
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. లడ్డూలలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంపై యావత్ ప్రజానీకం నివ్వెరపోయింది. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరుతూ.. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణియన్ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై ఈ నెల 30న విచారణ ప్రారంభం కానుంది. జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్ బెంచ్ లడ్డూ వివాదంపై విచారణ జరపనున్నారు. చంద్రబాబు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ స్వార్థం, స్వలాభం కోసం వాడుకునే అవకాశం ఉందనే తాను సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు సుబ్రమణియన్స్వామి తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment