చ‌రిత్ర సృష్టించిన సీఎస్‌కే.. ప్రపంచంలోనే తొలి జట్టుగా | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన సీఎస్‌కే.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Published Sun, Apr 28 2024 11:27 PM

Chennai Super Kings Create History, Set Massive World Record

టీ20 క్రికెట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అరుదైన ఘనత సాధించింది. టీ20ల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ పరుగులు చేసిన చేసిన జట్టుగా సీఎస్‌కే రికార్డులకెక్కింది. ఐపీఎల్‌-2024లో భాగంగా చెపాక్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదారాబాద్‌తో మ్యాచ్‌లో 212 పరుగులు చేసిన సీఎస్‌కే..ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

 టీ20 క్రికెట్‌లో చెన్నై ఇప్పటివరకు 35 సార్లు 200పైగా పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్‌ కౌంటీ జట్టు సోమర్‌సెట్‌ పేరిట ఉండేది. సోమర్‌సెట్‌ టీ20ల్లో 34 సార్లు 200 ప్లస్‌ స్కోర్లు సాధించింది. తాజా మ్యాచ్‌తో సోమర్‌సెట్‌ వరల్డ్‌ రికార్డును సీఎస్‌కే బ్రేక్‌ చేసింది. 

ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అయితే ఈ రికార్డు టీమిండియా పేరిట ఉంది. భారత జట్టు 32 సార్లు 200పైగా పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్‌ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు. 19వ ఓవర్‌లో నటరాజన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గైక్వాడ్‌ ఔటయ్యాడు.
 

Advertisement
Advertisement