IPL 2024
-
ఇదేం చెత్త ఆట బ్రో.. ఐపీఎల్లోనే ఆడుతావా! ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన అభిషేక్.. ఇప్పుడు పోర్ట్ ఎలిజిబెత్లో జరిగిన రెండో టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్లో 5 బంతులు ఆడిన అభిషేక్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. సఫారీ పేసర్ కోయిట్జీ బౌలింగ్లో చెత్త ఆడి ఈ పంజాబీ స్టార్ బ్యాటర్ ఔటయ్యాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా అభిషేక్ శర్మపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇదేమి ఆట భయ్యా..కేవలం ఐపీఎల్లోనే ఆడుతావా? అంటే ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. మరి కొంతమంది అతడి స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్ అవకాశం ఇవ్వండి అంటూ భారత జట్టు మేనెజ్మెంట్ను సూచిస్తున్నారు.ఒక్క సెంచరీ మినహా.. కాగా జింబాబ్వే సిరీస్తో టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ ఇప్పుడు భారత్ తరపున 9 మ్యాచ్లు ఆడాడు. అయితే జింబాబ్వే సిరీస్లో సెంచరీ మినహా ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. జైశ్వాల్కు బ్యాకప్గా జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు తన మార్క్ను చూపించడంలో విఫలమయ్యాడు. 24 ఏళ్ల అభిషేక్ శర్మ తన తొమ్మిది టీ20 ఇన్నింగ్స్లలో ఎనిమిదింటిలో కనీసం 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. దీంతో జట్టులో అతడి స్ధానం ప్రశ్నార్థకంగా మారింది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో రాణిస్తానే అభిషేక్ జట్టులో కొనసాగే అవకాశముంది.ఐపీఎల్లో అదుర్స్ఐపీఎల్-2024లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ తరపున అభిషేక్ శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 484 పరుగులు చేశాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఆ దూకుడును అభిషేక్ ప్రదర్శించలేకపోతున్నాడు.Abhishek Sharma's last 9 T20i innings:0(4), 100(47), 10(9), 14(11), 16(7), 15(11), 4(4), 7(8), 4(5)He is clearly missing IPL tracks and his partner Travis Head.#INDVSSA pic.twitter.com/rZLiTGUmxe— JassPreet (@JassPreet96) November 10, 2024చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్గా -
సన్రైజర్స్ సంచలన నిర్ణయం.. క్లాసెన్కు రూ.23 కోట్లు!
న్యూఢిల్లీ: ఐపీఎల్ గత సీజన్లో తన అద్భుత ఆటతో జట్టును ఫైనల్ వరకు చేర్చిన హెన్రిచ్ క్లాసెన్పై సన్రైజర్స్ హైదరాబాద్ నమ్మకముంచింది. వచ్చే సీజన్కూ అతడిని తమతో అట్టి పెట్టుకునేందుకు రైజర్స్ ఆసక్తి చూపిస్తోంది. ఇందు కోసం భారీగా రూ. 23 కోట్లు చెల్లించేందుకు కూడా టీమ్ మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్కో టీమ్ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు. వీరిలో ఒకరైనా జాతీయ జట్టుకు ఆడని ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. ఈ ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు అక్టోబర్ 31 వరకు గవరి్నంగ్ కౌన్సిల్ గడువు ఇచి్చంది. ప్రతీ టీమ్ తాము కొనసాగించే తొలి ఐదుగురు ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు అన్క్యాప్డ్ అయితే రూ. 4 కోట్లు చెల్లించాలి. అయితే తొలి ఐదుగురు ఆటగాళ్లకు కలిపి గరిష్ట పరిమితి అయిన రూ.75 కోట్ల నుంచి తమకు నచి్చన విధంగా ఖర్చు చేసుకునే స్వేచ్ఛ ఫ్రాంచైజీలకు ఉంది. ఈ నేపథ్యంలో కెపె్టన్ ప్యాట్ కమిన్స్కు రూ. 18 కోట్లు, ఓపెనర్ అభిషేక్ శర్మకు రూ. 14 కోట్లు ఇచ్చేందుకు రైజర్స్ సిద్ధంగా ఉంది. 2024 సీజన్లో క్లాసెన్ 15 ఇన్నింగ్స్లలో 171.07 స్ట్రయిక్రేట్తో 479 పరుగులు సాధించాడు. ఇందులో 19 ఫోర్లు, 38 సిక్స్లు ఉన్నాయి.అభిõÙక్ 16 ఇన్నింగ్స్లలో 204.21 స్ట్రైక్రేట్తో 484 పరుగులు చేయగా... 36 ఫోర్లు, 42 సిక్స్లు బాదాడు. 2023 ఐపీఎల్కు ముందు మినీ వేలంలో క్లాసెన్ను సన్రైజర్స్ రూ. 5.25 కోట్లకు తీసుకొని తర్వాతి ఏడాది కొనసాగించింది. ఇప్పుడు అతనికి లభించే మొత్తం గతంతో పోలిస్తే ఏకంగా 338 శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ ముగ్గురి కొనసాగింపు దాదాపు ఖరారు కాగా... నాలుగో, ఐదో ఆటగాళ్లుగా ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిలను కూడా అట్టి పెట్టుకోవాలని సన్రైజర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
లక్నోలోకి రోహిత్ శర్మ..? హింట్ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్
ఐపీఎల్-2025 సీజన్ ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడిడంపై ఊహాగానాలు ఊపుందుకున్నాయి. రోహిత్ వచ్చే ఏడాది సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్తో జతకట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.అతడి కోసం ఎంత మొత్తాన్ని నైనా వెచ్చించేందుకు లక్నో ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి."శర్మ వేలంలోకి వస్తే అతడిని స్వాగతించేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్దంగా ఉంది. అతడు చాలా గొప్ప ఆటగాడు. హిట్మ్యాన్ వేలంలోకి వస్తే ప్రతీ ఫ్రాంచైజీ అతడిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముంబై ఫీల్డింగ్ కోచ్గా ఉన్న సమయంలో రోహిత్తో చాలా క్లోజ్గా పనిచేశా. అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకెంతో ఇష్టమని" న్యూస్ 24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోడ్స్ పేర్కొన్నాడు. దీంతో రోహిత్పై లక్నో దృష్టిసారించినట్లు తేటతెల్లమైంది.కాగా ఐపీఎల్-2024 సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి ముంబై తమ జట్టు పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచి ముంబై యాజమాన్యం పట్ల హిట్మ్యాన్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీ మారేందుకు రోహిత్ శర్మ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. -
ముంబై ఇండియన్స్ కాదు.. నా ఫేవరేట్ ప్రత్యర్ధి ఆ జట్టే: కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదివారం(ఆగస్టు 18)తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో విరాట్ సరదాగా ముచ్చటించాడు. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ నుంచి పలు ప్రశ్నలు కోహ్లికి ఎదురయ్యాయి. తన ఫేవరేట్ క్రికెటర్లను ఎంచుకోమని ఎంఎస్ ధోని, ఎబీ డివిలియర్స్ పేర్లు అప్షన్స్ ఇవ్వగా.. కోహ్లి ఇద్దరూ కూడా తనకు ఇష్టమైన వారేనని తెలివగా సమాధనమిచ్చాడు. ఆ తర్వాత తనకు ఇష్టమైన షాట్ ఫ్లిక్ లేదా కవర్ డ్రైవ్? అని అడగ్గా.. అందుకు కవర్ డ్రైవ్ తన ఫేవరేట్ షాట్ అని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఐపీఎల్లో తన ఫేవరేట్ ప్రత్యర్ధి జట్టు ఏదన్న ప్రశ్న కోహ్లికి ఎదురైంది. అందుకు అప్షన్స్గా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు కాస్త సమయం తీసుకున్న కోహ్లి.. ఆలోచించి కేకేఆర్ను తనకు ఇష్టమైన ప్రత్యర్ధిగా ఎంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా భారత జట్టుతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కూడా విరాట్ రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగతున్నాడు. 2008 తొలి సీజన్ నుంచి ఆర్సీబీలోనే కోహ్లి ఉన్నాడు.తొట్టతొలి సీజన్ నుంచి ఒక ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లినే. ఇక ఐపీఎల్లో కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్ అంటే అభిమానలకు పండగే. ఇరు జట్ల మధ్య మ్యాచ్లు హోరహోరీగా జరుగుతాయి. ఇప్పటివరకు ఇరు జట్లు 34 మ్యాచ్ల్లో తలపడగా.. కేకేఆర్ 20 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. ఆర్సీబీ 14 సార్లు గెలుపొందింది. -
పంజాబ్ కింగ్స్ ఓనర్తో షారుక్ ఖాన్ తీవ్ర వాగ్వాదం.. కారణమిదే?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్లు చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచాలని, కనీసం ఆరుగురిని రిటైన్ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ప్రాంఛైలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని బుధవారం( జులై 31) జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్లో ఆయా ప్రాంఛైజీల ఓనర్లు ప్రస్తావించారు. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం అందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. అందుకు బదులుగా ముగ్గురు ఆన్ క్యాప్డడ్ ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని ఒకట్రెండు ఫ్రాంచైజీల ఓనర్ల మినహా దాదాపు అందరూ అంగీకరించినట్లు వినికిడి. అయితే ఇదే విషయంపై కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, పంజాబ్ కింగ్స్ సహ-యజమాని నెస్ వాడియా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం.. షారుక్ ఖాన్ కచ్చితంగా రిటైన్ చేసే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని పట్టు పట్టినట్లు సమాచారం. కానీ నెస్ వాడియా మాత్రం ఎక్కువ మందిని రిటైన్ చేసుకునే వీలు కల్పించవద్దని, మెగా వేలం వైపు మెగ్గు చూపినట్లు క్రిక్ బజ్ పేర్కొంది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్- నెస్ వాడియా మాటల యుద్దం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రూల్ ప్రకారం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను మాత్రం రిటైన్ చేసుకునే అవకాశముంది. -
హార్దిక్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది.. అది చూసి నేను షాకయ్యా: నితీష్
ఆంధ్రా స్టార్ ఆల్రౌండర్, ఎస్ఆర్హెచ్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్-2024 తర్వాత స్పోర్ట్స్ హెర్నియా గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్న నితీష్ కుమార్.. సెప్టెంబర్ 9 నుంచి జరగనున్న దులీప్ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో సీజన్లో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో నితీష్కు భారత జట్టు నుంచి తొలిసారి పిలుపువచ్చింది. జింబాబ్వే సిరీస్కు నితీష్ కుమార్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు నితీష్ దూరమయ్యాడు. అయితే తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇష్టమైన ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఒకడని, తనకు ఎంతో సపోర్ట్గా ఉన్నాడని నితీష్ చెప్పుకొచ్చాడు."టీ20 వరల్డ్కప్-2024 సన్నాహాకాల్లో బీజీగా ఉన్నప్పటకి హార్దిక్ భాయ్ నాకు ఓ మెసేజ్ చేశాడు. ఫీల్డ్లో నా ఎఫక్ట్, ఎనర్జీ, ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు పాండ్యా ఆ మెసేజ్లో రాసుకొచ్చాడు. త్వరలోనే మనం కలిసి ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.నిజంగా అతడి మెసెజ్ను చూసి షాక్ అయ్యాను. ఎందకంటే ఓ మెగా టోర్నీకి సన్నద్దమవుతున్న సమయంలో కూడా నన్ను గుర్తుపెట్టుకోవడం నిజంగా చాలా గ్రేట్. వెంటనే పాండ్యా భయ్యాకు ధన్యవాదాలు తెలుపుతూ రిప్లే ఇచ్చాను.అదే విధంగా ఓ ఆల్రౌండర్గా బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యాలను నేను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నానని" ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో 11 మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్.. 303 పరుగులతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డును సైతం ఈ ఆంధ్ర స్టార్ ఆల్రౌండర్ గెలుచుకున్నాడు. -
లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా వీవీఎస్ లక్ష్మణ్!?
భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ ఐపీఎల్లోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2025 సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కోచింగ్ స్టాప్లో లక్ష్మణ్ భాగం కానున్నట్లు సమాచారం. లక్నో ఫ్రాంచైజీ తమ కోచింగ్ స్టాప్లోకి భారత దిగ్గజ ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్మణ్పై కన్నేసినట్లు వినికిడి. అతడిని తమ జట్టు మెంటార్గా నియమించాలని లక్నో యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే లక్ష్మణ్తో లక్నో ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.కాగా లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ( (NCA) ఛీప్గా ఉన్నాడు. లక్ష్మణ్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. తన కాంట్రాక్ట్ను పొడగించే అవకాశం బీసీసీఐ ఇచ్చినా.. వీవీయస్ మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.లక్ష్మణ్ తన నిర్ణయాన్ని బీసీసీఐ ఇప్పటికే తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక మెంటార్గా లక్ష్మణ్కు అపారమైన అనుభవం ఉంది. 2013 నుంచి 2021 వరకు ఎస్ఆర్హెచ్ జట్టుకు లక్ష్మణ్ పనిచేశాడు. ఆ తర్వాత ఏన్సీఏ హెడ్గా బాధ్యతలు చేపట్టడంతో మెంటార్ పదవి నుంచి ఈ ఈ సొగసరి బ్యాటర్ తప్పుకున్నాడు. ఇక లక్ష్మణ్ తర్వాత ఎన్సీఏ ఛీప్గా మాజీ భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. -
IPL 2025: డుప్లెసిస్కు షాక్.. ఆర్సీబీ కెప్టెన్గా కేఎల్ రాహుల్!?
ఐపీఎల్-2025 సీజన్కు పలు ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి లక్నో సూపర్ జెయింట్స్. వచ్చే ఏడాది సీజన్కు ముందు తమ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ను విడిచిపెట్టాలని లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. కేఎల్ రాహుల్, లక్నో మేనేజ్మెంట్ మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడిని లక్నో విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. రాహుల్ కూడా లక్నో మేనేజ్మెంట్ పైన ఆంసతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో ఎల్ఎస్జి యజమాని సంజీవ్ గోయెంకా, రాహుల్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు పలు ఊహాగానాలు వినిపించాయి.ఆ తర్వాత రాహుల్, గోయెంకా ఇద్దరూ ఈ ఊహాగానాలను ఖండించినప్పటికి.. క్రికెట్ వర్గాల్లో మాత్రం ఇంకా ఈ చర్చనడుస్తోంది. రాహుల్ సారథ్యంలోని ఎల్ఎస్జి రెండు సార్లు ఫ్లే ఆఫ్స్కు చేరింది. కానీ ఈ ఏడాది సీజన్లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.ఆర్సీబీ కెప్టెన్గా రాహుల్?ఇక కేఎల్ రాహుల్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కన్నేసినట్లు తెలుస్తోంది. మెగా వేలానికి ముందు ఎల్ఎస్జి నుంచి రాహుల్ను ట్రేడ్ చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వయస్సు 40కి చేరుకోవడంతో.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కొత్త కెప్టెన్ను ఫ్రాంచైజీ వెతుకుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేఎల్ రాహల్ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఆర్సీబీ యాజమాన్యం యోచిస్తున్నట్లు వినికిడి. కాగా కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరీర్ను ఆర్సీబీ ఫ్రాంచైజీతో ప్రారంభించాడు. -
IPL 2025: రిషబ్ పంత్కు ఊహించని ఎదురు దెబ్బ.. !?
