-
సాయంత్రం గవర్నర్ ను కలవనున్న YSRCP నేతల బృందం
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: గవర్నర్ అబ్లుల్ నజీర్ ప్రసంగం ఇదే..
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. తొలిరోజు సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అబ్దుల్ నజీర్ ప్రసంగం ఇలా.. విద్యా రంగం.. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. మనబడి నాడు-నేడు ద్వారా స్కూల్స్ రూపురేఖలు మార్చాం. విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు చేశాం. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని అమ్మఒడి పథకం తెచ్చాం. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలే లక్ష్యంగా నాడు-నేడు కార్యక్రమం. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా రూ.15వేలు జమ చేస్తున్నాం. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు గోరుముద్దకు రూ.4,417కోట్లు ఖర్చు చేశాం. జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం. జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటి వరకు రూ.3,367 కోట్లు ఖర్చు చేశాం. విద్యా సంస్కరణల్లో డిజిటల్ లెర్నింగ్ కీలకమైనది. 8,9 తరగతుల విద్యార్థులకు 9,52,925 ట్యాబ్స్ పంపిణీ చేశాం. వచ్చే ఏడాది జూన్ నుంచి ఒకటో తరగతి నుంచి ఐటీ విధానం. ప్రతీ ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తాం. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విద్యాబోధన. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు. అత్యున్నత 50 విద్యా స్థంస్థల్లో గుర్తించిన 20 ఫ్యాకల్టీలలో ఏ విభాగంలోనైనా విదేశీ విద్యను అభ్యసించవచ్చు. ఇప్పటివరకు రూ.1.25 కోట్ల వరకు మొత్తం రీయింబర్స్ చేస్తున్నాం. ప్రభుత్వ కృషితో స్కూల్స్లో డ్రాప్ఔట్లు గణనీయంగా తగ్గాయి. వైద్య రంగం.. రాష్ట్రవ్యాప్తంగా 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్లు. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు. 53 ఏరియా ఆసుపత్రులు, తొమ్మిది జిల్లా ఆసుపత్రుల్లో వసతులు అభివృద్ది. నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు. ఇప్పటి వరకు 53,126 మంది వైద్యసిబ్బందిని నియమించాం. ఫ్యామిలీ డాక్టర్ కింద 3.03 కోట్ల ఓపీ సేవలు అందించాం. ఇప్పటి వరకు 1.3 కోట్ల గ్రామీణ రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలు. ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేశాం. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించాం. ఇప్పటి వరకు 1.32 కోట్ల ప్రత్యేక రోగుల సేవలు అందించాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. వ్యవసాయ రంగం.. రైతులు రాష్ట్రానికి వెన్నముక 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఇప్పటి వరకు 53.53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చాం. రైతు భరోసా కింద రూ.33,300 కోట్లు పంపిణీ. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. ఉచిత పంట బీమా కింద 54.75 లక్షల మంది రైతులకు రూ.7802కోట్ల క్లైయిమ్లు. మిచాంగ్ తుఫాన్తో నష్టపోయిన రైతులకు రూ.347.55 కోట్లు విడుదల. జీఎస్డీపీలో వ్యవసాయం వాటా ఏపీలో 36 శాతం కాగా, జాతీయ సగటు 18శాతమే. ఆక్వా రంగం.. రూ.50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్ల ఏర్పాటు. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రతీ కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో 30 శాతం వాటాతో ఏపీ మొదటి స్థానం. వేటకు వెళ్లి మత్స్యకారులు చనిపోతే రూ.10లక్షల పరిహారం. 20వేల ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కింద రూ.128 కోట్లు. 61వేల మంది ఆక్వా రైతులకు విద్యుత్ ఛార్జీ రాయితీ రూ.3186కోట్లు. 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్. రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాతో ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా ఏపీ. మహిళా సాధికారత.. మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం 78.84 లక్షల మంది మహిళలకు రూ.25,571 కోట్లు. రాష్ట్రంలో 55,607 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణిలు, 28.62 లక్షల మంది పిల్లలకు లబ్ధి. పౌష్టికాహార పథకాలకు రూ.6688 కోట్లు ఖర్చు. అంగన్వాడీ కేంద్రాలకు రూ.21.82 కోట్ల విలువైన గ్రోత్ మానిటరింగ్ పరికరాలు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 66.34 లక్ష మందికి పెన్షన్ అందిస్తున్నాం. రాష్ట్రంలో దిశయాప్ ద్వారా 3040 కేసులు పెన్షన్ కానుక.. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల పెన్షన్ అందిస్తున్నాం. నెలవారీ పెన్షన్ బడ్జెట్ రూ.1961 కోట్లు పెరిగింది. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కోసం రూ.4,969.05 కోట్లు కేటాయింపు. వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,129 కోట్ల పంపిణీ. వైఎస్సార్ కాపునేస్తం కింద రూ.2,029 కోట్లు జమ. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రూ.1,257.04కోట్లు జమ. ఐదేళ్లలో రూ.75వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నాం. 3,57,844 మంది అర్హుల ఖాతాల్లో రూ.2,029 కోట్లు జమ. రూ.71కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల కొనుగోలు. దీని ద్వారా 3,27,289 మంది తల్లులకు లబ్ది. ఆటో ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ మొబైల్ డిస్పెన్సింగ్ ఓనర్లకు 10వేలు ఆర్థిక సాయం. జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం 10వేలు అందిస్తోంది. జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ. 10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ. 350.89 కోట్లు అందిస్తున్నాం నాన్ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం.. పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత. పీడీఎఫ్ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం. పోలవరం ప్రాజెక్ట్లో ఇప్పటి వరకు 74.01 శాతం పనులు పూర్తి. ఎల్ఏ అండ్ ఆర్ఆర్ పనిలో 22.42 శాతం పూర్తి. రూ.280 కోట్లతో 10 టీఎంసీల చిత్రావతి ప్రాజెక్ట్ను పూర్తి చేశాం. అవుకు ప్రాజెక్ట్ రెండో టన్నెల్ను పూర్తి చేశాం. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేశాం. పులిచింతల నిర్వాసితులకు రూ.142 కోట్లు చెల్లించాం. 24 గంటల త్రీఫేజ్ కరెంట్ విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు వ్యవసాయ ఫీడర్లు. గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నాం. ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు పగటి పూట కరెంట్. తొమ్మిది గంటల ఉచిత్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. 1221 కి.మీల రోడ్ల మరమ్మతులకు రూ.490కోట్లతో పనులు. ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన 880 బస్సులు. జగనన్న టౌన్షిప్ల కోసం ప్రతీ నియోజకవర్గంలో రెండు ఎంఐజీ లేఅవుట్లు. 12,042 ప్లాట్లతో 30 ప్రాజెక్ట్లు చేపట్టాం. ఐటీ, విమానయాన, పర్యాటక రంగం.. భోగాపురంలో మే మూడో తేదీన నిర్మాణ పనులు ప్రారంభించాం. మరో 30 నెలల్లో ఎయిర్పోర్టు ప్రారంభించేందుకు సిద్ధం. ఐటీ రంగాన్ని ప్రొత్సహించేందుకు ఐటీ పాలసీ 2021-24 ప్రవేశపెట్టాం. ఐటీ ఫలాలు చివరి మైలురాయి వరకు చేరేలా కృషి. 200 ఎండబ్ల్యూ డేటా సెంటర్ కోసం రూ.14,694కోట్ల పెట్టుబడి. మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏర్పాటు. పర్యాటక రంగం అభివృద్ధికి ఏపీ టూరిజం పాలసీ 2020-2025 అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంపై ఫోకస్. 7,290 మందికి ఉపాధి కల్పించేలా రూ.3,685 కోట్ల పెట్టుబడి. వికేంద్రీకరణ.. వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 13 కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది. 2.6 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు. జగనన్న సురక్ష ద్వారా కోటి ధృవీకరణ పత్రాలను ఇంటి వద్దకే అందించాం. 35,44,866 ఎకరాల భూమి పేదలకు పంపిణీ, హక్కులు కల్పించాం. 20,24,709 మంది భూమి లేని నిరు పేదలకు ప్రయోజనం. మా ప్రభుత్వంలో పేదరికం 11.52 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది. -
Live: ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
-
AP: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ బీసీఏ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 7న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. 7తేదీన ఉదయం 8 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. 8వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. -
సుధామూర్తితో కలిసి డాక్టరేట్ అందుకున్న నైనా
భారత టేబుల్ టెన్నిస్ స్టార్, చదువుల తల్లిగా పేరొందిన నైనా జైస్వాల్ డాక్టరేట్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో గల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన స్నాతకోత్సవం సందర్భంగా.. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నైనాకు పీహెచ్డీ డాక్టరేట్ సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తికి కూడా గౌరవ డాక్టరేట్ అందించారు. కాగా అత్యంత పిన్న వయసులోనే పీహెచ్డీ పట్టా పుచ్చుకున్న తొలి భారతీయ వ్యక్తిగా నైనా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 22 ఏళ్ల వయసులోనే ఈ హైదరాబాదీ ఈ ఫీట్ నమోదు చేశారు. కుటుంబంతో నైనా జైస్వాల్ తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ‘మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్రపై అధ్యయనం’ అనే అంశంపై నైనా జైస్వాల్ పరిశోధన చేశారు. ఈ క్రమంలో పీహెచ్డీ పట్టా అందుకుని రికార్డు సాధించారు. కాగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించిన నైనా జైస్వాల్.. చదువులోనూ మేటి. ఎనిమిదేళ్లకే పదో తరగతి పూర్తి చేసిన ఆమె.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్లో డిగ్రీ సాధించారు. తద్వారా ఆసియాలోనే చిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు అంతర్జాతీయస్థాయిలో మోటివేషనల్ స్పీకర్గా రాణిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తున్నారు. -
ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు: గవర్నర్ అబ్దుల్ నజీర్
-
అవార్డులు అందజేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
-
సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్
-
ఏపీ ప్రభుత్వ సంక్షేమ పాలనకు అభినందనలు
AP Republic Day 2024 Celebrations Updates.. గవర్నర్ ప్రసంగం ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉండాలి ఐక్యమత్యంగా రాష్ట్రం అభివృద్ధి కోసం అంతా పని చేయాలి ఎదురైన అడ్డంకుల్ని అధిగమిస్తూ మన లక్ష్యాల్ని చేరుకోవాలి గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదుడుకులను ఎదుర్కొంది ఒడిదుడుకుల్లో ధైర్యంగా నిలిచిన ప్రజలందరికీ అభినందనలు ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోంది సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది కుల, మత, ప్రాంతాలకు అతీతంగా.. రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకే అందిస్తున్నారు 56 నెలలుగా గ్రామస్వరాజ్యం దిశగా సంస్కరణలు మారుమూల గ్రామాలకు కూడా సేవలు అందేలా సంస్కరణలు రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం విలేజీ క్లీనిక్స్తో గ్రామాల్లోనే ప్రజలకు వైద్యసేవలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి జగనన్న అమ్మఒడితో ప్రతీ పేద విద్యార్థి చదువుకోగలుగుతున్నారు జగనన విదేశీ విద్యాదీవెన ద్వారా విదేశాల్లో చదివేందుకు అవకాశం కలుగుతోంది ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్తో వైద్యం అభినందనీయం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం సమర్థవంతంగా అమలు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నాణ్యమైన వైద్యం అందుతోంది రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాం గర్బిణులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే చేరుకుంటున్నాయి పెన్షన్లు, రేషన్ నేరుగా ఇళ్లకే వెళ్లి అందజేత ప్రతీనెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి అందించడం అభినందనీయం పరిపాలన సంస్కరణల్లో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు ప్రతీ ఏడాది స్కూళ్లు తెరవక ముందే విద్యాకానుక అందజేత రూ.2,400 విలువైన జగనన్న విద్యాకానుక అందజేత ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతులు స్కూళ్లలో నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి గ్రామ, వార్డు సచివాలయాలు నేరుగా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారు ఏపీ సంక్షేమ పాలనకు నా అభినందనలు ప్రస్తుత పాలన రానున్న రోజుల్లో మంచి ఫలితం ఇస్తుంది ► శకటాల ప్రదర్శన తిలకిస్తున్న గవర్నర్ నజీర్, ఇతరులు ► ప్రత్యేక ఆకర్షణగా సంక్షేమ శకటాలు సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ సాయుధ దళాల పరేడ్ను సమీక్ష చేసిన గవర్నర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంక్షేమ పథకాల శకటాలు ►గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేడియంలో పోలీసు , ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాల కవాతు ►ప్రదర్శనకు సిద్ధమైన వివిధ శాఖలకు చెందిన శకటాలు ►పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ నజీర్ ►జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ► ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు హాజరైన సీఎం జగన్ దంపతులు, మంత్రులు, అధికారులు ► ఏపీ అసెంబ్లీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనమండలి ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మండలి చైర్మన్ మోషేన్ రాజు గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన స్పీకర్, మండలి ఛైర్మన్ ► ఏపీ సచివాలయంలో జెండా ఆవిష్కరణ ఏపీ సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించిన ప్రధాన కార్యదర్శి జవహార్రెడ్డి పాల్గొన్న పలువురు ఉన్నతాధికారులు ► విజయవాడ స్టేడియంలో.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(IGMC)లో మరికాసేపట్లో దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు జెండా ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరణ అనంతరం గవర్నర్ ప్రసంగం ► రాజ్భవన్లో హైటీ కార్యక్రమం రిపబ్లిక్ డే సందర్భంగా సాయంత్రం రాజ్భవన్లో హై టీ కార్యక్రమం హాజరుకానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఇదీ చదవండి: సీఎం జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం..
-
సాక్షి లైఫ్.. మీ ఆరోగ్య నేస్తం
వైద్య రంగంలో విశ్వసనీయమైన సమాచారా న్ని అందించేందుకు ‘సాక్షి లైఫ్’ను తీసుకొచ్చింది సాక్షి మీడియా గ్రూప్. సమస్త ఆరోగ్య సమచారాన్ని సమగ్రంగా ఆర్టికల్స్, వీడియోల రూపంలో తీర్చిదిద్దింది. ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు నిష్ణాతులైన డాక్టర్ల సూచనలు, సలహాలతో పాటు ఆహారం, వ్యాయామాల గురించి వివరంగా ఇందులో నిక్షిప్తం చేసింది. life.sakshi.com పేరుతో వచ్చిన ఈ వెబ్సైట్లో వైద్యరంగానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ విభాగాలకు సంబంధించి ప్రముఖ వైద్యు ల ఇంటర్వ్యూలు, నిపుణుల సలహాలను వీడియోల రూపంలో యూట్యూబ్లో sakshi life ఛానల్లో అప్లోడ్ చేసింది. ‘సాక్షి‘ ఇద్దరి స్పూర్తితో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వైద్యరంగం నుంచి వచ్చి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒకరు. రూపాయికే వైద్యం అందించి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన వైఎస్సార్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ని తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. మరొకరు డాక్టర్ ఈ.సీ.గంగిరెడ్డి. నిస్వార్థ వైద్య సేవలకు మారుపేరుగా నిలిచి ప్రజల గుండెల్లో కొలువైన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వైద్యం వృత్తి కాదు,ప్రాణం అని నమ్మారు. ఈ ఇద్దరి మహనీయుల స్ఫూర్తితో ‘సాక్షి లైఫ్ ‘ తెలుగు ప్రజల ముందుకు వస్తోంది. ఆరోగ్య సమాచారాన్ని సులువుగా తెలుగు వారందరికీ అందించాలన్నదే ‘సాక్షి’ లక్ష్యం. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, శ్రీమతి వై.ఎస్.భారతి రెడ్డి ‘సాక్షి లైఫ్’ వెబ్సైట్ తో పాటు యూట్యూబ్ ఛానెల్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. సాక్షి లైఫ్ ప్రజలందరి ఆరోగ్య నేస్తం. అందుబాటులో ఉన్న వేర్వేరు వైద్య విధానాల గురించి చెప్పడమే కాదు, అసలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తుంది. life.sakshi.com https://www.youtube.com/@life.sakshi సాక్షి లైఫ్ప్రారంభం సందర్భంగా ప్రముఖ డాక్టర్లు ఏమన్నారంటే... ‘హెల్త్ కు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం సాక్షి లైఫ్లో ఉంది. ఇది సమాజానికి చాలా అవసరం.’ – డా.డి.నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ‘ప్రస్తుతం నమ్మకమైన వైద్య సమాచారం అందుబాటులో లేదు, ఆ లోటును సాక్షి లైఫ్ భర్తీ చేస్తుందనుకుంటున్నాను’ . – డా. మంజుల అనగాని, ప్రముఖ గైనకాలజిస్ట్ ‘వైద్యరంగంలో పరిశోధనలు, వాటి విశేషాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా సాక్షి లైఫ్ను తీర్చిదిద్దారు’. – డా. చిన్నబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ‘ప్రతీ ఒక్కరికి గుండె కీలకం, అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలన్నది సాక్షి లైఫ్లో విపులంగా చె΄్పారు’. – డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ ‘జీవనశైలిలో మార్పులే రోగాలకు కారణం, ఈ విషయంపై సాక్షి లైఫ్లో నిపుణుల సలహాలున్నాయి.’ – డా.గోపీ చంద్ మన్నం, చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్ ‘ఆరోగ్య రంగానికి సంబంధించిన సరైన సమాచారాన్ని నిపుణులైన వైద్యుల ద్వారా అందుబాటులోకి తెచ్చిన ‘సాక్షి లైఫ్‘ కు వెల్కమ్’ – డా.కోనేటి నాగేశ్వరరావు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ‘మానసిక సమస్యలు పైకి చెప్పుకోలేని వారికి సాక్షి లైఫ్లో నిపుణుల ఇంటర్వ్యూల ద్వారా మంచి అవగాహన కలుగుతుంది, ఆల్ ది బెస్ట్’ – డా. పూర్ణిమ నాగరాజు, సైకియాట్రిస్ట్ ‘ఆర్థరైటిస్ సమస్యలు తలెత్తడా నికి కారణాలు.. ముందుగా తెలుసుకుంటే అవి రాకుండా జాగ్రత్త పడొచ్చు.. ఇలాంటి సమా చారాన్ని సాక్షి లైఫ్ ద్వారా అందిస్తున్నారు.’ – డా.కె. జె.రెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ -
ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, విజయవాడ: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఇస్రోకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కాగా, పీఎస్ఎల్వీ-సీ58పై గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పందించారు. ఈ సందర్బంగా రాకెట్ విజయవంతంగా ప్రయోగించినందుకు అభినందనలు చెప్పారు. అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్ను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహాన్ని కలిగి ఉన్న రెండవ దేశంగా భారతదేశం అవతరించడంపై హర్షం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం రోజున మిషన్ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో భారతదేశ పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. పీఎస్ఎల్వీ-సీ58 విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరింది. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని అని ఆకాంక్షించారు. ఇది కూడా చదవండి: పీఎస్ఎల్వీ సీ-58 ప్రయోగం విజయవంతం -
సీఎం జగన్కు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ను విష్ చేశారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు సీఎం జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎత్తున సేవా కార్యక్రమాలను వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. Birthday wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu. May he lead a long and healthy life. — Narendra Modi (@narendramodi) December 21, 2023 గవర్నర్ శుభాకాంక్షలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh on his Birthday. pic.twitter.com/75KTexNMbI — governorap (@governorap) December 21, 2023 -
అర్హులందరికీ పథకాలు చేరేలా అధికారులు చొరవ చూపాలి: గవర్నర్
సాక్షి, గుంటూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ చేరేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. గుంటూరులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారుల అనుభవాలు తెలుసుకుని పథకాలు మెరుగ్గా ఉండేటట్లు చూడాలన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హత ఉండి పథకాలు అందని వారి వివరాలు సేకరించాలని గవర్నర్ సూచించారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతం కావడానికి అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. చదవండి: విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు -
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో మాట్లాడుతన్న ఏపీ గవర్నర్
-
7 రంగాల్లో విశిష్ట సేవలందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు
-
నవరత్నాలు ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం: గవర్నర్ అబ్దుల్ నజీర్
-
రావు బాల సరస్వతిగారికి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం
-
శ్రీ గోవిందరాజు చక్రధర్ గారికి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం
-
శ్రీ పుల్లెల గోపీచంద్ గారికి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం
-
వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది
-
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్ ప్రమాణం
సాక్షి,అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా గుహనాథన్ నరేందర్ సోమవారం ప్రమాణం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం జస్టిస్ నరేందర్ను గవర్నర్ అభినందించారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఈ కార్యక్రమ ప్రొసీడింగ్స్ను నిర్వహించారు. అనంతరం జస్టిస్ నరేందర్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు చదివి వినిపించారు. కాగా.. రాజ్భవన్లో జస్టిస్ నరేందర్ను అటు గవర్నర్, ఇటు ముఖ్యమంత్రికి జస్టిస్ ధీరజ్ సింగ్ పరిచయం చేశారు. కార్యక్రమం అనంతరం రాజ్భవన్ ఏర్పాటు చేసిన తేనీటి విందులో అందరూ పాల్గొన్నారు. 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య జస్టిస్ నరేందర్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. జస్టిస్ నరేందర్ హైకోర్టులో నాలుగో స్థానంలో కొనసాగుతారు. మంగళవారం ఆయన జస్టిస్ దుర్గాప్రసాదరావుతో కలిసి కేసులను విచారిస్తారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే.. విజయనగరంలో జరిగిన రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం, తిరిగి రావడంలో జాప్యం జరగడంతో జస్టిస్ నరేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొనలేకపోయారు. దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ జి.నరేందర్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్ సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. ఆలయ ఏఈవో చంద్రశేఖర్ జస్టిస్ నరేందర్కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు సమర్పించారు. -
Governor Abdul Nazeer: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు (ఫొటోలు)
-
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులతో సీఎం వైఎస్ జగన్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లికి అంత్యక్రియలు జరపకుండా..
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
- అమెరికాలో గంజాయి బ్యాచ్లకు ఊరట!
- తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
Advertisement