tirupati laddu
-
‘లడ్డూ’ వివాదంలో అందుకే అరెస్టులు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు:తిరుమల లడ్డూపై ఆరోపణలు చేసి చంద్రబాబు ఇరుక్కుపోయారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయమై సోమవారం(ఫిబ్రవరి10) అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘తిరుపతి లడ్డూ వ్యవహారం నుంచి బయటపడడానికి బాబు ప్రయ యత్నిస్తున్నారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే చంద్రబాబు తిరుపతి లడ్డూపై ఆరోపణలు చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని అబద్ధం చెప్పారు. తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.తిరుమల లడ్డూల తయారీకి నెయ్యి సరఫరాకు ఒక పద్ధతి ఉంది.ఏఆర్ డెయిరీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే నెయ్యి సరఫరా ప్రారంభించారు.టెస్టుల్లో ఫెయిలైన ట్యాంకర్లను వెనక్కి పంపుతారు.వైఎస్ జగన్హయాంలోనూ ట్యాంకర్లను వెనక్కి పంపారు.దైవాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు’అని అంబటి రాంబాబు అన్నారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు నాయుడు అత్యంత దుర్మార్గుడు నీచుడుపవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాడునిబంధనల ప్రకారం వెనుక్కు పంపించిన నెయ్యి పైన అరెస్టులు జరుగుతున్నాయిచంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఎక్కడా స్వామివారి ప్రసాదాలలో కల్తీ జరగలేదుచంద్రబాబు నాయుడు ఆరోపణలపై విచారణ జరుగుతోంది2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 15 సార్లు నెయ్యి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వెనక్కి పంపారువైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం 18సార్లు నెయ్యి వెనుక్కు పంపారుచంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి ఇరుక్కుపోయాడు కాబట్టే ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయిస్వామివారి ప్రసాదంపైన జరగని విషయాన్ని జరిగినట్టు ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోయాడులడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని విష ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ మెట్లు తుడిచి హంగామా చేశాడువాడని నెయ్యిని వాడినట్టు వాటిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు ప్రచారం చేశాడుతిరుమల నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలు ఆధారాలు లేవుచంద్రబాబు పాలనలోనే ఏఆర్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నెయ్యి పంపిణీ చేసిందిచిరంజీవి రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి కాదుప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపినట్లే జనసేనను బీజేపీలో కలుపుతారాచిరంజీవి మాటలు వింటే అదే అర్థమవుతోందిప్రజారాజ్యం రూపాంతం చెంది జనసేన అయిందన్న చిరంజీవి మాటల వెనుక బీజేపీలో జనసేనను కలుపుతారు ఏమో అని చెక్ చేసుకోవాలి -
గోవిందా.. ఏమిటీ అపచారాలు?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల, తిరుపతిలో వరుసగా జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి. తిరుమలేశుని భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ స్వయంగా సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవోనే పెద్ద అభాండం వేశారు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో పంది కొవ్వు కలిసిందంటూ జరిగిందంటూ కోట్లాది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించి సీబీఐ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది.ఈ ఘటన జరిగినప్పటి నుంచి తిరుమల తిరుపతిలో వరుస సంఘటలు అధకార కూటమి నేతలు చేసిన తప్పులకు పర్యావసానమేనని భక్తులు, స్థానికులు అంటున్నారు. ఇటీవల తిరుపతి క్యూలైన్లో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందడం సహా పలు జరగరాని ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం తిరుమలలో కొందరు భక్తులు ఎగ్ పలావ్ని కొండపైకే తెచ్చి, అక్కడే తినడం మరింత కలకలం రేపింది. ఈ వరుస అపచారాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధార్మిక క్షేత్రం తిరుమలకు నిత్యం లక్షలాది భక్తులు వస్తుంటారు. అయినా ఒక చిన్న అవాంఛనయ సంఘటన కూడా జరిగిన దాఖలాలు లేవు. క్రౌడ్ మేనేజ్మెంట్లో టీటీడీకి ఉన్నంత పటిష్టమైన ప్రణాళికలు దేశంలో ఎక్కడా లేవు. అందుకే 9 నెలల క్రితం అయోధ్య రామాలయం ట్రస్ట్ నిర్వాహకులు తిరుమలలోని క్యూలైన్ వ్యవస్థను పరిశీలించి, టీటీడీ అధికారులతో చర్చించి వెళ్లారు. అనంతరం టీటీడీ ఇంజినీరింగ్ నిపుణులు అయోధ్యకు వెళ్లి అక్కడి వారికి శిక్షణ ఇచ్చి వచ్చారు కూడా. అంతటి సమర్ధవంతమైన వ్యవస్థ ఉన్న తిరుమలలో కూటమి ప్రభుత్వం స్వార్ధపూరిత చర్యలకు దిగింది. దాని పర్యవసానమే ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం క్యూలైన్లో తొక్కిసలాట. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఎందుకింత నిర్లక్ష్యం? తొక్కిసలాట ఘటన మరువక ముందే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్ లో షార్ట్ సర్కూట్తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో కౌంటర్లు, క్యూలలో వేలాది భక్తులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ కౌంటర్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత తిరుమల రెండో ఘాట్ రోడ్ వద్ద ఆర్టీసి బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తుల్లో 15 మందికి పైగా గాయపడ్డారు. రెండు రోజుల క్రితం తిరుమల పద్మనాభం యాత్రిక సదన్ పైనుంచి మూడేళ్ల బాలుడు జారిపడి మృతి చెందాడు.గత ఆదివారం పరకామణిలో 100 గ్రాముల బంగారు బిస్కెట్ని చోరీ చేస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అంతకు ముందు ఇదే వ్యక్తి పరకామణిలో మరిన్ని దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో తేలినట్లు తెలిసింది. అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో భక్తులను మోసం చేస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు. తిరుమల ఆలయంపై తరచూ విమానాలు చక్కర్లు కొట్టడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.ఇంకోపక్క తిరుమల పాపవినాశం పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఎర్రచందనం చెట్లను నరికి యథేచ్ఛగా తరలిస్తున్న విషయం బయటపడింది. ఇలా తరలిస్తున్న వారిలో కొందరిని టాస్్కఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. శనివారం తమిళనాడుకు చెందిన 18 మంది భక్తులు ఎగ్ పలావ్ తో తిరుమల కొండ పైకి వచ్చేశారు. తిరుపతిలోనే పూర్తిగా తనిఖీ చేసి పంపే పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా వీరు నిషేధిత ఆహార పదార్థాలతో తిరుమలకు చేరుకోవడం, శ్రీవారి ఆలయానికి అతి సమీపంలోని రాంబగీచ వద్దే ఆరగించడం అందరినీ విస్తుగొలిపింది.ఆ ప్రాణాలకు ఇచ్చే విలువ ఇంతేనా? వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టికెట్లు జారీకి సరైన ఏర్పాట్లు చేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ ఫలితమే భైరాగిపట్టెడ పద్మావతి పార్క్, శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ భక్తుల ప్రాణాలకు ఇచ్చే విలువేమిటో ఇక్కడే వెల్లడైంది. చనిపోయిన భక్తుల కుటుంబాలకు టీటీడీ రూ.25 లక్షలు చొప్పున మాత్రమే పరిహారం చెల్లించింది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, ప్రతి కుటుంబానికి టీటీడీలో ఉద్యోగం ఇవ్వాలని పలు పారీ్టలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం, టీటీడీ పట్టించుకోడంలేదు. -
బాబూ.. ఆ సామెత నీకు కరెక్ట్గా సరిపోతుంది: ఆర్కో రోజా
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చింత సచ్చిన పులుపు చావలేదు ఆన్న సామెత చంద్రబాబు కోసమే పుట్టినట్టు ఉందంటూ సెటైర్లు వేశారు. కల్తీ రాజకీయాలు చేస్తారు కాబట్టే కల్తీ రాజకీయాలను నమ్ముకున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘చింత సచ్చిన పులుపు చావలేదన్న సామెత మన ముఖ్యమంత్రి చంద్రబాబు కోసమే పుట్టినట్లు ఉన్నది. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలపై విచారణ, ఆధారాలు లేకుండా రాజకీయ దురుద్దేశంతో కల్తీ ఆరోపణలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. సుప్రీం కోర్టు చంద్రబాబు సిట్ను కాకుండా సీబీఐ సారథ్యంలో నూతన సిట్ ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయ విమర్శలు వద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.అయినా తన కలుషిత బుద్ధి మానుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని మోదీకి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేసిన సందర్భాన్ని కూడా తన మీడియాతో స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డు అని ముఖ్యమంత్రి అంటే ప్రధాని సంతోషించారంటూ కల్తీ వార్తలు ప్రచారంలో పెట్టారు. తాను మాట్లాడితే కోర్టు ధిక్కరణ అవుతుంది కనుక తన మీడియాతో కల్తీ కథనాలు ప్రచారంలో పెట్టారు. కల్తీ రాజకీయాలను చెసే వారు గనుక కల్తీ ప్రచారాన్ని నమ్ముకున్నట్లున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. చింత సచ్చిన పులుపు చావలేదు ఆన్న సామెత మన ముఖ్యమంత్రి @ncbn గారి కోసమే పుట్టినట్లు ఉన్నది. పవిత్రమైన తిరుమల శ్రీవారి @TTDevasthanams లడ్డు ప్రసాదాలపై విచారణ , ఆధారాలు లేకుండా రాజకియ దురుద్దేశ్యంతో కల్తీ ఆరోపణలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. సుప్రీం… pic.twitter.com/ao9VntFTgv— Roja Selvamani (@RojaSelvamaniRK) October 9, 2024 -
పవన్ కల్యాణ్పై కేఏ పాల్ ఫిర్యాదు
పంజగుట్ట (హైదరాబాద్): తిరుపతి లడ్డూ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ సోమవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పాల్ మాట్లాడుతూ లక్ష లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధపు మాటలు మాట్లాడారని, లడ్డూపై విచారణ జరిగిందే జూన్లో కాగా, అయోధ్య ప్రారంభోత్సవం జనవరిలో జరిగిందని కల్తీ ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. 14 సెక్షన్ల కింద ఫిర్యాదు చేశానని,ఆర్టికల్ 8 ప్రకారం ఆయన్ను వెంటనే ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని, లేదా ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్కల్యాణ్కు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే.. అది సినిమాలో మాదిరి చదువుతున్నాడని, గతంలోనే చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఏపీ స్పీకర్, గవర్నర్, దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఛీప్ జస్టిస్, సీబీఐ అతనిపై విచారణ చేయాలని, వెంటనే పవన్కల్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు -
పవన్ తన్ను తాను మోసం చేసుకుంటున్నారా!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వింత, విచిత్ర ధోరణి అంతుపట్టకుండా పోతోంది. మాటలు మార్చే విషయంలో ఘనాపాఠిగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడినే మించిపోయేలా ఉన్నాయి వపన్ చర్యలు. ఈ క్రమంలోనే ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూ.. తనను తాను మోసగించుకుంటున్నారా? లేక పార్టీ కార్యకర్తలు లేదా ప్రజలందరినీ మూర్ఖులను చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు. ఈ ప్రస్తావనంతా ఎందుకిప్పుడు అంటే...తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం, ఆ వెంటనే పవన్ రంగంలో దిగి దీక్ష డ్రామాకు తెర తీయడం మనం చూశాం. అయితే ఈలోపుగానే.. లడ్డూ తయారీలో జంతువు కొవ్వు కలిసిన నెయ్యి వాడారు అనేందుకు ఆధారాల్లేనట్లు అందరికీ తెలిసిపోయింది. ఈ పరిణామంతో చంద్రబాబైనా కొంత తగ్గాడేమో కానీ.. పవన్ మాత్రం మరింత రెచ్చిపోయాడు. తానే అసలు సిసలైన హిందువు అని జనాన్ని నమ్మించేందుకు ముందు తిరుమల యాత్ర అని ఆ తరువాత వారాహి డిక్లరేషన్ అని నానా డ్రామాలూ ఆడేశారు. ఆయా సందర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలు కూడా రంకెలేసినట్లుగా అరుపులతోనే సాగాయి. మత విద్వేషాన్ని ఎగదోయడమే లక్ష్యమన్నట్టుగా పవన్ మాట్లాడారని ప్రజలు చాలా మంది అభిప్రాయపడ్డారు.సనాతన ధర్మమంటూ మాట్లాడి, అదేమిటో చెప్పకుండా, హిందూ మతాన్ని తానే ఉద్దరిస్తున్నట్లు ఫోజు పెట్టారు. తిరుమలేశుని భక్తుణ్ణి అని చెప్పుకుంటూనే ఆయనకు అపచారం జరిగేలా లడ్డూ పై ప్రజలలో విశ్వాసం పోయేలా మళ్లీ మాట్లాడారు.అధికారంలో ఉన్నప్పుడు మన మాటలు, చేష్టలు బాధ్యతాయుతంగా ఉండాలి. ఎన్నికల ముందు ఎన్ని అబద్దాలు చెప్పినా చెల్లిపోయింది కదా అని, ఇప్పుడు కూడా అదే ధోరణిలో వెళితే జనానికే కాదు.. జనసేన కార్యకర్తలకు సైతం విసుగొచ్చే ప్రమాదముంది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన వాంగ్మూలంలోనే లడ్డూ కల్తీ ప్రస్తావనను టీటీడీ తీసుకురాకపోతే.. ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్న పవన్ లేనిపోని ఆరోపణలను వల్లెవేయడంలో ఆంతర్యమేమిటో ఆయనకే తెలియాలి.ఎర్ర కండువా నుంచి కాషాయానికి మారడం తప్పు కాదు కానీ తాను గతంలో ఏం మాట్లాడింది? ఇప్పుడు మాట్లాడుతున్నదేమిటి? అన్నది కూడా ఆలోచించుకుని ఉండాల్సింది. ఆ విజ్ఞతతో ప్రసంగించాలి. అంతే తప్ప సనాతన ధర్మ పరిరక్షకుడిని తానే అన్నట్టుగా మాట్లాడినా, పోజు పెట్టినా ప్రజల్ని తక్కువ అంచనా వేయడమే అవుతుంది.2014లో అసలు జనసేన సిద్దాంతాలుగా ఆయన ప్రకటించిందేమిటి? చెప్పిన ఏడు పాయింట్లలో మొదటిది కులాలను కలిపే ఆలోచనా విధానం అనే కదా ఉంది? ఆ తరువాత కులాల గురించి మాటలు ఎన్ని మార్చారో అందరికి తెలుసు. ఎన్నికల సందర్భంగా ఆయన చివరకు తన కులపు వాళ్లయినా తనకు మద్దతివ్వాలని అడిగిన వైనం ప్రజల మనసుల్లో తాజాగానే ఉంది. జనసేన పార్టీ సిద్ధాంతాలుగా పవన్ ప్రకటించిన వాటిల్లో రెండోది మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఈ సిద్ధాంతం కూడా ఇప్పుడు అధికారం వచ్చాక మారిపోయింది. తాను హిందూమతం కోసం పాటు పడతానని, సనాతన ధర్మం కోసం పని చేస్తానని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వీటినిబట్టే కులం, మతం విషయాలలో పవన్ వైఖరి ఎంత దారుణంగా మారిందో అర్థమవుతుంది. ఆయన నిజంగా స్వామి అవతారం ఎత్తదలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పార్టీ రాజకీయాలను వదలిపెట్టి అలాగే చేసుకోవచ్చు. అలా కాకుండా వేషం మాత్రం మార్చి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే దొంగ బాబాగా మిగిలిపోతారు.పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాటల్ని ఒకసారి గుర్తుకు చేసుకుందాం.... ఒకసారి తాను బాప్టిజం తీసుకున్నానని, ఇంకోసారి తన భార్య, కుమార్తె క్రైస్తవులని ఒకసారి చెప్పుకొచ్చారు ఆయన. పరస్పర విరుద్ధమైన ప్రకటనలకు కొదవేలేదు. వీడియోలు అనేకం కనిపిస్తున్నాయి. సనాతన దర్మంలో తండ్రి మతం కాకుండా తల్లి మతం కుమార్తెకు ఎలా వస్తుందన్న ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వగలరా? ఏదో పబ్లిసిటీ కోసం తన కుమార్తెతో తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించి తన పరువు తాను తీసుకున్నారు. ఇక వ్యక్తిగత జీవితంలోకి వెళ్లితే సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు చెబుతున్న ఈయన చేసిన నిర్వాకాలేమిటో అందరికీ తెలుసు.అయినా ఎలాంటి భేషజం లేకుండా పవన్ కళ్యాణ్ ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే, ఆయన మోసపూరిత రాజకీయం చేస్తున్నారని తెలిసిపోతుంది. రాజకీయంగా మాటలు మార్చితే ఒక పద్దతి.అలా కాకుండా మతాల మధ్య చిచ్చుపెట్టేలా అధికారంలో ఉన్న పెద్ద మనిషి వ్యవహరిస్తే అది సమాజానికి ప్రమాదం అవుతుంది. సనాతన ధర్మం అంటే తోచిన అబద్దం చెప్పడమా? తిరుపతి సభలో ఆయన మాట్లాడుతూ సనాతన దర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా తుడిచిపెట్టుకు పోతారని హెచ్చరించారు. సనాతన ధర్మం ప్రకారం విడాకుల ప్రసక్తి ఉండదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు చెబుతున్నారు.మరి పవన్ ఏమి చేశారు. రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. రెండుసార్లు హిందూ స్త్రీలకు విడాకులు ఇచ్చి మూడోసారి క్రైస్తవ మహిళను వివాహమాడారు. అంటే హిందూ ధర్మంపై దాడి చేసింది పవనే అవుతారు కదా! చట్టం ప్రకారం ఆయన చేసింది తప్పు కాకపోవచ్చు.కానీ ఆయన చెబుతున్న సనాతనం ప్రకారం అయితే అది నేరం కాదా?ఇందులో ఇతర అంశాల జోలికి వెళితే బాగుండదు. అవన్ని కూడా సనాతన ధర్మానికే కాదు..హిందూ మత విధానాలకే వ్యతిరేకంగా చేశారు. ఆయన ఇప్పుడు వచ్చి ఈ ధర్మం గురించి బోధిస్తుంటే ఏళ్ల తరబడి హైందవ ధర్మం కోసం పనిచేస్తున్న స్వామీజిలు బిత్తరపోతున్నారు.తాము ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోవాలా అన్నదానిపై పవన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారట. ఎన్నికల ముందు ఆలోచించకుండా ఇష్టారీతిలో అబద్దపు వాగ్దానాలు చేయడం సనాతన ధర్మంలో ఉందా? హిందూ మతంలో ఉందా? కలియుగ దైవానికి అపచారం చేస్తే ఎందుకు ఊరుకుంటాం అని పవన్ ప్రశ్నించారు. అపచారం చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే కదా? జంతు కొవ్వు కలిసిన నేతిని లడ్డూ తయారీలో వాడారని ఆధారం లేని సంగతి చెప్పింది వారే కదా? అది నిజమే అయితే రెండు నెలలపాటు మౌనంగా ఉండడం నేరం కాదా? అయోధ్యకు పంపిన లడ్డూలు కల్తీ అయ్యాయని పవన్ చేసిన ఆరోపణకు నిదర్శనం చూపించాలి కదా? ఈయన స్వయంగా అక్కడకు వెళ్లారు కదా.అప్పుడు ఎవరైనా ఈయనకు ఫిర్యాదు చేశారా? చేస్తే వెంటనే ప్రకటన ఇచ్చేవారు కదా? అంటే అసత్యం చెప్పారనే కదా!'ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోవాలి. అల్లా అంటే ఆగిపోతారు. అదే గోవిందా అంటే మనం ఆగిపోం.." అని అంటారు. ఇది మతాలను రెచ్చగొట్టడం కాదా? హైందవ ధర్మంలో ఇదేనా ఉంది? సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అంటే గొడవ పెట్టుకోవడానికి వచ్చాను అని పవన్ అన్నారు. గొడవలు సృష్టించడానికే ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారా? అసలు ఎవరైనా సనాతన ధర్మం గురించి ఈ మధ్యకాలంలో మాట్లాడారా? కేవలం పవన్ కళ్యాణ్ లేని వివాదం తెచ్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. జగన్ పాలనలో ఏదో జరిగిందని పచ్చి అబద్దాలు చెప్పి హిందూ మతానికి ఈయన మరింత అప్రతిష్ట తెస్తున్నారు.టీడీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని చోట్ల రధం దగ్దం చేయడం వంటివి కొన్ని జరిగాయి. అలాగే మహిళలపై ఈ నాలుగు నెల్లోనే జరిగినన్ని అత్యాచారాలు,ప్రత్యేకించి చిన్న పిల్లలపై జరిగిన ఘోరాలు సమాజాన్ని కలచివేస్తున్నాయి.వాటి గురించి మాట్లాడే ధైర్యం లేని పవన్ ఎంతసేపు గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, సనాతన ధర్మం అంటూ కొత్తపాట ఎత్తుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. నిజానికి ఆయనకు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియదనేదే విద్యాధికుల స్పష్టమైన భావన. ఏపీ ప్రజలలో మత భావాలను పెంచి బీజేపీ ఎజెండా ప్రకారం ఇలాంటి కుట్రలకు పవన్ పాల్పడుతున్నారన్నది మరికొందరి అనుమానం. చంద్రబాబే అవకాశ వాదంతో రకరకాల వర్గాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటారంటే, ఆయనను దాటి పోవాలని ఏమైనా అనుకుంటున్నారా? అన్నది తెలియదు. కానీ హనుమంతుని ముందు కుప్పి గంతులా అన్నట్లు చంద్రబాబు ఈయన తోక కట్ చేయగలరు. తన మీడియా బలంతో భ్రష్టు పట్టించగలరు. చంద్రబాబు, లోకేష్ లు తెలివిగా పవన్ కళ్యాణ్ ను ఇరికించి పరువు తీస్తున్నారా? అన్నది మరికొందరి సందేహం. ప్రస్తుతానికి ఇద్దరూ కలిసి జనాన్ని మోసం చేయడానికి ఈ గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తిరుమల లడ్డూ ప్రసాదంపై తీరు మారని పచ్చ పార్టీ
-
బాబు మెడకు జంతువుల కొవ్వు.. బాలకృష్ణ, పవన్ సైలెంట్..
-
Video: బాబూ.. ఇదేనా వెంకన్నపై నీకున్న భక్తి: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: తిరుమల వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలైంది. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు చంద్రబాబు. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్సీపీ షేర్ చేసింది.చంద్రబాబు భక్తిని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు. దేవుడంటే చంద్రబాబుకి భక్తి లేదు.. భయం అంతకంటే లేదు.. ఇదిగో సాక్ష్యం!.వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన @ncbn.. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు దేవుడంటే చంద్రబాబుకి భక్తి లేదు.. భయం అంతకంటే లేదు.. ఇదిగో సాక్ష్యం!#CBNShouldApologizeHindus#SatyamevaJayate#TirupatiLaddu#CBNDestroyedAPin100Days pic.twitter.com/YZuC5A79eN— YSR Congress Party (@YSRCParty) October 5, 2024ఇదే సమయంలో లడ్డూ విషయంలో డైవర్షన్ రాజకీయాలను ప్రశ్నించింది. చంద్రబాబు రాజకీయ పునాదులు.. అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్సే. లడ్డూ వ్యవహారంలో కూడా ఆయన పద్ధతి ఇదే. వీటికి సమాధానాలు చెప్పకుండా.. ఈ డైవర్షన్లు ఎందుకు. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. కనీసం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లకైనా సమాధానం చెప్పు.1.లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిస్తే.. ఆధారాలెక్కడ? 2.కల్తీ జరిగిందని అనుకున్నప్పుడు లడ్డూలపై ఎందుకు పరీక్షలు చేయించలేదు?3.ఈవో ఒకమాట, సీఎం ఒక మాట ఎందుకు చెప్పారు? ఆరోపణలున్న నెయ్యిని తిప్పిపంపామని ఈవో, లేదు వాడారని సీఎం… పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేశారు?4.ఎలాంటి ఆధారం లేకుండా భక్తుల మనోభావాలను చంద్రబాబు ఎందుకు దెబ్బతీశారు?5.జులై 23న రిపోర్టు వస్తే సెప్టెంబరు 18వరకూ 54 రోజులపాటు ఎందుకు దీని గురించి పట్టించుకోలేదు. 6.అసలు నెయ్యి సరఫరా జరిగింది ఎప్పుడు? చంద్రబాబు పరిపాలనలో కాదా? 7.శాంపిళ్లు తీసిన జులై 6, జులై 12 తేదీల్లో నడుస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా? టీటీడీలో ఉన్నది చంద్రబాబు వేసిన ఈవోనే కదా?. -
సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు
-
సుప్రీం తప్పుపట్టినా ఆగని లడ్డు రాజకీయం.. బాబుపై జగన్ ఫైర్
-
టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా సీబీఐ సిట్ విచారణ
-
సుప్రీంకోర్టు తప్పుపట్టినా మారవా బాబూ.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు తప్పుపట్టినా చంద్రబాబులో మార్పు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారంటూ ట్వీట్ చేసిన ఆయన.. పలు రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు, తదితరులకు ట్యాగ్ చేశారు. Even after the critical remarks of the Hon’ble Supreme Court against @ncbn , TDP continues to politicize the Laddu Prasadam issue. @BJP4India @INCIndia @arivalayam @BRSparty @samajwadiparty @AamAadmiParty @AIADMKOfficial @narendramodi @AmitShah @ShivSenaUBT_ @AITCofficial… pic.twitter.com/vefByATGT6— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2024 ‘సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేస్తూ తీర్పు ఇస్తే.. సిగ్గూ ఎగ్గూ లేకుండా ఆ తీర్పును వక్రీకరిస్తారా? మీరు చేసిన తప్పులను సుప్రీంకోర్టు ఎత్తి చూపుతూ మిమ్మల్ని నిలదీస్తే మాకు అక్షింతలు వేసిందంటూ దుష్ప్రచారం చేస్తారా?’ అంటూ నిన్న(శుక్రవారం) నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. శుక్రవారం ‘ఎక్స్’లో తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతా(హ్యాండిల్)లో చేసిన పోస్టింగ్స్ చూస్తే.. ‘తప్పు జరిగిందని తెలిసినా, దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినా చంద్రబాబులో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అంటూ దుయ్యబట్టారు.టీడీపీ అధికారిక ఖాతా నుంచి ‘ఎక్స్’లో చేసిన ఆ పోస్టింగ్స్లో ఏం రాశారన్నది చదివి వినిపిస్తూ ‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో అబద్ధం మీద అబద్దాలు చెప్పుకుంటూ పోతున్నారు. మనిషి అన్నాక కొద్దిగానైనా దేవుడంటే భక్తి ఉండాలి. కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంత దారుణంగా వక్రీకరణ చేయడమా?’ అంటూ వైఎస్ జగన్ తీవ్రంగా ఆక్షేపించారు.ఇదీ చదవండి: సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణకాగా, తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సుప్రీంకోర్టు పక్కన పెట్టిన పెట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తద్వారా దర్యాప్తు విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు తామే ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. -
బాబు సిట్' క్లోజ్
-
సుప్రీం సిట్ అయినా నిజం నిగ్గుదేల్చేనా?
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ కల్తీ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గదే అయినప్పటికీ విచారణ నిస్పక్షపాతంగా సాగుతుందా? లేదా? అన్నదానిపై అప్పుడే ఒక అభిప్రాయానికి రాలేము. ఎందుకంటే.. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై కొత్త ఎత్తులు వేస్తారా? అన్న సందేహం అందరిలోనూ ఉంది కాబట్టి! లడ్డూ వ్యవహారంలో తమకు సహకరించమని సుప్రీంకోర్టు కోరిన సోలిసిటర్ జనరల్ ఒకపక్క స్వతంత్ర సిట్కు ఓకే అంటూనే.. ఇంకోపక్క రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్కూ సర్టిఫికెట్ ఇస్తూ వారి అర్హతలు బాగానే ఉన్నాయనడం బాబు కేంద్రాన్ని ఏ మేరకు ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి అన్నది ఇక్కడ మరచిపోరాదు.ప్రపంచం మొత్తమ్మీద కోట్లాది మందికి ఇష్టదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెలలో ఒక అర్థం పర్థం లేని ఆరోపణ చేయడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సాగిన ఈ అసత్యపు ఆరోపణలపై నిజాలు నిగ్గుదేల్చేందుకు విషయం సుప్రీంకోర్టుకు ఎక్కింది. అయినా సరే.. టీటీడీ పవిత్రతను కాపాడవలసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రే దానిని దెబ్బతీసేలా వ్యవహరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి దీనిపై దీక్ష పేరుతో ఒక డ్రామా కూడా ఆడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తోసిరాజని బహిరంగ సభపెట్టి మరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకే ఆదేశాలు ఇస్తున్న రీతిలో, మతాల మధ్య ద్వేషాలు పెంచేలా పవన్ మాట్లాడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రాజకీయ డ్రామాలు ఆపండని ఘాటుగా స్పందించడం విశేషం.ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏ విచారణకు అయినా సిద్దం అని చెప్పలేకపోవడం ద్వారా చంద్రబాబు ఎంత ఆత్మరక్షణలో పడింది అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం, టీటీడీల తరఫు న్యాయవాదులు అఫిడవిట్లలో జంతు కొవ్వు కల్తీ ప్రస్తావనే తేలేదట. సుప్రీంకోర్టు మాత్రం తుషార్ మెహతా సూచనను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ నియమించే ఇద్దరు సభ్యులకు అవకాశం కల్పించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఎలా పనిచేస్తుంది? దాని ఎజెండా ఏమిటి? కాల పరిమితి ఏమిటి? ఏ అంశాలపై విచారణ జరుపుతుంది? మొదలైన విషయాలపై స్పష్టత రావల్సి ఉంది.చంద్రబాబు, పవన్ లు అధికారంలోకి వచ్చాక జరిగిన ఈ ఘటనలను గత జగన్ ప్రభుత్వానికి పులిమి రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నం జరిగింది. మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించి విచారణ కోరి ఉండకపోతే, చంద్రబాబు తన అరాచక ఆరోపణలు కొనసాగించే వారు. తాను చెప్పిన విధంగా నివేదిక తయారు చేసేందుకే సొంత సిట్ ను నియమించుకున్నారు. ఈ విషయాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొంతవరకు గమనించినట్లే అనుకోవాలి. అందుకే వారు పలు ప్రశ్నలు సంధించారు. ఏ ఆధారంతో లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని చెప్పారని సూటిగానే అడిగింది. విచారణ జరగకుండా సీఎం మీడియాకు ఎక్కడమేమిటని అసహనం వ్యక్తం చేసింది.సుప్రీం వేసిన ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ ల వద్ద జవాబు లేదు. టీటీడీ తరపున వాదించిన లాయర్ సిద్దార్ధ్ లూద్రా కల్తీ నెయ్యి తో లడ్డూ తయారు కాలేదని చెప్పారు. ఇది ప్రభుత్వం తరపున చెప్పినట్లే. అలాంటప్పుడు లడ్డూ విషయంలో స్పష్టత వచ్చినట్లయింది. ఇక విచారణ జరపవలసింది ఈ లడ్డూ వివాదంలో ఎవరి పాత్ర ఏమిటనేదే? చంద్రబాబు నాయుడు ఏ ఆధారంతో జంతుకొవ్వు కలిసిందని అన్నారు? తనతో శ్రీ వెంకటేశ్వర స్వామే నిజాలు చెప్పించారని అంటూ, గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలలో నిజం ఎంత? అబద్దం ఎంత?పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో సాగించిన తంతు ఏమిటి? ఈ ఓ శ్యామలరావు తొలుత వెజిటబుల్ ఫాట్ (వనస్పతి) కలిసిందని, ఆ టాంకర్లను వాడలేదని ఎలా చెప్పారు. తదుపరి జంతు కొవ్వు ప్రసావన ఎందుకు చేశారు. చంద్రబాబు ప్రభావంతోనే ఆయన అలా చేశారా? లడ్డూని పరీక్షకు పంపకుండా సీఎం స్థాయిలోని వ్యక్తి రెండు నెలల తర్వాత ఏ ఆరోపణ అయినా చేయవచ్చా? మైసూరులోని సంబంధిత పుడ్ టెస్టింగ్ లాబ్ కు తిరస్కరించిన నెయ్యి శాంపిల్స్ పంపించారా? లేదా? పంపిస్తే ఆ లాబ్ ఏమి రిపోర్టు ఇచ్చింది.పనికట్టుకుని గుజరాత్ లోని ఎన్.డి.డి.బి లాబ్ కు పంపడంలో ఏమైనా కుట్ర ఉందా? ఆ సంస్థ చైర్మన్ సరిగ్గా అంతకు ఒకటి, రెండు రోజుల ముందే టీటీడీ ఈఓని, మరికొందరు ప్రముఖులను ఎందుకు కలిసి వెళ్లారు? గతంలో చంద్రబాబు హయాంలో కాని, జగన్ హయాంలో కాని ఇలా నాణ్యత ప్రమాణాలు లేని నేయి ట్యాంకర్లను తిరస్కరించినప్పుడు, వేరే లాబ్ లకు పరీక్ష నిమిత్తం పంపించారా? లేదా? లేకుంటే ఎందుకు చేయలేదు. సుప్రీంకోర్టు విచారణలో పలు సందేహాలు వ్యక్తం చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ యధాప్రకారం లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని ఆరోపించడంలో ఉద్దేశం ఏమిటి? అయోధ్యకు కూడా కల్తీ నెయ్యి కలిసిన లడ్డూలు పంపారని పవన్ చెప్పడానికి ఆధారం ఏమిటి? అప్పట్లో అయోధ్యలో ఈ ప్రసాదం లడ్డూలను తిన్నవారెవరు ఎలాంటి పిర్యాదు చేయలేదు కదా? ఎన్.డి.డి.బి రహస్య నివేదిక ఇస్తే దానిని టీడీపీ ఆఫీస్ నుంచి ఎలా విడుదల చేశారు?ఇలాంటి అంశాలన్నిటిపైన కొత్త కమిటీ దర్యాప్తు చేస్తే మంచిదే. కమిటీ కూర్పులో సీబీఐ నుంచి ఇద్దరు, పుడ్ సేఫ్టి టెస్టింగ్ లాబ్ నుంచి ఒకరిని నియమించడం వరకు ఫర్వాలేదు.రాష్ట్రం నుంచి ఇద్దరు సిట్ సభ్యులను నియమించడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది. వారు చంద్రబాబు పక్షాన ఆయనకు అనుకూలంగా ప్రభావితం చేయరన్న గ్యారంటీ ఉంటుందా.? కేంద్రంలోని సీబీఐపై కూడా విపక్షాలు పలు విమర్శలు చేస్తుంటాయి. అలాంటప్పుడు సుప్రీంకోర్టు నేరుగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తే బాగుండేదేమో! లేక ఒక న్యాయమూర్తిని లేదా రిటైర్డ్ జడ్జిని నియమించి విచారణ చేయిస్తే ఎక్కువ ఉపయోగం ఉండేదేమో ఆలోచించాలి. తొలుత విచారణ జరిపినప్పుడు న్యాయమూర్తులు చేసిన ఘాటైన వ్యాఖ్యలకు తగినట్లుగా ఈ విచారణ సంఘం ఏర్పాటు కాలేదేమో అన్న అభిప్రాయం ప్రబల వచ్చు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేయాల్సిన అపచారం అంతా చేసి, కేవలం రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి తప్పుడు ఆరోపణలు చేసి ఇంత గందరగోళం సృష్టించారన్న భావన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయడం , అందులో వివాదాస్పద ,పక్షపాతంతో పనిచేసే అధికారులను నియమించిన వైనంపై రాజకీయ పార్టీలు తప్పు పట్టాయి. ఇన్ని పరిణామాలు జరిగిన ఈ ఉదంతంలో తొలుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లనే విచారించాలి. అలాగే టీడీపీ ఆఫీస్ లో టెస్ట్ రిపోర్టు అంటూ విడుదల చేసిన టీడీపీ ప్రతినిధులను ప్రశ్నించాలి.తదుపరి ఈ ఓ శ్యామలరావును ప్రకటనలపై దర్యాప్తు చేయాలి.టెస్ట్ రిపోర్టు వచ్చిన రెండు నెలల తర్వాత దానిని ముఖ్యమంత్రి ఎందుకు బహిర్గతం చేశారో తెలుసుకోవాలి. ఎలాగూ ఏఆర్ సంస్థకు టెండర్ వచ్చిన దానిపై విచారణ జరుగుతుంది? అయితే వారు నెయ్యి సరఫరా చేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. మాజీ చైర్మన్ లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలను, మాజీ ఈఓ ధర్మారెడ్డిని ఎలాగూ కమిటీ విచారిస్తుంది! ఏది ఏమైనా మొత్తం హైందవ సమాజం అంతటిని గందరగోళంలోకి నెట్టిన ఈ అంశంలో, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు సృష్టించిన ఈ వివాదంలో నిష్పక్షపాతంగా కమిటీ విచారణ జరగాలి.అప్పుడే తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి జరిగిన అపచారానికి పరిహారం అయినట్లు అవుతుంది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సుప్రీంకోర్టు దెబ్బకు తప్పు ఒప్పుకున్న చంద్రబాబు
-
‘ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రకు తెరలేపారు’
తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వంద రోజుల పాలనపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు అంటూ ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి. ‘ లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో చిన్నారి అశ్వియా అంజుమ్ కిడ్నాప్కు గురై హత్య గావించబడితే పోలీసులు కనీసం పట్టించుకోలేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ కాలిపోతే డిజిపి స్పెషల్ ఫ్లైట్, ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు. డిజిపి పనితీరు మార్చుకోవాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో నాపై బురద చల్లెందుకు ఎన్నో కుట్రలు చేశారు, ఎలాంటి ఆధారాలు లభించక లేదు’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన అశ్వియా అనే బాలిక కిడ్నాప్ గురై ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడింది. అశ్వియా కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిలు పరామర్శించనున్నారు. అయితే పెద్దిరెడ్డి, మిథున్రెడ్డిలు హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు పుంగనూరుకు వెళుతున్నారన్న సమాచారంతో అక్కడ పెద్ద ఎత్తును పోలీసులను మోహరించింది చంద్రబాబు సర్కారు. -
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సీబీఐ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘సిట్’ను పక్కనపెట్టిన సుప్రీంకోర్టు
-
లడ్డూలో కాదు.. కూటమిలోనే కల్తీ
సాక్షి, విశాఖపట్నం: పవిత్రమైన తిరుపతి లడ్డూను రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారు. వందరోజుల పాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు విషరాజకీయాలకు తెరతీశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేశారంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. రెండు రోజుల తర్వాత.. కల్తీ నెయ్యి అనీ.. మరికొద్ది రోజుల తర్వాత.. లడ్డూలో కలవలేదనీ.. కలవకుండా ఆపేశామంటూ పూటకోమాట మార్చేస్తూ.. భక్తుల మనోభావాలతో రాజకీయ చదరంగమాడారు. దీనిపై నిస్పాక్షికమైన దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు, అండ్ కో చేసిన వ్యాఖ్యలపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాల్లేకుండా.. దేవుడిని రాజకీయాల్లోకి లాగారంటూ మండిపడింది. చేసిన తప్పుడు వ్యాఖ్యల్ని సమరి్థంచుకునేందుకు కూటమి ప్రభుత్వం.. రాష్ట్ర పోలీసులతో సిట్ పేరుతో ఆడాలనుకున్న నాటకాలకు ధర్మాసనం స్వస్తి పలికింది. లడ్డూ వ్యవహారం సీబీఐకి అప్పగించి.. స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కుటిల స్వార్థంతో భగవంతుడిని రాజకీయాల్లోకి లాగారంటూ ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. సుప్రీం నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టులాంటిదని అభిప్రాయపడుతున్నారు. తప్పు జరిగితే దేవుడే చూసుకుంటాడని.. తప్పుడు ఆరోపణలు చేసినా.. ఏడుకొండల వాడు విడిచి పెట్టరంటున్నారు. మతజ్వాలలు రగిలించిన ప్రభుత్వ వ్యవహారంపై చిన్నా పెద్దా తేడాలేకుండా.. యావత్ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. అసలు లడ్డూలో కల్తీ లేదని.. కూటమి ప్రభుత్వం చేసిన విషప్రచారంలోనే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుంటే బావుంటుంది ఈ మధ్య మా మిత్రులతో కలిసి భద్రాచలం వెళ్లాం. అక్కడ ప్రసాదం తినే ముందు సీఎం చంద్రబాబు దుర్బుద్ధితో చేసిన కల్తీ లడ్డూ ప్రకటన గుర్తుచేసుకొని బాధపడ్డాం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఐదుగురితో ఏర్పాటు చేసిన బృందంలో ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులకు బదులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటే బావుంటుంది. సిట్ విచారణ చేయడానికి సుప్రీంకోర్టు కాలపరిమితి విధించాలి. – జీవీఎన్ సంజయ్, సాఫ్ట్ వేర్ ఆపరేషన్ మేనేజర్ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. తెలిసితెలిసి కలియుగ దైవం వేంకటేశ్వరస్వామితో ఆడుకుంటే వారికి మామూలుగా పాపం అంటదు. వంద రోజుల ప్రభుత్వ పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కల్తీ లడ్డూ వివాదం కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. చివరకు మాజీ సీఎం వైఎస్ జగన్ను తిరుమల రాకుండా మతం రంగు పులిమి అడ్డు తగిలారు. సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అయింది. –దంతులూరి వెంకట శివ సూర్యనారాయణరాజు, ఎంపీపీ, భీమిలిచంద్రబాబు ప్రకటన ఆవేదనకు గురిచేసింది నేను మూడేళ్ల నుంచి తిరుమల వెంకటరమణమూర్తి గోవింద మాల వేస్తున్నాను. తిరుమల లడ్డూ ప్రసాదం జంతువుల కొవ్వుతో కల్తీ చేశారనే చంద్రబాబు ప్రకటన చాలా ఆవేదనకు గురిచేసింది. ఆధారం లేకుండా ముఖ్యమంత్రిగా ఎలా బహిరంగ ప్రకటన చేశారని చంద్రబాబును సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించిన తర్వాత కాస్త మనసు కుదుటపడింది. దర్యాప్తులో ఏ రాజకీయ పార్టీది తప్పని తేలితే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి. – మజ్జి రవికుమార్, తిరుమల గోవింద మాలధారుడుచంద్రబాబును బహిష్కరించాలి హిందూ ధర్మ పరిరక్షణే మూల సిద్ధాంతంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం బీజేపీ మెజార్టీ హిందువుల ఓట్లతో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా చంద్రబాబు తిరుపతి లడ్డూపై వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమి నుంచి బహిష్కరించాలి. సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిజాయితీగా దర్యాప్తు చేయాలలి– వాసు, జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ఫైవ్మెన్ కమిటీని స్వాగతిస్తున్నా.. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్వాగతిస్తున్నాం. విచారణకు సంబంధించి ఫైవ్మెన్ కమిటీతో నిజాలు బయటపడతాయన్న ఆశ ఉంది. కోట్లాది మంది హిందువులు..శ్రీవారి భక్తుల మనోభావాలను చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్ దెబ్బతీశారు. సనాతన ధర్మం కోసం పవన్కల్యాణ్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. – వాసుపల్లి గణేష్కుమార్, వైఎస్సార్సీపీ దక్షిణ సమన్వయకర్తశివుడు కూడా సహించడు తిరుపతి వెంకన్న లడ్డూ్డ అంటే అది దివ్యప్రపాదం. ఒకసారి స్వామికి నివేదించాక అది అమృతం కన్నా గొప్పది. దేవతలు మనంపెట్టే నైవేద్యాలను ఆఘ్రాణ రూపంగా ఆరగిస్తారని శా్రస్తాలు చెపుతాయి. అటువంటి గొప్ప ప్రసాదం మీద కల్తీ అనే అపవాదు వ్యాపింపజేయడం గొప్ప అపచారం. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమయోచితంగా స్పందించింది. పరమ పవిత్రమైన లడ్డూపై జరిగిన దు్రష్పచారాన్ని చంద్రచూడుడు (శివుడు) మాత్రం సహిస్తాడా?? – బులుసు వేంకటేశ్వర్లు, ప్రముఖ పద్యకవి, తగరపువలసబాబు ఆరోపణలు తగవు తిరుమల లడ్డూ విషయంలో వైఎస్సార్ సీపీ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఆది నుంచి కోరింది. సుప్రీంకోర్టు కూడా ఫైవ్మెన్ కమిటీతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. స్వతంత్ర దర్యాప్తుతోనే వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విషయంపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. – గొలగాని హరి వెంకటకుమారి, విశాఖ నగర మేయర్నిజం నిగ్గు తేలుతుంది రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్పై హిందువులెవరికీ నమ్మకం లేదు. ఒక స్వతంత్ర ఏజెన్సీ ద్వారా దర్యాప్తు జరపాలని వైఎస్సార్సీపీ తొలి నుంచి డిమాండ్ చేస్తోంది. శ్రీవారి లడ్డూపై వచ్చిన ఆరోపణలపై నిజనిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను యావత్ హిందువులు స్వాగతిస్తున్నారు. మాపార్టీ నుంచి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సు్రíపీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు చేయించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం. – గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, విశాఖ -
దేవుడంటే బాబుకు భయమూ, భక్తి రెండూ లేవు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దుర్భుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ టీడీపీ ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తుందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. చంద్రబాబు రాజకీయ దుర్భుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చిగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేసినట్టుగా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు. ఈ విషయంలో చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. చంద్రబాబు స్వయంగా వేసుకున్న సిట్ను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు... చంద్రబాబుకు దేవుడంటే భక్తి ఉంటే ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. చంద్రబాబుకు భయం, భక్తి రెండూ లేవు. ఆయనకు భయం, భక్తి ఉంటే.. ఇప్పటికైనా పశ్చాత్తాపం రావాలి. చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఇప్పటికీ టీడీపీ ట్విట్టర్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కోర్టులు వారిని తప్పుబడితే సోషల్ మీడియాలో మాపై తప్పుడు ప్రచారానికి తెరలేపారు. లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని టీటీడీ ఈవోనే చెప్పారు. చంద్రబాబు చెప్పింది తప్పు అని ఈవోనే అంటున్నారు. ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తున్నారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా చంద్రబాబు తీరు మారలేదు. సిగ్గు లేకుండా చంద్రబాబు ప్రతీ విషయాన్ని వక్రీకరిస్తున్నారు. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు అపవిత్రం చేశారని ఆరోపించారు. .. లడ్డూ వివాదంలో జాతీయ మీడియా కూడా చంద్రబాబును తప్పు బట్టింది. శ్రీవారి లడ్డూ విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ హయాంలో 14 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించాం. ఈ టెండర్లలో వచ్చిన వాళ్లకే కాంట్రాక్ట్లు ఇస్తారు. ప్రతీ నెయ్యి ట్యాంకర్ సర్టిఫికెట్ తీసుకుని రావాలి. నెయ్యి ట్యాంకర్లకు టీటీడీ మూడు టెస్టులు చేస్తుంది. టెస్టులు ఫెయిల్ అయితే ఆ ట్యాంకర్లను వెనక్కి పంపుతారు. ట్యాంకర్లను రిజెక్ట్ చేసినట్టు స్వయంగా ఈవోనే చెప్పారు. నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉందని ఈవోనే స్పష్టంగా వెల్లడించారు. చంద్రబాబు మాత్రం లడ్డూ ప్రతిష్టను దిగజార్చారు... కల్తీ నెయ్యి ప్రసాదానికి వాడలేదని ఈవో మరోసారి చెప్పారు. ఈవో చెప్పినప్పటికీ చంద్రబాబు మళ్లీ అసత్య ప్రచారాలు చేశారు. భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పింది. రాజకీయ డ్రామాలు చేయవద్దని హెచ్చరించింది. చంద్రబాబు మంచి వ్యక్తి అయితే ఆధారాలను చూసి సిగ్గుపడాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా బాబు వ్యవహరించారు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘టీటీడీ లడ్డూ విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాము. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాము. పొలిటికల్ కామెంట్ చేయొద్దు అని కోర్టు చెప్పింది. చంద్రబాబు వ్యాఖ్యల కారణంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగింది. ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పాము.నా హయాంలో ఏఆర్ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయి అన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దు అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. విచారణ ముగిసే వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంటుంది. మాపై చేసిన నిందలు తొలగిపోతాయని అనుకుంటున్నాము. మేము ఉన్న సమయంలో కల్తీ జరగలేదు. లడ్డులను ఇంతవరకు టెస్ట్ చేయలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ‘సుప్రీం’ నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్సార్సీపీ -
తిరుమలలో అపశృతి
తిరుపతి,సాక్షి : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రారంభం ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. సాయంత్రం ధ్వజారోహణం సమయంలో ధ్వజస్తంభంపై గరుడ పఠాని ఈ కొక్కి ద్వారానే ఏగుర వేయాల్సి ఉందని అర్చకులు తెలిపారు. కొద్దిసేపటి క్రితం కొక్కి విరగడంతో టీటీడీ మరమ్మత్తు పనులు ప్రారంభించింది. అర్చకులు ద్వారా ధ్వజస్తంభంపై టీటీడీ మరమ్మత్తు పనులను ముమ్మరం చేసింది. -
సీబీఐ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ దర్యాప్తును స్వాగతిస్తున్నాం
-
‘మీరే హిందూ మతానికి అసలైన శత్రువులు’.. పవన్కు డీఎంకే కౌంటర్
చెన్నై: తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది పవన్ వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడారు. ‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా’ అంటూ హెచ్చరించారు.అయితే పవన్ వ్యాఖ్యలపై డీఎంకే గట్టి కౌంటర్ ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ‘ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది’ అని సూచించారు. తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30న తొలిసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. శ్రీవారి ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడం తగదంటూ మొట్టికాయలు వేసింది. తాజాగా ఆ వ్యాఖ్యల్ని ప్రస్తావించిన హఫీజుల్లా..‘ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీలే హిందూ మతం, మానవత్వానికి నిజమైన శత్రువులు ’ ద్వజమెత్తారు. డీఎంకే ఏ మతం గురించి మాట్లాడదు. మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేది బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్. వారే అసలైన శత్రువులు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మీకు మీరే సాటి అని సెటైర్లు వేశారు. ‘ఇంకా.. కులం, అంటరానితనంపై అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, పెరియార్ ఇతర ద్రావిడ ఉద్యమ వ్యవస్థాపకుల తరహా వైఖరినే డీఎంకే అవలంభిస్తుంది. వాటికి అనుగుణంగా కులం, అంటరానితనం గురించి పోరాడుతుంది. వ్యతిరేకిస్తుందని సూచించారు.👉చదవండి: సుప్రీంలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ -
స్వతంత్ర సిట్ దర్యాప్తుపై వైవీ సుబ్బారెడ్డి ఫస్ట్ రియాక్షన్
-
‘సుప్రీం’ నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్సార్సీపీ
సాక్షి, తిరుపతి: సీబీఐ సిట్ బృందం విచారణ పూర్తిగా స్వాగతిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయంపై ఆయన స్పందిస్తూ.. లడ్డూపై కేవలం దురుద్దేశ పూర్వకంగా చంద్రబాబు ఆరోపణలు చేశారన్నారు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే నమ్మకం ఉందన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయన్నారు. సీబీఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలతాయని, సత్యం వెలుగులోకి వస్తుందని భూమన అన్నారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డిసుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పొలిటికల్ కామెంట్లు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. చంద్రబాబు వ్యాఖ్యలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేశామన్నారు. ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పాము. నా హయాంలో ఏ.ఆర్ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. విచారణ ముగిసే వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంటుంది. మా పై చేసిన నిందలు తొలగిపోతాయని అనుకుంటున్నాము. మా సమయంలో కల్తీ జరగలేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.బాబు అబద్ధాలు తేటతెల్లమయ్యాయి: రవీంద్రనాథ్రెడ్డితిరుమల లడ్డు కల్తీ ఆరోపణలపై సుప్రీం కోర్టు సిట్ వేయడం చంద్రబాబుకు చెంపపెట్టని, ఇప్పటికైనా చంద్రబాబు దేవుడిని తన స్వార్ధ రాజకీయాలకు వాడుకోవడం మానుకోవాలని వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరుని భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారని, లడ్డూలో కల్తీ నెయ్యి వాడకపోయినా కల్తీ జరిగిందంటూ చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేశారని ఆయన అన్నారు. నేటి సుప్రీం కోర్టు తీర్పుతో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని తేటతెల్లమయ్యాయని, సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు రవీంద్రనాథ్రెడ్డి చెప్పారు.స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి..: ఆర్కే రోజాశ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం’’ అని మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని ఆమె హితవు పలికారు.‘‘మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రే విచారణ, ఆధారాలతో సంబంధం లేకుండా రాజకీయ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి పరిధిలోని విచారణతో నిజాలు బయటికి రావని స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావాలని కోరుకున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో విచారణ జరగాలనే వాదనతో మా డిమాండ్కు విశ్వసనీయత పెరిగింది. సుప్రీం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి వస్తాయని, తద్వారా గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని పునరుద్ధరించినట్టు అవుతుందని తిరుపతి ఆడబిడ్డగా నమ్ముతున్నాను..!!’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు.శ్రీవారి లడ్డూ ప్రసాదాల వివాదంలో #SupremeCourt తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం. సుప్రీం తీర్పుతో అయినా సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు అందరూ మానుకుంటే మంచిది. మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర…— Roja Selvamani (@RojaSelvamaniRK) October 4, 2024 చంద్రబాబు, పవన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కొట్టు సత్యనారాయణ స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయడం స్వాగతిస్తున్నామని మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు వంద రోజుల పరిపాలన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకొని లడ్డూ రాజకీయం చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం కోట్లాది మంది హిందువుల మనోభావాలు నిలబెట్టింది. దుర్మార్గుడైన ముఖ్యమంత్రి రాజకీయ క్రీడలకు ఇది చెంపపెట్టు. లడ్డూ వివాదంపై ఇప్పటికైనా ప్రభుత్వం పుల్ స్టాప్ పెట్టి సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.ఇదీ చదవండి: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ..స్వతంత్ర సిట్ కమిటీ చంద్రబాబు పవన్ కల్యాణ్లను కూడా విచారణ చేయాలి. కల్తీ లడ్డూలు అయోధ్య రామలయానికి కూడా పంపారంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఏ ఆధారాలతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.? ఎవరు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మంలో బ్రాహ్మణ ఇతరులు సైతం కూడా ఆచరించే ఆగమాలు సైతం ఉన్నాయి. సనాతన ధర్మంపై పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు.సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం: కాకాణిసుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. మొదటి నుంచి వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్న దానినే సుప్రీంకోర్టు ఏకీభవించినట్లు అనిపించిందన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా నిజానిజాలు బయటికి రావు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు అయ్యే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారానే నిజాలు బయటికి వస్తాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉండాలి హిందూ భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. రాజ్యాంగం, కోర్టుల గురించి పవన్కు అవగాహన లేదు. హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదు. వారాహి డిక్లరేషన్లో పవన్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణలోకి తీసుకోవాలి.చంద్రబాబు రాజకీయ పతనం ఆరంభమైంది: తోపుదుర్తితిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి స్పందిస్తూ.. తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. సుప్రీంకోర్టు.. చంద్రబాబుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం భగవంతున్ని సైతం వదలకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు రాజకీయ పతనం ఆరంభమైంది. చంద్రబాబు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, లేదంటే రాజీనామా చేయాలి’ అని తోపుదుర్తి డిమాండ్ చేశారు. -
లడ్డూ వివాదంపై సుప్రీం ఆదేశాలు.. అంబటి రియాక్షన్
-
చంద్రబాబుకు సుప్రీం ఊహించని దెబ్బ..
-
స్వతంత్ర సిట్ నిజాలు నిగ్గుతేల్చుతుందా ?
-
లడ్డూ కేసులో స్వతంత్ర సిట్ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ దర్యాప్తు
-
తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. కాసేపట్లో విచారించనున్న సుప్రీంకోర్టు
-
తిరుమల లడ్డూ కేసు:.. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేడు(శుక్రవారం) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసింది.తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈరోజు విచారణప్రారంభమైన అనంతరం కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జర్నల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేంద్ర అధికారిని ఏర్పాటు చేస్తే మంచిదని, లడ్డూ వ్యవహారంపై ఆరోపణలు నిజమైతే హర్షించదగనిది.. ఈ కేసు విచారణకు సిట్ ఒక్కటే సరిపోదు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలి. సెంట్రల్ నుంచి సూపర్ విజన్ ఉండాలి’’ అని తుషార్ మెహతా తెలిపారు.ఈ కేసు సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు?: సుప్రీంతిరుమల లడ్డూ వివాదంపై కేసును సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘ఈ అంశంపై పొలిటికల్ డ్రామా జరగొద్దనుకుంటున్నాం. సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు.కల్తీ జరిగిందని మీరు ఊహించుకుంటున్నారా? కల్తీ నెయ్యి కేసు సీబీఐకి ఎందుకు దర్యాప్తు చేపట్టకూడదు’ అని ప్రశ్నించింది.స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టుస్వతంత్ర దర్యాప్తు ఉంటే మంచిది.సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు ఉండొచ్చు కదా. రాజకీయంగా లడ్డూపై వ్యాఖ్యలు చేయొద్దు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు. స్వంతంత్ర సిట్ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు. లడ్డూ కల్తీ జరిగితే చాలా తీవ్రమైన అంశం’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు. స్వంతంత్ర సిట్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. సిట్ సభ్యులుగా ఇద్దురు సీబీఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, FSSAI(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ఇండియా) నుంచి ఒకరు దర్యాప్తు చేపట్టనున్నారు.కాగా సెప్టెంబరు 30న ఈ కేసును విచారించిన సుప్రీం.. సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలా అనే విషయంలో తమకు సహకరించాలని మెహతాను కోరిన విషయం తెలిసిందే. నెయ్యి కల్తీ పై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించారని గత విచారణలో వ్యాఖ్యానించింది. కల్తీ అంశంపై వాస్తవాలు నిర్ధారణ కోసం సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మీడియా ముందుకు వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి. జూలైలో రిపోర్టు వస్తే .. సెప్టెంబర్లో మీడియాకు ఎందుకు చెప్పారు ?.సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరస్కరించిన నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా?కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా ?. సిట్ వేసిన తర్వాత మళ్లీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారు’ అంటూ ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీటీడీ తరుఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా నీళ్లు నమిలారు. -
అది నోరా.. మోరా.. పవన్
-
తిరుమల లడ్డూ వివాదంపై నేడు విచారణ
-
పవన్కూ కోర్టులో మొట్టికాయలు తప్పవా?
తిరుపతి: సనాతన ధర్మాన్ని ముందు ఉంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఊగిపోయారు. గురువారం సాయంత్రం వారాహి డిక్లరేషన్ సభలో ఏకంగా న్యాయవ్యవస్థపైనే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవైపు తిరుమల లడ్డూ ప్రసాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్లపై విచారణ నడుస్తున్న వేళ.. పవన్ తాజా వ్యాఖ్యలు కచ్చితంగా చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.‘‘నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. సనాతన ధర్మం పాటించే వాళ్ల పట్ల చట్టాలు నిర్ధాక్షిణ్యంగా పని చేస్తున్నాయి. సనాతన ధర్మాన్ని దూషించేవారిని కోర్టులే రక్షిస్తున్నాయి. అయినవాళ్లకు ఆకులు.. కానివాళ్లకు కంచాలు అన్నట్లు ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆకులు కూడా పోయాయి.. చేతుల్లో పెట్టి నాకేసుకోమంటున్నారు... సనాతన ధర్మం వైరస్లాంటిదని, నాశనం చేస్తానని ఓ యువనేత అన్నారు. ఇలాంటి మాటలు ఇస్లాం గురించి అంటే తక్షణం కోర్టులు స్పందించేవి. వాళ్లను నిర్దాక్షిణ్యంగా శిక్షించేవి. సనాతన ధర్మాన్ని తిట్టినా.. శ్రీరాముడిని, సరస్వతి దేవిని తిట్టినా.. దాడి చేసినా ఏ ఒక్కకోర్టు మాట్లాడదు. అలాంటి వారిని ఏమైనా అనాలంటే కోర్టులు భయపడతాయి. ఇది న్యాయానికి ఉదాహరణ... నాకు ఏదో అన్యాయం జరిగిందని నేను బయటకు రాలేదు. జనసేన అధ్యక్షుడిగానో, ఏపీ డిప్యూటీ సీఎంగానో ఇక్కడికి రాలేదు. సనాతన ధర్మ విరోధులతో గొడవ పడడానికే వచ్చా. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా?. లడ్డూ విషయంలో కోర్టులు తీర్పులు ఇచ్చే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పవన్ అన్నారు.ఈమధ్యకాలంలో కోర్టులు ఈ తరహా వ్యాఖ్యలను అస్సలు ఉపేక్షించడం లేదు. తమ తీర్పును రాజకీయాలకు ముడిపెట్టి స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా పరిగణించి సుప్రీం కోర్టు మందలించింది. అలాగే లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తన రాజకీయం కోసం చేసిన ప్రచారంపైనా మండిపడింది. ఇవేకావు.. బాధ్యతగల పదవుల్లో ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వాళ్లపట్ల న్యాయస్థానాలు అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలున్నాయి. అలాంటిది.. పవన్ నేరుగా కోర్టులపైనే బహిరంగ సభలో వ్యాఖ్యలు చేశారు. మరి వీటిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా ఉంటుందా?. మొట్టికాయలు వేయకుండా ఉంటుందా?. ::లోకేష్ఇదీ చదవండి: చివరి నిమిషంలో లడ్డూ పిటిషన్ల విచారణ వాయిదా -
లడ్డూ కల్తీపై పిటిషన్లు... విచారణ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేటి సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. సోలిసిటర్ జనరల్ అభ్యర్థనతో చివరి నిమిషంలో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు.గత విచారణ సమయంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగించాలా? లేదంటే స్వతంత్ర దర్యాప్తు జరిపించాలా? అనే అంశంపై కేంద్రాన్ని స్పష్టత కోరింది సర్వోన్నత న్యాయస్థానం. ఇందుకు ఇవాళ్టి లోపు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం చెప్పమని కోరింది.అయితే ఇవాళ 3గం.30ని. విచారణ జరగాల్సి ఉండగా.. రేపటి వరకు సమయం కావాలని సోలిసిటర్ జనరల్ అభ్యర్థించారు. దీంతో రేపు సుదీర్ఘంగా విచారిస్తామని, ఇరువైపుల వాదనలు వింటామని చెబుతూ విచారణను చివరినిమిషంలో వాయిదా వేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.నాలుగు పిటిషన్లపై విచారణ.. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యితో అపవిత్రం అయ్యిందంటూ చేసిన ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్ధిస్తూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సంపత్, శ్రీధర్, సురేష్ చవంకేలు వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలను కలిపి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కిందటి నెల 30వ తేదీన విచారణ జరగ్గా.. సీఎం హోదాలో బాధ్యతారాహిత్యంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్రావు, సంపత్, శ్రీధర్ తరఫున రాఘవ్ అవస్తీ, సురేష్ చవంకే తరఫున సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్.. అలాగే ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు ఇరుపక్షాల వాదనలు సాగగా.. వాటిని కోర్టు రికార్డు చేసింది.ఇదీ చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు -
పల్టీలు కొట్టే.. పరువు పాయే!
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపడితే, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం సుప్రీంకోర్టును తప్పు పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టిన తీరు గమనించారా? తాను అర్ధవంతంగా మాట్లాడడం లేదని ఆమెకు తెలుసు. అందుకే కొంత తడబాటుగా, మరికొంత పొడి, పొడిగా మాట్లాడారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సమర్థించడానికి ఆమె తంటాలు పడ్డారు. నిజానికి ఇలాంటి సందర్భాలలో నిజాయితీగా మాట్లాడితే వారి విలువ పెరుగుతుంది. ఎంత మిత్రపక్షమైనా, వారు ఏమి చేసినా సమర్థిచే దశకు వెళితే ఆ మరక వీరికి కూడా అంటుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు.ఇప్పటికే కూటమిలో మరో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ వెనుకబడి పోతానో అని ఏదో దీక్ష అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి గబ్బు అయ్యారు. చివరికి తాను లడ్డూ కల్తీ గురించి తిరుమల యాత్ర చేయలేదని, గత ఐదేళ్లలో పాపాలు జరిగాయని అందుకు ప్రాయశ్చితంగా వెళ్లానని చెప్పవలసి వచ్చింది. పవన్ కళ్యాణ్కు అబద్దాలు ఆడడం, మాట మార్చడం కొత్తకాదు. కాని ఈసారి మరీ గట్టిగా బుక్ అయ్యారు. చంద్రబాబును గుడ్డిగా బలపరచబోయి పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ లు అప్రతిష్టపాలయ్యారు.తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అయిన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ సంచలన వ్యాఖ్య చేసి, దానికి ఆధారాలు చూపించలేక, పల్టీలు కొట్టిన చంద్రబాబు దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నారు. హిందువుల దృష్టిలో ఆయన దేవుడి పట్ల తీరని అపచారం చేశారు. అలాంటి వ్యక్తిని సమర్థించిన వీరిద్దరూ కూడా అపచారం చేసినట్లే అవుతుంది. తిరుమల లడ్డూపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి, రాజ్యసభ సభ్యుడు, మాజీ టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు వేసిన పిటిషన్ పై విచారణ చేస్తున్న సందర్భంలో పలు ప్రశ్నలను న్యాయమూర్తులు సంధించారు.ఇదీ చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టులడ్డూ కల్తీ అయిందనడానికి ఆధారాలు ఏమిటి? లడ్డూని ఎందుకు పరీక్షకు పంపించలేదు. ఎన్.డి.డి.బి రిపోర్టు వచ్చిన రెండు నెలల తర్వాత ఎందుకు వెల్లడి చేశారు. అందులో ఎక్కడా నిర్దిష్టంగా జంతు కొవ్వు కలిసిందని లేదే? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడవచ్చా? దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి అంటూ పలు వ్యాఖ్యలను గౌరవ న్యాయమూర్తులు చేశారు. ఈ వ్యాఖ్యలపై బిన్నాభిప్రాయం ఉంటే ఉండవచ్చు. అవి అర్ధవంతంగా ఉండాలి. అంతే తప్ప, కోర్టు ధిక్కార ధోరణిలోనో, న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించే రీతిలో ఉండకూడదు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబే ఇంతవరకు స్పందించలేకపోయారు! దానికి కారణం కేవలం తాను తప్పు చేశానన్న సంగతి తెలుసు కనుక. జంతుకొవ్వు లడ్డూలో కలిసిందని తప్పుడు ఆరోపణ చేసి దొరికిపోయానన్న విషయం తెలుసు కనుక.ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!అంతేకాదు.. సెప్టెంబర్ ఇరవై ఒక్కటో తేదీన తనతో శ్రీవెంకటేశ్వరస్వామే నిజాలు చెప్పిస్తున్నారంటూ ప్రసాదం లడ్డూపై అబద్దాలు ఆడారని తేలిపోయింది. చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో లడ్డూలో జంతునెయ్యి కలిసిందని చెప్పగానే, అలా మాట్లాడడం తప్పు అని పురందేశ్వరి ఆయనను వారించి ఉంటే మంచి పేరు వచ్చేది. ముఖ్యమంత్రి రాజ్యాంగపరంగా అధినేత స్థానంలో ఉన్నారని అంటున్నారు. అయితే రాజ్యాంగానికి అతీతంగా అబద్దాలు చెప్పవచ్చా అన్నదానికి ఆమె సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి పోస్టు రాజ్యాంగ పదవి అయితే, న్యాయమూర్తుల పదవులు రాజ్యాంగ పదవులు కావా? సీఎంకు ఉన్న పరిస్థితులు సమీక్షించుకుని మాట్లాడాలా? వద్దా అనేది ఆయన ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుందని పురందేశ్వరి అంటున్నారు.ఎంత సీఎం అయినా ఇష్టం వచ్చినట్లు స్పీచ్ ఇవ్వవచ్చా?. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీయవచ్చా?. గతంలో కూడా పలు సందర్భాలలో న్యాయస్థానాలు పలువురి ప్రకటనలు రాజ్యాంగ స్పూర్తిగా విరుద్దంగా ఉంటే తప్పు పట్టాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా అమలు అవుతుందా?లేదా అనేది కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలని ఏదో అర్థం లేని మాట చెప్పారు. ఇందులో నిర్ణయం ఏముంది? ఒక అబద్దం చెప్పడానికి సీఎంకు అధికారం ఉంటుందని ఆమె వాదించదలిచారా?. ఈ మధ్యనే ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కొంత అతిగా స్పందించారు. వెంటనే న్యాయమూర్తులు సీరియస్గా తీసుకున్నారు. ఆ మీదట రేవంత్ కోర్టువారిని క్షమాపణ కోరారు.అయినా చంద్రబాబు ఇలాంటివాటన్నిటికి అతీతుడని పురందేశ్వరి అనుకుంటే ఎవరూ ఏమి చేయలేరు. ముఖ్యమంత్రి గారు.. మీరు ఎందుకు మాట్లాడారు అనే అధికారం కోర్టుకు ఉందా అనేది ఆలోచించాలి అని ముక్తాయించారు. విద్యాధికురాలైన ఆమెకు, సుమారు తొమ్మిదేళ్లపాటు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఆమెకు కోర్టుకు ఉన్న అధికారం ఏమిటో తెలియదా?. గతంలో ముఖ్యమంత్రి హోదాలో నేదురుమల్లి జనార్దనరెడ్డి పన్నెండు వైద్య కాలేజీలను మంజూరు చేశారు. అందులో అక్రమాలు జరిగాయని కొందరు కేసు వేశారు. ఆ క్రమంలో ఆయనపై సుప్రీంకోర్టు కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను తొలగించాలని నేదురుమల్లి కోర్టును కోరినా అందుకు అంగీకరించలేదు.చంద్రబాబుతో నిజానికి గతంలో దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి అంత సత్సంబంధాలు ఏవీ లేదు. 2014లో కూడా టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉంది. అప్పట్లో ఒంగోలు లేదా మరో సేఫ్ సీటును ఆమె ఆశించారు. కాని కుట్రపూరితంగా ఆమె గెలవలేని రాజంపేట లోక్ సభ స్థానాన్ని చంద్రబాబు, వెంకయ్యనాయుడులు కలిసి కేటాయించారని అనేవారు. తన భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి, ఆ తర్వాత ఎగవేయడంతో సహా పలుమార్లు చంద్రబాబు తీవ్రంగా అవమానించారనే బాధ పురందేశ్వరికి ఉండేది. ఒక కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు రాగానే ఆమె వేదికపైనుంచి దిగి వెళ్లిపోయారు. పలు చేదు అనుభవాలు ఉన్నప్పటికీ ఎక్కడ రాజీ కుదిరిందో కాని ఆమె పూర్తిగా మద్దతురాలైపోయారు.తన చెల్లి కళ్లల్లో ఆనందం చూడడానికి గాను పురందేశ్వరి తన పరపతిని తగ్గించుకున్నట్లయిందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన న్యాయ వ్యవస్థ నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నారో అందరికి తెలుసు. కొందరు న్యాయమూర్తులు తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసేవారు. ఒక జడ్జి అయితే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నంతగా తనకు సంబంధం లేని అంశాలపై కామెంట్లు చేశారు. అయినా అప్పట్లో పురందేశ్వరికి కోర్టులు అలా మాట్లాడవచ్చా అన్న సందేహం రాలేదు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు ఈమె కూడా ఆనందం చెందారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే మొత్తం మాట మార్చేశారు. నాలుక మడతేశారు. తను ఎందుకు దీక్ష చేసింది తొలుత చెప్పినదానికి, ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చినదానికి సంబంధం లేదు. ఆపసోపాలు పడుతూ పవన్ కళ్యాణ్ కాలినడకను తిరుమల వెళ్లినా, చంద్రబాబు పాపంలో ఆయనకు కూడా వాటా ఉండక తప్పదని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దేవుడిని రాజకీయాలకు వాడి చేయరాని తప్పు చేశాడు.. సిద్ధాంతం, నీతి లేని అవకాశవాది పవన్
-
లడ్డూ పిటిషన్లపై సుప్రీం విచారణ.. మరికాసేపట్లో కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మరికాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తు కొనసాగడమా? లేదంటే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం నిర్ణయం వెల్లడించనుంది. గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూ ప్రసాదంపై ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేయడం కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. అలాగే.. భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దని గట్టిగానే మందలించింది. అదే టైంలో స్వతంత్ర దర్యాప్తు అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం కోరింది సుప్రీంకోర్టు. ఆయన అభిప్రాయం మేరకు కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. ‘‘రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి. జూలైలో రిపోర్టు వస్తే.. సెప్టెంబర్లో మీడియాకు ఎందుకు చెప్పారు?. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి. కోట్లాదిమంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. తిరస్కరించిన నెయ్యి లడ్డూ తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా?. కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా?. సిట్ వేసిన తర్వాత మళ్లీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారు’’ అంటూ గత విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.కాగా, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.ఇదీ చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టుఅలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్ధిస్తూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలకు చెందిన సంపత్, శ్రీధర్, సురేష్ చవంకే వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలపై జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం (సెప్టెంబర్ 30) మధ్యాహ్నం విచారణ జరిపింది.పిటిషనర్ సుబ్రమణియన్ స్వామి తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్రావు, సంపత్, శ్రీధర్ తరఫున రాఘవ్ అవస్తీ, సురేష్ చవంకే తరఫున సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు ఇరుపక్షాల వాదనలు సాగగా.. వాటిని కోర్టు రికార్డు చేసింది. -
చంద్రబాబు వ్యాఖ్యలపై నేడు సుప్రీం కోర్టులో విచారణ..
-
పవన్ నవ్వుల పాలు!
సాక్షి ఇంటర్నెట్ డెస్క్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సెప్టెంబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. లడ్డూలో ఉపయోగించిన నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని చెబుతూ.. ‘కొవ్వు’ కామెంట్లు చేశారాయన. దానికి కొనసాగింపుగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత టీటీడీ బోర్డు చైర్మన్లతోపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పనిలో పనిగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు.ఏపీలో లడ్డూ రాజకీయంపై హైడ్రామా కొనసాగుతున్న తరుణంలోనే.. సుప్రీం కోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై స్వతంత్ర దరాప్తు జరిపించాలని కోరారు పిటిషనర్లు. వీటన్నింటిని కామన్గా విచారణకు స్వీకరించింది ద్విసభ్య ధర్మాసనం. తొలిరోజు విచారణలో చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: దేవుడికే ఆగ్రహం తెప్పించిన ప్రభుత్వమిది! తిరుపతి లడ్డూ ప్రచారంలో తొలుత జాతీయ మీడియా ఛానెల్స్ సైతం చంద్రబాబు వ్యాఖ్యలనే ప్రముఖంగా ప్రస్తావించాయి. ఆనక.. ఆ వ్యాఖ్యలను నిపుణులతో విశ్లేషించి.. బాబు రాజకీయాల్ని గ్రహించి.. దిద్దుబాటు కథనాలు ఇచ్చాయి. మరోవైపు ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య లడ్డూ వ్యవహారంపై తన బ్రష్కు పని చెప్పారు. తొలి నుంచి జరుగుతున్న పరిణామాలను.. చంద్రబాబు, పవన్లకు ఎదురవుతున్న అనుభవాలను ఆయన తన కార్టూన్లలో భలేగా చూపించారు. అందులో కొన్నింటిని ఫస్ట్పోస్ట్ పబ్లిష్ చేయగా.. మరికొన్నింటిని ఆయన ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేశారు. మొత్తంగా.. ఈ లడ్డూ రాజకీయంలో చంద్రబాబు తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుంటే, నవ్వులపాలైంది పవనే అనే కామెంట్ ఎక్కడ చూసినా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Satish Acharya (@cartoonistsatish) View this post on Instagram A post shared by Satish Acharya (@cartoonistsatish) Images Courtesy: Satish Acharya -
నిబంధనలు తుంగలో తొక్కి తిరుమలలో పవన్!
సాక్షి, తిరుమల: టీటీడీ నిబంధనలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తుంగలో తొక్కేశారు. తన ఇద్దరి కుమార్తెలతో పవన్ మహాద్వారా ప్రవేశం చేశారు. భార్యకు మాత్రమే మహా ద్వార ప్రవేశం ఉంటుంది. అయితే, పిల్లలకు వర్తించదని టీటీడీ అంటోంది. నిబంధనలకు విరుద్దంగా పవన్ కల్యాణ్ క్యారివాన్ తిరుమలలో చక్కర్లు కొట్టింది. తిరుమలలో నిషేధంలో ఉన్న వాహనాలను టీటీడీ అధికారులు అనుమతించారు.మరోవైపు, డిప్యూటీ సీఎం పర్యటనలో టీటీడీ అధికారులు, భద్రతా అధికారులు పవన్ ఆశీస్సుల కోసం అత్యుత్సాహం ప్రదర్శించారు. దాదాపు గంటపాటు క్యూలైన్ నిలిపివేశారు. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ దర్శనం కారణంగా భక్తులకు మరింత ఆలస్యం అవుతుంది. గతంలో అనేక మంది డిప్యూటీ సీఎంలు స్వామివారి దర్శనానికి వచ్చిన ఎన్నడూ ఇంత రాజమర్యాదలు చెయ్యలేదు...కానీ డిప్యూటీ సీఎం హాదాలో తిరుమలకు వచ్చిన పవన్కు సీఎం స్థాయిలో ప్రోటోకాల్ కల్పించడం సర్వత్ర విమర్శలు తావిస్తోంది. మరో పక్క స్వామివారిని దర్శించుకున్న భక్తులు, తిరువీధుల్లో ప్రదక్షణలు చేసే భక్తలను భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. తిరువీధుల్లో ఉన్న గ్యాలరీలు తాళాలు వేసి భక్తులను అనుమతించలేదు.. దాదాపు గంటన్నర పాటు ఆలయం వద్ద భక్తులకు రాకపొకలు నిలిపేశారు. దీంతో భక్తులు గెట్లు ఎక్కి దుకారు.. గతంలో ఎన్నడు లేని విధంగా తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రసన్న చేసుకోవడానికి అధికారులు దాసోహం అయ్యారు. -
‘బావ కళ్లలో ఆనందం కోసం కాదు’..పురందేశ్వరిపై ఆర్కే రోజా ఫైర్
సాక్షి,అమరావతి : ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి రోజా ఫైరయ్యారు. బావ కళ్లల్లో ఆనందం చూడడం కంటే.. భక్తుల కళ్లల్లో ఆనందం చూడాలని సెటైర్లు వేశారు. సీఎం చంద్రబాబు ఏదైనా మాట్లాడొచ్చని అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. రోడ్లమీద మాట్లాడే బాబు,లోకేష్, పవన్ సుప్రీం కోర్టులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వ తరుపు లాయర్ ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పలేదని రోజా ప్రశ్నించారు. తిరుపతి లడ్డూపై ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడిన మీరు అత్యున్నత న్యాయం స్థానం అడిగిన ప్రశ్నలు బదులు ఇవ్వచ్చు కదా? అని రోజా అన్నారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై పురందేశ్వరి ఏమన్నారంటే?తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబును తూర్పారబట్టింది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనడానికి మీ దగ్గర ఆధారాలున్నాయా? అని ప్రశ్నిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, సుప్రీం కోర్టు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు. ‘‘సీఎం(చంద్రబాబును ఉద్దేశిస్తూ)రాజ్యంగం పరంగా రాష్ట్రాదినేత. సమీక్షలు చేసి సీఎం కామెంట్స్ చేస్తారు. అంతేకానీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉందా అనేది అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి అని పురందేశ్వరి అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా అమలవుతున్నాయా? లేదా? అని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కోర్టులకు ఉందంటూ’’ పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నమిలిన సిదార్థ్ లూథ్రాగత సోమవారం (సెప్టెంబర్ 30న)సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ వివాదంపై విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది.‘నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా? ఉంటే చూపించండి.ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు? సెకండ్ ఒపీనియన్ ఎందుకు వెళ్లలేదు.కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా..?లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదు? కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు?’’అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ధర్మాసనం వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఏపీ ప్రభుత్వం తరుపు న్యాయవాది సిదార్థ్ లూథ్రా నీళ్లు నమిలారు. గురువారం (అక్టోబర్ 3న) తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. -
చంద్రబాబు ఏదైనా అనొచ్చంట.. పురందేశ్వరికి విజయసాయి కౌంటర్
సాక్షి,అమరావతి : మీ వైఖరి కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే ఎక్కువ అన్నట్లుగా ఉందంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వెఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు రాజకీయాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, లడ్డూ అంశంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యల్ని తప్పుబట్టిన పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపై అయినా మాట్లాడుతారు. లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు. చంద్రబాబు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ధర్మాసనం కామెంట్స్ చేయడం సరికాదు’ అంటూ పురందేశ్వరి వ్యాఖ్యానించారు.ఆ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘‘పురందేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు ఈ విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డు ప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం, కోర్ట్ ధిక్కారం ఆమెపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి...పురందేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చేశారు. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏదైనా అనొచ్చంట. ఏమమ్మా! మరి న్యాయవ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థే కదా! తమరికి తెలియదా? అంత చిన్న విషయానికే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా అని చిరాకు పడిపోయారు పురంధేశ్వరి.ఆమెది బావా’తీతమైన ఆవేదన అనుకోవాలి మరి! కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే గొప్పవాడు అన్నట్లుంది ఈమె వైఖరి. ఈ వందేళ్లలో తిరుమల ఆలయానికి నారా, నందమూరి చేసిన డ్యామేజి మరి ఎవరూ చేయలేదు. ఇంకెన్ని ఘోరాలు చూడాలో గోవిందా...గోవిందా. చంద్రబాబు హిందువుల మనోభావాలను లడ్డుప్రసాదాల విషయంలో దెబ్బయటమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు’ అంటూ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 1) పురంధేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ, కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డుప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం, కోర్ట్ ధిక్కారం. ఆమెపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి. 2)… pic.twitter.com/ZWBfEhRFtW— Vijayasai Reddy V (@VSReddy_MP) October 2, 2024 -
తిరుమల: సొమ్మసిల్లిన పవన్.. పాదయాత్ర రసాభాస
సాక్షి, తిరుపతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల పాదయాత్ర రసాభాసగా సాగింది. నిన్న(మంగళవారం) తిరుపతి అలిపిరి మెట్లమార్గం నుంచి 4.45 నిముషాలకు ప్రారంభించిన పాదయాత్ర దాదాపు 5 గంటలపాటు నడిచి తిరుమలకు చేరుకున్నారు. రాత్రి 9.20 నిముషాలకు తిరుమలకు చేరుకున్నారు. నడకదారిలో పాదయాత్ర ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఆదిలోనే నిరసించిపోయారు. అలసిపోయి నడవడానికి ఇబ్బందులు పడ్డారు. దారిపొడవున కూర్చుంటూ వచ్చారు. నడవలేక అష్టకష్టాలు పడ్డారు.. ఎలాగోలా నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు.పవన్ కల్యాణ్ పాదయాత్ర సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులను మధ్యలోనే అపేసారు.. డిప్యూటీ సీఎం వద్ద మార్కులు కొట్టేయడానికి టీటీడీ అధికారులు, పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మెట్లమార్గం పొడవున రోప్ వేసి తిరుమలకు వచ్చే భక్తులను చుక్కలు చూపించారు. గోవింద నామస్మరణలతో మార్మోగాల్సిన తిరుమల గిరులు వ్యక్తిగత నినాదాలతో తిరుమల పవిత్రతను మంటగలిపారు. ఇదంతా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందే నినాదాలు చేస్తున్నా ఆపకుండా వేడుక చూశారు.. సనాతన ధర్మం అంటూ నినదిస్తున్న పవన్కి తిరుమల పవిత్రతను కాపాడాలని తెలియదా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు పోలీసులు మరో అడుగు ముందుకేసి మోకాళ్ళ మెట్లు వద్ద వాహనాలను ఆపివేశారు. దాదాపు గంటన్నర పాటు వాహనాలు నిలిపోవడంతో తిరుమల జీఎన్సీ వరకు వాహనాలు నిలిపోయింది. దీంతో స్వామివారిని దర్శించుకోని తిరుగు ప్రయాణం అవుతున్న భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు.ఇదీ చదవండి: కింకర్తవ్యం!? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబు అంతర్మథనంగంటపాటు ఆలస్యం కావడంతో రిజర్వేషన్ చేసుకున్న భక్తులు సకాలంలో చేరుకోలేక నానా కష్టాలు పడ్డారు. తిరుమలకు చేరుకున్న పవన్ కల్యాణ్ బస్టాండ్ వరకు నడిచి అక్కడి నుంచి వాహనంలో పద్మావతి ప్రాంతంలో ఉన్న గాయత్రి నిలయం చేరుకున్నారు. -
ప్రాయశ్చిత్త పాపం!
-
Laddu Row: సిట్ బ్రేకులపై డీజీపీ రియాక్షన్
తిరుపతి, సాక్షి: తిరుమల లడ్డూ అంశంపై సిట్ దర్యాప్తు నిలిపివేతపై డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. దర్యాప్తును తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారాయన.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఆయన.. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల లడ్డూ అంశంపై.. కేసు తీవ్రత వల్లే సిట్ వేయాల్సి వచ్చింది. అయితే సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. అందుకే దర్యాప్తును ఆపుతున్నాం. తదుపరి సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు విచారణ వుంటుంది’’ అని తెలిపారాయన.తిరుమల లడ్డూ అంశంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై నిన్న విచారణ జరిగింది. ఆ టైంలో.. సిట్ లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయించే అంశంపై అభిప్రాయం తెలియజేయాలని సోలిసిటర్ జనరల్ను ద్విసభ్య ధర్మాసనం కోరింది. అక్టోబర్ 3వ తేదీన తదుపరి విచారణ టైంలో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే ఐదోవ రోజు గరుడ వాహన సేవ రోజున అదనంగా భద్రతా ఏర్పాట్లు చేస్తాం. బ్రహోత్సవాల కోసం నాలుగు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తున్నాం. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం... మొబైల్ డివైజ్ ఫింగర్ ప్రింట్ ఏర్పాట్లతో అనుమానితుల్ని గుర్తిస్తాం. 2,700 సీసీ కెమరాలతో పాటు అదనంగా బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాలో తప్పులు వార్తలు ప్రచారం కాకుండా నిఘా ఉంచుతాం. గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు వీక్షించే అవకాశం వుండగా.. అదనంగా 80 వేల మంది భక్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైనులు ద్వారా అనుమతిస్తాం.మొత్తం.. 2.5 లక్షల మంది ప్రయాణించేలా గరుడ సేవ రోజున ఆర్టిసి బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తేనే సౌకర్యవంతంగా వుంటుంది అని అన్నారాయన. అలాగే.. దసరా సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండబోవనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
#TirupatiLaddu : బాబు లడ్డు కహానీ! (ఫొటోలు)
-
రాజకీయాలకు దేవుడ్ని, మతాన్ని వాడుకుంటావా బాబు: విజయసాయి రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి వెన్నుపోటుదాడులు రాజకీయ లబ్ధి కోసం దేవుడిని, మతాన్ని వాడుకుంటారన్ని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఇదే సమయంలో చంద్రబాబు రాజకీయ అజ్ఞాని అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘హిందూ మతాన్ని నమ్మడం, వాడుకోవడం.. ఈ రెండు వేరు వేరు. నిజమైన హిందువు.. దేవుని, హిందూ మతాన్ని నమ్ముకుంటాడు. రాజకీయ అజ్ఞాని, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు, దేవుడినీ, మతాన్ని వాడుకుంటారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. హిందూ మతాన్ని నమ్మడం ,,, వాడుకోవడం ... ఈ రెండు వేరు వేరు.......నిజమైన హిందువు దేవుని, హిందూ మతాన్ని నమ్ముకుంటాడు ,,, రాజకీయ అజ్ఞాని ,,, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు ,,, దేవుడినీ ,,, మతాన్ని వాడుకుంటారు… @ncbn— Vijayasai Reddy V (@VSReddy_MP) October 1, 2024ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు -
పవన్.. మీకిది తగునా?: తిరుపతి ఎంపీ గురుమూర్తి
సాక్షి,తిరుపతి : ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నల వర్షం కురిపించారు. సర్వశక్తిమంతుడిని రాజకీయాల్లోకి లాగినందుకు .. సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబును తప్పుబట్టింది. సున్నితమైన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు.. బహిరంగ సభ నిర్వహించడం న్యాయమని మీరు అనుకుంటున్నారా?భక్తులను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా?’అని గురు మూర్తి ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. -
సుప్రీం అక్షింతలు.. దర్యాప్తు నిలిపివేసిన సిట్
సాక్షి,తిరుపతి: టీటీడీ నెయ్యికల్తీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు నిలిపివేసింది. లడ్డూ వివాదంపై సోమవారం(సెప్టెంబర్30) సుప్రీంకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో సిట్ దర్యాప్తు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నెయ్యి కల్తీపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కొనసాగించాలా లేక వేరే సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్న విషయంలో సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. దీంతో లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే దాకా సిట్ తన దర్యాప్తును నిలిపివేసింది. తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యికల్తీ అయిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డితో పాటు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: సుప్రీం వ్యాఖ్యలు బాబుకు చెంపపెట్టుకాగా, నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ మూడు రోజులపాటు దర్యాప్తు చేసింది. కల్తీపై ఫిర్యాదులో జాప్యం ఎందుకు జరిగింది అనే అంశంతో పాటు పలు కీలక విషయాలపై టీటీడీ అధికారుల నుంచి సిట్ సమాచారం రాబట్టింది. టీటీడీ మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్ జీఎం కార్యాలయంలోనూ తనిఖీలు చేసింది. -
శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ ఆరోపణల విషయంలో వాస్తవాలు నిర్ధారణ కాక ముందే కల్తీ జరిగినట్లు సీఎం చంద్రబాబు రాజకీయ ప్రకటనలు చేయడాన్ని తప్పుబట్టిన సుప్రీం కోర్టు
-
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
సాక్షి, అమరావతి: తిరుమల ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వేంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పిన రోజు నుంచి కోట్లాది భక్తులు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ఆయన సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పట్టిందన్నారు.సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కూడా కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని వాడలేదని చెప్పారన్నారు. కల్తీ అయిందని చెబుతున్న నెయ్యి వాడలేదు కదా అని సుప్రీం కోర్టు ప్రశ్నించడంతో పాటు, దానిపై సెకెండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా నిలదీసిందని చెప్పారు. జూలై 23 నుంచి సెప్టెంబరు 18 వరకు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని కూడా సర్వోన్నత న్యాయస్ధానం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిందని తెలిపారు. సిట్ నియామకాన్ని కూడా ప్రశ్నించిందన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దని వెల్లంపల్లి మరోసారి చంద్రబాబుకి సూచించారు. -
కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
తిరుమల: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబే వేసిన సిట్ సోమవారం కూడా విచారణ కొనసాగించింది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ నేతృత్వంలోని బృందం తిరుమలలో ల్యాబ్ను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను ఎలా గుర్తిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకుంది. అనంతరం నెయ్యిని నిల్వ చేసే గోదాముకు చేరుకుని ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతారు, నాణ్యతా పరీక్షల నిమిత్తం ఎప్పుడు శాంపిళ్లు తీసుకుంటారు, శాంపిల్ తీసుకున్న అనంతరం ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు, టెండర్దారుడు ప్రమాణాల మేరకు సరఫరా చేశారా లేదా అనేది ఎలా నిర్ధారిస్తారు, ఒకవేళ కల్తీ జరిగితే.. ఆ విషయాన్ని పసిగట్టే పరికరాలు ల్యాబ్లో ఉన్నాయా వంటి వివరాలను అధికారులు, సిబ్బంది నుంచి సేకరించారు.ల్యాబ్లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అప్పటికే ల్యాబ్కు చేరుకున్న ట్యాంకర్లలోని నెయ్యిని పరిశీలించిన అధికారులు, ల్యాబ్ సిబ్బంది నెయ్యి నాణ్యతా పరీక్షలు ఎలా జరుపుతారో ప్రత్యక్షంగా పరిశీలించారు. గతంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన టెండర్దారుల వివరాలను, నాణ్యతా పరీక్షల నివేదికలను అధికారులు సేకరించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఎప్పటి నుంచి నెయ్యి సరఫరా చేసింది, ఆ నెయ్యిలో నాణ్యత లేదని ఎప్పుడు గుర్తించారు, నెయ్యిని పరీక్షల కోసం పంపించాలని ఎవరు ఆదేశించారన్న సమాచారాన్ని కూడా అధికారులు సేకరించారు. అనంతరం త్రిపాఠీ నేతృత్వంలోని అధికారుల బృందం పోలీస్ గెస్ట్హౌస్కు చేరుకుని గత మూడు రోజులుగా లభ్యమైన ఆధారాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తరువాత సిట్ చీఫ్ నేతృత్వంలోని బృందం తిరుపతి బయలుదేరి వెళ్లిపోగా.. డీఎస్పీ స్థాయి నేతృత్వంలోని అధికార బృందం మాత్రం ఇంకా ల్యాబ్లో తనిఖీలు నిర్వహిస్తూ.. పాత రికార్డులను పరిశీలించింది.నేడు లడ్డూ పోటు, విక్రయ కేంద్రాల్లో విచారణ మంగళవారం లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించి.. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను విచారించనున్నట్టు సమాచారం. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డెయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది. టెండర్ల నిబంధనల్లో మార్పులు చేయడానికి దారి తీసిన పరిస్ధితులపై కూడా సిట్ బృందం దర్యాప్తు చేయనుంది. సిట్ బృందం మరో రెండు రోజుల పాటు తిరుమల, తిరుపతిలో ఉండి విచారణ నిర్వహించనుంది. సిట్ కార్యకలాపాల కోసం టీటీడీ శ్వేత భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. -
సుప్రీం వ్యాఖ్యలు బాబుకు చెంపపెట్టు
తిరుపతి మంగళం: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచ రాజకీయాలు చేసిన సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి పదవి ఉందని పెదవి జారి అబద్ధాలను నిజం చేయాలని చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చంద్రబాబూ అని హెచ్చరించారు. భూమన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. చంద్రబాబు స్వార్థ, కుటిల, కుతంత్ర రాజకీయాలతో మహా ప్రసాదానికి మలినం అంటించాలని చూస్తే దేవదేవుడు చూస్తూ ఊరుకోరని చెప్పారు. సాక్షాత్తు శ్రీవారే సుప్రీం కోర్టు ధర్మాసనంతో చంద్రబాబుకు చెంప పెట్టులాంటి మాటలు పలికించారని అన్నారు.టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పిన మాటలకు భిన్నంగా చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. సత్యాన్ని అసత్యంగా మార్చాలన్నదే చంద్రబాబు దురాలోచన అని మండిపడ్డారు. చంద్రబాబు సిట్ అంటే కూర్చునే అధికారులను సిట్లో నియమించి విచారణ జరిపిస్తే ఆ రిపోర్ట్ ఎలా ఉంటుందో అందరికి తెలుసునన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలపలేదు కాబట్టే తాము సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. ప్రసాదంలో కల్తీ చేసి ఉంటే తాము సర్వనాశనం అయిపోవాలని, రక్తం కక్కుకుని చనిపోవాలని శ్రీవారి సన్నిధిలోని కోనేటిలో స్నానమాచరించి, అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి వేడుకొన్నామన్నారు.తప్పు చేసి ఉంటే నిజంగా ఆ దేవదేవుడు తమకు శిక్ష విధించేవారని అన్నారు. నిజంగా తాము తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయిశ్చిత్త దీక్షలు చేపట్టి దుర్గమ్మ ఆలయాన్ని శుద్ధి చేశారని, పాపాలు చేసిన వారే ప్రాయిశ్చిత్తం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచ రాజకీయాలు చేసిన చంద్రబాబు, పవన్ను, వారికి వంతపాడుతున్న ఎల్లో మీడియాను ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా ఛీకొడుతున్నారని చెప్పారు. -
‘రాజకీయ కారణాలతోనే ఏఆర్ డెయిరీపై కేసు’
అమరావతి, సాక్షి: తిరుపతి లడ్డూ వ్యవహారంలో.. ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ (Rajasekaran) ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సోమవారం ఆయన ఓ పిటిషన్ వేశారు.తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) ఫిర్యాదుతో తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో.. తనపై అరెస్టు సహా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తన పిటిషన్లో ఆయన కోరారు.నెయ్యి శాంపిల్స్ సేకరణ జరిపి.. దాన్ని విశ్లేషించడంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండెడ్స్ అథారిటీ నిబంధనలేమీ అనుసరించలేదని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించారు. అలాగే తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండానే కేసు పెట్టడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.తనపై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని, రాజకీయ కారణాలతో కేసు పెట్టారని ఆరోపిస్తున్నారాయాన. ఈ క్రమంలో తన ముందస్తు బెయిల్ మంజూరుకు ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానని ఆయన అభ్యర్థిస్తున్నారు. ఈ పిటిషన్ రేపు(మంగళవారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: లడ్డూ వివాదం.. జగన్ చెప్పిందే కోర్టూ చెప్పింది! -
‘‘చంద్రబాబూ.. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పు’’
తాడేపల్లి, సాక్షి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ప్రచారంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూ కల్తీ జరిగిందన్న ఆధారాల్లేకుండా.. పైగా దర్యాప్తు ఇంకా మొదలుకాకముందే మీడియా ముందుకు వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని? నిలదీసింది. దేవుడ్ని రాజకీయంలోకి లాగొద్దంటూ చురకలంటించింది. ఈ తాజా పరిణామాలపై వైఎస్సార్సీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.. పదవీ ఉందని పెదవి జారితే..అబద్ధాని నిజం చేయాలని చూస్తే.. భక్త ద్రోహం చేయాలని చూస్తే ఇలానే ఉంటుందిమహాప్రసాదం కు మలినం అంటగట్టాలని చూస్తే సుప్రీం కోర్టు స్పందించిన తీరు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారుమొత్తం ప్రపంచ వ్యాప్తంగా హిందుత్వ సంఘాలు ఆందోళనకు గురయ్యాయి.సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు శ్రీవారి ప్రసాదం పై బాధించిందిఈవో చెప్పిన మాటలకు భిన్నంగా మాట్లాడుతూ.. జంతువులు కొవ్వు వాడారు అని ఎలా చెబుతారుతప్పు జరిగింది అంటూ ఎల్లో మీడియా విష ప్రచారం చేశారుమహా ప్రసాదం.. మహా మాలిన్యం అయింది అంటూ ప్రచారం చేశారుస్వామి ప్రతిష్ఠ కు భంగం వాటిల్లే విధంగా లడ్డు ప్రసాదం విషయంలో అసత్యాలు ప్రచారం చేశారుదేవుడ్ని వివాదాల్లో తీసుకుని రాకండని ఎంత చెప్పినా వినలేదుకేసు పెట్టకుండా,విచారణ జరపకుండా చంద్రబాబు మాట్లాడాడు.సీఎం హోదాలో ఉంటూ అసత్య లు మాట్లారు..సుప్రీంకోర్టు సరైనా విధంగా ప్రశ్నించింది... దేవుడే సుప్రీంకోర్టుతో మాటలు పలికించారు..నిజం ఎప్పటికి గెలుస్తుంది.. తప్ప చేయాలేదు కాబట్టే దైర్యం మేము విచారణ కోరాంస్వామీవారి వైభవాన్ని తగ్గించే విధంగా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారుబాబు, పవన్ లను హిందువులందరూ ఛీ కోడుతున్నారు:::భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ చంద్రబాబు ఇప్పటికైనా శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలికోట్లాది మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారుసుప్రీంకోర్టు కూడా చంద్రబాబు మాటలను తప్పుపట్టిందిచంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్తో విచారణ చేస్తే వాస్తవాలు వెల్లడి కావుస్వతంత్ర సంస్థతో విచారణ జరపాలిచంద్రబాబును కూడా ఆ విచారణ సంస్థ ప్రశ్నించాలిసుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనేది మా డిమాండ్తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభవాలతో ఆడుకోవద్దని చంద్రబాబు, పవన్ ను కోరుతున్నానుNDDB రిపోర్ట్ టీడీపీ కార్యాలయంలో విడుదల చేయటంపై విచారణ జరగాలిసుప్రీం కోర్టు విచారణలో వాస్తవాలు బయటకు వస్తున్నాయిరాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదుచంద్రబాబు తరఫు న్యాయవాదులు కూడా కల్తీ జరిగిందనే ఆరోపణలు ఉన్న నెయ్యిని వాడలేదని కోర్టులో చెప్పారుసీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారుసిట్ వేయాల్సిన అవసరం ఏంటి, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించిందిమూడో తారీఖున జరిగే విచారణలో నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నానుతిరుమల శ్రీవారితో రాజకీయాలు చేయవద్దని చంద్రబాబును కోరుతున్నానుసుప్రీంకోర్టు విచారణ ద్వారా అనేక అనుమానాలు తొలిగాయి::: వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి తిరుమల లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని స్వాగతిస్తున్నా. చంద్రబాబు కనుసైగల్లో సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అంటూ వ్యవహరించే టీమ్ పై తమని ఏమాత్రం నమ్మకం లేదు. ఈ కేసులో సుప్రీం కోర్టు కలగజేసుకోవాలి ..::: ఆర్కే రోజా, మాజీ మంత్రి -
జగన్ చెప్పిందే కరెక్ట్! సుప్రీం కూడా ఇవాళ అదే..
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఆధారాల్లేకుండా.. దర్యాప్తు అడుగు పడకుండానే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు నుంచి చెబుతున్న విషయాల్నే.. ఇవాళ సుప్రీం కోర్టు ప్రముఖంగా ప్రస్తావించించడం గమనార్హం.తిరుమల లడ్డూ వివాదంపై జగన్ మొదటి నుంచి ఏం చెబుతూ వస్తున్నారో.. దాదాపు అలాంటి వ్యాఖ్యలే ఇవాళ సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం చేసింది. వాటి మధ్య ఉన్న సారూప్యతలను పరిశీలిస్తే.. అంతా బాబు హయాంలోనే..‘జులై 12న నమూనాలు తీసుకున్నారు. వాటిని పరీక్షిస్తే సరిగా తేలలేదని, జులై 17న ఎన్డీడీబీకి వాటిని పంపారు. వాటిపై ఆ సంస్థ జులై 23న నివేదిక ఇచ్చింది. కానీ 2 నెలల తర్వాత.. ఇప్పుడు బయటకు తీసి టీడీపీ కార్యాలయంలో విడుదల చేశారు’సుప్రీం కోర్టు ఇవాళ.. ఎన్డీడీబీ నివేదికను సీఎం నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన సమయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. జులైలో రిపోర్ట్ వచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో చేపనూనె, జంతువుల కొవ్వు, పందికొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ రిపోర్టు పేర్కొంది. జులైలో నివేదిక వస్తే.. దానిని సెప్టెంబర్లో చెప్పారు.. ఎందుకు?. ఈ నివేదికపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చింది?.స్వార్థ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తావా? పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదు. పచ్చి అబద్ధాలు వల్లె వేసి తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రతిష్టను సీఎం చంద్రబాబు అబాసుపాలు చేశారు. పరమ పవిత్రమైన లడ్డూ విశిష్టతకు దెబ్బతీశారు. శ్రీవారి ప్రసాదం బాగాలేదని, తింటే మంచిది కాదని భక్తుల్లో అనుమానపు బీజాలు నాటారు. తాను చెబుతున్నది పచ్చి అబద్ధమని తెలిసి కూడా చంద్రబాబు పదే పదే అవాస్తవాలు చెబుతున్నారు.సుప్రీం కోర్టులో ఇవాళఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రపంచంలోని భక్తులందరి మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యాఖ్యలతో వాళ్ల మనోభావాలు దెబ్బతీశారు. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి. భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దు. ఈ అంశంపై నేరుగా మీరు మీడియాకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా.సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి. సీఎం వ్యాఖ్యలతో కోట్లాదిమంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడ్డాయి.వాడని నెయ్యి.. తయారుకాని లడ్డూటీటీడీ ట్రస్ట్ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్ 12 నుంచి సరఫరా మొదలుపెట్టారు. అంటే అప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాతే నెయ్యి సరఫరా మొదలైంది. జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టుల్లో పాస్ అయి ముందుకు కదిలాయి. వాటిని లడ్డూల తయారీలో వాడారు. ఆ తర్వాత జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 12న మరో రెండు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి టీటీడీ టెస్టుల్లో ఫెయిల్ కావడంతో వెనక్కు పంపడానికి సిద్ధం చేశారు. సాధారణంగా మరోసారి ఆ శాంపిళ్లను పరీక్షించేందుకు మైసూర్లోని సీఎఫ్టీఆర్ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)కు పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్లోని ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్)కి పంపారు. ఇది టీటీడీ చరిత్రలో తొలిసారి. టీటీడీ పంపించిన శాంపిల్స్పై ఎన్డీడీబీ జూలై 23న రిపోర్ట్ పంపింది. .. నెయ్యిలో కల్తీ ఉందన్న విషయం చెప్పారు. దాంతో ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అలా 4 ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు ఆ కంపెనీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. మరి ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా.. ఆ నెయ్యిని వాడారని రెండు నెలల తర్వాత సెప్టెంబరు 18న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఎందుకు అన్నారు?. ఆ నాలుగు ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం. షోకాజ్ నోటీస్ ఇచ్చామని, వాటిలో వనస్పతి ఆయిల్ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్ క్లియర్గా ఈవో చెప్పినా... రెండు నెలల తర్వాత చంద్రబాబు సెప్టెంబరు 18న ఏ రకంగా అబద్ధాలు మాట్లాడారు. అన్నీ తెలిసినా.. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని.. లడ్డూలు తయారు చేశారని.. వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు.సుప్రీం కోర్టులో ఇవాళ.. లడ్డూ కల్తీ అయ్యిందని చెప్పడానికి మీ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా? తిరస్కరించిన నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా ? అసలు కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా ?. నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా?. ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా?. పరీక్షలకు ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు?. ఇంకా ఎన్నో ల్యాబ్ సంస్థలు ఉన్నాయి కదా!. మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు?. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్ను ల్యాబ్కు ఏమైనా పంపించారా?. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడిట్లు ప్రాథమికంగా ఆధారాల్లేవ్. అసలు దర్యాప్తునకు వెళ్లకుండానే లడ్డూ కల్తీ అయ్యిందని సీఎం స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు?’’ అని టీటీడీ లాయర్ సిదార్థ్ లూథ్రాను ప్రశ్నించింది. జగన్ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు అండ్ కోకు ఎలాగైతే నోళ్లు మూతలు పడ్డాయో.. ఇవాళ సుప్రీం ధర్మాసనం సంధించిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వలేక సీనియర్ లాయర్ లూథ్రా తడబడ్డారు.ఇదీ చదవండి: దీని అర్థం ఏంటి బాబూ?: వైఎస్ జగన్ -
లడ్డూ వివాదంలో చంద్రబాబు తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
-
సుప్రీంకోర్టులో విచారణ.. టెన్షన్ లో చంద్రబాబు
-
కల్తీ నెయ్యి వ్యవహారం పై జోరు పెంచిన సిట్ ..ఏఆర్ ఫుడ్స్ కు నోటీసులు
-
కల్తీ నెయ్యి వ్యవహారం పై జోరు పెంచిన సిట్ ..ఏఆర్ ఫుడ్స్ కు నోటీసులు
-
తిరుమల లడ్డూ ఎపిసోడ్ పై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
-
సీఎం చంద్రబాబుపై సుప్రీం కోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా? అంటూ సూటిగా ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. లడ్డూ శాంపిల్ను ముందుగానే ఎందుకు పరీక్షల కోసం పంపలేదని నిలదీసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం విచారణ జరిపింది. టీటీడీ తరఫు లాయర్పై ప్రశ్నల వర్షంల్యాబ్ మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా?. నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా?. ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా?. జులైలో రిపోర్ట్ వస్తే.. సెప్టెంబర్లో చెప్పారెందుకు?. ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు?. మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు?. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడిట్లు ఆధారాల్లేవ్. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్ను ల్యాబ్కు పంపించారా? అని టీటీడీ లాయర్ సిదార్థ్ లూథ్రాను ప్రశ్నించింది. ‘నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా? ఉంటే చూపించండి.ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు? సెకండ్ ఒపీనియన్ ఎందుకు వెళ్లలేదు.కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా..?లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదు? కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు?’’ లడ్డూ అంశంపై విచారణకు సిట్ వేశారు?. ఇది దర్యాప్తునకు సరిపోతుందా?.. మీ అభిప్రాయం చెప్పండి..’’ అని సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతాను అడిగింది ధర్మాసనం.చంద్రబాబు వైఖరిపై సుప్రీం కోర్టు సీరియస్ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రపంచంలోని భక్తులందరి మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యాఖ్యలతో వాళ్లను గాయపరిచారు అంటూ సీఎం చంద్రబాబు బాబుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై నేరుగా మీరు మీడియాకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దు. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ వ్యాఖ్యానించింది. . ధర్మాసనం ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ప్రభుత్వం తరపు న్యాయవాది సిదార్థ్ లూథ్రా నీళ్లు నమిలారు. ఆ నాలుగు ట్యాంకులు వాడలేదని కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో ఇరువైపులా వాదనలను రికార్డ్ చేసిన అనంతరం.. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి(గురువారం) వాయిదా వేసింది. అంతకు ముందు.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అందుబాటులో లేకపోవడంతో విచారణ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. లడ్డూ అంశంపై ఏపీ సీఎం, టీటీడీ ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని.. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరారు.‘‘లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి పరీక్షకు నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. కల్తీ జరిగిన వంద శాతం నెయ్యి వాడలేదని స్వయంగా ఈవో చెప్పారు. ఇష్టారీతిన మాట్లాడడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దేవాలయ వ్యవహారాలు పూర్తిగా ఈవో, బోర్డునే నిర్వహిస్తారు. ఈవో ను ప్రస్తుత ప్రభుత్వమే నియమించింది’’ సుబ్రహ్మణ్యస్వామి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.కాగా, తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు.ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్స్వామి వాదనలు వినిపించారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించారు. ఇదీ చదవండి: పరిపాలనకు ‘తిరు’క్షవరం -
తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
తిరుమల లడ్డూపై మాట మార్చిన ఈవో, బాబుపై వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం
-
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
లడ్డూ విషయంలో బాబు నీచ రాజకీయాలు
-
నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ వివాదం మీద దాఖలైన పటిషన్లపై సోమవారం సుప్రింకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారించనుంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యరి్థంచారు.ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని పిటిషన్లో విన్నవించారు.నిరాధారమైన తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించారు. ఎస్వోపీ ప్రకారం పరీక్షల్లో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నెయ్యిని మాత్రమే తిరుమల ప్రసాదానికి వినియోగించే విధానం దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఏదో ఒక చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు అభ్యరి్థంచారు. -
తిరుమల లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: తిరుమల శ్రీవారీ లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం (సెప్టెంబర్30) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేయగా.. ఈ రెండు పిటిషన్లను రేపు ఒకేసారి సుప్రీంకోర్టు విచారించనుంది. -
ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది : మల్లాది
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద బురద జల్లాలని చూస్తే.. ఆ బురద మీ మీదే పడుతుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో కూటమి నేతల అరాచకాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం గాలి కొదిలేసింది. రాజకీయ దుర్భుద్ధితో ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది. టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటుంది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రజలను గందరగోళంలోకి నెట్టేసింది. నెయ్యి ట్యాంకర్లు ఎప్పుడొచ్చాయి. ఎప్పుడు తిప్పి పంపించారో డేటాతో సహా చెప్పాం. ఈవో ఒకలా, చంద్రబాబు మరోలా మాట్లాడుతున్నారు.ఏపీలో రౌడీరాజ్యం నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు రౌడీల్లా మారారు. పోలీసులు ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే వారిపైనే కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆ ప్రాంతాన్ని దోచుకుతింటున్నారు. సొంత పార్టీ వాళ్లే టీడీపీ ఆఫీస్కు వెళ్లి కొలికపూడిపై ఫిర్యాదు చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రభుత్వ వైద్యుడిపై దాడి చేసి బూతులు తిట్టారు. డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు..ప్రజలకు సమాధానం ఏం చెబుతారు. ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అంబేద్కర్ బ్యానర్ను చించేసి అవమానించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన దగ్గర ఓ రెడ్ బుక్ ఉందని బెదిరిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలను గెలిపించింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. వరద బాధితులకు సాయం చేయాల్సింది పోయి వారినే బెదిరిస్తున్నారు. వరద బాధితులపై లాఠీఛార్జి చేయడమేంటి. సాయం అడిగినందుకు చెట్టుకు కట్టేసి కొట్టడమేంటి. విజయవాడ మునిగిపోతే నిర్లక్ష్యంగా ఎన్యుమరేషన్ చేశారు. ఎన్యుమరేషన్ సరిగా చేయాలని మేం స్వయంగా కలెక్టర్ను కలిసి కోరాం. కానీ మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు.లడ్డూ వివాదంపై సిట్ వల్ల ఏం ఉపయోగం. సిట్ చంద్రబాబుకు బీ టీమ్ వంటిది. మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలని ప్రయత్నించి...ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలబడింది.రాజకీయాల కోసమే లడ్డూ అంశాన్ని చంద్రబాబు వాడుకున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే లడ్డూ వివాదం పై సీబీఐ విచారణ జరిపించాలి. సుప్రీంకోర్టు పై మాకు అచెంచలమైన విశ్వాసం ఉంది. మా హయాంలో ఏ తప్పూ జరగలేదని..మేం గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నాం. వైఎస్ జగన్ మీద బురద జల్లాలని చూస్తే..ఆ బురద మీపైనే పడింది. వైఎస్ జగన్ జగన్ ఐదేళ్లలో హిందూత్వాన్ని కాపాడారని గుర్తు చేశారు. కూటమి వందరోజుల పాలనలో అరాచకం..రౌడీయిజం.. ఘోరాలకు అడ్డేలేకుండా పోయింది. రౌడీ ఎమ్మెల్యేల అరాచకాలపై చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. 👉 చదవండి : చంద్రబాబు ఓ పొలిటికల్ జాదు -
చంద్రబాబు పొలిటికల్ జాదు : గుడివాడ
సాక్షి,విశాఖపట్నం : సీఎం చంద్రబాబు పొలిటికల్ జాదు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడంలో చంద్రబాబు ఆరితేరారు’అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి ప్రతిష్టను సీఎం చంద్రబాబు దెబ్బ తీశారు. తిరుపతి లడ్డుపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి. రాష్ట్రానికి కుల రాజకీయాన్ని పరిచయం చేసింది చంద్రబాబు. నేడు కొత్తగా మత రాజకీయానికి పునాదులు చేశారు. మతాలు మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు.అధికారంలోకి వచ్చిన తరువాత 35 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నాడు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ద్వసం చేశారు. కలుషిత ఆహారం తిని చిన్న పిల్లలు చనిపోయారు. విజయవాడ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ దిశగా అడుగులు వేస్తుంది. స్టీల్ ప్లాంట్లో 4000 మంది కాంట్రాక్ ఉద్యోగులను తీసేసారు. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతల రాజీనామాలు అవసరం లేదు. ఎన్డీయే ప్రభుత్వం టీడీపీ బలంతోనే నడుస్తుంది.స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అపక పోతే మద్దతు ఉపసంహరిస్తామని చెప్పండి. వీటన్నిటినీ నుంచి ప్రజల దృష్టి మార్చడం కోసం తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు. కల్తీ నెయ్యి వాడ లేదని ఈవో చెప్పారు. జూలై నాలుగో తేదీన వచ్చిన ట్యాంకర్లు వెనక్కి పంపమని ఈవో చెప్పారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే సీబీఐ విచారణ జరిపించ లేదు. చంద్రబాబు సీబీఐ విచారణ జరిపించాలని ప్రధానికి లేఖ రాయాలి. తిరుపతి మీద మీకు అంత భక్తి ఉంటే తిరుపతి జిల్లాకు ఎక్కువ మద్యం షాపులు కేటాయించారు. తిరుపతి పవిత్రత గురించి మాట్లాడే చంద్రబాబు 264 షాపులు కేటాయించారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని టీడీపీ గెజిట్ ఈనాడు పేపర్లో రాశారు. గతంలో జేబు నిండా డబ్బులు పట్టుకెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. నేడు సంచి నిండా డబ్బులు పట్టుకెళ్తె జేబు నిండా కూరగాయలు వస్తున్నాయి.చంద్రబాబు ఒక పొలిటికల్ జాదు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడంలో చంద్రబాబు ఆరితేరాడు. అపవిత్రమైన టీడీపీ ప్రభుత్వం కోసం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు వేసిన సిట్ మీద మాకు నమ్మకం లేదు అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. -
చంద్రబాబు దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా?.. లడ్డూ వివాదంపై వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : సత్యమేవ జయతే అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. లడ్డూ ప్రసాదంపై మాట మార్చిన ఈవో, చంద్రబాబుపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ వీడియోలు పోస్ట్ చేశారు. దీని అర్ధం ఏంటి చంద్రబాబు? దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. దీని అర్థం ఏంటి @ncbn ?దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా?“సత్యమేవ జయతే’’ pic.twitter.com/gQ7R6X6WfE— YS Jagan Mohan Reddy (@ysjagan) September 29, 2024 కాగా, సెప్టెంబర్ 18వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.తిరుమల లడ్డూలో‘యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ కొత్త వివాదానికి తెరలేపారు. ‘‘భక్తులకు పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఉంది, ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రిడియంట్స్ కాకుండా యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు’’అని చంద్రబాబు అసత్యాలు వల్లివేశారు.సెప్టెంబర్ 22వ తేదీన చంద్రబాబు మరోసారి మాట్లాడుతూ.. తిరుమలకు నాలుగు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, దానిని వాడారని చంద్రబాబు మళ్లీ అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేశారు.టీటీడీ ఈవో శ్యామలరావు ఆ ట్యాంకర్లను వాడలేదని , వెనక్కి పంపామని చెబితే, ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు.. ఆ నెయ్యి వాడారంటూ అసత్యపు ప్రచారానికి దిగారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా వీడియోలు పోస్ట్ చేసి చంద్రబాబు అసత్యపు ప్రచారాన్ని మరోసారి ఎండగట్టే యత్నం చేశారు.ఇదీ చదవండి: దొరికిపోయిన చంద్రబాబు.. అబద్ధాలు బట్టబయలు -
మీ దగ్గర ఆధారాలుంటే.. సిట్ ఎందుకు?: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: లడ్డూలో కల్తీ జరిగితే ఇన్ని రోజులుగా ఏం చేస్తున్నారు? బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ.. చంద్రబాబు నీచ రాజకీయాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు బాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.శ్రీవారి భక్తుడని చెప్పుకునే బాబు ఇలాంటి రాజకీయం చేస్తారా?. జులై 23న రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 19 వరకు ఏం చేశారు?. 2 నెలలు ల్యాబ్ రిపోర్ట్ను ఎందుకు బయటపెట్టలేదు’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ నిలదీశారు. ‘‘చంద్రబాబు,ఈవో మాటలకు పొంతన లేదు. మీ దగ్గర ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలి కదా?. సిట్ ఎందుకు?’’ అంటూ వెల్లంపల్లి దుయ్యబట్టారు.ఇదీ చదవండి: ‘టీడీపీ ఆఫీస్లో టీటీడీ రిపోర్ట్.. ఏంటీ గూడుపుఠాణి?’‘‘చంద్రబాబు వంద రోజుల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆధారాల్లేకుండా అడ్డమైన ఆరోపణలు చేశారు. తప్పు జరిగితే ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదు?. కంటితుడుపు కోసం ఇప్పుడు సిట్ వేశారు. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రే ఆరోపణలు చేశాక ఇక సిట్ దర్యాప్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏఆర్ ఫుడ్స్ నిజంగానే తప్పు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. సనాతన ధర్మం గతంలో లేనట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. చెప్పులు వేసుకుని దీక్షలు చేయటం పవన్ కళ్యాణ్కే చెల్లింది. ఇలాంటి దారుణాలను మేము ఎప్పుడూ చూడలేదు. మాటలు చెప్పే ముందు సనాతన ధర్మాన్ని పవన్ పాటించాలి..ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన రెండు నెలల వరకూ దాన్ని ఎందుకు బయట పెట్టలేదు?. ఆ రిపోర్టు గురించి టీడీపీ ఆఫీసులో మాట్లాడటం ఏంటి?. వనస్పతి కలిసిన నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపామని ఈవో శ్యామలరావు జులై 23న చెప్పారు. జంతువుల కొవ్వు కలిసిందని సెప్టెంబరు 18న చంద్రబాబు కూటమి మీటింగ్లో మాట్లాడారు. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. కానీ వనస్పతి కలిసిన ట్యాంకర్లను వెనక్కు పంపామని సెప్టెంబరు 20న ఈవో శ్యామలరావు చెప్పారు. మళ్లీ చంద్రబాబు సెప్టెంబరు 22న మాట్లాడుతూ ఆ నెయ్యిని వాడారని మరీసారి అబద్దాలు చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రా? టీటీడీ ఈవోనా?. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే రకం చంద్రబాబు...హరికృష్ణ మృతదేహం పక్కనే పొత్తుల గురించి చర్చించిన నీచ చరిత్ర చంద్రబాబుది. సూపర్ సిక్స్ పథకాల నుండి డైవర్షన్ కోసమే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు. లడ్డూ విషయమై సుప్రీంకోర్టు విచారణ జరపాలి. తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చేసిన తప్పును ఒప్పుకుంటూ చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. చంద్రబాబూ నీ తప్పు ఒప్పుకో.. లేకపోతే వెంకటేశ్వరస్వామి ఒప్పుకోడు.వరదల మేనేజ్మెంట్లో చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. వరదల పేరుతో చంద్రబాబు వందల కోట్లు వసూలు చేశారు. అందులో పదిశాతం ఖర్చు పెట్టినా బాధితులను ఆదుకోవచ్చు. వరద బాధితులపై లాఠీ ఛార్జి చేసిన ఘనత చంద్రబాబుది. సాయం చేయమని కోరితే లాఠీఛార్జి చేస్తారా?. పరిహారం ఎగ్గొట్టడానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వీటన్నిటికీ చంద్రబాబు బాధ్యత వహించాలి’’ అని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. -
‘టీడీపీ ఆఫీస్లో టీటీడీ రిపోర్ట్.. ఏంటీ గూడుపుఠాణి?’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని.. ఇది ప్రజల ప్రభుత్వం కాదంటూ వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి చేతులెత్తేశారని.. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వంద రోజుల్లో రూ.30 వేల కోట్లు అప్పు చేసి ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు. చేసిన అప్పులు, ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ప్రజలు తప్పు చేశామని బాధ పడుతున్నారు.. పాలిచ్చే ఆవును వదిలి తన్నే గేదెను తెచ్చుకున్నామని ఆవేదన పడుతున్నారు. ఓ పక్క దోపిడీ, మరో పక్క వైఎస్సార్సీపీ వారిపై దాడులు. వరదలు నుంచి డైవర్ట్ చేయడానికి ప్రకాశం బ్యారేజ్ బోటు అంటూ ఆరోపించారు. తీరా చూస్తే అది టీడీపీ నేతకు చెందిన బోటు. ఆ తర్వాత కాదంబరి అనే మహిళ వ్యవహారం తెచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నిక రాజకీయ కుట్రలు చేసినా కానీ ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు మర్చిపోరు’’ అని రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు.‘‘ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ ప్రతిష్టను దెబ్బతెస్తున్నారు. ఇలాంటి నీచమైన పాలిటిక్స్ చేసే వారు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నెయ్యి వచ్చింది. టెస్ట్ చేసింది అంతా చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చాకే టెండర్లు పిలిచారు. సరఫరా కూడా జరిగింది ఆ తర్వాతే. మార్చి 16 నుంచి మా ప్రమేయం లేదు. తిరుమల, తిరుపతిలో రెండు ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ అన్నీ పరీక్షలు జరుగుతాయి. వాస్తవానికి ఉన్నత పరీక్షల కోసం మైసూర్ సీఎఫ్టీఆర్ఐకి పంపుతారు. కానీ దీన్ని గుజరాత్ ఎన్డీడీబీకి పంపారు’’ అని రవీంద్రనాథ్రెడ్డి వివరించారు.ఇదీ చదవండి: పరిపాలనకు ‘తిరు’క్షవరం‘‘ముందు రోజు ఈ సంస్థ ప్రతినిధులు టీటీడీ ఈవో శ్యామలరావు కలిశారు. ఎన్డీడీబీ ప్రస్తుత చైర్మన్ మనీషా, మాజీ ఛైర్మన్ వర్షా ఇద్దరూ శ్యామలరావును కలిశారు. ఆ తర్వాతే ఈ రిపోర్ట్ వచ్చింది. గూడుపుఠాణి చేసి జగన్పై ఆరోపణలు చేస్తున్నారు. ఈవో, ముఖ్యమంత్రి వేర్వేరు స్టేట్మెంట్లు ఇచ్చారు. రెండు నెలల తర్వాత ఈ నివేదిక విడుదల చేయడంలో ఆంతర్యమేమిటి..?. ఒక కీలకమైన టీటీడీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్లో విడుదల చేయడం ఏంటి?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘ఇవన్నీ చూస్తుంటే పెద్ద కుట్ర జరిగిందని స్పష్టమవుతుంది. హిందువులను వైఎస్ జగన్కు దూరం చేయాలని ఈ కుట్ర పన్నారు. లడ్డూనే కాదు.. ఏ ఆహార పదార్థాల్లోనైనా జంతువుల కొవ్వు కలిపితే రెండు రోజుల్లోనే దుర్వాసన వస్తుందని నిపుణులు చెప్తున్నారు. కేవలం వైఎస్సార్సీపీని దెబ్బతీయాలని ఎన్డీఏ భాగస్వాములు అంతా కలిసి చేసిన కుట్ర. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు’’ అని రవీంద్రనాథ్రెడ్డి చెప్పారు.‘‘వైఎస్ జగన్ దేవుని దర్శనానికి వెళ్తుంటే అడ్డుకుని, మేమెప్పుడు అడ్డుకున్నామంటూ బుకాయిస్తున్నాడు. వైఎస్సార్సీపీ వారికి నోటీసులు ఇచ్చి, పోలీసులతో అడ్డుకున్నారు. 30 యాక్ట్ పెట్టీ వైఎస్సార్సీపీ వారినే ఆడ్డుకుంటారా. ? ఇతర పార్టీల వారు తిరుమల చేరుకున్నా యాక్ట్ అమలు కాదా .?. నీకు దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకో.’’ అని రవీంద్రనాథ్రెడ్డి సవాల్ విసిరారు.‘‘వైఎస్ జగన్ ప్రధానికి లేఖ రాశారు.. సిట్టింగ్ జడ్జితో విచారణ డిమాండ్ చేశారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు.. నీకు బుద్ధి చెప్తారు. నిన్న వైఎస్సార్సీపీ పిలుపు మేరకు ప్రజలు నిన్న దేవాలయాల్లో చంద్రబాబుకు మంచి బుద్ధి రావాలని పూజలు చేశారు. పవన్ కళ్యాణ్.. తన ఓనర్ స్క్రిప్ట్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చి డ్రామాలు వేస్తాడు. ప్రశ్నిస్తాను అన్నాడు.. పిల్లల మిస్సింగ్ అన్నావు. డిప్యూటీ సీఎంగా నువ్వు ఎంతమందిని కాపాడావు ?. వరదల్లో కనీసం బయటకు వచ్చావా .? ఓనర్ స్క్రిప్ట్ ఇవ్వగానే బయటకు వచ్చి హంగామా చేశాడు. తాను క్రిస్టియన్ అని చెప్పి మళ్లీ సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్నాడు. మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు వస్తుంది’’ అంటూ రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. -
తిరుపతిలో నేడు రెండవ రోజు సిట్ బృందం విచారణ
-
జగన్ పై కొండంత విషం..! ఏడుకొండలవాడితోనే ఆటలా బాబు
-
తిరుమల లడ్డూపై 30న సుప్రీంకోర్టులో విచారణ
-
కోట్లాది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశాడు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
-
తిరుమల లడ్డూపై 30న సుప్రీంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. లడ్డూలలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంపై యావత్ ప్రజానీకం నివ్వెరపోయింది. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరుతూ.. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణియన్ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై ఈ నెల 30న విచారణ ప్రారంభం కానుంది. జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్ బెంచ్ లడ్డూ వివాదంపై విచారణ జరపనున్నారు. చంద్రబాబు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ స్వార్థం, స్వలాభం కోసం వాడుకునే అవకాశం ఉందనే తాను సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు సుబ్రమణియన్స్వామి తెలిపారు. -
బురదజల్లడమే బాబు పని
సాక్షి, అమరావతి: మతకల్లోలాలు సృష్టించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవాలని టీడీపీ భారీ కుట్ర చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మాజీ సీఎం వైఎస్ జగన్కి అనుమతి లేదంటున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా! అని ప్రశ్నించారు. కల్తీ లడ్డూ ఆరోపణలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు దాన్ని డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్ అంశం తెరపైకి తెచ్చారని భరత్ మండిపడ్డారు.చంద్రబాబు హిందుత్వాన్ని, తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు ఎలా వాడుకుంటున్నారో, ఏ రకంగా కుటిల రాజకీయాలు చేస్తున్నారో వైఎస్ జగన్ అద్భుతంగా వివరించారని చెప్పారు. చంద్రబాబు చేసిన అపచారం కారణంగా రాష్ట్ర ప్రజలకు నష్టం కాకూడదని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించినట్టు చెప్పారు. లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించిన చంద్రబాబు ఆధారాలు చూపించడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీటీడీ ఈవో శ్యామలరావు, సీఎం చంద్రబాబు పరస్పర భిన్నమైన స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజల్ని, కోట్లాది మంది శ్రీవారి భక్తుల్ని అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. మీడియాతో చంద్రబాబు చెప్పిన మాటల్లో డొల్లతనం కనపడిందన్నారు. నెయ్యిని వాడారని చెబుతున్న చంద్రబాబు.. ఎక్కడ వాడారన్నది మాత్రం అప్రస్తుతం అంటున్నారని, ఆ వాడిన నెయ్యిలో కల్తీ ఉందా అంటే.. ఆ తర్వాత వచ్చిన నెయ్యిలో ఉంది అంటున్నారని భరత్ చెప్పారు. చంద్రబాబు ఎలా హిందుత్వవాదో బీజేపీ చెప్పాలిబూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబుకి హిందుత్వం పట్ల, హిందూ సంస్కృతి పట్ల అసలు నమ్మకం ఉందా.. అంటూ భరత్ ప్రశ్నించారు. హిందుత్వానికి టార్చ్ బేరర్స్ అని చెప్పుకునే బీజేపీకి ఇవన్నీ కనపడవా అని నిలదీశారు. తిరుమలలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేయించిన చంద్రబాబు హిందుత్వవాది ఎలా అవుతారో బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లడ్డూ నాణ్యత పరీక్షల విషయంలో పదే పదే అబద్ధాలు చెబుతున్న చంద్రబాబుకి దశాబ్దాలుగా టీటీడీలో మూడు లేయర్ల టెస్టులు జరుగుతున్న విషయం కూడా తెలియకపోవడం బాధాకరమని అన్నారు. గతంలో ఏనాడూ నాణ్యత పరీక్ష కోసం బయటకు పంపలేదని చంద్రబాబు మరో పచ్చి అబద్ధం చెప్పారన్నారు. టీటీడీ వారు 2022లో బెంగళూరులోని ఐసీఏఆర్కి పరీక్షల కోసం పంపిన విషయం తెలుసుకోవాలన్నారు. -
ఎందుకీ రాద్ధాంతం?
ఆ నెయ్యిలో ఏదో జంతువు కొవ్వు కలిసిందని జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాజనితం. దీనికి ఎలాంటి శాస్త్రీయ కొలబద్ద లేదు. ఇలాగైతేనే ప్రజలు నమ్ముతారని మూఢ నమ్మకం మాటున చెబుతున్నదే. ఏదైనా విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా అశాస్త్రీయంగా అంచనా వేయడంలో భాగంగానే ఇది జరిగింది. అంటే ఏదో ఆశించి ఇలా చేశారని స్పష్టమవుతోంది. ఇది ‘బ్యాడ్ కేస్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్’గా నిలుస్తుంది. – ప్రముఖ ఆర్థిక వేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామిసాక్షి, హైదరాబాద్ : ఏ నివేదికలో నిరూపణ కాకుండానే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం తగదని ప్రముఖ ఆర్థిక వేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ‘సెక్యులర్ రాజ్యంలో మతానికి చోటుండదు. మతపరమైన విశ్వాసాలు అనేవి వ్యక్తిగతం. అసలు ప్రభుత్వంలో మతం అనే దానికి చోటే లేదు. ఇలాంటి విషయాలను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమలను వివాదాస్పదంగా మార్చడం సరికాదు’ అని అన్నారు.మతపరమైన విశ్వాసాలపై వివాదం సృష్టించి, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు కనిపిస్తోందని చెప్పారు. పాలకులకు ఇబ్బంది కలిగించే విషయాలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి వివాదాలు తెరపైకి తెస్తుంటారని, ఏపీలో ఇప్పుడదే జరుగుతోందన్నారు. తిరుమల లడ్డూ వివాదం, జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిణామాలు, ఆర్థిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అవన్నీ రాజకీయ ఆరోపణలే ⇒ లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే రాజకీయ ఆరోపణలు, వాటికి ప్రభుత్వ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మినహా అది నిజమని ఏ నివేదికలోనూ వెల్లడి కాలేదు. ఈ అంశం అమూల్తో సహా ఏ నివేదికలోనూ నిరూపితం కాకుండానే అయినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ⇒ పాలు జంతువుల ఉత్పత్తితో ముడిపడినవే. శాస్త్రీయంగా చూస్తే.. ఆవు, బర్రె, మేక ఆ మాటకొస్తే ఏదైనా మొక్క నుంచి వచ్చే కొవ్వును మారి్పడి చేస్తే నెయ్యి తయారవుతుంది. ఆవు అధికంగా మేత మేసినా, లేక తక్కువగా తిన్నా ఫలితాల్లో మార్పులు కనిపిస్తాయి. ఇదే విషయాన్ని అమూల్ టెస్ట్ రిజల్ట్ నిర్ధారించింది. కల్తీ అయిందని చెబుతున్న నెయ్యే లడ్డూ తయారీలో వాడనప్పుడు అపచారం జరిగిందనడానికి ఎక్కడ తావుంది? ⇒ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది. తన స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలే ఆయనకు అత్యంత ముఖ్యం. ఇందుకోసం ఏం చేయడానికైనా ఆయన వెనుకాడరని చరిత్ర చెబుతోంది. గతంలో మోదీని నంబర్ వన్ శత్రువుగా ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయనకు నంబర్ వన్ మిత్రుడు ఎలా అయ్యారు? ⇒ అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి లౌకికవాదమంటే అసలైన అర్థం తెలుసా? వారికి ఆ పదవిలో కొనసాగే అర్హత ఉందా? (ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ను ఉద్దేశించి) అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు స్వార్థ రాజకీయాలే చేస్తారు ⇒ గతంలో చంద్రబాబు మనుషులు సైబరాబాద్ చుట్టూ భూములు కొని లాభ పడ్డారు. అప్పుడు అక్కడ భూముల పేరిట చేసిందే ఇప్పుడు అమరావతిలో పెద్ద ఎత్తున చేయబోతున్నారు. అందుకే అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని పట్టుబడుతున్నారు. తన అనుయాయులు కొన్న భూములన్నీ కూడా అక్కడే ఉండటం గమనించాల్సిన విషయం. చంద్రబాబు ఎప్పుడూ స్వార్థ రాజకీయాలే చేస్తారు. ⇒ అయితే అక్కడ మౌలిక, ఇతర అవసరాల కోసం పెట్టుబడులు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు కావాలి. మోదీ ప్రభుత్వం కూడా ఆ మేరకు ఇచ్చే పరిస్థితి లేదు. ఏపీకి కేంద్రం ‘ప్రత్యేక హోదా కల్పన’ ఇవ్వడం అనేది అసాధ్యం. ఏపీలో బీహార్ మాదిరిగా వెనుకబాటుదనం లేదు. ఈశాన్య రాష్ట్రాల లాగా భౌగోళికంగా దూరప్రాంతాల్లోనూ లేదు. ప్రతిసారి కేంద్రం నుంచి గ్రాంట్లు కావాలని, డబ్బులు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసినా అది రావడం కూడా కష్టమే. సాధ్యం కాదు. ⇒ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే చంద్రబాబు.. అమరావతిలో మెట్రో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పరిపాలనా కేంద్రం సచివాలయం, గవర్నమెంట్ ఉద్యోగుల క్వార్టర్లు, ఇతర ఆధునిక సదుపాయాలు, ముఖ్యమైన సంస్థలన్నీ అమరావతిలోనే ఉండాలంటున్నారు. ఇలా అన్నీ అక్కడే ఎందుకో.. దాని వెనుక ఏం ప్రయోజనాలు ఆశిస్తున్నారో లోతుగా గమనించాలి. ముందుగా ఓ కమర్షియల్ సెంటర్గా ఎదిగాక అవన్నీ సమకూరాలని కోరుకుంటే మంచిది. ⇒ కేంద్రంలో రాజకీయ స్థిరత్వం అనేది చంద్రబాబు, నితీ‹Ùకుమార్ వంటి నమ్మకం లేని (అన్ ట్రస్ట్ వర్తీ) వ్యక్తులపై ఆధారపడి ఉంది. వీరిద్దరూ మద్దతు ఉపసంహరించినా కేవలం ఆరుగురు ఎంపీల మెజారిటీతో ప్రభుత్వం మనగలుగుతుంది. అయితే గత రెండు పర్యాయాలతో పోలి్చతే మోదీ ప్రభుత్వం బలహీనంగానే ఉంది. దేశంలో నిరుద్యోగ శాతం, ఉద్యోగాలు, ఉపాధి కోరుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ విధానాలను, విపక్షాలను మోదీ ‘మిస్ మేనేజ్’ చేశారు. తప్పుడు గణాంకాలతో మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘కేపిటల్ ఇన్వెస్ట్మెంట్’ అనుకున్న విధంగా జరగలేదు. కార్పొరేట్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. వైఎస్ జగన్ వికేంద్రీకరణ ఆలోచన బాగుంది ⇒ రాష్ట్ర రాజధానిని వికేంద్రీకరించాలనే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన ఎంతో బాగుంది. గతంలో కర్నూలులో రాజధాని ఉండేది. హైకోర్టు, రాష్ట్ర సచివాలయం రెండూ రాజధానిలోనే ఎందుకుండాలి? రాష్ట్ర రాజధానిలోనే మెట్రోరైల్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటివి ఎందుకుండాలి? భోపాల్, రాయ్పూర్, రాంచీ, లఖ్నవూ, పాట్నా వంటి రాజధానుల్లో మెట్రో, అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు. ⇒ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు.. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలపై దృష్టి సారించడం బాగుంది. మంచి ఫలితాలు వచ్చాయి. వివిధ వర్గాల ప్రజలకు, ముఖ్యంగా పేదలకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) అనేది మంచి ఆలోచన. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ఇలా చేయడం, ఇళ్ల దగ్గరే ప్రజలకు అందించడం ఎంతో మేలు చేసింది. డీబీటీ విధానాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఇది ఉత్పాదకతను పెంచేదే. ఆర్థిక రంగానికి మేలు చేస్తుంది. ⇒ ఎవరైనా సంక్షేమ పథకాలు సరైనవి కాదు అనడం, వీటిపై డబ్బు ఖర్చు చేయడం వృథా అనడం తప్పు. విద్య, వైద్య సేవలకు కూడా చార్జ్ చేస్తారా? ఇవన్నీ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ప్రభుత్వాలు ఏవైనా విద్యా రంగం, పబ్లిక్ హెల్త్కేర్పై ఎక్కువ నిధులు ఖర్చు చేయాలి. ప్రజలకు మేలు చేకూర్చడం అనేది ఓ మంచి ఆర్థిక కార్యక్రమంగా భావించాలి. -
ప్రజల మనసుల్లో విషం నింపేందుకు బాబు కుట్ర: మార్గాని భరత్
సాక్షి,తాడేపల్లి:తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను వైఎస్జగన్ బట్టబయలు చేశారని మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ అన్నారు.శనివారం(సెప్టెంబర్28) తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడారు.‘వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారు.ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజలు చేశారు.జూన్ 12 నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి సప్లై చేసింది.జులై నెలలో వచ్చిన ట్యాంకర్లు వెనక్కి పంపించేశామని ఈవో శ్యామల రావు చెబుతున్నారు.ఎన్డీడీబీకి పంపించిన శాంపుల్స్ రిపోర్ట్ జూలై 23న వచ్చింది.నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఈవోనే స్వయంగా చెప్పారు.జంతువుల కొవ్వు కలిసిందని తెలిసినప్పుడు సెప్టెంబర్ 2 వరకూ చంద్రబాబు ఎందుకు ఆగారు.చంద్రబాబు రెండు నెలలు ఆగి అబద్ధాలు చెప్పారు.చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు.నాలుగు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించామని ఈవో చెబుతున్నారు.2014-19 మధ్య 14సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు.2019-24 మధ్య 18సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు.చంద్రబాబుకు హిందుత్వం పట్ల హిందువుల పట్ల అసలు గౌరవం ఉందా.బూట్లు వేసుకుని శంకుస్థాపనలు చేశాడు.అదేనా హిందుత్వమంటే.వెయ్యి కాళ్ల మండపాన్ని చంద్రబాబు ఎందుకు కూల్చివేయించేశారు.చంద్రబాబు రాజకీయాలను బీజేపీ నేతలు గమనించాలి.సీఎం హోదాలో వైఎస్జగన్ ఐదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించారు.పాదయాత్ర పూర్తయ్యాక కాలినడకన వెళ్లి తిరుమల దర్శనంచేసుకున్నారు.డిక్లరేషన్పై అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు.నెయ్యి నాణ్యత పై చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారా..తెలియక మాట్లాడుతున్నారా.ఎన్డీబీబీ నుంచి వచ్చిన నివేదికను టీడీపీ కార్యాలయం నుంచి ఎందుకు విడుదల చేశారు.ఎన్డీబీబీనుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు.వైఎస్జగన్మోహన్రెడ్డి పర్యటనకు పర్మిషన్ లేదని మా పార్టీ నేతలకు నోటీసులిచ్చారు.చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే సిట్ అధికారులు అమలు చేస్తారు.ప్రజల మనసులో చంద్రబాబు విషం నింపాలని ప్రయత్నం చేస్తున్నారు.ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తారో పవన్ కు తెలుసా.చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పవన్ దీక్ష చేస్తున్నారా.బీజేపీ వాళ్లు ముందు చంద్రబాబుని ప్రశ్నించాలి’అని భరత్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: నెయ్యి కల్తీపై థర్డ్పార్టీ విచారణ చేయించండి: బొత్స -
అయ్యప్ప మాలేస్తే ఆదాయం తగ్గుతుందన్నాడుగా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనపై చంద్రబాబు చేస్తున్నరాద్దాంతంపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. తిరుమల పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్ను డిక్లరేషన్ అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు పోసాని. హిందూ ధర్మా పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న బాబు.. ఒకప్పుడు అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మద్యం అమ్మకాలు జరగడం లేదని ఘోరంగా వ్యాఖ్యానించాడని గుర్తు చేశారు.మతతత్వ పార్టీ బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నానని, ఇదే విషయాన్ని గతంలో మసీద్లోనే చెప్పాడని గుర్తు చేశారు.తనకు ఏ పార్టీలో కలవాలని లేకున్నా కూడా ఢిల్లీ నుంచి వచ్చి కలవండి అంటే బీజేపీలో కలిశాను అని బాబు చెప్పాడని తెలిపారు. మోదీ అంటే కేడీ.. కేడీ అంటే మోదీ అని ఘోరంగా తిట్టిన బాబు.. మళ్లీ ఢిల్లీకి వెళ్లి మోదీ.. అమిత్ షా కాళ్లు పట్టుకున్న ఫోటోలను కూడా చూశామని ఎద్దేవా చేశారు. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.‘చంద్రబాబు లాంటి వ్యక్తి ఉంటాడనే అంబేద్కర్ చాలా బలమైన రాజ్యాంగం రాశారు. ఓట్ల కోసం క్రిస్టియన్, ముస్లింల ఇంటికి చంద్రబాబు వెళ్లలేదా?, నేను, నా భార్య కలిసి చర్చ్, మసీద్కు వెళ్లాం. మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ అఫిడవిట్ అడగలేదు. జగన్ది గ్రేట్ పాలిటిక్స్.. నీది డర్టీ పాలిటిక్స్ బాబూ’ అని ధ్వజమెత్తారు పోసాని -
‘పాపం చంద్రబాబుదే.. ‘లడ్డూ’ కుట్రపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే’
సాక్షి, తిరుపతి: తిరుమల ఆలయ పవిత్రత మంట కలిపే విధంగా చంద్రబాబు వ్యవహరించారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ అపవాదు వేశారని.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు వాఖ్యలు చేయడం సరికాదన్నారు.మా హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని.. సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్ను శ్రీవారి దర్శనానికి రాకుండా అడ్డుకున్నారు వేంకటేశ్వరస్వామిని వైఎస్ జగన్ ఎన్నోసార్లు దర్శించుకున్నారు. రాజకీయ ప్రాబల్యం కోసం చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేశారు. వెంకన్న చౌదరి తిరుమలలో అన్యమతస్తులకు ప్రవేశం లేదంటూ పెద్ద ఎత్తున బోర్డులు పెట్టారు. వెంకన్న చౌదరి వెంకన్నకు సేవ చేయాలి. చంద్రబాబుకు కాదు. వైఎస్ జగన్ పర్యటన రద్దువ్వగానే వెంటనే ఫ్లెక్సీలు తీసేశారు. రోజుకు 700 మందికి పైగా అన్యమతస్తులు తిరుమల దర్శనానికి వస్తారు. ఏనాడు డిక్లరేషన్ తీసుకోలేదు’’ అని భూమన అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాడి మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి: సజ్జల రామకృష్ణారెడ్డిబాబు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు టీడీపీ ఆఫీస్లో ఎన్డీడీబీ రిపోర్టును లీక్ చేశారువైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారుఏమీ జరగకుండానే ఏదో జరిగినట్లుగా చంద్రబాబు ఘోరమైన ఆరోపణలు చేశారు.వేంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారు: మార్గాని భరత్గత వారం రోజులుగా తిరుపతి లడ్డూపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందితిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను జగన్మోహన్రెడ్డి బట్టబయలు చేశారు.వేంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారుఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పూజలు చేశారు.జూన్ 12 నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి సప్లై చేసిందిజూలై నెలలో వచ్చిన ట్యాంకులు వెనక్కి పంపించేశామని ఈవో శ్యామల రావు చెబుతున్నారుNDDBకి పంపించిన శ్యాంపుల్స్ రిపోర్ట్ జూలై 23న వచ్చిందివెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఈవోనే స్వయంగా చెప్పారుజంతువుల కొవ్వు కలిసిందని తెలిసినప్పుడు సెప్టెంబర్ 2 వరకూ చంద్రబాబు ఎందుకు ఆగారుచంద్రబాబు రెండు నెలలు ఆగి అబద్ధాలు చెప్పారుచంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలునాలుగు ట్యాంకులు వెనక్కి పంపించామని ఈవో చెబుతున్నారు2014-19 మధ్య 14 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు2019-24 మధ్య 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారుచంద్రబాబుకు హిందుత్వం పట్ల...హిందువుల పట్ల అసలు గౌరవం ఉందాబూట్లు వేసుకుని శంకుస్థాపనలు చేశాడు...అదేనా హిందుత్వమంటేవెయ్యి కాళ్ల మండపాన్ని చంద్రబాబు ఎందుకు కూల్చివేయించేశారుచంద్రబాబు రాజకీయాలను బీజేపీ నేతలు గమనించాలిసీఎం హోదాలో జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించారుపాదయాత్ర పూర్తయ్యాక కాలినడకన వెళ్లి తిరుమల దర్శనం చేసుకున్నారుడిక్లరేషన్ పై అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?నెయ్యి నాణ్యత పై చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారా...తెలియక మాట్లాడుతున్నారా?NDDB నుంచి వచ్చిన నివేదిక....టీడీపీ కార్యాలయం నుంచి ఎందుకు విడుదల చేశారు?NDDB నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదుజగన్మోహన్రెడ్డి పర్యటనకు పర్మిషన్ లేదని.. మా పార్టీ నేతలకు నోటీసులిచ్చారు.చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను అధికారులు అమలు చేస్తారు.ప్రజల మనసులో చంద్రబాబు విషం నింపాలని ప్రయత్నం చేస్తున్నారుప్రాయశ్ఛిత్త దీక్ష ఎందుకు చేస్తారో పవన్కు తెలుసా?చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పవన్ దీక్ష చేస్తున్నారా?బీజేపీ వాళ్లు ముందు చంద్రబాబుని ప్రశ్నించాలిసుప్రీంకోర్టు జడ్జి లేదంటే సీబీఐతో విచారణ చేయించాలి: బొత్సవిశాఖపట్నం: నెయ్యికల్తీపై చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోందని మాజీమంత్రి,వైఎస్ఆర్సీపీసీనియర్నేత బొత్ససత్యనారాయణ అన్నారు.విశాఖపట్నంలో శనివారం(సెప్టెంబర్28)బొత్స మీడియాతో మాట్లాడారు.‘నెయ్యి ఎక్కడ కల్తీ జరిగిందో తెలియదని బాబు చెప్తున్నాడు.నెయ్యి కల్తీని చంద్రబాబు నిరూపించాలి. సుప్రీంకోర్టు జడ్జి లేదంటే సీబీఐతో విచారణ చేయించాలి. కల్తీ చేసిన వారిని శిక్షించాలి. చంద్రబాబుకు చిత్తశుద్ధిఉంటే థర్డ్పార్టీతో విచారణ జరిపించాలి. సీబీఐ విచారణ కోసం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు?చంద్రబాబు తన అబద్ధాలను నిజం చేసుకోవడానికి తన మనుషులతో సిట్ వేసుకున్నారు.కల్తీ జరిగి ఉంటే ఎందుకు న్యాయవిచారణకు వెనుకాడుతున్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని స్వార్థరాజకీయలు చేస్తున్నారు.ఇంతటి దుర్మార్గానికి ఎవరైనా పాల్పడతారా..ఇది న్యాయమా అని ప్రశ్నించారు బొత్సదేవుడిని కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి లాగి నీచ రాజకీయాలు: చెవిరెడ్డిప్రకాశం జిల్లా: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం అనైతికమని విమర్శించారు ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు ముందు పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా వందలాది వెంకటేశ్వరస్వామి గుడులు కట్టించారని ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి గుర్తు చేశారు.వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఐదుసార్లు శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించారని, ఆయన కొడుకుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారన్నారు. చంద్రబాబు నాయుడు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగా నీచ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. దేవుడి గురించి ఎక్కువగా మాట్లాడకూడదనే అందరం స్పందించడం లేదని చెవిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకి దేవుడంటే భయం లేదు: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్విశాఖ పట్నం: రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి చంద్రబాబు లాగారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదు. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు లడ్డూని తెరపైకి తెచ్చారు. సీఎం లడ్డూపై రోజుకో మాట మాట్లాడుతున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని మొదట మాట్లాడారు. కల్తీ లడ్డూ ఎక్కడ వాడారో తనకు తెలియదని మళ్ళీ అంటున్నారు. వైఎస్ జగన్ నేరుగా ఎదుర్కొనలేక చంద్రబాబు.. దేవుని రాజకీయాల్లోకి లాగుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబుకి దేవుడంటే భయం లేదు.. అసలు వాస్తవాలు తెలియాలంటే లడ్డూ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలి. చంద్రబాబు వేసిన సిట్పై నమ్మకం లేదు.. తిరుపతి వెళ్తామంటే నోటీసులు ఇచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా?. గతంలో వైఎస్ జగన్, ఆయన తండ్రి వైఎస్సార్ తిరుపతి వెళ్లలేదా.. మళ్లీ వైఎస్ జగన్ తిరుపతి వెళతారు. ఎవరు ఆపుతారో చూస్తాంవైఎస్ జగన్కు వెంకటేశ్వరస్వామిపై ఉన్న భక్తి చంద్రబాబుకు లేదు. రుషికొండ టీటీడీ దేవాలయాన్ని వైఎస్ జగన్ హయాంలోనే నిర్మించారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా ప్రత్యేక పూజలు నిర్వహించాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు పవన్ కళ్యాణ్ దీక్షలు చేయాలి. జనసేన ఎమ్మెల్యే దళిత ఉద్యోగిపై దాడి చేసినందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి’డిక్లరేషన్ బోర్డు పెట్టి ఎందుకు తీసేశారు?: మాజీ మంత్రి అంబటి రాంబాబుఅసత్య ప్రచారంతో టీటీడీ ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారు. డిక్లరేషన్ బోర్డు పెట్టి ఎందుకు తీసేశారు?. బాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్ తిరుమల వెళ్లారు. అప్పుడు డిక్లరేషన్ ఎందుకు అడగలేదు?. వైఎస్ జగన్ను మానసికంగా వేధించాలని కుట్రలు చేస్తున్నారు.కూటమి నేతల మెదడులోనే ‘కల్తీ’: వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్కూటమి ప్రభుత్వం గత పది రోజులుగా తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రచార అస్త్రంగా మార్చుకుంది. ఇష్టానుసారంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.. ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు చేసిన పాపాలకు వారికే శిక్షలు పడాలని ఆ దేవుడిని కోరుతున్నాం. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నాం. కల్తీ లడ్డూలో జరగలేదు... కల్తీ నెయ్యిలో జరగలేదు. కూటమి నేతల మెదడులోనే కల్తీ జరిగింది.పాదయాత్ర ముగించుకుని జగన్ నేరుగా తిరుమల వెళ్లారు. ఆ రోజు చంద్రబాబు ఎందుకు డిక్లరేషన్ అడగలేదో సమాధానం చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో కలిసి వెళ్లినపుడు ఆ రోజు బీజేపీ నేతలు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు?. తిరుమల వెంకన్న స్వామిపై వైఎస్ జగన్కి అపారమైన నమ్మకం ఉంది. కాబట్టే తిరుమలతో నవనీత సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగులను పర్మినెంట్ చేశారు. జీతాలు రెట్టింపు చేశారు. ఇళ్లస్థలాలు ఇచ్చారు. ఏ రోజు ఏ మతంలో ఉంటాడో.. ఏ కులంలో ఉంటాడో తెలియని పవన్ను చంద్రబాబు డిక్లరేషన్ అడగాలి. -
NDDB చైర్మన్ తో టీటీడీ ఈవో.. షాకింగ్ సీక్రెట్ బట్టబయలు
-
రాజకీయ వేదికగా తిరుమల.. బోర్డులు ఎత్తేస్తున్నారు.
-
లడ్డూ వివాదంపై బెంచ్ ను నిర్ణయించిన సుప్రీంకోర్టు
-
పాపాల చంద్రబాబు.. అడ్డంగా దొరికేశాడు!
తిరుపతి: శ్రీవారి లడ్డూ ప్రసాదంపై పిచ్చి ప్రేలాపనలు పేలిన చంద్రబాబు.. తిరుమలను రాజకీయాలకు వేదికగా ఎలా మార్చారో ఆధారాలతో సహా బయటపడ్డాయి. డిక్లరేషన్ పేరుతో దేవదేవుడి సన్నిధిలో నీచ రాజకీయానికి తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో జరిగిన దుర్మార్గాలు, వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివద్ధిని పరిశీలిస్తే..తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం, విజయవాడలో 30 ఆలయాలను చంద్రబాబు కూల్చివేస్తే.. ఆయన కూల్చేసిన 30 ఆలయాలను వైఎస్ జగన్ పునర్నిర్మించారు. ధూప దీప నైవేద్యాల కింద 5,338 ఆలయాలకు వైఎస్ జగన్ సాయం అందించారు. 2,635 నూతన ఆలయాల నిర్మాణంతో పాటు మరో 300 ఆలయాల జీర్ణోద్ధరణకు చర్యలు తీసుకున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబు మరో అబద్ధం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైఎస్ జగన్శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ జగనే. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, కశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మఠాధిపతులు, ఆగమ పండితులతో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేశారు. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ జగనే. -
మరోసారి అడ్డంగా దొరికిపోయిన చంద్రం..
-
తిరుమల లడ్డూ వివాదంపై విచారణకు సుప్రీంకోర్టు బెంచ్
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదం కేసు విచారణకు బెంచ్ను సుప్రీంకోర్టు నిర్ణయించింది. లడ్డూ కేసు విచారణ జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్ బెంచ్కు కేటాయించింది. కాజ్ లిస్టులో ఐటెం నెంబర్ 63గా తిరుమల లడ్డూ కేసు లిస్ట్ అయ్యింది. ఎల్లుండి, సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.ఈ వివాదం నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేయగా, ఈ రెండు పిటిషన్లను ఒకేసారి సుప్రీంకోర్టు విచారించనుంది. ఇదీ చదవండి: చంద్రబాబు మరో అబద్ధం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైఎస్ జగన్ -
Big Question: తిరుమలలో నాస్తికుడు.. నారా బాబు నీచ పనులు
-
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
-
ఆ నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం
సాక్షి, అమరావతి: కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిపోయిందంటూ నిన్నటివరకు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. అదంతా ఉత్తి అసత్య ప్రచారమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశదీకరించి, వాస్తవాలను ప్రజల ముందుంచడంతో కంగుతిన్నారు. కల్తీ జరిగిన నెయ్యిని ఎక్కడ వాడారన్నది అప్రస్తుతమంటూ చంద్రబాబు తప్పించుకొనే ప్రయత్నం చేశారు. బాబు శుక్రవారం సాయంత్రం సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఏఆర్ డెయిరీ నెయ్యిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వినియోగించారా లేక దేనికోసం ఎక్కడ వాడారు అన్నది అప్రస్తుతమంటూ మాట మార్చారు. ఏఆర్ డెయిరీ మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి పంపితే అందులో నాలుగు ట్యాంకర్ల నెయ్యి వినియోగించామని, మరో నాలుగు ట్యాంకర్లను పరీక్ష కోసం ఎన్డీడీబీకి పంపితే ఆ నివేదిక ఆధారంగా వాటిని తిరస్కరించామని అన్నారు. ముందు వినియోగించిన నాలుగు ట్యాంకర్లలో కల్తీ జరిగిందా అని అడగ్గా.. ఆ తర్వాత ట్యాంకర్లలో జరిగింది కదా అంటూ అడ్డంగా బుకాయించారు. తన తప్పుడు ప్రచారాన్ని సమర్థించుకోవడానికి ఆపసోపాలు పడ్డారు. ఇప్పటివరకు తిరుమలలో ఎటువంటి ల్యాబులు లేవన్న చంద్రబాబు.. ఇప్పుడు కేవలం నాణ్యత ప్రమాణాలు పరిశీలించే ల్యాబులు మాత్రమే ఉన్నాయని ఒప్పుకొంటూనే.. మరోపక్క కల్తీ జరిగిందా లేదా అన్న విషయాన్ని నిర్థారించే అడల్ట్రేషన్ ల్యాబులు లేవంటూ తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేశారు. త్వరలోనే తిరుమలలో ప్రపంచస్థాయి అల్రడ్టేషన్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వేంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలుగుతుందంటూ ఎన్డీడీబీ నివేదికను బయట పెట్టకుండా తాము దాచిపెడితే, ఆ తర్వాత అది బయటకు వస్తే ఆ స్వామి మమ్మల్ని క్షమిస్తాడా అంటూ ఎదురుదాడి చేశారు. ఆ 4 ట్యాంకుల కల్తీ నెయ్యి వాడకుండా ఉంటే సంతోíÙంచేవాడినని, అవి వాడినందునే బాధపడుతున్నా అని అన్నారు. తెలిసీ తెలీక తప్పులు జరిగాయని, క్షమించాలని ప్రతి ఏటా ఆగస్టు 15 తర్వాత తిరుమలలో పవిత్రోత్సవాలు చేస్తారని, కానీ నెయ్యి కల్తీ జరగడంతో ఇటీవల సంప్రోక్షణ, శాంతియాగం చేశారని చెప్పారు. కొత్త చట్టం తెస్తాం ఎవరు ఏ ప్రార్థనాలయాలకు వెళ్లినా అక్కడి సంప్రదాయాలను తప్పనిసరిగా గౌరవించేలా త్వరలో కొత్త చట్టం కూడా తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. వివిధ ప్రాంతాల వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా పెట్టడం తప్పుకాదని, దాన్ని జంబో బోర్డుగా మార్చడమే తప్పు అని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు త్వరలోనే దేశవ్యాప్తంగా మేధావులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీ ప్రక్షాళన కోసమే ఈవోగా శ్యామలరావును నియమించామని చెప్పారు. ఆ తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ వేశామని, ఇప్పుడు సిట్ వేశామని చెప్పారు. సిట్ దర్యాప్తు తర్వాత కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జగన్పై అక్కసు వెళ్లగక్కిన బాబు జగన్ తిరుమలకు రాకుండా తాము ఎక్కడా అడ్డుకోలేదని, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని, అటువంటి నోటీసులు ఉంటే చూపించాలని అన్నారు. తిరుమల వెళ్లినప్పుడు నియమాలు, ఆచారాలు, సంప్రదాయాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. రౌడీయిజం చేస్తామంటే కుదరదన్నారు. ఇతర మతస్తులు ఎవరొచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారని చెప్పారు. పదే పదే అబద్ధాలు తిరిగి చెప్తున్నారని అన్నారు. తెలీసో, తెలీక తప్పులు జరిగితే క్షమించమనడానికి దేవుడికి పూజ చేస్తారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రినే రానివ్వకుంటే దళితులను రానిస్తారా అని మాట్లాడుతున్నారని, దళితులను రానివ్వరని ఎవరు చెప్తున్నారంటూ ప్రశ్నించారు. తిరుమల వెళ్లడం ఇష్టంలేకే వివిధ రకాలుగా బురదజల్లుతున్నారన్నారు. జగన్ మాటలకు విశ్వసనీయత ఉండదని అన్నారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తిరుమల, తిరుపతిల్లో స్థానికులు పోటీగా జనసమీకరణ చేస్తామని సమాచారం రావడంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసు యాక్ట్ 30ని అమలు చేసి, పది మందికంటే ఎక్కువ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. -
దొరికిపోయిన చంద్రబాబు.. అబద్ధాలు బట్టబయలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధికోసం చేస్తున్న తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు(శుక్రవారం) తాడేపల్లిలో ప్రెస్మీట్ నిర్వహించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు చేస్తున్న విష రాజకీయాలను ఎండగట్టారు. చంద్రబాబు మళ్లీ మళ్లీ అబద్ధాలుసెప్టెంబర్ 18వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో‘యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ కొత్త వివాదానికి తెరలేపడాన్ని కూడా వైఎస్ జగన్ వీడియో ముఖంగా ప్రస్తావించారు. ‘‘భక్తులకు పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఉంది, ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రిడియంట్స్ కాకుండా యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు’’అని చంద్రబాబు పేర్కొనడాన్ని వైఎస్ జగన్ కౌంటర్ చేశారు.సెప్టెంబర్ 22వ తేదీన చంద్రబాబు మరోసారి మాట్లాడుతూ..తిరుమలకు నాలుగు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, దానిని వాడారని చంద్రబాబు చెప్పడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఆ ట్యాంకర్లను ఈవో వాడలేదని , వెనక్కి పంపామని చెబితే, ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు.. ఆ నెయ్యి వాడారంటూ అసత్యపు ప్రచారం చేయడాన్ని వీడియో ప్లే చేసి మరీ చూపించారు వైఎస్ జగన్జూలై 23వ తేదీన టీటీడీ ఈవో ఇలా.. తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావులు వేర్వేరు సందర్భాల్లో ఏమి మాట్లాడారో వీడియోలు ప్లే చేసి మరీ చూపించారూ వైఎస్ జగన్. స్వయంగా చంద్రబాబు నాయుడు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు జూలై 23 వ తేదీన ఏం మాట్లాడారో వీడియో ముఖంగా చూపించారు వైఎస్ జగన్ఆ నెయ్యి వాడలేదని ఈవోనే రిపోర్ట్ ఇచ్చాడు..మళ్లీ సెప్టెంబర్ 20వ తేదీన టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా ముఖంగా మాట్లాడుతూ ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని వాడలేదంటూ ధృవీకరించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు వైఎస్ జగన్. 22వ తేదీన తాను సంతకం చేసి మరీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాడు ఈవో శ్యామలరావు. ల్యాబ్ టెస్టులో ఫెయిలైన నెయ్యిని వాడలేదని, సదరు ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపామని ఈవో తన రిపోర్ట్లో పేర్కొన్నాడు. -
శ్రీవారిని దర్శించుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా?: అంబటి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు. అశాంతి తలెత్తేలా ప్రభుత్వమే ప్రయత్నించడం దారుణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్ తిరుపతి వెళ్తుంటే ప్రభుత్వానికి ఆందోళన ఎందుకు అంటూ ప్రశ్నించారు.‘‘వైఎస్ జగన్ తిరుపతి ఎట్లా వస్తాడో చూస్తామని కొందరు మాట్లాడుతున్నారు. హైదరాబాద్కు చెందిన బీజేపీ నేతలు, తిరుపతి జనసేన నేతలు, టీడీపీ వారిదీ అదే మాట. ఇంత విచిత్రమైన పరిస్థితిని నేనెప్పుడూ చూడలా. వైఎస్ జగన్ ఓ ఆరుగురితో కలిసి తిరుపతి వెళ్తున్నారు. అధికారికంగా అందరికీ తెలిసినదే. ఆయన వెంట ఎవరూ వెళ్లొద్దంటూ పోలీసులు ఆంక్షలు పెట్టడమేంటి?. వేంకటేశ్వరస్వామిని మాజీ సీఎం దర్శించుకోవడానికి అనుమతి లేకపోవడమేంటి?. దేవుడి దర్శనానికి ఒకరి అనుమతి కావాలా. దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా? అని అంబటి రాంబాబు నిలదీశారు.ఇదీ చదవండి: తిరుపతిలో వైఎస్ జగన్పై దాడికి కుట్ర?!‘‘డిక్లరేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతాడు. బీజేపీ పురంధేశ్వరి మాట్లాడతారు. వేంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం వాడుకోవడం నీచాతినీచం. వైఎస్సార్, వైఎస్ జగన్ అనేక మార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టువస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ జగన్ తిరుమల వెళ్లారు. అప్పుడెప్పుడూ రాని అభ్యంతరం ఇప్పుడెందుకు?. లడ్డూ చుట్టూ రాజకీయం చేసి మీరు బాగుపడాలని ప్రయత్నం చేస్తే మీకే నష్టం. పదివేల మందితో జగన్ దర్శనానికి వెళ్తున్నారని పోలీసులు నోటీసులివ్వడం బాధాకరం. చంద్రబాబు అగ్లీ చేష్టలను ప్రజలు హర్షించరు’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
తిమ్మిని బమ్మిని చేసే యత్నం.. బాబు పాత టెక్నిక్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక విశిష్టత ఉంది. చెప్పదలుచుకున్న అబద్ధాన్ని నిజం అనిపించడానికి అన్ని అవకాశాలూ వాడుకుంటారు. రాజకీయ ప్రత్యర్థులపై బురద వేయడానికి ఏ అవకాశాన్నీ వదులుకోరు. మొహమాటపడరు కూడా. శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఒక తప్పుడు ఆరోపణ చేసి దాన్ని నిజం చేసేందుకు ఇప్పుడు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు చంద్రబాబు నైజానికి తాజా నిదర్శనం. సీబీఐ విచారణకు ససేమిరా అంటూ తనకు కావాల్సిన అధికారులతో ఏర్పాటు చేసుకున్న సిట్తో కొత్త డ్రామా కూడా అదే. ఈ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ కూడా పూర్తిస్థాయిలో సిద్ధం కావడంతో తెలుగుదేశం అనుకూల మీడియా ఇప్పుడు హైరానా పడుతోంది. నెపాన్ని వైఎస్సార్సీపీపై నెట్టేందుకు కనిపించిన చెత్తా చెదారమంతా పోగేసి ప్రచారం చేస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపేశామని ముందు చెప్పిన టీటీడీ అధికారులు ఇప్పుడు మాట మారుస్తూండటం! కల్తీ గురించి తెలియక నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీలో వాడేశామంటున్నారు వాళ్లిప్పుడు! ఈ కథనం కూడా ఈనాడులోనే ప్రచురితమైంది. అంతేకాదు... ఏఆర్ డెయిరీ ఫుడ్స్ జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని మాకు సరఫరా చేసిందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు.. అంటే రెండు నెలల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యమైంది ఎందుకు అన్న ప్రశ్నకు వారిస్తున్న సమాధానం మరీ విచిత్రంగా ఉంది. సరఫరా అయిన తరువాత అనుమానం కొద్దీ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపామని అంటున్నారు! కొందరు స్వార్థపూరిత శక్తులతో చేతులు కలిపిన ఏఆర్ డెయిరీ కుట్రపూరితంగా ఇలా చేసిందని టీటీడీ జీఎం మురళీ కృష్ణ తన ఫిర్యాదులో చెప్పుకొచ్చారని సమాచారం. ఈ ఫిర్యాదులోని అంశాల్లో నిజానిజాలను కాసేపు పక్కన బెడదాం. టీటీడీ అధికారులు స్వయంగా.. కల్తీ గురించి తెలియక లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యిని వాడేశామంటే.. అది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసినట్లు ఒప్పుకోవడమే కదా? అంటే... ప్రభుత్వం ఇంతకూ తెగించిందన్నమాట. ప్రజలన్ని మోసం చేసినా ఫర్వాలేదు కానీ.. తమ రాజకీయ లక్ష్యాలు మాత్రం నెరవేరాలని అనుకుంటున్నట్లే. కల్తీ జరిగిన నెయ్యిని భక్తులు తిన్నారని చెప్పడం దుర్మార్గం. ఇదంతా చంద్రబాబు కుత్సిత రాజకీయ నాటకంలో రెండో అంకమని అనుకోవాలి. ఈవో అబద్ధం చెప్పాడా? లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీపై బాబు అసత్య ప్రచారం మొదలైన సమయంలో ఆయన స్వయంగా నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు ఏమన్నాడన్నది ఒకసారి గుర్తు చేసుకోవాలిప్పుడు. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని గుర్తించి వెనక్కు పంపామని ఆయన ఎందుకు చెప్పారు? అందుకు భిన్నంగా నెయ్యిని వాడేసి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవాలి కదా? ఎందుకు బాబు ప్రభుత్వం వెనకాడుతోంది? కల్తీ జరిగిందని గుర్తించక వాటిని వాడేశామని టీటీడీ అధికారులు నిస్సిగ్గుగా చెబుతుంటే మూడు నెలలైనా వారిపై చర్యలేవి? కేసు వివరాలు ఇప్పుడు ఈనాడులో ప్రముఖంగా వచ్చాయి. ఆ పత్రిక ఎక్కడా ఇలాంటి సందేహాలను లేవనెత్తక పోవడం.. ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లుగా కథనం ప్రచురించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అదే సమయంలో లడ్డూ తయారీకి వాడుతున్న జీడిపప్పు, యాలకులు నాసిరకం అంటూ మరో కథనాన్ని ఈనాడు అచ్చుగుద్దింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో అడుగడుగునా అవకతవకలు జరిగాయని విజిలెన్స్ వారు ఇప్పుడు కనిపెట్టారట. ఎంత హాస్యాస్పదం. నిజానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా టీటీడీకి సంబంధించిన వివిధ సమస్యలపై వార్తలు వస్తునే ఉంటాయి. తిరుమల భక్తుల అగచాట్లపై ఇదే ఈనాడు మూడు దశాబ్దాల క్రితం కూడా కథనాలు ప్రచురించింది. విశేషమేమిటంటే మతం, దైవం అంటే అంత విశ్వాసం లేని సీనియర్ పాత్రికేయుడు, ఏడు తరాల పేరుతో రూట్స్ గ్రంథానిన అనువదించిన ప్రముఖుడు అయిన ఉమా మహేశ్వర రావును ఇందుకోసం ఈనాడు యాజమాన్యం ప్రత్యేకంగా తిరుమలకు పంపి మరీ కథనాలు సిద్ధం చేయించింది. మరి... ఇందుకు అప్పుడు తిరుమలకు అపచారం జరిగిందని అప్పుడెవరూ గొడవ చేయలేదే! కానీ ఇప్పుడు వైఎస్సార్ సీపీపై ఏదో ఒక బురద చల్లడం కోసం రకరకాల దిక్కుమాలిన రిపోర్టులు తయారు చేస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తోంది ఈనాడు! ఇక ఆంధ్రజ్యోతి ఒక కథనం రాస్తూ లడ్డూ ప్రసాదం అపవిత్రం అవడం పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉందని రాశారు. అంటే చంద్రబాబు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా వీరు భజన చేస్తున్నారన్న మాట. ఈ విషయమై డిజిపి సిట్ అధికారులకు దిశా నిర్దేశం చేశారట. కల్తీ నెయ్యిపై శ్రీ వైష్ణవులు అభ్యంతరం చెబితే వారిని బెదిరించారని కొత్త కథలు అల్లుతున్నారు. ఈ రకంగా చంద్రబాబు చేసిన తప్పును కప్పిపుచ్చి వైఎస్సార్సీపీపై ఆరోపణ చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయి. జంతు కొవ్వు కలిసిన నెయ్యి తమ చేతికి అంటిందని భావించి ఉంటే శ్రీవైష్ణవులు అప్పుడే కచ్చితంగా నిరసన తెలిపేవారు. అసలు అలాంటి కల్తీ జరిగితే ఆ వాసనను వీరు భరించడమే కష్టమయ్యేది. శ్రీవారిని నమ్మే వారు ఎవరో చేసిన బెదిరింపులకు ఎందుకు భయపడతారు? టీటీడీ మీడియా కట్టు కథలు రాస్తున్నది అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? ఈ మీడియా చెప్పేవాటిలో నిజముంటే చంద్రబాబు ప్రభుత్వం ఇంతకాలం చర్య తీసుకోకుపోవడంలో మతలబు ఏంటో వివరించాలి కదా! మొత్తం ఇదంతా కూడా బ్లాక్ మెయిల్ వ్యూహంలో ఒక భాగంగా కనిపిస్తోంది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ జరిగితే తాము చేసిన ఘోర అపచారం బయటకు వస్తుందేమోనని భయపడి చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే మీడియా ముందస్తుగా కొత్త కథలు అల్లి జనంపై రుద్దుతున్నట్టుగా వుంది. వైఎస్సార్సీపీ హయాంలో దేవాలయాలకు సంబంధించి ఏ చిన్న ఘటన జరిగినా దాని వెనక పలుచోట్ల జనసేన, తెలుగుదేశం వారి హస్తముందని పోలీసుల విచారణలో వెల్లడైనా అదంతా వైఎస్సార్సీపీవారి పనేననంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి వారు అసత్య ప్రచారం చేసేవారు. మత రాజకీయం చేయడానికి ఎక్కడా వెనకాడేవారు కాదు. ప్రస్తుతం తిరుమల లడ్డూ విషయంలో కూడా అదే తరహా మత రాజకీయం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రెండు రోజుల క్రితం ఒక రథాన్ని కొందరు దుండగులు దగ్ధం చేశారు. మరి ఇది టీడీపీ ప్రభుత్వానికి మచ్చ కాదా? ఈ దుశ్చర్యను వైసీపీకి పులమడానికి చంద్రబాబు ప్రయత్నిస్తే రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాత్రం ఈ ఘటనకు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు రాజకీయం ఇలా ఉంటుందన్నమాట. అంతే కాకుండా ఇలాంటి నేరాలు చేస్తే మక్కెలిరగ్గొడతామని సీఎం చెబుతున్నారు.ఇంతకాలం జరిగిన హింసాకాండను ఆయన ఎలా సమర్థించారో చెప్పాలి. దౌర్జన్యాలకు పాల్పడ్డ ఎంతమంది టీడీపీ శ్రేణుల మక్కెలు విరగ్గొట్టారు? కబుర్లు ఆకాశానికి అంటుతాయి. చర్యలు మాత్రం పాతాళంలో ఉంటాయి.! వైఎస్ జగన్ హయాంలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయడానికి చంద్రబాబు ,పవన్ కల్యాణ్ లు ఎన్నిరకాలుగా రెచ్చగొట్టేవారో చూశాం. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చాక కూడా అదే రకంగా మత రాజకీయాలు చేస్తూ ఉసిగొలుపుతూ, పైగా ఎదురు దాడి చేస్తున్నారు. అదే కాదు విజయవాడ వరదల్లో చాలా సాయం చేశామంటూ ఒక సమావేశం పెట్టుకొని అందులో కూడా తన కుట్ర రాజకీయాలను వదలి పెట్టలేదు. బోట్లను నదిలోకి వదిలి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి వైఎస్సార్సీపీ కుట్ర పన్నిందని ఆయన మరోసారి ఆరోపించారు. ఆ బోట్లు తెలుగు దేశం వారివి అని తెలిసినా ఆయన ఇలా మాట్లాడుతూనే ఉంటారు. వరదల్లో ఆయనకు ఆయనే సర్టిపికెట్ ఇచ్చుకుంటారు. మంచి చేస్తే ఫర్వాలేదు. కానీ వరద బాధితులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నవారు ఉన్నారు. వరద సాయం అందడంలో కొన్ని సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. రేషన్ కార్డులు లేవని సాయం అందని భవానీ పురం కరకట్ట వాసులు ఆందోళనకు దిగితే వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ విషయాన్ని కూడా మరిచిపోవద్దు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో, చంద్రబాబు పాలన గతంలో ఎన్నడూ లేని విధంగా నాసిరకంగా, మత రాజీకాయలు చేయాలన్న లక్ష్యంతో, అబద్దాల పాలన సాగుతుండడం అత్యంత దురదృష్టకరం. వీటితో సూపర్ సిక్స్ హామీలను జనం మరిచిపోతారని ప్రభుత్వ నేతలు భ్రమపడుతున్నారేమో!-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తప్పు చేస్తున్నావ్ చంద్రబాబూ.. వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని.. కానీ వైఎస్ జగన్పై మాత్రం బురదజల్లుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.అన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. ప్రజలను మభ్యపెట్టడానికి డ్రామాలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం వాళ్ల వైపే వేళ్లు చూపే పరిస్థితి వచ్చింది. ఒక మతంపై బురద జల్లడంపై చంద్రబాబు, పవన్కు బుద్దిలేదని ప్రజలు భావిస్తున్నారు. వైఎస్ జగన్.. స్వామి వారి దర్శనానికి వెళ్తుంటే కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. పోలీసులతో నోటీసులు ఇప్పించి నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల దర్శనానికి అనుమతి దేనికీ..? అనుమతి లేదని నోటీసులు ఇవ్వడం ఏమిటి..?. మా పేరు చెప్పి సాధారణ భక్తులను కూడా ఇబ్బందీ పెడుతున్నారు. మేం ఇలానే ఆలోచిస్తే చంద్రబాబు మా ప్రభుత్వంలో తిరిగే వాడే కాదు’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు.ఇదీ చదవండి: తిమ్మిని బమ్మిని చేసే యత్నం.. బాబు పాత టెక్నిక్!నీచమైన మత రాజకీయాలొద్దు: మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఈ వంద రోజుల్లో ప్రజలకు మీరు ఏమి ఒరగబెట్టారని పండుగలు చేసుకుంటున్నారు..?. మీ సూపర్ సిక్స్లో ఎన్ని అమలు చేశారు..?. మేము చెప్పిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల వద్దకు వెళ్లాం. మీరు వెళ్తుంటే ప్రజలంతా మిమ్మల్ని నిలదీస్తున్నారు. మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఈ రోజు తిరుమల వెళ్లకుండా నోటీసులు ఇచ్చారు...మా రాష్ట్ర అధ్యక్షుడు వస్తుంటే మమ్మల్ని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. లడ్డూ వ్యవహారాన్ని తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారు. పరమ భక్తితో మొక్కే జగన్పై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. విజయవాడలో గుళ్లను కూల్చిన వ్యక్తి చంద్రబాబు అయితే.. వాటిని జగన్ పునర్నిర్మించారు. దేవుళ్లను రాజకీయాలకు వాడుకుంటున్నావ్.. మంచిది కాదు. ఇప్పటికే ఒకసారి నీకు దేవుడి దెబ్బ తగిలింది.. ఇప్పుడు ఏమి జరుగుతుందో ఆ దేవుడికే ఎరుక. చంద్రబాబూ.. నీచమైన మత రాజకీయాలొద్దు. హుందాతనంగా రాజకీయాలు చేయాలిఇది సరికాదు చంద్రబాబూ..: మేయర్ సురేష్ బాబుపవిత్రమైన దేవదేవుని లడ్డూ ప్రసాదంపై అపవిత్ర రాజకీయాలు చేయడం చంద్రబాబుకు సరికాదు. అలాంటి వ్యక్తికి జనసేన, బీజేపీ తోడయ్యి మాటలాడటం దారుణం. వైఎస్ జగన్ హిందూ దేవాలయాలకు ఎందుకు వెళ్ళకూడదో వారు చెప్పాలి. ఏదో ఒక రోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పక తప్పదు. దేశంలో ఎవరూ చేయని సంస్కృతిని చంద్రబాబు తీసుకొచ్చాడుచంద్రబాబు తప్పు మీద తప్పు: పోతిన మహేష్విజయవాడ: వైఎస్ జగన్ తిరుమల వెళ్తుంది శ్రీవారి దర్శనానికి ధర్నాకి కాదని.. చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి తిరుమల ఆలయ దర్శనం చేసుకున్నారు ఆ సమయంలో ఎటువంటి డిక్లరేషన్ అడగలేదు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో వైఎస్ జగన్ దర్శనం చేసుకున్నప్పుడు ఎవరు డిక్లరేషన్ గురించి ప్రస్తావించలేదు. ఈ విషయాన్ని పురందరేశ్వరి ఆ సమయంలో ఎందుకు ప్రస్తావించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.తిరుమల ఆలయ ప్రతిష్టతను శ్రీవారి విశిష్టతను చంద్రబాబు రాజకీయం చేస్తూ తప్పు మీద తప్పు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో మీరు అనేక ఆలయాల్లో దర్శనం చేసుకున్నారు ఆ రోజున మీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. వైఎస్ జగన్ తిరుమల దర్శనంలో ఏ చిన్న అలజడి, అవాంతరం జరిగిన దానికి చంద్రబాబు, కూటమి ప్రభుత్వానిదే బాధ్యత. తిరుమల దర్శనానికి నిబంధనల ప్రకారం నలుగురు లేదా ఐదుగురు వెళతారు ఎవరైనా వేల మందితో వెళ్తారా?. తిరుమల ఆలయ విశిష్టతను రాజకీయాల కోసం వాడుకుంటూ అలజడలు సృష్టించాలని, సెక్షన్ 30 అమలు, నోటీసులు జారీ, ముందస్తు అరెస్టులు వెంకన్న స్వామి దర్శనానికి రావద్దని ఆంక్షలు విధించడం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి.’’ అని పోతిన మహేష్ అన్నారు.కూటమి నేతలకు భయం పట్టుకుంది: ఉషశ్రీ చరణ్తాడేపల్లి: వైఎస్ జగన్ తిరుమలకు వెళ్తున్నట్లు ప్రకటించగానే కూటమి నేతలకు భయం పట్టుకుందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. తమ నేతలకు నోటీసులిచ్చి గృహనిర్భంధం చేశారని మండిపడ్డారు. వందరోజుల్లో కూటమి ప్రభుత్వం విఫలమైంది. అందుకే వందరోజుల సమావేశంలో లడ్డూ అంశాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారు. నిజాలు వెలుగులోకి వస్తాయని చంద్రబాబుకి భయం పట్టుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మేం తిరుమల దర్శనం చేసుకోకూడదాఅభాండాలు మోపి పాపాలు చేశారు కాబట్టే పవన్ దీక్ష చేస్తున్నాడు. వైఎస్ జగన్ ఐదేళ్లు సీఎం హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించారు. వైఎస్సార్ కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. ఇంట్లో దీపారాధన వద్ద మా నాన్న సిగరెట్ వెలిగించుకున్నారని చెప్పిన వ్యక్తి కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. దేవుడి పేరుతో చంద్రబాబు,పవన్, బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. దీనికి భవిష్యత్తులో ఫలితం మీరు అనుభవించక తప్పదు. ధర్మాన్ని కాపాడే నాయకుడు మా జగన్’’ అని ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. -
లడ్డూ వివాదం.. సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డు వివాదంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ముందుగా దీనిపై అక్టోబర్ 4న విచారణ చేపడతామని సుప్రీం తెలుపగా.. తాజాగా విచారణ తేదీలో మార్పులు చేసింది. అటు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్తోపాటు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి పిటిషన్ను కలిసి ఒకేసారి విచారించనుంది సర్వోన్నత న్యాయస్థానం.కాగా లడ్డూ వివాదంపై నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సుబ్రమణ్య స్వామి సైతం సుప్రీంను ఆశ్రయించారు. వైవీ సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలని అన్నారు. చంద్రబాబు వేసిన సిట్తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెప్పే అవకాశం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘లడ్డూ’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు -
‘జగన్ తిరుమలకొస్తే ఆంక్షలా? ఎందుకంత భయం బాబూ’
సాక్షి, తిరుపతి: ఆలయాలకు ఎవరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతుంది హిందూ ధర్మం. అలాంటిది.. ఐదేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేతను అడ్డుకోవాలని చూస్తారా?. జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి.‘‘మా పార్టీ నేతలందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జగన్ అంటే చంద్రబాబుకు ఎంత భయమో దీని బట్టి చూస్తే అర్థమవుతోంది. వైఎస్ జగన్పై నీచాతినీచంగా రాజకీయ దాడికి దిగుతున్నారు. దేవుడిపై భక్తి లేని వారు జగన్ను కట్టడి చేయాలని చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. వైఎస్ జగన్పై గతంలో లేని ఆంక్షలు ఇప్పుడెందుకు? అంటూ భూమన ప్రశ్నించారు.‘‘చంద్రబాబూ.. ఇకనైనా మీ రాజకీయాలు ఆపండి. మీరు ఎంత నిర్బంధానికి గురిచేస్తే అంతగా పైకి లేస్తాం. మీ పాపపు పాలనపై ప్రజా పోరాటం చేస్తాం. వేదమూర్తి ప్రసాదం మీద వెయ్యి నాలుకలతో మాట్లాడకండి. చంద్రబాబు మీరు చాలా పాపం చేశారు. చంద్రబాబూ మీరొక మాట.. పవన్ మరో మాట మాట్లాడతారు. చంద్రబాబు శిష్యులు జగన్ను రానివ్వం అంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. బీజేపీ నేతలు డిక్లేరేషన్ కోసం భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు’’ అంటూ కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: తిరుమలకు జగన్.. కూటమి సర్కార్ ‘అతి’ చేష్టలు‘‘వైఎస్ జగన్ ఒక భక్తుడిగా శ్రీవారి దర్శనానికి వస్తున్న సమయంలో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందంటూ రాయలసీమ వ్యాప్తంగా హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. జగన్ను చూస్తే చంద్రబాబుకు భయం వేస్తుంది. ర్యాలీలు అంటే మీకు భయం, 10 వేల మందిని సమీకరిస్తున్నారంటూ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. మేము ఎక్కడ జన సమీకరణ చేయడం లేదు. మీరు చేసిన పనికి డిఫెన్స్లో పడిపోయారు...వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూజలు చేయడానికి అర్హత లేదా?. వైఎస్ జగన్ వెంట ఎవరు రాకూడదని చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. చంద్రబాబు నిరంకుశ విధానాలు వ్యతిరేకిస్తాం. ప్రజా గొంతుక వినిపిస్తాం. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మీరు ఎంతకైనంతెగిస్తారు చంద్రబాబు. సనాతన హిందూ పరిరక్షణకు ఎన్నో కార్యక్రమాలు వైఎస్సార్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఈవో శ్యామలరావును ఒకటే అడుగుతున్నాం.. ఇప్పటి వరకు వెళ్లిన నెయ్యి ట్యాంకర్లు వివరాలు చెప్పాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. -
‘సిట్’తో వాస్తవాలు బయటకు రావు’
సాక్షి, విశాఖపట్నం: టీటీడీ లడ్డూ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని వీహెచ్పీ నేత కోటేశ్వర శర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సిట్’తో విచారణ జరిపితే వాస్తవాలు బయటికి రావన్నారు. న్యాయ విచారణ అయితే నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు.లడ్డులో కొవ్వు పదార్థాలు కలిశాయనే ఆధారాలు మా దగ్గర లేవు. మీడియాలో వస్తున్న కథనాలు ప్రకారం మాట్లాడుతున్నాము. అసలు వాస్తవాలు బయటకు రావాలంటే న్యాయ విచారణ జరిపించాలి’’ అని కోటేశ్వర శర్మ చెప్పారు.కాగా, తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ చీఫ్గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉండనున్నారు.ఇదీ చదవండి: తిరుమలకు జగన్.. కూటమి సర్కార్ ‘అతి’ చేష్టలుఈ సిట్ బృందం శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరపనుంది. కాగా ఏపీ ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులను ప్రోత్సహించినట్లు సర్వశ్రేష్ట త్రిపాఠిపై ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో త్రిపాఠిపై వైఎస్సార్సీపీ గవర్నర్కు ఫిర్యాదు కూడా చేసింది.పల్నాడులో అల్లర్లు సమయంలో త్రిపాఠి గుంటూరు ఐజీగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పల్నాడులో ఎన్నికల నిర్వహణ జరిగింది. ఎన్నికల సమయంలో దేశంలో ఎక్కడా లేని అల్లర్లు త్రిపాఠి హయాంలో జరిగాయని ఈసీ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే అలాంటి వివాదాస్పద అధికారితో సిట్ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తిరుమలకు జగన్.. కూటమి సర్కార్ ‘అతి’ చేష్టలు
తిరుపతి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనకు ఎలాగైనా అవాంతరాలు కలిగించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధికారం చేతుల్లో ఉంది కదా అని అడ్డగోలు ఆంక్షలతో ఆధ్యాత్మిక నగరాన్ని పోలీసుల వలయంగా మార్చేసింది. మరోవైపు నోటీసులు, హౌజ్ అరెస్టులతో వైఎస్సార్సీపీ నేతలనూ వేధింపులకు గురి చేస్తోంది.శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ఆరోపణలు.. తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని జగన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేసిన ఈ పాపానికి పరిహారంగా ప్రక్షాళన పూజలు చేయాలని వైఎస్సార్సీపీకి కేడర్కు ఆయన పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంతోనే ఆయన శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే..జగన్ ఇవాళ సాయంత్రమే తిరుమలకు వెళ్లనున్నారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నాం తాడేపల్లికి తిరుగు పయనం అయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పర్యటన కావడం.. పైగా ఈ పర్యటనను ప్రత్యర్థి పార్టీలు రాద్ధాంతం చేసే అవకాశం ఉండడంతో ఎటువంటి హడావిడి చేయొద్దని, ప్రత్యర్థులు కవ్వింపులకు పాల్పడ్డా సంయమనం పాటించాలని పార్టీ కేడర్కు ఇప్పటికే ఆయన సూచించారు. అయినప్పటికీ.. కూటమి ప్రభుత్వం అతి చేష్టలకు దిగింది. ఇదీ చదవండి: వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’గోలమునుపెన్నడూ లేని విధంగా తిరుపతి తిరుమలలో పోలీసు మోహరింపు కనిపిస్తోంది. సుమారు వెయ్యి మంది పోలీసులతో జిల్లా వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. ఉన్నపళంగా పోలీస్ యాక్ట్ 30ను తెరపైకి తెచ్చారు. ఈ వంకతో గత రాత్రి నుంచి వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా పోలీసు 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సహకరించాలని పోలీసులు అంటున్నారు. అక్టోబర్ 24వ తేదీ దాకా.. సభలు, సమావేశాలు, ర్యాలీలకు, నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయాని హెచ్చరికలు జారీ చేశారు. అయితే జగన్ తిరుమల దర్శన కార్యక్రమానికి అనుమతుల్లేవంటూ పోలీసులు ఆ నోటీసుల్లో ప్రస్తావించడం గమనార్హం!.ఇక వైఎస్ జగన్ ఈ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాలలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేల మంది వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయనకు ఆహ్వానం పలికేందుకు వస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. అదే టైంలో అదే సోషల్ మీడియాలో ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా తాము సెక్షన్ 30 అమలు చేస్తున్నామంటున్నారు. దీంతో.. ఎయిర్పోర్ట్ నుంచే జగన్ పర్యటనకు అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన వెంట నేతలెవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవచ్చని సమాచారం. మరోవైపు.. చుట్టుపక్కల నాలుగు జిల్లాల నుంచి వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు తరలి రావొచ్చనే సమాచారంతోనే తాము తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఈ హడావిడితో సాధారణ ప్రజలు, భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులతో పాటు భయాందోళనకు గురవుతున్నారు. ఆధ్యాత్మిక సందర్శనకు రాజకీయ రంగు పులుముతున్నారని.. గతంలో ఎన్నడూ ఇలా నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టిన ఘటనలు లేవని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి గుర్తు చేస్తున్నారు.నేతల గృహనిర్భంధాలుజగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో.. చుట్టుపక్కల జిల్లాలోనూ వైఎస్సార్సీపీ నేతలను గృహ నిర్భందం చేస్తున్నారు. మరోవైపు.. తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ నేతల గృహ నిర్భంధం కొనసాగుతోంది. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంటిని వేకువ ఝామునే చుట్టుముట్టిన పోలీసులు.. జగన్ కార్యక్రమానికి వెళ్ళడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో ఆకేపాటి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
‘చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు’
అన్నమయ్య జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థల మీద రాజకీయం చేస్తుంటాడని, ఇప్పుడు ఏదీ లేక వెంకటేశ్వరస్వామితో రాజకీయం చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. వెంకటేశ్వరస్వామితో రాజకీయం చేసే చంద్రబాబు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు.వంద రోజుల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చాడని, అసలు పరిపాలన ఏం చేశాడని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన ఎటువంటి హామీలు నెరవేర్చని చంద్రబాబు.. ఇప్పుడు ఆర్భాటాలతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్సిక్స్ హామీలు అమలు చేయలేక, యూట్యూబ్లో యాడ్స్లాగా డైవర్ట్ చెయ్యడానికి తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్ మైసూర్లో ఉంటే, గుజరాత్లోని ల్యాబ్లో లడ్డు టెస్ట్ చేయించారన్నారు. అందులో మర్మం ఏమిటని శ్రీనివాసులు నిలదీశారు. శ్రీవెంకటేశ్వరస్వామికి ఒక్కసారి కూడా తలనీలాలు ఇవ్వని చంద్రబాబుకు వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైఎస్ జగన్ తన పాదయాత్రకు ముందు తరువాత తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు శ్రీనివాసులు. -
కూటమి ప్రభుత్వానికి వంగా గీత చాలెంజ్
కాకినాడ, సాక్షి: రాజకీయంగా ఎదుర్కొనలేకే తిరుపతి లడ్డూ ప్రసాదం ద్వారా వైఎస్ జగన్పై కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని, దమ్ముంటే ఆ ఆరోపణలను నిజమని నిరూపించాలని వైఎస్సార్సీపీ నేత వంగా గీత సవాల్ విసిరారు. పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గీత గురువారం మధ్యాహ్నాం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ‘‘ సిట్ పేరిట చంద్రబాబు తమకు కావాల్సిన మనుషులతో విచారణ జరిపిస్తే ఎలా?. టీటీడీ లడ్డు వివాదంలో నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. సీబీఐ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. చేసిన ఆరోపణల్లో కూటమి ప్రభుత్వం నిజనిజాలు తేల్చాలి అని గీత అన్నారు.జగన్ను రాజకీయంగా తగ్గించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు తిరుమల లడ్డుపై ఆరోపణలు చేశారు. ముందు ఆ ఆరోపణలను నిజాలు అని నిరూపించండి. అప్పుడు జగన్ డిక్లరేషన్ గురించి మాట్లాడడండి అని రాజకీయ ప్రత్యర్థులకు ఆమె సవాల్ విసిరారు. చివర్లో దేవుడితో.. టీటీడీతో ఆటలొద్దని కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబుకి ఆమె హెచ్చరిక జారీ చేశారు. -
లడ్డూ వివాదం: ‘బాబు, లోకేష్ తిరుమలలో ప్రమాణం చేయగలరా?’
సాక్షి, తిరుపతి: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ, సిట్టింగ్ జడ్డీతో విచారణ జరిపించాలన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారిపై తప్పుడు ప్రచారం చేసిన వారికి దేవుడే తగిన శిక్ష విధిస్తాడని చెప్పుకొచ్చారు.మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కులాలు, మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను చూస్తుంటే మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నట్టు ఉంది. రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్న వారికి దేవుడే తగిన శిక్ష వేస్తాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదే అంశంపై నెల్లూరు జిల్లాలో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మామని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ డ్రామాకు తెర తీశారు. వైఎస్ జగన్పై విమర్శలు చేయడం దారుణం. లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు, లోకేష్ తిరుమలలో ప్రమాణం చేయగలరా?’ అని సవాల్ విసిరారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ దేవరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెగ -
గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచాక ఇంకో అవతారం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ‘‘గెలిచే ముందు ఒక అవతారం. గెలిచాక ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం.. ఎందుకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్’’ అంటూ తనదైన శైలిలో పరోక్షంగా పవన్ను ఉద్దేశించే ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం..ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్? #justasking— Prakash Raj (@prakashraaj) September 26, 2024తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఆరోపణలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ప్రకాష్ రాజ్.. పవన్ కల్యాణ్ను కోట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ‘మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు)’’ అని పేర్కొన్నారు.దీనిపై పవన్ కల్యాణ్ మంగళవారం కనకదుర్గమ్మ ఆలయం వద్ద స్పందించారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉన్నప్పటికీ.. సున్నితాంశాలపై తెలుసుకుని మాట్లాడాలని పవన్ సూచించారు. ‘‘ ప్రకాష్ రాజ్తో పాటు పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని, అప్పటిదాకా వీలుంటే తన ట్వీట్ మళ్లీ చదవి అర్థం చేసుకోవాలని’’ అని పేర్కొన్నారు. ఈ లోపు..ఈలోపే.. ‘సత్యం సుందరం’ ఈవెంట్లో ‘లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైంది’ అని నటుడు కార్తీ నవ్వుతూ చెప్పడంపైనా పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దని సూచించడంతో కార్తీ క్షమాపణ చెప్పారు. అందుకు పవన్ బదులిస్తూ, కార్తి కావాలని అనలేదని అర్థమైందని అనడంతో అక్కడికి ఆ వివాదం ముగిసింది. అయితే.. ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్...’ అని ప్రకాశ్రాజ్ పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం ఇక్కడితోనే ముగిసిపోదని అర్థమైంది. -
సరికొత్త కుట్రకు తెర తీసిన చంద్రబాబు!!
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణ మీద దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ జరగాలని కోరుతుంటే, ఆయన మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించడం చర్చనీయాంశమైంది. చేసిన తప్పు నుంచి బయటపడడానికి చంద్రబాబు ఈ ప్లాన్ వేశారన్న ఆరోపణలూ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సిట్లను సాధారణంగా ముఖ్యమంత్రితో ముడిపడని అంశాల మీదే ఏర్పాటు చేస్తుంటారు. కానీ శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణను స్వయంగా ముఖ్యమంత్రే చేశారు. విచారణ జరిగితే ముందుగా ఆయన వద్ద నుంచే సమాచారం సేకరించాల్సి ఉంటుంది.అందువల్ల సిట్ దర్యాప్తుతో పెద్దగా ప్రయోజనం ఉండదనేది ఎక్కువమంది భావన. పైగా వివాదస్పద, పక్షపాతంతో వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని పనిగట్టుకొని సిట్ సారథిగా నియమించడం కచ్చితంగా దురుద్దేశంతో చేస్తున్న ప్రక్రియగానే అనిపిస్తోంది. గతంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పనిచేసిన గోపీనాధ్ జెట్టీని సిట్ సభ్యునిగా నియమించారు. ఇందులో హేతుబద్దత ఏమిటో తెలియదు. చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం ఉండి ఉంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పని చేసిన వ్యక్తిగా కూడా ఆ తప్పుతో సంబంధం ఉండే అవకాశముంది.సిట్ విధి విధానాలు ఇంకా వెల్లడి కాలేదు గానీ అందులో కీలకమైన అంశాలకు ఎంతమేరకు తావు ఉంటుందనే సందేహమే. ఉదాహరణకు లడ్డూలో కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో శ్యామలరావు, మంత్రి లోకేష్ ప్రకటించారు. కానీ చంద్రబాబేమో లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని చెబుతున్నారు. ఇందులో ఎవరిది సత్యమన్నదన్న విషయాన్నిన్ని ఈ సిట్ నిర్ధారిస్తుందా? జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలుగానీ ,ఇతర ఆహార పదార్థాలుగానీ విపరీతమైన దుర్వాసన వస్తాయని రుచి శ్రీవాస్తవ లాంటి ఆహార పరిశోధకులు చెబుతున్నారు. ఆవు నెయ్యి కంటే ఫిష్ ఆయిల్, పిగ్ ఆయిల్ ఖరీదు ఎక్కువేనని అందువల్ల వాటిని కలిపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నిపుణులను సిట్ అన్ని కోణాల్లో విచారణ చేస్తుందా? లేకపోతే చంద్రబాబు ఏం చెబితే అదే చేస్తారా? వేచి చూడాలి. ఇప్పటికే చంద్రబాబు తన తీర్పు ఇచ్చేసినందున, దానికి విరుద్దంగా నివేదిక వస్తుందా? టీటీడీ ఈవో మొదట ఒక రకంగా, తరువాత చంద్రబాబు చెప్పినట్లుగాను మాట మార్చడమే ఒక నిదర్శనం. జున్, జులై నెలల్లో కొత్త ప్రభుత్వం ఆధీనంలోనే టీటీడీ పని చేసింది. ఏఆర్ కంపెనీ నుంచి పది ట్యాంకర్ల నెయ్యి వస్తే నాలుగు ట్యాంకర్లను తిరస్కరించారు. తిరస్కరించిన నెయ్యిని లడ్డూల్లో వాడే అవకాశమే లేదు. అటువంటపప్పుడు అనుమతించిన నెయ్యిలో కల్తీ ఉందని చంద్రబాబు భావిస్తున్నారా? ఒక వేళ కల్తీ నెయ్యిని అనుమతించి ఉంటే చంద్రబాబు నియమించిన ఈవో శ్యామలరావే బాధ్యుడు అవుతారు కదా? ఆయన్ను విచారిస్తారా? గతంలో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లకు మరోసారి పరీక్షలు నిర్వహించిన సందర్భం లేదు. కానీ ఈ సారి ఏఆర్ కంపెనీ నెయ్యి శాంపిల్స్ నే ఎందుకు ఎన్డీడీబీకి పంపించారు. ఇందులో ఏమైనా కుట్ర ఉందా? చంద్రబాబు హయాంలో 14 సార్లు, జగన్ సమయంలో 18 సార్లు టీటీడీ నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించినప్పుడు ఎందుకు ఇలా శాంపిల్స్ వేర్వేరు ప్రయోగశాలలకు పంపలేదు? కేవలం ఏదో విధంగా జగన్ ప్రభుత్వానికి, వైఎస్సార్ సీపీకి అంటగట్టడానికే ఈ సిట్ ను వేశారనే అభియోగం వస్తోంది. పోనీ సిట్ ఉన్నతాధికారి త్రిపాఠి ట్రాక్ రికార్డ్ ఏమైనా బాగా ఉందా? అని చూస్తే.. ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశానికి పూర్తిగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నేతలపై టీడీపీ విధ్వసకాండ జరిపినా చూసీ చూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఒక అక్రమ కేసులో ఇరికించడం తదితర ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి.చంద్రబాబు నియమించిన సిట్ చీఫ్ త్రిపాఠి ఆయనకు వ్యతిరేకంగా తన రిపోర్ట్ లో ఏమైనా రాసే పరిస్థితి ఉంటుందా? ఇంత సున్నితమైన అంశాన్ని చంద్రబాబు ఎందుకు ఇంత ఘోరంగా ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు? ఆయన టైమ్లో జరిగిన కల్తీని వైఎస్సార్సీపీకి అంటగట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయా సందర్భాల్లో కొన్ని కమిటీలు, కమిషన్లు వేసినా అవి తూతూ మంత్రంగానే సాగాయి. ఉదాహరణకు రాజమండ్రిలో పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. అది కూడా చంద్రబాబు కుటుంబం స్నానాల ఘట్టం షూటింగ్ తీసే సందర్భంలో అయితే ,ఆయన నియమించిన విచారణ కమిషన్ మాత్రం క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేసింది. తప్పు భక్తులది, మీడియాది ఫలానా టైమ్ మంచి ముహూర్తమని ప్రచారం చేయడంవల్లే తొక్కిసలాట జరిగిందని ఆ కమిషన్ చెప్పిందే తప్ప, చంద్రబాబు ఆ స్నానాల ఘట్టానికి వెళ్లడం తప్పని చెప్పలేకపోయింది. అంత పెద్ద ఘటనలో ఒక్క పోలీస్ కానిస్టేబుల మీద కూడా చర్య తీసుకోలేదు. పైగా సీసీ టీవీ పుటేజిని మాయం చేసినా ఎవరికీ ఇబ్బంది రాలేదు. అలాగే కాపుల రిజర్వేషన్ అంశంపై మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు. తీరా మంజునాథ్ తన ఆలోచనలకు భిన్నంగా నివేదిక ఇస్తారని తెలిసిన చంద్రబాబు ఆ కమిటీ సభ్యులతో వేరే నివేదిక తెప్పించి శాసన సభలో పెట్టారు.ఇలా పలు విషయాల్లో చంద్రబాబు టైమ్ లో వేసిన కమిటీలు ఉత్తుత్తి కమిటీలుగానే మిగిలిపోయాయి. శ్రీవారి ప్రసాదం మీద వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు, సుప్రీంకోర్ట్ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తుంటే చంద్రబాబు మాత్రం సింపుల్ గా సిట్ వేసి చేతులు దులుపుకున్నారు. మొదట తాను చేసిన రభస వల్ల తనకే నష్టం జరిగిందని, తన ప్రభుత్వమే ఆత్మరక్షణలో పడిందన్న భయంతోటి ఇలా చేస్తుండవచ్చు. లేదంటే అందరూ కోరుకున్న విధంగా సిబిఐ లేదా ఒక జడ్జి నేతృత్వంలో విచారణకు అంగీకరించేవారు. అలా చేయకపోవడంతో అందరి వేళ్లు ఆయనవైపే చూపెడుతున్నాయి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.ఇదీ చదవండి: Tirupati Laddu Controversy: బాబూ మీరు కొన్నది రూ. 276కే -
Tirumala Laddu Row: రేపు తిరుమలకు వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకతీతంగా ఆయన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకుగానూ.. ఆ పాప ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు.ఈ శనివారం(సెప్టెంబర్ 28) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ కేడర్కు ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనున్నారు. ఇందుకోసం శుక్రవారం రాత్రే ఆయన తిరుమల చేరుకోనున్నారు. శనివారం ఉదయమే ఆయన స్వామివారిని దర్శించుకుంటారు.అంతకు ముందు.. తిరుమల పవిత్రతను, వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం విశిష్టతను, స్వామి వారి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను చంద్రబాబు తన రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారని జగన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.తిరుమల పవిత్రతను,స్వామివారి ప్రసాదం విశిష్టతను,వెంకటేశ్వరస్వామి వైభవాన్ని,టీటీడీ పేరు ప్రఖ్యాతులను,వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2024కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: బాబు లడ్డు కుట్ర.. పోలీసుల వత్తాసు!! -
తీసుకున్న గోతిలోనే.. బాబు అండ్ కో
-
బెడిసికొట్టిన పన్నాగం
-
సీబీఐ, జ్యుడీషియల్ ఎంక్వైరీ.. బాబు మెడకు జంతువుల కొవ్వు.. కొవ్వు పట్టిందా ? లేదా ?
-
తిరుపతి లడ్డు వివాదంపై పేర్ని నాని ఫస్ట్ రియాక్షన్
-
తాము తీసుకున్న గోతిలోనే.. బాబు అండ్ కో!
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం సృష్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకు వంత పాడిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అదే భజన చేసిన ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి మొదలైనవి తాము తీసిన గొయ్యిలో తామే పడ్డట్టుగా అయింది. మాజీ ముఖ్యమంత్రిపైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పైనా బురద చల్లాలన్న తాపత్రయంతో, దురుద్దేశంతో వీరంతా కలిసి చేసిన కుట్ర బహిర్గతమవుతోంది. అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్లు చర్చను వేరే అంశాలపైకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.ఈనాడు, ఆంధ్రజ్యోతిలు స్వరం మార్చి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న వార్తల బదులు ఇంకేవేవో కథనాలు ఇస్తూ పాఠకుల్ని దారి మళ్లించాలని ప్రయత్నిస్తోంది. వివాదం మొదలైన మొదటి రెండు రోజులపాటు రెచ్చిపోయి కథనాలు గుప్పించిన వీరు సోమవారం నుంచి రివర్స్లో వెళుతున్నారు. ఇందుకు కొన్ని స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలించిన 2014-19 టైమ్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం రూ.300 కంటే తక్కువ ధరకే నెయ్యి కొనుగోలు చేసినట్లు స్పష్టం కావడం ఒకటైతే.. నేతికన్నా ఫిష్ ఆయిల్, పిగ్ ఆయిల్ వంటివి అధిక ఖరీదు కలిగినవని వెల్లడి కావడం ఇంకో కారణం.ఈ ఏడాది జులైలో ఏఆర్ కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో నాలుగు ట్యాంకర్లను తిరస్కరించి మిగతావి అనుమతించారు. ఈవో శ్యామలరావు ఏమో కల్తీ నెయ్యిని వాడలేదని చెబితే, వాడేశారని చంద్రబాబు వాదించారు. ఇదే నిజమైతే ఆయన నియమించిన ఈవో శ్యామలరావే బాధ్యులవుతారు కదా. ఆయన్ను వెంటనే పదవి నుంచి తప్పించాలి కదా? సస్పెండ్ చేయాలి కదా? అలాగే నెయ్యిలో కల్తీ ఉన్నప్పటికీ లోపలికి అనుమతించిన ఇతర అధికారులపై వేటు వేయాలి కదా? ఏఆర్ కంపెనీపై కేసు వేయాలి. ఇవేవీ చేయకుండా రెండు నెలలపాటు కథ నడిపి వందరోజుల పాలన సందర్భంగా ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశంలో లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని నీచమైన ఆరోపణ చేయడమేంటి? చంద్రబాబు ఇక్కడే దొరికిపోయారు. కాకపోతే తన మీడియా మద్దతుతో రెండు మూడు రోజులు దబాయించగలిగారు అంతే. ఒక అబద్ధాన్ని చెప్పి దాన్ని కవర్ చేసుకోవడానికి మరిన్ని అబద్ధాలు ఆడారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు అంగీకరిస్తున్నట్టు చెప్పకపోవడం, సిట్ అంటూ కొత్త నాటకానికి తెరతీయడం, మరోవైపు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిల్ వేయడం, అందులో చంద్రబాబుపై నిర్దిష్టమైన ఆరోపణలు చేయడం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వతంత్ర విచారణ కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. మరో మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆలయం ఎదుట ప్రమాణం చేస్తుంటే పోలీసులు అడ్డుపడిన తీరు కూడా సందేహాలకు తావిస్తోంది. సుబ్బారెడ్డి విసిరిన సవాలుకు చంద్రబాబు ముందుకొచ్చి ప్రమాణం చేయకపోవడం అనుమానం కలిగించే అంశమే. పదకొండు రోజులు దీక్ష చేస్తానన్న పవన్ కల్యాణ్ రెండో రోజే తన తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్లో పాల్గొనడం గమనార్హం. అంటే ఆయన కూడా ఇందులో నిజం లేదన్న భావనకు వచ్చి ఉండాలి. వీటన్నిటి రీత్యా చంద్రబాబు అండ్ కో తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టయిందన్న భావన కలుగుతోంది. కోట్లాది మంది హిందువుల, తిరుమలలేశుని భక్తుల మనోభావాలను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే దెబ్బతీశారన్న విషయం ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. కొందరు నిపుణులు చెబుతున్న ప్రకారం ఎన్డీడీబీకి తిరస్కృత నెయ్యి శాంపిల్స్ పంపినప్పుడు దాన్ని సరఫరా చేసిన కంపెనీ వారికి కూడా ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా చేసినట్టు కనిపించడం లేదు. అలాంటప్పుడు టెస్టింగ్కు ఆ కంపెనీ నమూనాలే పంపారన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నించవచ్చట. ఏఆర్ కంపెనీకి టీటీడీ ఇచ్చిన నోటీసులో విజిటబుల్ ఫాట్ ఉందని చెప్పడం గమనార్హం. చంద్రబాబు చెబుతున్నట్లు జంతువుల కొవ్వు కల్తీ జరిగి ఉంటే అదే విషయాన్ని నోటీసులో ప్రస్తావించాలి కదా!. అంటే చంద్రబాబు చెప్పింది తప్పే అవుతుంది కదా!. గతంలో చంద్రబాబులో టైమ్లోగానీ, ఆ తర్వాత వైఎస్ జగన్ సమయంలోగానీ ఇలా నెయ్యి ట్యాంకర్లను నాణ్యత సరిగా లేదని తిరుపతిలో జరిగే పరీక్షల్లో తేలితే వెనక్కి పంపించే వారు. ప్రత్యేకంగా ఏ ఎన్డీడీబీకో, మరొక సంస్థకో పంపి పరీక్షలు జరిపేవారు కాదు. అలాంటప్పుడు ఏఆర్ కంపెనీకి సంబంధించి శాంపిల్స్నే ఎందుకు గుజరాత్ దాకా పంపించారనే ప్రశ్న వస్తోంది. పోనీ ఎన్డీడీబీ వారైనా నిర్దిష్టంగా ఫలానా కల్తీ జరిగిందని చెప్పారా? లేదు. అటువంటప్పుడు జంతు కొవ్వు కల్తీ జరిగిందని, దానిని లడ్డూలలో వాడారని చంద్రబాబుకు ఎవరు చెప్పారు?.మంత్రి లోకేష్ కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదని చెబుతుంటే తండ్రి చంద్రబాబు వాడారని చెబుతున్నారు. మరి ఇందులో ఏది నిజం? గతంలో రివర్స్ టెండర్లు ఎందుకు అని ప్రశ్నించిన చంద్రబాబు తాజాగా అదే పద్ధతిలో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్కు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ను ఎందుకు కేటాయించరన్న ప్రశ్న కూడా వస్తోంది. అందుకే ఈ కంపెనీకి ఫేవర్ చేయడం కోసం, ఏఆర్ కంపెనీని తప్పించడానికి నెయ్యిలో జంతువు కొవ్వు అవశేషాలున్నాయనే ఆరోపణ తెరమీదకు తెచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. గత నెలలో పిలిచిన టెండర్లలో నందిని సంస్థ కిలో నెయ్యి రూ. 470కి కోట్ చేయగా ఢిల్లీలోని ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ రూ. 530కు కోట్ చేసి ఎల్ 2గా నిలిచింది. ఆ తర్వాత కారణమేమైనాగానీ రివర్స్ టెండర్ లోకి వెళ్లారు. నిజానికి ఈ సిస్టమ్లో రివర్స్ టెండర్ కు అవకాశం లేదట. ఈ సారి ఆల్ఫా కంపెనీ రూ. 450, నందిని రూ. 470 కోట్ల చేశాయి. ఈ టెండర్లో ఆల్ఫాకు 65 శాతం నందినికి 35 శాతం నెయ్యి సరఫరా అవకాశం కల్పించారు. నందిని సంస్థ వివాదం లేవనెత్తకుండా ఉండాలనే వారికి కూడా కేటాయించారు. ఇక్కడ విషయం ఏమిటంటే కిలో నెయ్యి రూ. 1000 నుంచి రూ. 1500 లదాకా ఉంటే మరిప్పుడు ఆ రెండు సంస్థలు చంద్రబాబు చెబుతున్న థియరీ ప్రకారం ఇంత తక్కువ ధరకే ఎలా కోట్ చేశారన్నదానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు అని, ఆయన అసత్యాలకు ఒక చరిత్ర వుందని కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. మతపరమైన వివాదాలను సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధికి చంద్రబాబు ప్రయత్నించారనే విషయం స్పష్టంగా కనపడుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. ఇలాంటి చీప్ ట్రిక్స్కు పాల్పడుతున్న చంద్రబాబు ఐదేళ్లు పాలించలేడని సుబ్రహ్మణ్యంస్వామి అంటున్నారు. మామూలుగానైతే ఇంత ఘోరమైన అపచారానికి పాల్పడ్డ వ్యక్తి పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్ వస్తుంది. చంద్రబాబు తాను సృష్టించుకున్న సుడిగుండం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: తిరుమల శ్రీవారిపై రాజకీయం చేసి చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నారని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇదే సమయంలో తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.మాజీ మంత్రి అమర్నాథ్ బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘రాజకీయాల కోసం పసుపు చొక్కాలు వేసుకునే టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం కాషాయ చొక్కాలు వేసుకుంటున్నారు. దేవుడితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలి. చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ వలన ఎలాంటి ఉపయోగం లేదు.ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. లడ్డూ విషయంపై విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ ఇప్పటికే లేఖ రాశారు. ఈ విషయంపై మోదీకి ఫిర్యాదు చేస్తాం అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి -
సిట్.. బాబు స్కిట్.. ఏదో తేడా కొడుతోంది
-
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ పేరుతో స్కిట్ సిద్ధం చేసిన బాబు
-
శ్రీవారి లడ్డూ విషయంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న చంద్రబాబు తప్పులు
-
ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: లడ్డూ ప్రసాదం వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిట్ చంద్రబాబు కోరుకున్నట్టు గానే నివేదిక ఇస్తుందని చెప్పుకొచ్చారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ టీడీపీ నిరాధారమైన ఆరోపణలు చేసింది. ఆ నిరాధార ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన సిట్ పూర్తిగా టీడీపీ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ కమిటీ స్వతంత్రంగా పూర్తిస్థాయిలో విచారిస్తుందన్న నమ్మకం లేదు. చంద్రబాబు కోరుకున్నట్టుగానే ఆ నివేదికను సిట్ ఇస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. The Special Investigation Team (SIT) formed to probe TDP’s unfounded allegations of adulteration in the sacred Tirupati temple laddus is entirely controlled by the TDP government. Led by a police officer and with two additional police members, this committee lacks any real…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 25, 2024ఇది కూడా చదవండి: సిట్.. బాబు స్కిట్ -
ఆయనేమన్నాడు.. ఈయన ఏమనుకున్నాడు?
-
లడ్డూ ప్రసాదం వివాదంపై సిట్ను ఏర్పాటు చేసి తిమ్మిని బమ్మిని చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అది బాబు ప్రభుత్వంలో తెచ్చిన నెయ్యే...
-
తిరుపతికి లడ్డూ ఎలా వచ్చింది?
తిరుపతి లడ్డూపై వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అసలు లడ్డూ ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో కలుగుతోంది. అసలు తిరుమల శ్రీ వేంకటేశుని ప్రసాదంగా లడ్డూ ఎప్పటి నుంచి ఉంది..అసలు లడ్డూయే ప్రసాదంగా ఎందుకు ఉంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు అనిరుధ్ కనిశెట్టి అనే చరిత్రకారుడు ‘ది ప్రింట్’లో రాసిన సమగ్ర కథనంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తొమ్మిదో శతాబ్దం నుంచి ఇప్పటివరకు తిరుపతి చరిత్రను వివరిస్తూ కాలగమనంతో పాటు శ్రీ వేంకటేశుని ప్రసాదం ఎలా మారుతూ వచ్చిందన్నది అనిరుధ్ తన కథనంలో రాసుకొచ్చారు.వేల ఏళ్ల క్రితం తిరుపతి ప్రసాదం ఏంటి..?నిజానికి తిరుమల-తిరుపతి అనగానే లడ్డూ టక్కున గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే తిరుపతి వెళ్లినపుడు ఏడుకొండలవాడిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమైన ఘట్టమో లడ్డూ ప్రసాదం తినడమూ భక్తులకు అంతే ముఖ్యం. ఏడుకొండలకు వెళ్లి లడ్డూ ప్రసాదం ఆరగించడమే కాదు..క్యూలో నిల్చొని కష్టపడి తీసుకున్న లడ్డూను ఇతరులకు పంచి పెట్టడం కూడా భక్తిలో భాగమైపోయాయి. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన లడ్డూ నిజానికి తొలి ఉంచి ఏడు కొండలవాడి ప్రసాదం కాదని అనిరుధ్ చెబుతున్నారు. తొమ్మిదో శతాబ్దం నుంచి 1900 సంవత్సరం వరకు శ్రీవారి ప్రసాదం అన్నం,నెయ్యితో తయారు చేసిన పొంగల్ అని తెలిపారు. లడ్డూ ప్రసాదంగా ఎలా మారింది..?తొమ్మిదో శతాబ్దంలో తిరుపతి పుణ్యక్షేత్రం బ్రాహ్మణుల ఆధీనంలో చిన్న పల్లెటూరుగా ఉండేది.ఆ తర్వాతి కాలంలో చోళులు, విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు, బ్రిటీషర్ల పాలనలో తిరుపతి క్షేత్రంలో చాలా మార్పులు జరిగాయి. శ్రీ వేంకటేశుడి మహిమతో తిరుపతి ప్రభ రోజురోజు పెరుగుతూ వచ్చింది.తొలుత అక్కడ పొంగల్గా ఉన్న ప్రసాదం ఉత్తర భారతీయుల కారణంగా లడ్డూగా మారిందని అనిరుధ్ తన కథనంలో రాశారు. ‘బాలాజీ’ అనే పిలుపు కూడా వారిదే..బ్రిటీషర్ల పాలనలో ఉత్తర భారతీయులు ఎక్కువగా తిరుపతి సందర్శనకు వచ్చేవారని, వీరు వెంకటేశుడిని బాలాజీగా పిలుచుకునే వారని తెలిపారు. వీరే పొంగల్గా ఉన్న తిరుపతి ప్రసాదాన్ని తీయనైన లడ్డూగా మార్చారని అనిరుథ్ రాసుకొచ్చారు.తొలుత బ్రాహ్మణుల ఆధీనంలో తిరుపతి ఉన్నపుడు వెంకటేశునికి స్వచ్చమైన మంచి నీటితో అభిషేకాలు అక్కడ నెయ్యితో వెలిగించిన దీపాలు తప్ప ఎలాంటి నైవేద్యాలు ఉండేవి కాదని కథనంలో అనిరుధ్ పేర్కొనడం విశేషం. ఇదీచదవండి: లడ్డూ వెనుక ‘బాబు’ మతలబు ఇదేనా.. -
చంద్రబాబు కెరీర్లోనే ఇది వరస్ట్ రాజకీయమట!
రాజకీయాల్లో సుద్దపూసలు భూతద్దంతో వెతికితేనే కనిపిస్తారని ఓ మహానుభావుడన్నాడు. చంద్రబాబులాంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేత ఆ కోవ కిందకు అసలే రారు. తాజాగా తిరుమల ప్రసాదంపై ఆయన చేసిన ప్రేలాపనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అదే టైంలో.. మునుపెన్నడూ లేనివిధంగా దిగజారిపోయి మరీ ఆయన మత రాజకీయాలకు దిగడం చూస్తున్నాం.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బీజేపీతో ఎన్డీయే పొత్తులో ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు జాతీయ మీడియాను కూడా బాగానే మేనేజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తిరుపతి లడ్డూపై ఆయన కామెంట్లను అవి హైలెట్ చేసిన తీరే అందుకు నిదర్శనం. అయితే అందుకు భిన్నంగా ఓ ఆంగ్ల మీడియాలో ప్రచురితమైన సంచలనాత్మక వ్యాసం .. ఇప్పుడు చర్చనీయాంశమైంది.తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న రాజకీయాన్ని ఆ ఆర్టికల్ ఫుల్లుగా ఏకీపారేసింది. ముఖ్యంగా చంద్రబాబు తన స్వార్థ రాజకీయం కోసం ఆధారాల్లేకుండా చేసిన ఆరోపణలు.. ఆ ఆరోపణలను ఎలా అనుకూలంగా మార్చుకోవాలని చూసింది కపిల్ కోమిరెడ్డి ఆ వ్యాసంలో విశ్లేషించారు.చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు, వాస్తవాల వక్రీకరణ, తప్పుడు ప్రచారాలను విపులంగా అందులో వివరించారు. అదే టైంలో.. చంద్రబాబు కొత్తగా మొదలుపెట్టిన మతపరమైన రాజకీయాలనూ ప్రశ్నించారు. బాబు జిత్తులమారి రాజకీయానికి నిజనిర్ధారణతో సంబంధం లేకుండా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలాంటి వాళ్లు పడిపోవడం సైతం ఆ ఆర్టికల్లో ప్రస్తావించారు.ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు మార్క్ కన్నింగ్ రాజకీయం రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎలా నడిచిందనేది సైతం డిటైయిల్డ్గా చర్చించింది ఆ వ్యాసం. తండ్రి వైఎస్సార్ బాటలో అన్ని మతాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఆదరించింది.. అయినా కూడా జగన్పై హిందూ వ్యతిరేకి ముద్ర వేసేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని టచ్ చేసింది.తిరుపతి ఆలయ ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు.. ఉద్దేశపూర్వకమైనవేనని, పక్కా రాజకీయ లబ్ధి కోసమేనని కుండబద్ధలు కొట్టారు కపిల్. అలాగే.. ఆయన సుదీర్ఘ రాజకీయంలో ఇదే అత్యంత దిగజారిన పరిణామమని అభిప్రాయపడ్డారు.చివరగా.. రాజకీయ సంస్కృతిలో మతాన్ని జొప్పించడం ద్వారా చంద్రబాబు ఘోరమైన తప్పిదమే చేశారని, ఏపీ ప్రజానీకం బాబు కుట్రలను, కుతంత్రాన్ని అర్థం చేసుకోగలరని ఆ వ్యాసం విశ్లేషించింది. ఏపీలో అధికారం ఎల్లవేళ ఒకే పార్టీ దగ్గర ఉండదనే విషయాన్ని ప్రస్తావించింది. మత రాజకీయం చేద్దామనుకున్న చంద్రబాబు ప్రయత్నం.. బెడిసి కొట్టడమే కాకుండా జీవితాంతం ఆయన్ని, ఆయన రాజకీయ వారసత్వాన్ని వెంటాడుతూనే ఉంటుందని ఆ ఆర్టికల్ పేర్కొంది. ప్రింట్ ఆంగ్ల వ్యాసం కోసం క్లిక్ చేయండి -
‘లడ్డూ’ వెనుక బాబు మతలబు ఇదేనా?.. ఏదో తేడా కొడుతోంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజులుగా రెచ్చిపోతూ ఉన్నవి లేనివి అన్నీ కలిపి విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్పై ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో తన గురించి తాను పొగుడుకుంటూ ఏకంగా తాను దేవుడి ప్రతినిధిని అన్నట్టుగా మాట్లాడుతుండడం సంచలనంగా ఉంది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ నెయ్యితో తయారవుతోందని దారుణంగా వ్యాఖ్యానించారు. విశేషమేమిటంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కల్తీ వ్యవహారం జరిగినప్పటికీ ఆయన వ్యూహాత్మకంగా వైఎస్సార్సీపీపైనా, మాజీ సీఎం వైఎస్ జగన్పైనా ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వరస్వామే తనతో నిజాలు చెప్పించారని ఆయన వెల్లడించడం పరాకాష్టగా భావించాలి. మామూలుగా కొంతమంది అతితో ఉండే భక్తులు, పూనకం వచ్చినవారు, భవిష్యత్తు వాణి చెబుతామనేవారు.. అటువంటివాళ్లే తాము దేవునికి ప్రతినిధులుగా, దేవుడే మాట్లాడిస్తున్నామని చెబుతుంటారు. చంద్రబాబును ఆ మాట అనలేముగానీ, ఆయన మాట్లాడిన తీరు చూస్తే అలా అనిపించే అవకాశముంది.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, వైఎస్సార్సీపీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్న తాపత్రయంలో తానేమి మాట్లాడుతన్నారో ఆయన తెలుసుకోలేకపోతున్నారు. అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న ఈయన, తిరుమలకు అపచారం కలిగించేలా తిరుమలేశుడిపై అపనమ్మకం పెరిగేలా దుష్ప్రచారం చేశారు. పైగా ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతున్నదని ఇంత పెద్ద అపచారం జరిగిన నేపథ్యంలో సంప్రోక్షణ గురించి మఠాధిపతులతో మాట్లాడతానని చెబుతున్నారు. హిందువులను రెచ్చగొట్టడంతో పాటు, తిరుమల ప్రసాదం లడ్డూ వివాదాన్ని మరి కొంతకాలం కొనసాగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది ఆయన దురుద్దేశంగా కనిపిస్తోంది.జూన్ 4న ఆయన అధికారంలోకి వచ్చారు. జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మొత్తం అధికార యంత్రాంగమంతా 4వ తేదీ నుంచే ఆయన అధీనంలోకి వెళ్లింది. జులై నెలలో నాణ్యతలేని ట్యాంకర్లను వెనక్కి పంపించడం ఆ తర్వాత నివేదిక తెప్పించడంవంటివి జరిగాయి. నాణ్యత లేని టాంకర్లను వెనక్కి పంపించామని, ఈఓ చెబితే, అబ్బేబ్బే.. లేదు.. ఆ నెయ్యిని లడ్డూలలో వాడారని చంద్రబాబు అంటున్నారు. అది నిజమే అయితే ఇలాంటి చర్యకు పాల్పడ్డ ఈఓని, ఇతర సంబంధిత అధికారులను చంద్రబాబు సస్పెండ్ చేయాలి కదా?. కేసులు పెట్టాలి కదా? ఏదో మతలబు లేనిదే చెన్నైలో ల్యాబ్లు అందుబాటులో వుంటే గుజరాత్కు పనిగట్టుకొని ఎందుకు పంపించారు? ఎన్డీడీబీ ఎండీ తిరుమల ఈవోను, మరికొంత మంది ప్రముఖులను ఎందుకు కలిశారు? ఆ తర్వాతనే ఈ టెస్టుల తతంగం జరగడంలోని ఆంతర్యం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.విశేషమేమిటంటే చంద్రబాబు నిజాలు చెబుతారా లేదా అన్నదానిపై గత మూడున్నరదశాబ్దాలుగా ప్రజల్లోగానీ, రాజకీయవర్గాల్లో గానీ చర్చజరుగుతోంది. చంద్రబాబుతో స్వామివారు సైతం నిజం చెప్పించలేరని కొంతమంది చమత్కరిస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, విభజిత ఏపీ అసెంబ్లీలోగానీ పలువురు ఈ అంశం గురించి మాట్లాడుతూ చంద్రబాబు అలవోకగా అబద్ధాలు ఆడుతుంటారని వ్యాఖ్యానిస్తుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో శాసనసభలో మాట్లాడుతూ చంద్రబాబు కన్నార్పకుండా అబద్ధాలు చెప్పగలరని, నిజం మాట్లాడితే తల వక్కలవుతుందనే మునిశాపం ఆయనకు వుందని ఎద్దేవా చేసేవారు. అప్పటినుంచీ ఈ డైలాగు బాగా ప్రసిద్ధిగాంచింది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు రాజకీయంగా గానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల విషయంలోగాన మాట మార్చడం, అబద్ధాలు చెప్పడం సర్వసాధారణం అన్న అభిప్రాయం నెలకొంది.ఉదాహరణకు ఉమ్మడి అసెంబ్లీలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టెండర్కు సంబంధించి వైఎస్సార్ హయాంలో ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. చర్చకు నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులో మొదట వేయికోట్లని రాసి, పదమూడు వందల కోట్లుగా మార్చారు. ఆ విషయాన్ని చీఫ్ విప్గా వున్న కిరణ్ కుమార్రెడ్డి లేవనెత్తారు. దానికి చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఇచ్చిన ఏంటంటే తాము కావాలనే సంఖ్యను మార్చామని చెప్పారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా చంద్రబాబుపై విరుచుకుపడి ఆయన గుణమే అంత అని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బాగా రభస అయింది. చంద్రబాబు చేసిన తప్పునకు టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం పక్షాల సభ్యులు తల పట్టుకున్నారు.డెయిరీ రంగంలో సొంతంగా హెరిటేజ్ పరిశ్రమను కలిగిన చంద్రబాబు 320కే నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పాల నుంచి కేవలం నెయ్యే కాకుండా పాలను ఇతర ఉత్పత్తుల అమ్మకం ద్వారా లోటును కవర్ చేసుకుంటారన్న సంగతి ఈయనకు తెలియదా? పోనీ ఇది తక్కువ ధర అనుకున్నా ఆయన పాలించిన 2014-19 మధ్య కిలో నెయ్యి 276కే మహారాష్ట్రలోని గోవిందా పాల ఉత్పత్తుల కంపెనీకి ఎలా టెండర్ ఖరారు చేశారు? అంటే అప్పుడు కూడా కల్తీ జరిగిందని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా!ఆనాడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు ( నందిని) ఎందుకు టెండర్ను ఇవ్వలేదు. ఇలాంటివాటికి ఏమీ సమాధానం ఇవ్వకుండా తనతో వెంకటేశ్వరస్వామి నిజాలు చెప్పించారని బుకాయిస్తే సరిపోతుందా?. తీరా చూస్తే ఆయన చెప్పినవి అసత్యాలేనని తేలుతోంది. ఆయన కుమారుడు లోకేషే కల్తీ నెయ్యితో ఉన్న టాంకర్లలోని సరుకు వాడలేదని ట్వీట్ చేశారు. దీంతో చంద్రబాబు నిజం చెప్పలేదా అన్న ప్రశ్న వస్తుంది. ఆనాడు టిటిడి ఏర్పాటు చేసిన ధరల కమిటీలో ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా వున్న పార్థసారథి, టీడీపీ శాసన సభ్యురాలు ప్రశాంతి రెడ్డి వున్నారు. వీరిద్దరూ ఆ రోజుల్లో వైఎస్సార్సీపీకి చెందినవారు. తదుపరి అంటే 2024లో టీడీపీలోకి వచ్చారు. మరి వీరిని ఇప్పుడు టీటీడీలో అవకతవకలకు బాధ్యులని చెప్పి తప్పించగలరా?అలాగే బీజేపీకి చెందని నేత వైద్యనాధన్ కూడా కమిటీలో వున్నారు. టీటీడీలో బీజేపీ సభ్యులుకూడా వున్నారని వైఎస్సార్సీపీ ప్రస్తావిస్తే దాన్ని బ్లాక్ మెయిల్ అని ఎల్లో మీడియా భాష్యం చెప్పడం విచిత్రంగా వుంది. అసలు విశేషం ఏమిటంటే నెయ్యి కన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతున్న పిష్ ఆయిల్, పిగ్ ఫాట్ వంటివాటి ఖరీదు చాలా ఎక్కువట. ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి ఆ వివరాలు చెబుతూ జంతు కొవ్వు వెయ్యి నుంచి 1400 రూపాయలు ఉంటే 320 రూపాయల ఖరీదుఉన్న నేతిలో ఎవరైనా కలుపుతారా? అని ప్రశ్నించారు. రాగిలో బంగారం కలుపుతారా?. బంగారంలో రాగి కలుపుతారా? పాలలో నీళ్లు కలుపుతారా . నీళ్లలో పాలు కలుపుతారా? అన్న అర్ధవంతమైన ప్రశ్న వేశారు. దీనికి చంద్రబాబు అండ్ కో ఏమి చెబుతారో చూడాలి.ఆ విషయానికి వస్తే 1995లో ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్ని రకాలుగా మాటలు మార్చారో అందరికీ తెలిసిందే. 1996 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మసీదులు కూల్చేపార్టీగా అభివర్ణించారు. 2004లో ఓటమి తర్వాత జీవితంలో బిజెపితో పొత్తుపెట్టుకోనని అన్నారు. నరేంద్ర మోదీని నర హంతకునిగా ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోదీని హైదరాబాద్ రానీయనని హెచ్చరించేవారు. అయినా మళ్లీ 2014లో మోదీ ఎక్కడుంటే అక్కడకు వెళ్లి బతిమలాడుకొని మరీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. 2018లో బీజేపీ నుంచి విడిపోయి మోదీని టెర్రరిస్టు, ముస్లింలను బతకనీయడు, పెళ్లాన్ని ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా ఏలుతాడు అని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. తిరిగి 2024 నాటికి మోదీ అంతటి గొప్పవాడు లేడని ప్రకటించాడు. మరి వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం అంటే ఏం చెప్పగలం.సోనియా గాంధీని దెయ్యం , భూతం అని తిట్టారు. కానీ ఆ తర్వాత ఆమెతో కలిసి రాజకీయ సభల్లో పాల్గొని పొగిడారు. లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని వాగ్ధానం చేసి ఆ తర్వాత దాన్ని నెరవేర్చకపోగా మొత్తం రుణమాఫీ చేశామని దబాయించేవారు. తమ రాజకీయ అవసరాల కోసం మాట్లాడే చంద్రబాబు మాటలు నిజాలా అబద్ధాలా అనేది పక్కన పెడితే, ఎలాగైనా మాట మార్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు వైఎస్ జగన్ పై ఎదురు దాడి చేస్తూ ప్రధానికి లేఖ రాయడానికి ఎంత ధైర్యమని ప్రశ్నించడం చిత్రంగా వుంది. వైవీ సుబ్బారెడ్డి భార్య పక్కా హిందువు అయితే ఆమెకు క్రైస్తవ మతం అంటగట్టి స్టేట్మెంట్ ఇచ్చారు.మరో వైపు తన క్యాబినెట్లోనే హోంమంత్రిగా వున్న వ్యక్తి ఒకసారి తను క్రిస్టియన్ అని, మరొకసారి హిందూమతం అని చెప్పుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తె పెళ్లిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశారని చంద్రబాబు ఆరోపిస్తారు. మరో వైపు ఒక క్రిస్టియన్ను వివాహమాడి, పిల్లలకు సైతం క్రిస్టియన్ పేర్లనే పెట్టిన పవన్ కల్యాణ్ చాలా గొప్ప హిందువు అని సర్టిఫికెట్ ఇస్తుంటారు. చంద్రబాబు స్వయంగా క్రైస్తవ సమావేశానికి వెళ్లి ఏసుక్రీస్తును నమ్మినవారికి అపజయం లేదని సూక్తులు చెప్పారు. కానీ ఇప్పుడేమో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నిజానికి మతమన్నది వ్యక్తిగతం. కానీ చంద్రబాబు లాంటివారు తమ స్వార్ధ రాజకీయాల కోసం కులం, మతం, నిజాలతో సంబంధం లేకుండా వాడేసుకోగలరని అనిపిస్తుంది.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
లడ్డులో జంతువు కొవ్వు?..
-
పవన్ ప్రాయశ్చిత్తం.. అసలు దేనికోసం?
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినందుకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకున్నారు. ఇందులో ఆయన చిత్తశుద్ధి ఎంత ఆ వెంకటేశ్వరుడికే తెలియాలి కానీ.. ఆయన తన వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు.. పశ్చాతాప పడినట్లు మాత్రం లేరు. జరగని తప్పును జరిగినట్లు చూపించేందుకు పోటీ పడుతున్న పవన్.. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణను పుట్టించింది.. ఆపై ప్రచారం చేస్తూ అపచారం చేస్తున్నదీ చంద్రబాబే అన్నది గుర్తించడం అవసరం. ఎందుకంటే.. ప్రాయశ్చిత్త దీక్షపై వస్తున్న కథనాలు చదివితే అవి.. బాబుకు వంత పాడేందుకు చేస్తున్నవే అన్న సందేహం రాకపోదు.లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారంలో తానెక్కడ ప్రచారం పడిపోతానో అన్న ఆదుర్దాతో పవన్ ఈ దీక్ష హంగామా సృష్టిస్తున్నట్లు అనిపిస్తుంది. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలాగూ నెరవేర్చలేకపోయాం కాబట్టి.. ఆ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఈ డ్రామాకు లేవనెత్తారా? అన్నది సామాన్యుడి ఒక సందేహం.పోనీ.. లడ్డూ ప్రసాదంలో కల్తీని పవన్ కళ్యాణ్ నిజంగానే విశ్వసిస్తున్నాడని అనుకుందాం. స్వామివారిపై భక్తి కూడా నిజమే అని భావిద్దాం. అప్పుడు పవన్ కళ్యాణ్ ముందుగా చేయాల్సిన డిమాండ్ ఏమిటి? కల్తీ సంఘటనపై సీబీఐతో విచారణ చేయించి దోషులెవరో పట్టుకుని శిక్షించాలని కదా? తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థలపై దాడు చేసి కల్తీకి సంబంధించిన ఆధారాలు సేకరించాలి కదా? పవన్ ఈ డిమాండ్లేవీ చేయడం లేదు ఎందుకని? నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీకి సంబంధించిన నెయ్యి నమూనాను పరిశీలించి నిర్దిష్టంగా ఫలానా కొవ్వు కలిసిందని పవన్ నమ్ముతున్నారా?.వెనకటికి దున్నపోతు ఈనిందని ఎవరో అంటే.. దూడను కట్టేయండని అన్నారట. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఘటనకు (ఒకవేళ నిజంగానే కల్తీ జరిగిందని అనుకుంటే) జగన్ ప్రభుత్వానికి ఆపాదించడం ఏమిటి? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ప్రధాని మోదీకి లేఖ రాసి కోరినట్లుగానే బాబు, పవన్లు కూడా సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదు?. ఆ మేరకు కేంద్రానికి లేఖ రాసి ఉండవచ్చు కదా?. పైగా.. తన ఆధీనంలోనే ఉండే సిట్ వేయడం వల్ల బాబుకు కలిగే ప్రయోజనం ఏమిటి?. టీటీడీ ఈవో లాంటి వారే ముఖ్యమంత్రి మాటలకు అనుగుణంగా తన మాటలను రోజుకో తీరుగా మార్చేస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు ఉన్నతాధికారుల మాటలకు తగ్గట్టుగా నివేదిక సిద్ధం చేయరన్న గ్యారెంటీ ఏమిటి?.పాపం పవన్.. ఉపముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్ద ఏదో నేర్చుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు కానీ.. వాస్తవానికి ఆయన అబద్ధాలు ఎలా చెప్పాలి? మాట తప్పడం ఎలా? వంటివే తన గురువు నుంచి ఒంటపట్టించుకుంటున్నట్లు అర్థమవుతోంది. అసలు విషయాలపై ప్రజల దృష్టిని ఎలా మళ్లించడం అన్న అంశంలో స్పెషలైజేషన్ చేస్తున్నట్లుంది. ఈ విద్య బాబుకు తెలిసినట్టుగా ఇంకొకరికి తెలుసునంటే నమ్మలేము. ఒకటో రెండు పాఠాలూ పవన్కూ అబ్బినట్లు కనిపిస్తోంది.కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులైన సందర్భంగా ఫలానా మంచి పని చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేక చంద్రబాబు ఈ డ్రామాను సృష్టించారనిపిస్తుంది. సూపర్ సిక్స్ హామీలు ఎప్పటికి నెరవేర్చుతారో చెప్పలేకపోతున్నారు. గతంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గప్పాలు పలికిన వీరు ఇప్పుడు నిమ్మకు నీరెత్తారు. చంద్రబాబు అయితే ప్రైవేటీకరణకు అనుకూలంగా గొంతు సవరించుకుంటున్న తీరుపై కార్మిక సంఘాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఈ అంశాలన్నింటీ నుంచి ప్రజల దృష్టిని తప్పించేందుకే బాబు లడ్డూ ప్రసాదం అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నట్లు అర్థమవుతోంది.ఇటీవల విజయవాడకు వచ్చిన వరదల్లో కేవలం తాను నివసిస్తున్న అక్రమ కట్టడాన్ని రక్షించుకునేందుకు చంద్రబాబు లక్షలాది సామాన్యులను నీట ముంచాడని ప్రజలకూ ఇప్పుడు స్పష్టమవుతోంది. ఇలాంటి వాటన్నిటిని మర్చిపోయేలా చేయాలంటే ఏదో పెద్ద అంశాన్నే లేవనెత్తాలని అనుకుని మరీ తిరుమల లడ్డూ ప్రసాదం పేరుతో రాజకీయం మొదలుపెట్టారు. చంద్రబాబు లాంటి వారికి దేవుడిపై నిజంగానే నమ్మకం ఉంటే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే, తిరుమలతోపాటు రాష్ట్రం పరువు పోయేలా కల్పిత గాథలను జనంలోకి వదులుతారా?. చివరికి టీడీపీ మీడియా కానీ, టీడీపీ సోషల్ మీడియా కానీ దారుణమైన, నీచమైన అసత్యాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తుందా?నెయ్యిలో కల్తీపై జూలై 23న నివేదిక వచ్చిందని చెబుతున్నారు కదా! నిజాయితీ ఉన్న పాలకులు అయితే ఏమి చేయాలి? వెంటనే సంబంధిత సంస్థపై దర్యాప్తునకు ఆదేశించాలి. దాడులు చేసి ఆధారాలు సేకరించాలి. సాక్ష్యాలు దొరికితే అరెస్టులు చేయాలి. అలాకాకుండా రెండు నెలలు ఏమీ తెలియనట్లు ఉంటారా? ఆ తరువాత తీరికగా.. వైఎస్ జగన్పై నీచమైన అభాండాలు వేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తారా?. వైఎస్ జగన్పై రాజకీయ ద్వేషం ఉంటే వేరే రీతిలో తీర్చుకోవాలి. అంతేకానీ తిరుమలను అడ్డుపెట్టుకుని ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా?. కల్తీ జరిగి తిరస్కరించామని చెబుతున్న తమిళనాడు కంపెనీ నుంచే మళ్లీ నెయ్యి తీసుకుంటామని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు చెప్పడం ఏమిటి? ఇంకోపక్క మంత్రి లోకేష్ టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని చెబుతారు. మీ పాలనలో టీటీడీలో తప్పు జరిగితే దానికి బాధ్యత ఆ సంస్థదే. అటువంటప్పుడు జగన్ పాలనలో తప్పు జరిగితే బాధ్యత ఎవరిది? ఇదెక్కడి తర్కం?.కోట్ల మంది స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు. నిజంగా అపవిత్రమైందో లేదో తెలియదు కానీ.. పవన్, లోకేష్, చంద్రబాబుల మాటలు, చేష్టలతో మాత్రం కచ్చితంగా అయ్యిందనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనసుల్లో ఇప్పుడు వీరు అనుమానాలు లేవనెత్తారు. వాస్తవానికి చంద్రబాబు, పవన్లు ఏం కోరుకుంటున్నారు?. తిరుమలలో లడ్డూలు కల్తీవి సరఫరా చేస్తున్నారని డప్పు వేసి చెప్పాలన్నది, ప్రచారం చేయాలన్నది వీరి అభిమతమా? తద్వారా తిరుమలకు భక్తులు తిరుమలకు రాకుండా, లడ్డూలు తినకుండా చేయాలన్నది ఉద్దేశమా? తిరుమలకు ఎంత అప్రతిష్ట వచ్చినా ఫర్వాలేదు కానీ.. వైఎస్ జగన్ బద్నాం కావాలనే వీరు పట్టుపట్టి పనిచేస్తున్నారా?.గతంలో రథాలు తగులు పెట్టారని, దేవాలయాలపై దాడులు జరిగాయని పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దాలు చెబుతున్నారు. వాటిపై సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశిస్తే కేంద్రం ఎందుకు వేయలేదో ప్రశ్నించరు. నిజానికి సోషల్ మీడియాలో ఈయనపై వస్తున్న కొన్ని ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంత హిందూ మతోద్దారకుడినని చెప్పుకునే ఈయన వేరే మతానికి చెందిన మహిళను ఎలా పెళ్లి చేసుకున్నారు? పోనీ చేసుకుంటే చేసుకున్నారు. వారికి పుట్టిన బిడ్డలలో ఒక్కరికి కూడా హిందూ పేరు పెట్టకుండా అన్యమత పేర్లు ఎందుకు పెట్టారని కొందరు అడుగుతున్నారు.అంతేకాదు.. చంద్రబాబు గోదావరి పుష్కర స్నానాలకు వెళ్లి షూటింగ్ పెట్టుకుని తొక్కిసలాటకు కారణమై ఇరవై తొమ్మిది మంది మరణిస్తే అందులో పాపం ఏమి లేదా? అప్పుడు పవన్ నోరు విప్పలేదే!. ఇవన్నీ కాదు.. తన వ్యక్తిగత జీవితంలో భార్య ఇంటిలో ఉండగానే వేరే మహిళను తీసుకు వచ్చి కాపురం చేశారన్న ఆరోపణపై ఎన్నడైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నారా? అని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదేదో వేరేవారు అంటే నమ్మలేం. స్వయంగా ఆయన మాజీ భార్యే ఈ విషయం వెల్లడించారే!.పవన్ శిష్యుడు వంటి జానీ మాస్టర్ తాజాగా రేప్ కేసులలో ఇరుక్కుంటే ఆయన ఎందుకు నోరు విప్పి మాట్లాడలేదు. తను పవన్ స్పూర్తితోనే ప్రయాణం చేస్తున్నానని జానీ మాస్టర్ చెబుతుంటే, అతనికి సామాజిక స్పృహ ఉందని ఈయన సర్టిఫికెట్ ఇచ్చారు. వలంటీర్లను కిడ్నాపర్లుగా పోల్చి ముప్పైవేల మంది యువతులకు తరలించారని నీచమైన ఆరోపణ చేశారే. దానిని రుజువు చేయలేకపోయారే. ఇలాంటి వాటికి కదా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి! బొట్టు పెట్టుకుని, కాషాయ శాలువా కప్పుకుంటే పవిత్రులై పోరు. నిజ జీవితంలో కూడా పవిత్రంగా ఉండాలి. పవన్ ఇది గుర్తిస్తే మంచిది!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణానికి భూమన సిద్ధం
సాక్షి, తిరుమల: తిరుమల లడ్డూ విషయంలో శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేసేందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 3:30గంటలకు ఆలయం వద్ద భూమన ప్రమాణం చేయనున్నారు.తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేయడానికి భూమన తిరుమల వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన తిరుమల వెళ్లి పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించనున్నారు. అనంతరం, స్వామి వారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేయనున్నారు. మరోవైపు.. తన వ్యాఖ్యలపై శ్రీవారి ఎదుట ప్రమాణం చేయాలని వైస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విసిరిన చాలెంజ్కు చంద్రబాబు ఇంతదాకా స్పందించకపోవడం గమనార్హం.ఇది కూడా చదవండి: ‘బాబూ.. భక్తుల మనోభావాలతో ఆడుకుంటావా?’ -
బాబు వ్యాఖ్యలపై పిటిషన్లు
న్యూఢిల్లీ, సాక్షి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టులో వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగానూ సుబ్రహ్మణ్యస్వామి స్వయంగా తెలియజేశారు. తిరుపతి తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. ప్రసాదం కలుషితమైందన్న ఆయన వ్యాఖ్యలు భక్తుల్లో ఆందోళన రేకెత్తించాయి. అందుకే దర్యాప్తునకు ఆదేశించేలా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను అని పోస్ట్ చేశారాయన.Today I filed a PIL seeking Supreme Court direction to investigate unsubstantiated allegation by CM C.B. Naidu that the Tirupati Tirumala Temple Prasadam were adulterated with meat of animals and other rotten items creating chaos almost bhaktas— Subramanian Swamy (@Swamy39) September 23, 2024 వైవీ సుబ్బారెడ్డి పిటిషన్మరోవైపు వైస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం సుప్రీంలో పిల్ వేశారు. చంద్రబాబు వ్యాఖ్యల సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని ఆయన పిటిషన్లో సుప్రీంను అభ్యర్థించారు. అంతకు ముందు.. తిరుమల లడ్డూ వివాదంపై సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో సీబీఐ లేదంటే ఇతర కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని, దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని ఆయన తన పిటిషన్ ద్వారా కోరారు. -
ప్రధానికి రాసిన లేఖలో వాస్తవాల్ని పరిశీలించండి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇవాళ మరింత మంది కేంద్ర మంత్రులను ఆ లేఖకు ట్యాగ్ చేశారు.తాను రాసిన లేఖలోని వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ఆయన కేంద్ర మంత్రులను ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తులు ఉన్నారు. వాళ్లందరి మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది. లేకపోతే చంద్రబాబు చెప్తున్న అబద్ధాలు అందరికీ వ్యాపించి, తీవ్ర వేదనను కలిగిస్తాయని, భవిష్యత్తులో కూడా అనేక పరిణామాలకు దారి తీస్తాయని జగన్ తన లేఖలో రాశారు.Kind Attention: Please take note of the facts presented in this letter addressed to the Honorable Prime Minister Narendra Modi Ji regarding the severe pain caused to the religious sentiments of Hindu devotees https://t.co/TI3vgkaZ0e. @rajnathsingh @AmitShah @nitin_gadkari…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 23, 2024ఇంకా ఆ లేఖలో.. ఏపీలో ప్రభుత్వం 100 రోజులు పూర్తైంది. తమ పాలన అద్భుతంగా ఉందంటూ టీడీపీ గొప్పలు చెప్పుకుంటోంది కానీ ప్రజాభిప్రాయం ప్రతికూలంగా ఉంది. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, నిలబెట్టుకోవడంలో కొత్త ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల దృష్టిని మరల్చడానికి టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారని జగన్ తన లేఖలో కుట్ర కోణాన్ని ప్రస్తావించారు. ఇదీ చదవండి: చంద్రబాబు స్వార్థ రాజకీయం.. జరగని తప్పుపై 'రాద్ధాంతం' -
బాబూ.. భక్తుల మనోభావాలతో ఆడుకుంటావా?: మాజీ మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో దుర్మార్గమైన వంద రోజుల పాలన నుంచి బయటపడేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.మాజీ మంత్రి కాకాణి సోమవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమల లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీవారి ప్రతిష్టను దిగజార్చవద్దు. సీఐడీతో కాకుండా సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి. రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు వైఎస్ జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుర్మార్గమైన వంద రోజుల పాలన నుంచి బయటపడేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పవిత్రమైన తిరుమలను రాజకీయాలకు వాడుకుంటున్నాడు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వ్యవహరించాలి. తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని విష ప్రచారం చేయడం సరైన పద్దతి కాదు. చంద్రబాబు ప్రస్టేషన్తో మాట్లాడుతున్నాడు.తిరుమల లడ్డూపై విచారణ జరపాలని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. లడ్డూ వివాదం విషయంలో నిష్పక్షపాత విచారణ జరగాలి. ఈవో శ్యామలరావుని కీలు బొమ్మలా మార్చి చంద్రబాబు ఆడిస్తున్నాడు. బాబు పలుకులే శ్యామలరావు పలుకుతున్నారు. శ్యామలరావు అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. భక్తుల మనోభావాలు కాపాడాలి. చంద్రబాబు ప్రభుత్వంలో సిట్ వేస్తే విచారణ నిగ్గు తేలదు. జంతువుల కొవ్వు అని చంద్రబాబు అన్నారు. వెజిటబుల్ ఫ్యాట్ అని ఈవో అంటున్నారు. నెయ్యి సరఫరాకి సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి.సీఎంగా చంద్రబాబు 2015లో ఉన్నప్పుడే నెయ్యిపై ఆరోపణలు వచ్చాయి. కల్తీ నెయ్యి జరిగిందని పదే పదే చెబుతున్నారు.. అది నిరూపించగలరా?. జూన్లో ఎవరి ప్రభుత్వం ఉంది?. ఒకవేళ ఆ నెయ్యిని జూన్, జూలైలో వాడి ఉంటే తప్పు ఎవరిది?. భక్తుల మనోభావాలతో ఆడుకుంది చంద్రబాబు కాదా?. కుట్ర పూరితంగా లడ్డు వివాదం చేస్తున్నారు.వెంకటేశ్వర స్వామి గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడా?. మా ప్రభుత్వ హయాంలో టెండర్లు నిబంధనల మేరకే జరిగాయి. ఐదేళ్లు డెయిరీ ఫామ్కి అనుభవం, ఏడాదికి 500 కోట్లు టర్నోవర్ ఉంటేనే కాంట్రాక్టు ఇస్తామని మేము చెప్పాం. చంద్రబాబు హయాంలో నందిని నెయ్యి రూ.306కి కొనుగోలు చేశారు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులకు వేధింపులు! -
తిరుమల లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు: బీవీ రాఘవులు
-
కల్తీ జరగలేదు.. బాబు, పవన్ క్లోజ్..
-
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో లడ్డూ వివాదంపై సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని కోరారు. దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్థించారు.ఇదిలా ఉండగా, అంతకుముందు.. తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీపై వాస్తవాలను తేల్చేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టును కోరారు. ఒకవేళ సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యం కాకపోతే, విచారణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. తద్వారా వాస్తవాల నిగ్గుతేల్చాలని కోరారు.ఈ అభ్యర్థనతో తాము ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయనున్నామని, దీనిపై విచారణ జరపాలని ఆయన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనాన్ని కోరారు. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి విషయంలో వాస్తవాలను తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని.. అందువల్ల నిజానిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు.అందుకోసమే తాము ఈ వ్యాజ్యం దాఖలు చేస్తున్నామన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించినది కాబట్టి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సుధాకర్రెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తాము బుధవారం విచారిస్తామని, ఈలోపు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.ఇది కూడా చదవండి: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్కు చురకలు -
బాబు, పవన్ వ్యాఖ్యలపై సీపీఎం రాంభూపాల్ రియాక్షన్..
-
సొల్లొద్దు సొల్యూషన్ కావాలి చంద్రం..
-
తిరుపతి లడ్డూ వివాదం.. పవన్కు చురకలు
విజయవాడ, సాక్షి: భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసే ఏ చర్యను.. ఏ రాజకీయ పార్టీ కూడా ఒప్పుకోదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. సీతారాం ఏచూరి సంస్కరణ సభలో తిరుపతి లడ్డు వివాదంపై స్పందించిన ఆయన.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కూ చురకలంటించారు.‘‘ఏపీలో లడ్డు గొడవ నడుస్తోంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఏచర్యను ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోదు. కల్తీ నెయ్యి వాడినట్లు తెలిస్తే.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. దోషులను పట్టుకుని శిక్షించాలి. అంతేగానీ రాజకీయం చేయడం సరికాదు.సనాతన ధర్మం బోర్డు పెట్టాలని ఒక పెద్ద మనిషి అంటున్నాడు అసలు సనాతన ధర్మం అంటే ఏంటో ఆయన్ని చెప్పమనండి అంటూ పవన్కు పరోక్షంగా రాఘవులు చురకలు అంటించారు.తిరుమల లడ్డూ వివాదంపై ఎక్స్ ఖాతాలో పవన్ స్పందిస్తూ.. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మరక్షణ బోర్డు' ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని, దీనిపై అన్ని వర్గాల వారితో జాతీయస్థాయిలో చర్చ జరగాలని అన్నారు. ఇదీ చదవండి: లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు..: బీవీ రాఘవులు -
‘చంద్ర’ డ్రామాలు.. దొరికి పోతామనే భయంతో నో కేసు ..
-
వాస్తవాలు నిగ్గు తేల్చాలి.. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ
సాక్షి,తాడేపల్లి: తన రాజకీయాల కోసం చంద్రబాబు.. టీటీడీ ప్రతిష్టను దిగజార్చారంటూ ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు.‘‘స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారు. టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా మాట్లాడారు. టీడీపీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు బుద్ది చెప్పాలి’’ అని లేఖలో వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.‘‘లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి.. వాస్తవాలు నిగ్గు తేల్చాలని ప్రధానికి లేఖ రాశారు.(లేఖ పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శకుని బతికుంటే చంద్రబాబును చూసి ఏడ్చేవారు: భూమన
సాక్షి, తిరుపతి: రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు సాక్షాత్తూ శ్రీవారిని అడ్డం పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.శ్రీవారి మహా ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేసి చంద్రబాబు తప్పు చేశారు. నీచ రాజకీయాలు చేసేందుకు కూడా చంద్రబాబు వెనుకాడ లేదు. సీబీఐ, సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు సిద్ధమేనా?. శ్రీవారికి కళంకం అంటగడుతున్నారు. జగన్ను రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు.’’ అని కరుణాకర్రెడ్డి నిప్పులు చెరిగారు...లడ్డూ వ్యవహారంపై ప్రధాని కూడా స్పందించాలి. నీచమైన రాజకీయం కోసం ఆరోపణలు చేస్తే అంతా శ్రీవారే చూసుకుంటారు. చంద్రబాబు ఆరోపణలు నిజమైతే.. లడ్డూలో కల్తీ నెయ్యి కారకులు రక్తం కుక్కుకుని చనిపోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. శకుని బతికుంటే చంద్రబాబును చూసి ఏడ్చేవారు. నెయ్యిలో వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని గతంలో టీటీడీ ఈవో చెప్పలేదా?. చంద్రబాబు బెదిరించిన తర్వాత ఈవో మాట మార్చారు.’’ భూమన నిలదీశారు. -
చంద్రబాబుకు నిలువెల్లా విషమే: లక్ష్మీపార్వతి ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా వెనుకాడడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.లక్ష్మీపార్వతి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఇవాళ దేవుడితో ఆటలాడుతున్నాడు. లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ నెయ్యి వాడలేదు. ఇది వందల ఏళ్లుగా అనవాయితీగా వస్తోంది. చంద్రబాబు హయాంలో నెయ్యిలో కల్తీ జరిగితే వైఎస్ జగన్పై నింద వేస్తున్నారు. చంద్రబాబు వల్ల తిరుమల గోవిందుడికి కళంకం వచ్చింది. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికి అయిన వెనుకాడడు. చంద్రబాబుకు నిలువెల్లా విషమే ఉంటుంది’ అంటూ విమర్శించారు. ఇది కూడా చదవండి: తిరుమల లడ్డూపై మరో మారు చంద్రబాబు అబద్ధాలు -
లడ్డులో కొవ్వు మాత్రమే కాదు - తిరుమలలో ప్రతి పరిస్థితిపై పూర్తి విశ్లేషణ
-
విచారణకు మేము సిద్ధం.. నువ్వు సిద్ధమా?.. చంద్రబాబుకు విశ్వేశ్వర రెడ్డి సవాల్
-
అంతా బోగస్.. సంచలన నిజాలు బయటపెట్టిన టీటీడీ ఈవో..
-
తిరుమల లడ్డూ ప్రసాదంపై బాబు అసత్య ఆరోపణలు
-
తిరుపతి లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలకు సుధాకర్ బాబు కౌంటర్
-
Gunshot: రాజకీయ లబ్ది కోసం భగవంతుడితో ఈ ఆటలేంటి ?
-
లడ్డూ తప్ప.. దేశంలో మరే సమస్యా లేదా?
– సీమాన్ ఆగ్రహంసాక్షి, చైన్నె : దేశంలో ఏ సమస్యా లేదా? అంతా లడ్డూ గురించి చర్చించుకుంటున్నారు? అని నామ్ తమిళర్ కట్చి కన్వీనర్, సినీ దర్శకుడు, నటుడు సీమాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శివగంగైలో జరిగిన కార్యక్రమంలో శనివారం సీమాన్ లడ్డూ వివాదం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిపేశారని ప్రస్తుతం కొత్త సమస్యను కొందరు సృష్టిస్తున్నారని, అందులో కొవ్వు ఉన్నా తాను తింట్టానని, లేకున్నా తింట్టానని వ్యాఖ్యానించారు. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు. శ్రీలంక నావికాదళం తమిళ జాలర్లపై దాడులు చేస్తూ, గుండుగీయించి పంపుతున్నా.. అది సమస్యగా కనిపించడం లేదా? లడ్డూ సమస్యే పెద్దదిగా కనిపిస్తోందా..? అని విమర్శించారు.మోసం కేసులో యువకుడి అరెస్ట్తిరువొత్తియూరు: కుట్రాంలో వ్యభిచారానికి మహిళలు ఉన్నారని చెప్పి యువకులను మోసం చేసి నగదు అపహరిస్తున్న యువకుడిని తెన్కాశి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కుట్రాలంలో వ్యభిచారానికి మహిళలు ఉన్నట్లు చెప్పి యువకులను నమ్మించి వారి వద్ద నగదు తీసుకుని మోసం చేస్తున్నట్లు తెన్కాశి పోలీసులకు సమాచారం అందింది. సమాచారం మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేశారు. విచారణలో పొల్లాచికి చెందిన ప్రభాకర్ అనే యువకుడు sokka.in అనే వెబ్సైట్ మూలంగా కుట్రాళంలో వ్యభిచారానికి మహిళలు ఉన్నట్లు చెప్పి వారిని మోసం చేస్తున్నట్లు తెలిసింది. యువకుడని పోలీసులు అరెస్ట్ చేశారు.పాము కాటుకు మహిళ మృతిసేలం: పాము కాటుకు ఓ మహిళ మృతిచెందింది. పొల్లాచ్చి కోట్టూర్ రోడ్డు నెహ్రూనగర్కు చెందిన రవి భార్య శాంతి (58). వీరి కుమారుడు సంతోష్. వీరు ఒక పిల్లిని పెంచుతున్నారు. ఈ స్థితిలో సంఘటన సంభవించిన రోజు పిల్లి ఇంటి ప్రాంగణంలో తిరుగుతున్న కాట్టువీరియన్ పామును నోటితో పట్టుకుని ఇంట్లో ఉన్న గదిలో వదిలింది. ఆ గదిలో నిద్రపోతున్న శాంతిని కాటు వేసింది. వెంటనే ఆమెను కుమారుడు సంతోష్, పొల్లాచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శనివారం ఉదయం మృతిచెందింది. పెంపుడు పిల్లి యజమాని ప్రాణానికి పాశంగా మారిన వైనం ఆ ప్రాంతంలో శోకాన్ని నింపింది. -
తిరుపతి లడ్డూ ఆరోపణలతో హెరిటేజ్ లింకులు!?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని నీచపు రాజకీయానికి.. అది ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తెర తీశారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. మరోవైపు హిందూ సంఘాలు.. ఇంకోవైపు నలభై ఏళ్ల బాబు రాజకీయం గురించి తెలిసిన నేతలూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. జాతీయ పార్టీ టీఎంసీ సైతం చంద్రబాబు తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది.టీఎంసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే ఎక్స్ వేదికగా చేసిన ఓ ఆసక్తికరమైన పోస్ట్.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలకు దిగారు. అందుకు ల్యాబ్ రిపోర్టులను సాక్ష్యంగా చూపిస్తున్నారు. లడ్డూల కోసం ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆయన పార్టీ ఆరోపిస్తోంది. అయితే..చంద్రబాబు, ఆయన సతీమణి పేరిట హెరిటేజ్ పుడ్స్ అనే డెయిరీ సామ్రాజ్యం ఉందని, అది నెయ్యి కూడా ఉత్పత్తి చేస్తోందని అన్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల సమయంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఇదే హెరిటేజ్ సంస్థ షేర్లు 1,200 కోట్ల రూపాయలకు పైగా లాభాల్లోకి వెళ్లాయని సాకేత్ గుర్తు చేశారు. అప్పట్లో బీజేపీ, స్టాక్ మార్కెట్ను మానిప్యులేట్ చేయడం వల్లే ఇది సాధ్యపడిందని ఆరోపించారు.𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭:𝐈𝐬 𝐭𝐡𝐞 𝐓𝐢𝐫𝐮𝐩𝐚𝐭𝐢 𝐥𝐚𝐝𝐝𝐨𝐨𝐬 𝐬𝐭𝐨𝐫𝐲 𝐫𝐞𝐚𝐥 𝐨𝐫 𝐢𝐬 𝐢𝐭 𝐚 𝐟𝐚𝐤𝐞 𝐜𝐨𝐧𝐭𝐫𝐨𝐯𝐞𝐫𝐬𝐲 𝐜𝐫𝐞𝐚𝐭𝐞𝐝 𝐰𝐢𝐭𝐡 𝐁𝐉𝐏’𝐬 𝐡𝐞𝐥𝐩 𝐟𝐨𝐫 𝐛𝐨𝐨𝐬𝐭𝐢𝐧𝐠 𝐩𝐫𝐨𝐟𝐢𝐭𝐬 & 𝐩𝐥𝐚𝐲𝐢𝐧𝐠 𝐩𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐬? Andhra Pradesh CM @ncbn… pic.twitter.com/Em5JxD4H1s— Saket Gokhale MP (@SaketGokhale) September 21, 2024 ఎవరి కుటుంబమైతే నెయ్యి- పాల ఉత్పత్తి రంగాన్ని శాసిస్తోందో.. అదే కుటుంబానికి చెందిన వ్యక్తి ఇప్పుడు తిరుమల లడ్డూల విషయంలో కూడా గుజరాత్కు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఆరోపణలు చేశారని సాకేత్ గోఖలే ప్రస్తావించారు.మొత్తంగా.. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు.. తిరుమల లడ్డూపై ఆరోపణలు చేశారని, దీనికోసం బీజేపీ సహకారాన్ని సైతం తీసుకున్నారని సాకేత్ గోఖలే ఆరోపించారు.ఇదీ చదవండి: దేవుడే ఇక చంద్రబాబుకి బుద్ధి చెప్తాడు! -
బాబు ఉన్మాద ప్రేలాపనలు
-
నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి: కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు మాజీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. అలాగే, బూట్లు వేసుకుని దేవుడిని పూజించే సంస్కారం చంద్రబాబుది అంటూ ఘాటు విమర్శలు చేశారు. చేతకాని కూటమి పాలనను ప్రజలు నిలదీస్తారని ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలకు తెరలేపారా? అంటూ ప్రశ్నించారు.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం పశ్చిమ గోదావరిలో మీడియాతో మాట్లాడుతూ..‘గత రెండు మూడు రోజులుగా నీచాతినీచమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తానే అని చెప్పుకునే విధంగా సీఎం చంద్రబాబు ఆ కలియుగ దైవాన్ని అడ్డుపెట్టుకున్నాడు. వంద రోజుల పరిపాలన గురించి మాట్లాడకూడదని డైవర్షన్గా నీచ రాజకీయాలు చేస్తున్నారు. పవిత్రమైన తిరుపతి ప్రసాదంపై ఎంతో దారుణంగా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఆ వేంకటేశ్వరస్వామి సహించడు. తిరుపతిలో ఏ వస్తువు కొనాలన్నా టెండర్ ప్రకారం పూర్తిగా తనిఖీలు అయ్యాకే అనుమతి ఇస్తారు. నిజంగా జూలై 22న రిపోర్ట్ వస్తే ఇంతకాలం ఎందుకు తొక్కి ఉంచారు. నీ చేతకాని 100రోజుల పరిపాలన ప్రజలు నిలదీస్తారని ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలకు తెరలేపారా?. ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిరం కట్టి తిరుపతిలో అడ్మినిస్ట్రేషన్ నచ్చి వారిని అయోధ్యకు తీసుకెళ్లారు. తిరుపతి వంటి అడ్మినిస్ట్రేషన్ అయోధ్యలో తీసుకురావాలని చూశారు. అటువంటి తిరుపతిలో తప్పు జరిగిందని చెప్పడం ఎంత దారుణం. కోట్లాది మంది హిందూ భక్తులు మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు. బూట్లు వేసుకుని దేవుడిని పూజించే సంస్కారం చంద్రబాబుది. నీ హయాంలో జరిగిన తప్పు ఎవరి మీదకి నెట్టేస్తున్నావ్. ఇదంతా వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు. తగిన మూల్యం చెల్లించక తప్పదు. హాథిరామ్ మఠం దేవాదాయ శాఖ భూములను కాజేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తున్నారు. గత ఐదేళ్లలో దేవాలయాలు చాలా బాగా నడిచాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాలను అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. సీజీఎఫ్ నిధుల ద్వారా 600 కోట్లతో పురాతన దేవాలయాలు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 4100 పైగా దేవాలయాలను అభివృద్ధి చేశాం. మేము దేవాలయాలను ఇంత అభివృద్ధి చేస్తే చంద్రబాబు దేవాదాయ శాఖలో రివ్యూ చేసి గత ప్రభుత్వంలో జరుగుతున్న దేవాలయాల పనులను ఆపేయమని ఆదేశాలు జారీచేశారు. ఇదంతా చూస్తూ బీజేపీ నాయకులు ఎందుకు నిలదీయడంలేదు. కూటమి భాగస్వాములు ఏం చేస్తున్నారు.సూపర్ సిక్స్ అన్నారు ఏమైపోయింది. ఒక ప్రాంతంలో వచ్చిన వరదను కూడా మీరు ఎదుర్కోలేక పోయారు. దేశ రాజకీయాల్లో ఎక్కడ కూడా చంద్రబాబు లాంటి నీచమైన నాయకుడు ఉండడు. ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకుని లెంపలు వేసుకుని చేసిన తప్పు ఒప్పుకో. మన రాష్ట్రానికే తలమానికంగా నిలిచే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మీదే నిందలు వేయడం అత్యంత బాధాకరం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: దేవుడి మీద రాజకీయం చంద్రబాబుకే చెల్లింది: ఎమ్మెల్సీ బొత్స