Published
Sun, Jul 21 2024 11:52 AM
| Last Updated on Sun, Jul 21 2024 1:06 PM
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ అబ్ధుల్ నజీర్తో భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్కు వెళ్లి, గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్.. టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను వైఎస్ జగన్.. రాష్ట్ర గవర్నర్కు వివరించనున్నారు.
వినుకొండలో పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా, ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్కు వైఎస్ జగన్ అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment