ఏపీని భగవంతుడే రక్షించాలి: విజయసాయిరెడ్డి | YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On CBN | Sakshi
Sakshi News home page

బాబూ 40 ఏళ్ల ఇండస్ట్రీ మతలబు.. ఏపీని భగవంతుడే రక్షించాలి: విజయసాయిరెడ్డి

Published Fri, Sep 20 2024 9:35 AM | Last Updated on Fri, Sep 20 2024 12:27 PM

YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On CBN

సాక్షి, ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. 40 ఏళ్ళ ఇండస్ట్రీగా స్వీయప్రకటన చేసుకున్న చంద్రబాబు.. పాలన తెలియని పామరుడు పదే పదే అధికారాన్ని చేజిక్కించుకోవటం వెనక వున్న మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలి! అంటూ కామెంట్స్‌ చేశారు.

విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘విజయవాడ వరదల్లో అందరి ఇళ్లు మునిగాయి, నా ఇళ్ళు మునిగింది. అయితే ఇప్పుడు ఏంటట అంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోదీ సర్కార్‌ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చెసేదానికి చాప క్రింద నీరులా పనిచేసుకుంటూ పోతుంటే కృష్ణానది కరకట్టపైన కట్టిన అక్రమ ఇంట్లో కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు. 40 ఏళ్ళ ఇండస్ట్రీగా స్వీయప్రకటన చేసుకున్న, పాలన తెలియని పామరుడు పదే పదే అధికారాన్ని చేజిక్కించుకోవటం వెనక వున్న మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలి!. ఆంధ్ర రాష్ట్రాన్ని భగవంతుడే రక్షించాలి. నారాయణ , నారాయణ.. నారాయణ’ అంటూ కామెంట్స్‌ చేశారు.
 

ఇది కూడా చదవండి: హిందూ జాతికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే: భూమన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement