parliament Meeting | Sakshi

పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించాలి: ఆర్‌.కృష్ణయ్య 

Nov 15 2021 3:15 AM | Updated on Nov 15 2021 3:15 AM

Telangana: krishnaiah Speech Over Parliament Meeting - Sakshi

కాచిగూడ(హైదరాబాద్‌): దేశ జనగణన లో భాగంగా కుల గణన చేపట్టే వరకు ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించాలని జాతీయ  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఆదివారం కాచిగూడలో 65 బీసీ సంఘాల, కుల సంఘాల సమావేశం జరిగింది.

ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ కులగణన విషయమై కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన బాధ్య త ప్రతిపక్ష పార్టీలదేనని అన్నారు. కులగణన, ప్రభుత్వసంస్థల ప్రైవేటీకరణపై కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ ‘బీసీబంధు’ పథకాన్ని ప్రారంభించి అమలు చేయాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement