vellampalli srinivas
-
పోసాని అరెస్ట్ పై వెల్లంపల్లి షాకింగ్ కామెంట్స్..
-
బెదిరించి.. భయపెట్టి.. ‘కూటమి’ ప్రలోభాలు: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేస్తోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రలోభాలకు లొంగకపోతే అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇంటిని కూల్చేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఎన్నికలు పారదర్శకంగా జరగాలి. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలి. రాజీనామా చేసి వచ్చిన వారినే పార్టీలో చేర్చుకుంటానని చంద్రబాబు చెబుతున్నాడు. స్థానిక సంస్థలకు ఆ సిద్ధాంతాలు వర్తించవా చంద్రబాబు?. ఎందుకు దొడ్డిదారిన వైఎస్సార్సీపీ పార్టీ నేతలను లాక్కుంటున్నారు. కూటమి నేతలకు అధికార దాహం తీరలేదు. ప్రజల గొంతును వినిపించకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారు. మీకు బలం లేనప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నారు?’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు: మల్లాది విష్ణుబలం లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దుయ్యబట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసి కూటమి దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలుపెట్టిన ప్రలోభాలను నేటికీ టీడీపీ కొనసాగిస్తోంది. బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ ఓటేసే అవకాశం ఇవ్వాలని.. భద్రత కల్పించాలని ఎన్నికల కమిషనర్ను కోరాం. పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మా కార్పొరేటర్లు,కౌన్సిలర్లకు భద్రత లేకుండా పోయింది. కూటమి దుష్ట ఆలోచనకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.భయపెట్టి దాడులు.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోంది: అవినాష్ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు భయపెడుతున్నారు. భయపెట్టి దాడులు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోంది. పార్టీ మారకపోతే రాత్రికి రాత్రి అభ్యర్థుల ఇళ్ల పై జేసీబీలతో దాడులు చేస్తున్నారు.ఇదీ చదవండి: టీడీపీ ప్రయోజనాలు వేరు.. ఏపీ అవసరాలు వేరు: బొత్సఅలాంటి వారికి త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారు: మేయర్ రాయన భాగ్యలక్ష్మిరాజకీయ భిక్ష పెట్టిన నాయకులను కాదని కొందరు పార్టీలు మారుతున్నారు. అలాంటి వారికి త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారు. కూటమి ప్రభుత్వం భయపెట్టి.. ప్రలోభపెట్టి వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకుంటున్నారు. ఒక సింబల్ మీద గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లడం సరికాదునిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి: ఎమ్మెల్సీ,లేళ్ల అప్పిరెడ్డిరేపు 10 చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. సంఖ్యా పరంగా ఎక్కడా టీడీపీ గెలిచే అవకాశం లేదు. సంఖ్యాపరంగా బలం లేనప్పుడు ప్రలోభాలు పెట్టడం దేనికి. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో బుల్డోజర్ సంస్కృతి వచ్చింది. మీపార్టీ వైపు లొంగకపోతే ఇళ్లు కూలగొడతారా.. దాడులు చేస్తారా?. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటే ఇదేనా చంద్రబాబు?. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలిమీరు చెప్పిన మాట మీకు వర్తించదా చంద్రబాబు?: అంబటి రాంబాబుతిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన అక్రమాల పై ఎన్నికల కమిషన్ను కలిశాం. శేఖర్ రెడ్డిని మేం డిప్యూటీ మేయర్గా ప్రకటించాం. శేఖర్ రెడ్డిని కూటమి నేతలు బెదిరించారు. శేఖర్ రెడ్డి బిల్డింగ్ను దుర్మార్గంగా కూల్చేశారు. రాజీనామా చేసి వస్తేనే పార్టీలో చేర్చుకుంటామని చంద్రబాబు అనేక మార్లు చెప్పారు. కార్పొరేటర్ల విషయంలో మీరు చెప్పిన మాట మీకు వర్తించదా చంద్రబాబు?. మా పార్టీలో గెలిచి పక్కపార్టీలోకి వెళ్లిన వారికి విప్ జారీ చేశాం. -
అల్లు అర్జున్ లాగే వీళ్ల మీద కేసులు పెట్టాలి!
-
వరదలు చూసి వసూలు చేసిన చందాలు పేద వారికి పంచకుండానే మింగేశారు
-
వంగలపూడి అనితకు వెల్లంపల్లి స్ట్రాంగ్ కౌంటర్
-
టీడీపీ నేతలు.. వరద బాధితులను కలిసే దమ్ముందా?: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్కు పేదలంటే ఎందుకు అంత చులకన అని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. సంక్షోభం నుంచి అవినీతి ఎలా చేస్తారో చంద్రబాబు చేసి చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులను నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి వెల్లంపల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు ఎన్ని విన్యాసాలు చేసినా బాధితులకు ఓదార్పు కలగలేదు. వరద బాధితుల కోసమని చిన్నపిల్లలు కూడా వారు దాచుకున్బ డబ్బు ప్రభుత్వానికి ఇచ్చారు. వరదల వలన లక్ష నుండి రెండు లక్షల వరకు ఒక్కో ఇంటికి నష్టం వచ్చింది. బాధితులకు ఐదు రోజులపాటు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు. రూ.368 కోట్లు భోజనాల పేరుతో దోచుకున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకుండానే కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చెప్పారు. రూ.26 కోట్లతో వాటర్ బాటిల్స్ ఇచ్చారంట. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.అలాగే, 412 డ్రోన్లతో ఆహారం అందించామని తప్పుడు లెక్కలు చెప్పారు. బాధితులకు సహాయం చేయకుండానే చేసినట్టు ఎందుకు లెక్కలు చెప్తున్నారు? పేదలంటే ఎందుకు అంత చులకనా?. కేంద్రం ఇచ్చిన నిధులు, విరాళాలు ఏం చేసినట్టు?. విజయవాడ బ్రాండ్ ఇమేజ్ని చంద్రబాబు డ్యామేజ్ చేశారు. బాధితులు సహాయం కోసం రోడ్డు మీదకు వస్తే పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించారు. ఇదేనా ప్రభుత్వ విధానం?. వరద బాధితుల పేరుతో కూడా దోచుకోవటం ఇప్పుడే చూస్తున్నాం. పదో తేదీన వరద బాధితుల కోసం ధర్నా చేయబోతున్నాం. ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకోవాలి. ప్రభుత్వం చేయలేని పని మేము చేశాం. మా పార్టీ తరఫున బాధితులను సహాయం అందించాం. ప్రభుత్వం అడ్డుకున్నా నడుచుకుంటూ వెళ్లి సాయం చేశాం. వరద బాధితులను నిలువునా ముంచారు. వరద బాధితుల ప్రాంతాల్లో టీడీపీ నేతలు పోలీసులు లేకుండా తిరిగే ధైర్యముందా?. ఒకసారి జనంలోకి వస్తే బాధితులే సమాధానం చెబుతారు.దసరా నవ రాత్రులు జరుగుతున్న తీరు బాధాకరం. మేయర్ భాగ్యలక్ష్మిని రోడ్డుమీద ఆపేశారు. కాదంబరీ జత్వానీని పోలీసు ఎస్కార్టుతో పంపటం దారుణం. గతంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు చూడలేదు. ఉచిత బస్సుల్లో వృద్దులను ఎక్కించుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ వెళ్తే సాధారణ భక్తులను గంటల తరపడి ఆపేశారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మేము గుడ్బుక్ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం: వైఎస్ జగన్ -
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
సాక్షి, అమరావతి: తిరుమల ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వేంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పిన రోజు నుంచి కోట్లాది భక్తులు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ఆయన సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పట్టిందన్నారు.సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కూడా కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని వాడలేదని చెప్పారన్నారు. కల్తీ అయిందని చెబుతున్న నెయ్యి వాడలేదు కదా అని సుప్రీం కోర్టు ప్రశ్నించడంతో పాటు, దానిపై సెకెండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా నిలదీసిందని చెప్పారు. జూలై 23 నుంచి సెప్టెంబరు 18 వరకు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని కూడా సర్వోన్నత న్యాయస్ధానం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిందని తెలిపారు. సిట్ నియామకాన్ని కూడా ప్రశ్నించిందన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దని వెల్లంపల్లి మరోసారి చంద్రబాబుకి సూచించారు. -
శ్రీవారిని అడ్డంపెట్టుకుని బాబు నీచ రాజకీయం చేస్తున్నారు
-
మీ దగ్గర ఆధారాలుంటే.. సిట్ ఎందుకు?: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: లడ్డూలో కల్తీ జరిగితే ఇన్ని రోజులుగా ఏం చేస్తున్నారు? బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ.. చంద్రబాబు నీచ రాజకీయాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు బాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.శ్రీవారి భక్తుడని చెప్పుకునే బాబు ఇలాంటి రాజకీయం చేస్తారా?. జులై 23న రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 19 వరకు ఏం చేశారు?. 2 నెలలు ల్యాబ్ రిపోర్ట్ను ఎందుకు బయటపెట్టలేదు’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ నిలదీశారు. ‘‘చంద్రబాబు,ఈవో మాటలకు పొంతన లేదు. మీ దగ్గర ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలి కదా?. సిట్ ఎందుకు?’’ అంటూ వెల్లంపల్లి దుయ్యబట్టారు.ఇదీ చదవండి: ‘టీడీపీ ఆఫీస్లో టీటీడీ రిపోర్ట్.. ఏంటీ గూడుపుఠాణి?’‘‘చంద్రబాబు వంద రోజుల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆధారాల్లేకుండా అడ్డమైన ఆరోపణలు చేశారు. తప్పు జరిగితే ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదు?. కంటితుడుపు కోసం ఇప్పుడు సిట్ వేశారు. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రే ఆరోపణలు చేశాక ఇక సిట్ దర్యాప్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏఆర్ ఫుడ్స్ నిజంగానే తప్పు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. సనాతన ధర్మం గతంలో లేనట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. చెప్పులు వేసుకుని దీక్షలు చేయటం పవన్ కళ్యాణ్కే చెల్లింది. ఇలాంటి దారుణాలను మేము ఎప్పుడూ చూడలేదు. మాటలు చెప్పే ముందు సనాతన ధర్మాన్ని పవన్ పాటించాలి..ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన రెండు నెలల వరకూ దాన్ని ఎందుకు బయట పెట్టలేదు?. ఆ రిపోర్టు గురించి టీడీపీ ఆఫీసులో మాట్లాడటం ఏంటి?. వనస్పతి కలిసిన నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపామని ఈవో శ్యామలరావు జులై 23న చెప్పారు. జంతువుల కొవ్వు కలిసిందని సెప్టెంబరు 18న చంద్రబాబు కూటమి మీటింగ్లో మాట్లాడారు. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. కానీ వనస్పతి కలిసిన ట్యాంకర్లను వెనక్కు పంపామని సెప్టెంబరు 20న ఈవో శ్యామలరావు చెప్పారు. మళ్లీ చంద్రబాబు సెప్టెంబరు 22న మాట్లాడుతూ ఆ నెయ్యిని వాడారని మరీసారి అబద్దాలు చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రా? టీటీడీ ఈవోనా?. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే రకం చంద్రబాబు...హరికృష్ణ మృతదేహం పక్కనే పొత్తుల గురించి చర్చించిన నీచ చరిత్ర చంద్రబాబుది. సూపర్ సిక్స్ పథకాల నుండి డైవర్షన్ కోసమే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు. లడ్డూ విషయమై సుప్రీంకోర్టు విచారణ జరపాలి. తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చేసిన తప్పును ఒప్పుకుంటూ చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. చంద్రబాబూ నీ తప్పు ఒప్పుకో.. లేకపోతే వెంకటేశ్వరస్వామి ఒప్పుకోడు.వరదల మేనేజ్మెంట్లో చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. వరదల పేరుతో చంద్రబాబు వందల కోట్లు వసూలు చేశారు. అందులో పదిశాతం ఖర్చు పెట్టినా బాధితులను ఆదుకోవచ్చు. వరద బాధితులపై లాఠీ ఛార్జి చేసిన ఘనత చంద్రబాబుది. సాయం చేయమని కోరితే లాఠీఛార్జి చేస్తారా?. పరిహారం ఎగ్గొట్టడానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వీటన్నిటికీ చంద్రబాబు బాధ్యత వహించాలి’’ అని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. -
కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ప్రజల చావుని చూస్తున్నావా..?
-
బాబు నిర్లక్ష్యం వల్లే ముంపు వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం
సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే విజయవాడ నగరం ఎప్పుడూలేని విధంగా ముంపునకు గురైందని వైఎస్సార్సీపీ నేతలు మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంవల్ల రాష్ట్రంతోపాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కృష్ణా, ఉప నదులకు భారీ ఎత్తున వరద వచ్చే అవకాశముందని ఐఎండీ, సీడబ్ల్యూసీ ముందస్తుగా హెచ్చరించినా.. ముంపు ముప్పు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు.ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు లాకులు ఎత్తేయడంవల్లే విజయవాడ ముంపునకు గురైందని ఫైర్ అయ్యారు. జలదిగ్బంధంలో చిక్కుకుని సహాయం కోసం ప్రజలు అర్థిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు వీకెండ్ ఎంజాయ్మెంట్లో బిజీగా ఉన్నారా? అని వారు ప్రశ్నించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో.. బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం కంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలే ముందుండి చేస్తున్నారని చెప్పారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. వారు ఇంకా ఏమన్నారంటే.. నిన్న కొండచరియలు విరిగిపడి ఐదుగురు చనిపోయారు. వారిని పరామర్శించిన వారులేరు. కరెంట్ లేదు.. నిత్యావసర వస్తువుల్లేవు.. ఇదేనా పాలన? విజయవాడ నగరంలో మీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ప్రజలు మాకు ఫోన్లుచేసి సాయం కోరుతున్నారు. మేమంతా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాం. అధికార్లు కూడా మా ఫోన్లు ఎత్తడంలేదు. గతంలో సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ ఉంటే ముందే ప్రజలను అప్రమత్తం చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ వ్యవస్థల్లేవు. కూటమి ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా మేం ప్రజల తరఫున పోరాటం చేస్తాం. -
వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం
-
వరద సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కార్ విఫలం: వెల్లంపల్లి
సాక్షి, గుంటూరు: వరద సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం కనీస అవరాలు తీర్చడం లేదని ధ్వజమెత్తారు. విజయవాడలో కొండ చరియలు విరిగిపడి ఆరుగురు చనిపోతే ఏపీ ప్రభుత్వానికి కనీసం పట్టింపులేదని వెల్లంపల్లి నిప్పులు చెరిగారు.‘‘రెండు రోజులుగా విజయవాడ అల్లాడిపోతోంది. కాలనీలు, ఇళ్లు నీట మునిగిపోయాయి. ప్రజలను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. కనీసం తక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. రెండు రోజులు అతలాకుతలం అయిపోతే ఈరోజు మంత్రులు వస్తున్నారు. విజయవాడలో అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. కనీసం భోజనం కూడా ప్రజలకు అందించలేదు. ఎవ్వరినీ పునరావాస కేంద్రాలకు తరలించలేదు’’ అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కొండ చరియలు విరిగిపోయి ఐదుగురు చనిపోయారు. కనీసం అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించలేదు. కరెంట్ లేదు, తిండి లేదు, నిత్యావసర వస్తువులు అందించలేదు. అమ్మాయిల పేరుతో దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. కానీ వరదల్లో ఉన్న ప్రజలను అడుకోలేదు. అధికారులు కూడా స్పందించడం లేదు. ప్రజలను అప్రమత్తం చేయలేదు’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ నిలదీశారు.‘‘సచివాలయ, వలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వైఎస్ జగన్ ముందు చూపుతో రిటైనింగ్ వాల్ కట్టారు. అందుకే లంక ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కొండ చరియలు పడి ఐదుగురు చనిపోతే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వాళ్ళ దగ్గరకి వెళ్ళారా..?. సుజనా చౌదరి ఎక్కడ..?. బోండా ఉమా ఎక్కడ..?. కేశినేని చిన్ని ఎక్కడ..?. గద్దె రామ్మోహన్ రావు ఎక్కడ..?. ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఇది’’ అంటూ వెల్లంపల్లి దుయ్యబట్టారు.‘‘కనీసం చంద్రబాబు సమీక్ష చేయలేదు. సీఎం సమీక్ష చేస్తే.. ఆ ఫోటో ఏది..?. డిప్యూటీ సీఎం ఎక్కడ..వారి తాలూకా వాళ్ళు ఎక్కడ..?. వీకెండ్ వస్తే..చాలు అందరూ వ్యక్తిగత పర్యటనలకు వెళ్లిపోతున్నారు. నష్టపోయిన ప్రజలందరికీ పరిహారం అందించాలి’ అని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. -
వెల్లంపల్లి నిరసన.. తోకముడిచిన పోలీసులు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్పోర్టుకు నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వైఎస్ జగన్ను వారిని కలవనీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్ద మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ కార్లలో ఉన్న కార్యకర్తలను సైతం దించివేయించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారుని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎయిర్ పోర్టు ప్రధాన గేటు వద్ద వెల్లంపల్లి భైఠాయించారు. వెల్లంపల్లి నిరసనతో దిగివచ్చిన పోలీసులు.. ఆయన కారుని ఎయిర్ పోర్ట్ లోపలికి అనుమతించారు. పోలీసుల తీరుపై వైస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు ఆంక్షలు బెంగళూరు నుంచి కొద్దిసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న @ysjagan గారు. స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్కి వస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.గతంలో ఎన్నడూ లేనట్లుగా ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు వద్ద మాజీ మంత్రులు,… pic.twitter.com/1UnrdPCeMB— YSR Congress Party (@YSRCParty) August 6, 2024 -
పవన్ కళ్యాణ్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
-
మీ పిల్లల్ని అదుపులో పెట్టుకో బోండా ఉమాకి వెల్లంపల్లి స్ట్రాంగ్ వార్నింగ్..
-
పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
-
బోండా ఉమా ఎన్నికల అఫిడవిట్ మోసాలను బయటపెట్టిన వెల్లంపల్లి శ్రీనివాస్
-
బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని.. ఆయన మోసాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2014లో బోండా ఉమా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికారులను తప్పుదారి పట్టించారని దుయ్యబట్టారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బోండాపై మేం మూడు ఫిర్యాదులు చేశాం. సింగ్ నగర్ పార్టీ ఆఫీస్లో ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్లోనే ఓట్లు ఉండాలి. మా ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదు. 2014లో అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారు. 2019 అఫిడవిట్లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్నే పెట్టారు. 2024 అఫిడవిట్లో సింగ్నగర్ పార్టీ ఆఫీస్ను ఇల్లుగా చూపించాడు. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారు. పార్టీ ఆఫీస్లో ఆయన ఎలా నివాసముంటున్నారు?. పార్టీ ఆఫీస్లో ఓట్లు ఎలా నమోదు చేస్తారు?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.‘‘గతంలో వైఎస్సార్సీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించాడు. అదే రూల్ ఇప్పుడు బోండాకు ఎందుకు వర్తించదు. టీడీపీ పార్టీ ఆఫీస్లోనే బోండా కుటుంబానికి చెందిన ఐదు ఓట్లు ఉన్నాయి. బోండా ఉమా అభ్యర్ధిగా పోటీ చేసేందుకు అనర్హుడు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నేను ఇక్కడితో ఆగను. బోండాపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తా. బోండా తన కుమారుడితో సంబంధం లేదని చెప్పి ఓటు ఇక్కడే చూపించారు. ఒక కుమారుడు ఇతర దేశంలో ఉంటారని చెప్పి.. ఓటు ఇక్కడే చూపించాడు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బోండా తప్పుడు సమాచారం ఇచ్చాడు. తప్పుడు డాక్యుమెంట్తో ఓటు చూపించాడు. బోండా ఉమా ఓటు రద్దుచేయించే వరకూ పోరాడతా’’ అని వెల్లంపల్లి తేల్చి చెప్పారు.‘‘నేను పక్క నియోజకవర్గం నుంచి వచ్చానంటున్నాడు. బోండా పక్క నియోజకవర్గం నుంచి రాలేదా?. ఎమ్మెల్యేగా గెలిచాక.. నేను సెంట్రల్ నియోజకవర్గంలోనే నివాసముంటా.. బోండా ఉమా... అతని సతీమణి.. ఇద్దరు కుమారులు.. కోడలు ఓట్లు చెల్లవు. పార్టీ కార్యాలయాన్ని ఇల్లుగా చూపించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎవరైనా కాపురాలు చేస్తారా?. బోండా ఉమా చెల్లదు.. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బోండాను అనర్హుడిగా ప్రకటించే వరకూ పోరాడతా. బోండా ఉమా అధికారులను బెదిరిస్తున్నాడు. బీజేపీతో పొత్తులో ఉన్నామని బెదిరిస్తున్నాడు.2 కోట్ల 54 లక్షల 97వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. బోండా ఉమా ఆర్థిక నేరస్తుడు. బోండా ఉమా వంటి ఆర్ధిక నేరస్తుడికి ఓటేయొద్దు. 2019లో పెండింగ్లో ఉన్నవి.. 2014లో ఉన్న కేసులు 2024 అఫిడవిట్లో పొందుపరచలేదు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. బోండా ఉమాపై ఉన్న కేసులపై తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. వేరే పార్టీలను ప్రచారం చేయనీయకుండా చేస్తున్నారు. వేరే పార్టీలకు అవకాశం లేకుండా పర్మిషన్లు తీసుకుని తిరగకుండా చేస్తున్నారు. మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.‘‘మా హక్కులకు బోండా ఉమా భంగం కలిగిస్తున్నాడు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాం. బోండా ఉమా దిక్కుమాలిన రాజకీయం మానుకోవాలి. ఓటు అడగనోడివి నీరెందుకు బోండా ఉమా అనుమతులు. ఓటమి భయంతోనే బోండా నీచ రాజకీయాలు చేస్తున్నాడు. బోండాను కచ్చితంగా ఓడించి తీరుతాం.. బుద్ధిచెబుతా’’ అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. -
బోండా ఉమాపై అనర్హత వేటు ?..ఈసీకి ఫిర్యాదు
-
బోండా ఉమాపై అనర్హత వేటు ?..ఈసీకి ఫిర్యాదు
-
బోండా ఉమా పని అయిపొయింది..వెల్లంపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబు ఆదేశాలతోనే..
-
బోండా ఉమాకి డిపాజిట్ కూడా రానివ్వను
-
బోండా ఉమా, చంద్రబాబుకు వెల్లంపల్లి అల్లుడు కౌంటర్
-
వెలంపల్లికి సజ్జల పరామర్శ
-
బస్సుపై అసలు ఏం జరిగిందంటే..!
-
‘పక్కా ప్లాన్ ప్రకారమే సీఎం జగన్పై దాడి జరిగింది’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. నా కంటికి కూడా దెబ్బ తగలడంతో విపరీతంగా నొప్పి వచ్చిందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సీఎం జగన్పై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనే అని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. కాగా, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్కు తగిలిన వెంటనే నాకు కూడా గాయమైంది. ఆ ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో అర్థం కాలేదు. నాకు కనుగుడ్డుపై ర్యాష్ అయ్యింది. ఇప్పుడు కూడా కంటి నొప్పి ఉంది. సీఎం జగన్ తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి జగన్పై జరిగిన హత్యాయత్నంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు, ఎన్నికల కమిషన్ ఈ ఘటనను సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టాలి. చంద్రబాబు నీచమైన రాజకీయం చేస్తున్నాడు. గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు చంపించాడు. సీఎం జగన్పైన ఈరోజు ఇలా కుట్ర చేశారు. సిగ్గులేకుండా లోకేష్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎన్నికల కోసం డ్రామాలాడే అలవాటు చంద్రబాబుదే. టీడీపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సీఎం జగన్పై దాడిని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాన్ ప్రకారమే సీఎం జగన్పై దాడి జరిగింది. దాడి చేసిన వెంటనే బాబు మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. సీఎం జగన్పై దాడిని కూడా డ్రామా అనడం చంద్రబాబు నైజం. విచారణ వేగంగా జరుగుతుంది.. వాస్తవాలు బయటకి వస్తాయి. ఈ దాడి ఘటనపై ఎన్నికల కమిషన్ వెంటనే దర్యాప్తు చేయాలన్నారు. మరోవైపు, సీఎం జగన్పై దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే రోజా నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్నకు వస్తున్న ఆదరణ చూడలేకే చంద్రబాబు దాడులు చేయించారు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి. పవన్ కల్యాణ్ కుట్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు సరికాదు. తన గెలుపు కోసం ఎదుటి వ్యక్తిని చంపాలనుకోవడం సిగ్గుచేటు. ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారు అని కామెంట్స్ చేశారు. -
సీఎం జగన్ కి తగిలి..నా మీద పడింది..
-
పవన్ కళ్యాణ్ పిల్ల రాజకీయ నాయకుడు
-
బోండా ఉమపై వెల్లంపల్లి తీవ్ర ఆగ్రహం
-
జగన్ మరోసారి సీఎం కావడం ఖాయం: వెల్లంపల్లి
-
చంద్రబాబుకు వెల్లంపల్లి వార్నింగ్
-
విశాఖ డ్రగ్స్.. పురందేశ్వరి కొడుకు కీలక పాత్ర!
-
ఈ కొబ్బరి బోండాన్ని, చంద్రబాబుని నమ్మితే అంతే
-
భయపెడితే బయపడేవాడు ఎవడు లేడు .. వెల్లంపల్లి వార్నింగ్
-
బాబు బలవంతం
-
ప్యాకేజీ పవన్ మంత్రాలు..
-
కౌరవుల్లా 100 మంది వచ్చినా ఇక్కడ ఉన్నది అర్జునుడు
-
వంగవీటి రంగా హత్యకు కారణం టీడీపీయే: వెల్లంపల్లి శ్రీనివాస్
-
అమరావతిలో పేదలకు ఇళ్లు నిర్మిస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారు: వెల్లంపల్లి
-
సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ కరపత్రాలను ప్రజలకు అందజేసిన వెల్లంపల్లి
-
బోండా ఉమ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
-
పవన్ బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు: వెలంపల్లి
-
కుప్పంలో మీ అయ్యా..భీమవరంలో మీ అన్న ఖేల్ ఖతం..
-
షర్మిల మర్యాదలు తెలుసుకుని మాట్లాడితే మంచిది: వెలంపల్లి
-
పవన్ కళ్యాణ్ సినిమా చూస్తారు ఓటు మాత్రం సీఎం జగన్ కే వేస్తారు
-
శాంతినగర్ డివిజన్ పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు
-
తాట తీస్తా జాగ్రత్త !..వెల్లంపల్లి వార్నింగ్
-
టీడీపీ నేత బోండా ఉమపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
-
నువ్వొక పనికిమాలిన వాడివి..నాదెండ్ల పై వెల్లంపల్లి ఫైర్
-
తుప్పు వ్యాపారం చేసే వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది?: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు తోకలు ఎవరూ గెలవరంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. శుక్రవారం ఆయన సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, అందరి జీవితాలు బాగుండాలంటే సీఎం జగన్కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లు ప్రజల వద్ద బోండా ఉమా లేడని.. బైక్ రేసులు, భూ కబ్జాలు, దొంగతనాలు, గుండాయిజం, కాల్ మనీలు చేసింది టీడీపీ నేతలేనని దుయ్యబట్టారు. ‘‘తుప్పు వ్యాపారం చేసే వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది. బోండా ఉమా ఆఫీసు ఉన్న ప్రాంతంలోనే ఉమాకి మెజార్టీ రాదు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గెలవడం కలే. బోండా ఉమాకు సెంట్రల్ నియోజకవర్గంలో నిలబడే అర్హత లేదని వెల్లంపల్లి మండిపడ్డారు. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఇలా మాట్లాడటం దారుణం. ఆమె అంటే మాకు గౌరవం. గతంలో వివేకానందరెడ్డిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్లు ఇప్పుడు షర్మిలమ్మను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఓటు, సీటు లేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, అప్పుల పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. దివంగత సీఎం వైఎస్సార్ పేరును కాంగ్రెస్.. ఎఫ్ఐఆర్లో నమోదు చేయించడం దారుణం. సోనియా గాంధీకి తెలియకుండానే వైస్సార్ మీద కేసు పెట్టారా?. 16 నెలలు సీఎం జగన్ను జైల్లో పెట్టింది వాస్తవం కాదా?. అలాంటి పార్టీలో షర్మిలమ్మ ఎలా చేరారు?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు. ఇదీ చదవండి: సీఎం జగన్, చంద్రబాబు మధ్య తేడా ఇదే -
బోండాకు ఆ అర్హత లేదు
-
పనికి పబ్లిసిటీకి తేడా చెప్పిన వెల్లంపల్లి
-
సీఎం జగన్ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్కు లేదు: వెల్లంపల్లి
-
సీఎం జగన్ ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్ కు లేదు: వెల్లంపల్లి
-
బోండా ఉమా హద్దు మీరి మాట్లాడితే సహించేది లేదు
-
మల్లాది విష్ణు, నేను వేరు కాదు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లాది విష్ణు, తాను వేరు కాదు.. ఇద్దరూ ఒక్కటేనని వెల్లంపల్లి స్పష్టం చేశారు. అలాగే, బోండా ఉమా హద్దు మీరి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వెల్లంపల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం. మల్లాది విష్ణు, నేను వేరు కాదు.. ఇద్దరం ఒక్కటే. సామాజిక సమీకరణాల్లో భాగంగానే మార్పులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండగా పాటిస్తాం. సీఎం వైఎస్ జగన్ పథకాలు, సంక్షేమ పాలనే వైఎస్సార్సీపీని, మమ్మల్నిని గెలిపిస్తాయి. టీడీపీ నేత బోండా ఉమ హద్దు మీరి మాట్లాడుతున్నాడు. బోండా ఉమ హద్దు మీరితే సహించేది లేదు. ముందు వాళ్ల సీట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి అని హితవు పలికారు. -
చంద్రబాబుకి ఆ గేటు తెరిచే ఉద్దేశం లేదేమో!
సాక్షి, విజయవాడ: ‘‘గేట్లు ఓపెన్ చేస్తే వైఎస్సార్సీపీ నేతలంతా టీడీపీలోకి వస్తారని గతంలో చంద్రబాబు అన్నారు.. మరి ఇప్పటివరకు ఎందుకు ఆ గేట్లు తెరవలేదు.. బహుశా చంద్రబాబుకి ఆ గేట్లు తెరిచే ఉద్దేశం లేదేమో!’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సెటైర్లు వేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నియోజకవర్గం మారాలంటే కొంత బాధగానే ఉంది. కానీ.. పార్టీ నిర్ణయం కోసం కట్టుబడి ఉంటా. సీఎం జగన్ సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం’’ అని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. ‘‘సామాజిక సమీకరణాల్లో భాగంగానే మార్పులు. వెస్ట్ నుంచి మైనారిటీ అభ్యర్థిని పెట్టాలని పార్టీ నిర్ణయించింది. వెల్లంపల్లి వర్గం, మల్లాది వర్గం అని వేర్వేరుగా లేవు.. అంతా వైఎస్సార్సీపీ వర్గమే. ఏ పార్టీలో చేరాలన్నది షర్మిల ఇష్టం. ఆమె ఏం మాట్లాడతారో చూడాలి’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్ -
175కి 175 స్థానాలు గెలిచి..మళ్లీ జగన్ సీఎం కావాలి
-
టీడీపీ సభపై వెల్లంపల్లి సెటైర్లు
-
దేవాలయాలు కూల్చి బాత్రూంలు కట్టిన చరిత్ర చంద్రబాబుది
-
చంద్రబాబు, పవన్, లోకేష్లకు వెల్లంపల్లి సవాల్
సాక్షి, విజయవాడ: ఆర్య వైశ్యులకు తానేం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని, టీడీపీ ఆఫీస్కు రమ్మన్నా వచ్చేందుకు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు, పవన్, లోకేష్లకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్య వైశ్య సంఘాల ముసుగులో తనను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు ఎప్పుడూ ఆర్య వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. జగన్ సీఎం అయ్యాక అనేక రాజకీయ, నామినేటెడ్ పదవులిచ్చారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలకు పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వలేదు. కార్తీక పౌర్ణమి స్నానాల కోసం వేలాది మంది భక్తులు వచ్చే చోట వారికి ఇబ్బంది కలిగేలా కార్యక్రమం తలపెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ హిందూ ద్రోహులు’’ అని వెల్లంపల్లి మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చివేస్తే బీజేపీ పట్టించుకోలేదు. విజయవాడ పశ్చిమ టిక్కెట్ వైశ్యులకు ఇచ్చే దమ్ము లోకేష్కి ఉందా?. పోతిన మహేష్ సిగ్గు లేకుండా చంద్రబాబుకి చెంచాగిరి చేస్తున్నాడు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు. చదవండి: ఇవిగో నవరత్నాల వెలుగులు -
రెండు కోతుల కథ చెప్పిన వెల్లంపల్లి
-
పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి చంద్రబాబుకి గుండు కొట్టించడం కాయం..!
-
జుట్టు ఎక్కువ...బుర్ర తక్కువ మంత్రి వెల్లంపల్లి సెటైర్లు
-
జనసేన వల్ల నీకు తప్ప ఎవరికీ ఉపయోగం లేదు.. చంద్రబాబు, పవన్ పై వెల్లంపల్లి సెటైర్లు
-
పవన్ కళ్యాణ్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
-
పురంధేశ్వరికి రాజకీయాలు తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు పట్టావు: వెల్లంపల్లి
-
2024లో ఏపీలోనూ టీడీపీ జెండా పీకేస్తారు: వెల్లంపల్లి
-
నిజం గెలవాలిపై మంత్రి వెల్లంపల్లి సెటైర్లు
-
రాజమండ్రి జైలు సాక్షిగా పవన్ తన ముసుగు తీసేశాడు: వెల్లంపల్లి
-
‘బావ కళ్లల్లో ఆనందం కోసం ప్రభుత్వంపై బురద చల్లితే సహించం’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: బావ కళ్లల్లో ఆనందం కోసం ప్రభుత్వంపై బాలకృష్ణ బురద చల్లితే సహించేది లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. పశ్చిమ నియోజక వర్గంలో పలు డివిజన్లలో పర్యటించిన వెల్లంపల్లి.. మీడియాతో మాట్లాడుతూ, భర్తను అరెస్ట్ చేస్తే భార్య బాధ పడటం సహజమని, చంద్రబాబుకి కోర్టులో మౌలిక సదుపాయాలు కల్పన విషయంలో ప్రభుత్వ న్యాయవాదులు ఎక్కడా అడ్డు పడలేదన్నారు. టీడీపీ బంద్కి పిలుపునిస్తే హెరిటేజ్ సంస్థ వ్యాపారాలు చేసుకోవడం సిగ్గు చేటు. చంద్రబాబు స్కిల్ పేరిట దోచుకున్న సొమ్మును కక్కిస్తాం. లోకేష్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. వాళ్ల నాన్న చేతికి పెట్టుకున్న ఉంగరంలోని చిప్ ఇప్పుడు లోకేష్ పెట్టుకుంటే మంచిది’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. చదవండి: బాబు, పవన్ ఫెవికాల్ బంధం.. ఎవరేమైతే మాకేంటి? -
చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదు.. అనివార్యం: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: చంద్రబాబుది అక్రమ అరెస్టుకాదని, అనివార్యమైన అరెస్టు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అరెస్టు చేయటం వలన సింపతి వస్తుందని టీడీపీ, ఎల్లోమీడియా చూసిందని, దీన్ని కక్షసాధింపుగా ప్రజలు చూస్తారని భావించారు కానీ అవేవీ జరగలేదని అన్నారు. భారీగా అక్రమాలు చేసినా చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని పేర్కొన్నారు. సీఐడీవారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వలన కేసుకు అనుగుణంగా వారు వ్యవహరించారని చెప్పారు,. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చేసినందునే చంద్రబాబు అరెస్టు అయ్యారని మంత్రి అంబటి అన్నారు. స్కిల్ కేసులో ఇప్పుడు అరెస్టు అయ్యారని.. ఇంకా రింగు రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు ముందు చాలా లోతైన విచారణ జరిగిందన్నారు. షెల్ కంపెనీలకు డబ్బు తరలించి, తర్వాత తన ఖాతాలోకి వేసుకున్నట్టు తేలిందని పేర్కొనఆనరు. సీమెన్స్ కంపెనీతో సంబంధం లేకుండానే వ్యవహారం నడిపారన్నారు. ఆ కంపెనీ కూడా ఈ విషయం చెప్పిందని, రూ.330 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని లూటీ చేశారని విమర్శించారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు మంత్రి అంబటి మాట్లాడుతూ.. అన్యాయంగా అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి? ఎన్నికలకు ముందు అరెస్టు చేస్తే చంద్రబాబుకు సింపతీ పెరుగుతుందని మాకు తెలీదా? కానీ వ్యవస్థలు సక్రమంగా పని తమపని తాము చేసుకునేలా మేము ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు. సీమెన్స్ కంపెనీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. రూ.330 కోట్లు ఇవ్వటానికి వీల్లేదని సీఎస్ కృష్ణారావుతో సహా ఫైనాన్స్ అధికారులు నోట్ ఫైల్ రాశారు. కానీ చంద్రబాబు ఒత్తిడి చేసి నిధులు విడుదల చేయించారు. అంతదారుణంగా అక్రమాలు చేస్తే అరెస్టు చేయకూడదా?. చట్టబద్దంగానే సీఐడీ అరెస్టు చేసింది. చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారయ్యారు. చంద్రబాబు సహకారంతోనే వారిద్దరూ పరారయ్యారు. ఫైబర్ నెట్, రింగ్ రోడ్ విచారణ కూడా జరుగుతుంది. ఎంతటి వారైనా తప్పు చేస్తే చట్టం, న్యాయం సహించదు. రోడ్డుమీదకు వచ్చి గొడవలు చేస్తే సహించేదిలేదు. ప్రజలకు ఇబ్బందులు కల్హిస్తే అణచివేస్తాం. ప్రజల నుండి దూరం చేయలేరంటూ పొలిటికల్ డైలాగులు కుదరవు. కోర్టులో వాస్తవాలు చెప్పుకుంటే మంచిది. ప్రభుత్వ సొమ్ము కాజేసిన సంగతిని పవన్ కల్యాణ్ తెలుసుకుని మాట్లాడాలి. వాసస్తవాలు తెలియాలంటే ఆ వివరాలు మేము పవన్కు పంఇస్తాం. పవన్ వత్తాసు పలకటం ఏంటి షూటింగ్ వదిలి బయటకు రాలేని పవన్, ప్రజలను రోడ్డు మీదకు రమ్మనటం ఏంటి?. గావుకేకలు షూటింగ్లో పెట్టటం కాదు, బయటకు వచ్చి మాట్లాడాలి. ఒక దోపిడీ దారునికి పవన్ కల్యాణ్ వత్తాసు పలకటం ఏంటి?. చంద్రబాబు, పవన్.. ఇద్దరూ ఎవరికి ఆపద వచ్చినా పూలబొకేలు ఇచ్చుకుంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు వద్దకు వచ్చి ఒక పూలబొకేని పవన్ ఇస్తే మంచిది. చంద్రబాబు, పవన్ అవినీతి గోదావరిలో దిగాలనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. బీజేపీ అధ్యక్షురాలు కూడా మా బావ అవినీతి చేయలేదని చెప్పటం లేదు. అరెస్టు ప్రొసీజర్ గురించే ఆమె మాట్లాడుతున్నారు. అంతేకానీ మా బావ నీతిమంతుడని చెప్పలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. లోకేష్ పాత్ర కూడా ఉందని తేలితే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారు. చదవండి: చంద్రబాబు పాపం పండింది: మంత్రి అమర్నాథ్ తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసు రాజకీయ కక్షతో బాబును అరెస్ట్ చేయించాల్సిన అవసరం మాకు లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాజకీయమే చేయాలంటే 4 ఏళ్లుగా బాబు, లోకేష్ బయట తిరేవారు కాదని అన్నారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్న బాబుకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యనించారు. తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసని పేర్కొన్నారు. బాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై 2018లో జీఎస్టీ కేసు పెట్టిందని డొల్ల కంపెనీల ద్వారా లావాదేవీలు జరిగాయని తేలిందన్నారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు చేశామని సెక్రటరీనే ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఇప్పుడు MOU అని సిమెన్స్ కంపెనీ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిందని గుర్తు చేశారు. యువతను చంద్రబాబు మోసం చేశాడని విమర్శించారు. యువతకు స్కిల్స్ నేర్చించలేదు కానీ.. తన స్కిల్స్తో వ్యవస్థను మేనేజ్ చేశాడని దుయ్యబట్టారు. స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్ శాంపిల్ మాత్రమే.. ఇలాంటి స్కామ్లు చాలా చేశాడని అన్నారు. అన్నీ కేసుల్లో స్టేలపైనే ఎవరి పాపాలు పండుతాయో ఎవరికి శిక్ష వెయ్యాలో ఆ దేవుడికి బాగా తెలుసు. దివంగత ఎన్టార్ ఆత్మ క్షోభ , బాధ కూడా గతంలో వినిపించారు.. అది ఇప్పటికి పాపం పండింది. చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కటి కాదు. ఏలేటి స్కామ్, లిక్కర్ స్కామ్లో అన్ని కేసులలో స్టేలపైనే జీవిస్తున్నాడు. పాపలన్నీ బద్దలైనాయిఅన్నింటికి శిక్ష తప్పదు. -మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చట్టానికి ఎవరూ అతీతులు కాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు సక్రమమే. చట్టానికి ఎవరు అతీతులు కాదు.. గతంలోనూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల అరెస్టులు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో వేల కోట్ల అక్రమాలకు చంద్రబాబు పాత్ర ఉంది కనుకనే అరెస్ట్ చేశారు. - నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు అరెస్టుకు రాజకీయ సంబంధం లేదు చంద్రబాబు అరెస్టును స్వాగతిస్తున్నాం. ఆయన అరెస్టుకు రాజకీయానికి సంబంధం లేదు. స్కిల్ డెవలప్ మెంట్లో ఏం జరిగింది అనేది అసెంబ్లీ సాక్షిగా పూర్తిగా చర్చించాం. అసలు సంబంధంలేని సీమెన్ కంపెనీ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. సీమెన్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తితో మాట్లాడి ఈ విధంగా అవినీతికి పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ కూడా ఎంక్వయిరీ చేసి దీనికి మాకు సంబంధం లేదని తేల్చేసింది. పూర్తిస్థాయిలో చర్చించి రూ. 370 కోట్లు ఏ విధంగా అవినీతి జరిగింది అని ప్రభుత్వ సంస్థలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిలో ఏ విధమైన రాజకీయ కోణం గానీ కక్ష సాధింపులు గాని లేవు. దొరికిపోయాడు కాబట్టే నన్ను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారంటూ మూడు రోజుల నుంచి చంద్రబాబు చెబుతున్నాడు. -నందిగామ ఎమ్మెల్యే,మొండితోక జగన్ మోహన్ రావు చంద్రబాబు అరెస్టు సమంజసమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో కూరుకు పోయారు. సీఐడీ పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు దారిమళ్లాయి. హవాలా రూపంలో చంద్రబాబు స్కాంకు పాల్పడ్డాడు. చంద్రబాబు అరెస్టు సమంజసమే. అవినీతికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేస్తే రాజకీయం చేయడం తగదు. -అనకాపల్లి జిల్లా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్ చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్. స్కిల్ డెవలప్మెంట్ స్కాం సూత్రధారి చంద్రబాబే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అనేక కుంభకోణాల్లో భాగస్వామి. చంద్రబాబు వేల కోట్ల అక్రమాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చాలా చిన్నది. చంద్రబాబు పాపం పండింది.. చంద్రబాబు ను జైలుకు పంపాలి. -రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పూర్తి ఆధారాలతో అరెస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పూర్తి ఆధారాలతోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే 2021లోనే అరెస్టు చేయొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ పేరిట ప్రజల సొమ్ము రూ. 360 కోట్లు దోచేసశాడు. జీఎస్టీ,ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబ్ ఇలా అన్ని కూడా మూడు సంవత్సరాల నుంచి దర్యాప్తు చేస్తూ పూర్తి ఆధారాలతో అరెస్టు చేశారు. - ఎమ్మెల్యే తలారి వెంకట్రావు -
యువతని మోసం చేసి 240 కోట్లు దొబ్బేసావు..బాబుపై వెల్లంపల్లి ఫైర్
-
‘వైఎస్సార్ ఫోటోను చూసినా చంద్రబాబుకు భయం’
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు ఒక శాడిస్ట్ అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. 2014-19 వరకూ వైఎస్సార్ విగ్రహాలు పెట్టనివ్వకుండా చంద్రబాబు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, వైఎస్సార్ ఫోటోను చూసినా చంద్రబాబు భయపడుతుంటారని ఎద్దేవా చేశారు వెల్లంపల్లి. ‘విజయవాడలో రాత్రికి రాత్రి 45 ఆలయాలను కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. సీఎం జగన్ వచ్చాక ఆ ఆలయాన్నింటిని పునర్నిర్మిస్తున్నారు.చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా?, వైఎస్సార్ కుటుంబం అంటే గుర్తొచ్చేది అభివృద్ధి సంక్షేమం. చంద్రబాబు అంటే అవినీతి వెన్నుపోటు’ అని వెల్లంపల్లి ధ్వజమెత్తారు. ఒలింపిక్స్లో మెడల్కొట్టి డోపింగ్లో దొరికినట్టయ్యింది చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులివ్వడంపై మంత్రి సీదిరి అప్పలరాజు తనదైన శైలిలో చమత్కరించారు. చంద్రబాబు పరిస్థితి ఒలింపిక్స్లో మెడల్కొట్టి, డోపింగ్లో దొరికినట్లయ్యిందన్నారు. ‘ చంద్రబాబుకు ఐటీశాఖ నోటీసులిచ్చింది. లెక్కల్లో చూపని రూ. 118 కోట్లకు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చింది. బాబుకు ఐటీ నోటీసులపై రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్నాయుడు స్పందించరు. బాబు తప్పుల గురించి వారు ప్రజలకు తెలపరు. అమరావతి అనే మాయా ప్రపంచాన్ని చంద్రబాబు సృష్టించారు. అమరావతిలో ఇతురులెవరూ భూమి కొనుగోలు చేయకుండా చట్టం సృష్టించాడు బాబు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని ప్రధానే చెప్పారు’ అని మంత్రి అప్పలరాజు మరోసారి గుర్తుచేశారు. చదవండి: లోకేశ్.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు: కన్నబాబు పొలిటికల్ పంచ్ -
‘పురంధేశ్వరి సాయంతో చంద్రబాబు చీప్ పాలిటిక్స్’
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రధాని మోదీ, అమిత్షాల ప్రాపకం కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. పగటిపూట బీజేపీతో, రాత్రిపూట రాహుత్లో కాపురం చేసే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. కాగా, వెల్లంపల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రధాని మోదీ ఏపీకి వస్తే నల్ల బెలూన్లు ఎగురవేశారు, అమిత్ షాపైకి రాళ్లు, చెప్పులతో దాడి చేశారు టీడీపీ నేతలు. ఇప్పుడు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని అడ్డుపెట్టుకుని మళ్లీ బీజేపీకి దగ్గరవడానికి చూస్తున్నారు. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లుతాయి. ఒంటరిగా పోటీచేసే ధైర్యం చంద్రబాబుకు లేదు. బీజేపీ అభయంతోనే గతంలో చంద్రబాబు గెలివగలిగాడు. అంతేతప్ప చంద్రబాబును చూసి ఎవరూ ఓటు వేయరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతోనే పొత్తు అంటుంటే, చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. వైఎస్సార్సీపీని కాదని వెళ్లినవారిని సీఎం జగన్ సస్పెండ్ చేశారు. అలాంటి ధైర్యం చంద్రబాబుకు ఉందా?. అప్పట్లో ప్రత్యేక హోదా వద్దన్న వ్యక్తి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తారు?. ఒంటరిగా పోటీచేసే ధైర్యం చంద్రబాబుకు లేదు’ అని సెటైర్లు వేశారు. ఇది కూడా చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య వైఎస్సార్ సీపీలో చేరిక -
పవన్ కళ్యాణ్ కు సత్తా ఉంటే సింగిల్ గా రావాలి: వెల్లంపల్లి
-
పోలీసులపై జరిగిన దాడి పవన్కు కనిపించడం లేదా?: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. పుంగనూరులో టీడీపీ అరాచకాలను, పోలీసులపై దాడులను నిరసిస్తూ విజయవాడలో నిరసనలు తెలిపారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ను అధికారం నుంచి దించలేమని చంద్రబాబు ప్లాన్ చేశారు. రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా పుంగనూరుకు వెళ్తానని చంద్రబాబు మొండికేయడంతో ఘర్షణ మొదలైందన్నారు. ‘‘లా అండ్ ఆర్డర్ కోసమే చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పోలీస్ వ్యాన్లు తగలపెట్టారు. 50 మంది పోలీసులను గాయపరిచారు. పోలీసులపై జరిగిన దాడి పవన్కు కనిపించడం లేదా? అధికారం కోసమే చంద్రబాబు హింసను పోత్సహిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడం చంద్రబాబు వల్ల కాదు’’ అని వెల్లంపల్లి స్పష్టం చేశారు. చదవండి: పక్కా ‘ఎల్లో’ స్కెచ్.. ‘పచ్చ’ నేతల కనుసన్నల్లోనే.. -
నీకు ఇక కేఏ పాల్ ఒక్కడే మిగిలున్నాడు: వెల్లంపల్లి శ్రీనివాస్