కొండపోచమ్మకు ఎంపీ పూజలు
జగదేవ్పూర్(గజ్వేల్): కొండపోచమ్మ అమ్మవారిని రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్యాదవ్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్లు తమ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనిల్కుమార్యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి అమ్మవారి సారే, ప్రసాదం అందించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతియేటా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న తర్వాత కొండపోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. 5వ వారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని నైవేద్యం సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సిబ్బంది మహేందర్రెడ్డి, కనకయ్య, హరి, చిన్న, సుధాకర్, లక్ష్మణ్, చందు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment