చంద్రబాబు క్షమాపణ చెప్పాలి | Vellampalli Srinivas Fires On Chandrababu Over Tirumala Laddu Issue | Sakshi
Sakshi News home page

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

Published Tue, Oct 1 2024 3:41 AM | Last Updated on Tue, Oct 1 2024 3:41 AM

Vellampalli Srinivas Fires On Chandrababu Over Tirumala Laddu Issue

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

సాక్షి, అమరావతి: తిరుమల ప్రసాదం పవి­త్రతను దెబ్బతీసేలా అసత్య ఆరో­ప­ణలు చేసిన ముఖ్యమంత్రి చంద్ర­బాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటే­శ్వర స్వామి భక్తులకు క్షమా­పణ చెప్పాలని వైఎస్సార్‌­సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీని­వాసరావు డిమాండ్‌ చేశారు. వేంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పిన రోజు నుంచి కోట్లాది భక్తులు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ఆయన సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల­యంలో మీడియాతో మాట్లా­డుతూ.. రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పట్టిందన్నారు.

సుప్రీం కోర్టు­లో ప్రభుత్వం తరపున వాదించిన న్యాయ­వాది కూడా కల్తీ జరి­గిందని చెబుతున్న నెయ్యిని వాడలే­దని చెప్పారన్నారు. కల్తీ అయిందని చెబు­తున్న నెయ్యి వాడలేదు కదా అని సుప్రీం కోర్టు ప్రశ్నించడంతో పాటు, దానిపై సెకెండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదని కూడా నిలదీసిందని చెప్పారు.  జూలై 23 నుంచి సెప్టెంబరు 18 వరకు ఈ విష­యాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని కూడా సర్వోన్నత న్యాయ­స్ధానం చంద్రబాబు ప్రభు­త్వాన్ని నిలదీ­సిందని తెలిపారు. సిట్‌ నియామ­కాన్ని కూడా ప్రశ్నించిందన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు త్వరలోనే బయటపడతా­యని అన్నారు. ఈ మొత్తం వ్యవహా­రంపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దని వెల్లంపల్లి మరోసారి చంద్రబాబుకి సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement