
మీడియా కమిషన్ ఏర్పాటు చేయండి
● జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి ● టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
వేములవాడ: రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతోపాటు మీడియాలో వస్తున్న అనారోగ్యకర భాష నియంత్రణకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలోని మున్నూరుకాపు సంఘం భవన్లో టీడబ్ల్యూజేఎఫ్ వేములవాడ నియోజకవర్గం మహాసభ శుక్రవారం జరిగింది. ఐఏఫ్ డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్కుమార్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, జిల్లా అధ్యక్షుడు పెరుక రవి, నేషనల్ కౌన్సిల్ మెంబర్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు వినతిపత్రం ఇవ్వాలని తీర్మానించారు.
వేములవాడ నియోజకవర్గ కమిటీ
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టస్ ఫెడరేషన్ వేములవాడ నియోజకవర్గం నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తొగరి కరుణాకర్, కార్యదర్శిగా సుంకరి నరేందర్, కోశాధికారిగా బొప్ప భిక్షపతి, ఉపాధ్యక్షులుగా అవధూత శ్రీధర్, కవ్వాల సురేందర్, ఎండీ షరీఫ్, సహాయ కార్యదర్శులుగా గొల్లపల్లి వేణు, కోటగిరి రాజశేఖర్, గోపు ప్రవీణ్, కార్యవర్గ సభ్యులుగా చల్లా రమేశ్, వాసం వెంకటస్వామి, ఎగుమంటి మూర్తిరెడ్డి, కళ్యాడపు వెంకటమల్లు, చక్రహరి దేవేందర్రాజు, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, నడిగట్ల భిక్షపతి, సయ్యద్ షబ్బీర్లను ఎన్నుకున్నారు.