ఐపీఎల్-2025 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హెడ్కోచ్ రికీ పాంటింగ్పై వేటు వేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు కెప్టెన్ రిషబ్ పంత్ను కూడా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం.. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు పంత్ను రిటైన్ చేసుకోడదని ఢిల్లీ భావిస్తున్నట్లు సమాచారం. పంత్కు ఢిల్లీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మద్దతు ఉన్నప్పటికీ.. ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం అతడిని విడిచి పెట్టే అవకాశముందని దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్లు పేర్కొంది.అదేవిధంగా పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు నుంచి విడుదల చేస్తే.. అతడిని దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడే అవకాశముందని సదరు పత్రిక పేర్కొంది.సీఎస్కే వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని వచ్చే ఏడాది సీజన్లో ఆడుతాడాలేదన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ కావాలని సీఎస్కే ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పంత్ కెప్టెన్సీపై కూడా ఢిల్లీ ఫ్రాంచైజీ ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది సీజన్కు రోడ్డు ప్రమాదం కారణంగా దూరంగా ఉన్న రిషబ్. . ఈ ఏడాది సీజన్తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.అయితే పంత్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటకి.. జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని విడిచిపెట్టాలని ఢిల్లీ నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రిషబ్.. ఐపీఎల్లో ఢిల్లీ తరపున లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. -
గంభీర్తో గొడవలు.. బీసీసీఐకి క్లారిటీ ఇచ్చిన కోహ్లి!
టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ నియామకం నేపథ్యంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి భవిష్యత్తు ఏమవుతుందోనంటూ క్రికెట్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరూ దూకుడు స్వభావం ఉన్నవాళ్లే కావడం.. పైగా గతంలో మైదానంలోనే ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లడం ఇందుకు కారణం.గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గౌతీ- కోహ్లి కొట్టుకున్నంత పనిచేశారు. నాడు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా ఉన్న గంభీర్.. ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి మధ్య వివాదానికి అఫ్గన్ పేసర్ నవీన్ ఉల్ హక్ అన్న సంగతి తెలిసిందే.హోరాహోరీగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో నవీన్- కోహ్లి మధ్య మాటా మాటా పెరగగా.. గంభీర్ జోక్యం చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన కోహ్లి.. ‘మీ ఆటగాళ్లకు ముందుగా బుద్ధి చెప్పండి’ అంటూ తీవ్రమైన పదజాలం ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి.గంభీర్ కూడా ఇందుకు ఘాటుగానే స్పందించాడని వినికిడి. అయితే, ఐపీఎల్-2024లో సీన్ మారింది. కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా వచ్చిన గౌతీ.. ఆర్సీబీ ఓపెనర్ కోహ్లితో కలిసిపోయాడు.They hugged 😭😭😭Gautam gambhir said sorry to king kohli for everything he spoke against him.I think the only controversy which will last this season is Hardik vs Rohit 😂#RCBvsKKR #IPL2024 #ViratKohli #GautamGambhir Maxwell pic.twitter.com/G0pZpGsOOb— RanaJi🏹 (@RanaTells) March 29, 2024ఇద్దరూ మైదానంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తమ మధ్య విభేదాలు సమసిపోయాయన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అయితే, తీవ్ర విమర్శల నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి పోయినట్లు నటించారని.. లోలోపల పరస్పరం గుర్రుగానే ఉన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.దీంతో గంభీర్, కోహ్లి వాటిని ఖండించారు. అయినా దుష్ప్రచారం ఆగలేదు. ఈ నేపథ్యంలో భారత జట్టు హెడ్ కోచ్గా గౌతీ ఎంపికకాగానే.. కోహ్లికి కష్టాలు మొదలు అన్నట్లుగా వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గంభీర్తో బంధం గురించి కోహ్లి బీసీసీఐకి స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది.గతంలోని గొడవల తాలూకు ప్రభావం కోచ్- ఆటగాడిగా తమ రిలేషన్పై ఉండబోదని.. భారత జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే తామిద్దరం ముందుకు సాగుతామని కోహ్లి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.తమ విషయంలో మేనేజ్మెంట్కు ఎలాంటి తలనొప్పి రాకుండా చూసుకునే బాధ్యత తనదేనని కోహ్లి చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ అనంతరం సెలవు తీసుకున్న విరాట్ కోహ్లి.. శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరం కానున్నాడనే ప్రచారం జరిగింది. అయితే, హెడ్ కోచ్గా ఈ పర్యటనతో ప్రస్థానం మొదలుపెట్టనున్న గంభీర్.. కోహ్లిని సెలవులు రద్దు చేసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిసింది.ఇందుకు తగ్గట్లుగానే కోహ్లి శ్రీలంకతో సిరీస్కు అందుబాటులో ఉంటాడని చెప్పాడు. ఈ క్రమంలో గురువారం ప్రకటించిన జట్టులో అతడి పేరు ఉండటం గమనార్హం. చాంపియన్స్ ట్రోఫీ-2025(వన్డే)ని దృష్టిలో పెట్టుకుని గంభీర్ ప్రతిపాదనకు కోహ్లి ఇలా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. -
కోలుకున్న పేస్గన్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే!
భారత యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ శుభవార్త పంచుకున్నాడు. గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించాడు. అయితే, పూర్తి ఫిట్నెస్ సాధించాలంటే మరికొంత కాలం చెమటోడ్చక తప్పదని పేర్కొన్నాడు.కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన స్పీడ్స్టర్ మయాంక్ యాదవ్ ఈ ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున తొలి మ్యాచ్లోనే సత్తా చాటిన ఈ యంగ్ పేస్గన్.. వరుసగా రెండు మ్యాచ్లలో జట్టును గెలిపించాడు.రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యూపీ ఎక్స్ప్రెస్ రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్గా రికార్డులకెక్కాడు.అయితే, దురదృష్టవశాత్తూ పక్కటెముకల గాయం కారణంగా ఐపీఎల్-2024లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు మయాంక్ యాదవ్. ప్రస్తుతం అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.వందశాతం ఫిట్నెస్ సాధించాలంటేఈ నేపథ్యంలో టెలిగ్రాఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘నా చికిత్స పూర్తైంది. గాయం నుంచి కోలుకుంటున్నాను. ఇక్కడ నాకు ఉపశమనం లభించింది.పూర్తి ఫిట్గా ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, వందశాతం ఫిట్నెస్ సాధించాలంటే మరికొంత కాలం ఇక్కడ ఉండక తప్పదని తెలుసు.గత కొన్ని రోజులుగా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయడం సానుకూలాంశం. ఇప్పటి వరకు సాధించిన పురోగతి పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని మయాంక్ యాదవ్ చెప్పుకొచ్చాడు.రీఎంట్రీ అప్పుడే కాగా పేస్ సంచలనం మయాంక్ యాదవ్పై దృష్టి సారించిన సెలక్టర్లు అతడి పునరాగమనం కోసం వేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దులీప్ ట్రోఫీ- 2024 ద్వారా ఈ బౌలర్ రీఎంట్రీ ఇస్తే.. ఆ ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టులో చోటు ఇచ్చే అంశం గురించి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.అరంగేట్రం ఆ తర్వాతే ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘మయాంక్ యాదవ్ వంటి అద్భుత నైపుణ్యాలున్న ఫాస్ట్బౌలర్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేము. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాత వేర్వేరు ఫార్మాట్లలో ఆడించాలనుకుంటున్నాం.అక్కడ ప్రతిభ నిరూపించుకున్న తర్వాతే టీమిండియా అరంగేట్రం గురించి స్పష్టత వస్తుంది. అంతేతప్ప హడావుడిగా జాతీయ జట్టులోకి పంపితే అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా తదుపరి శ్రీలంకతో తలపడనుంది.చదవండి: అభి"షేక్" శర్మ.. రసెల్, హెడ్ కూడా దిగదుడుపే..! -
నా కల నెరవేరింది.. పాస్ పోర్ట్, ఫోన్ కూడా మర్చిపోయా: పరాగ్
టీ20 ప్రపంచకప్-2024 విజయం తర్వాత తొలి విదేశీ పర్యటనకు టీమిండియా సిద్దమైంది. జూలై 6 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టీ20ల సిరీస్లో భారత జట్టు తలపడనుంది. అయితే ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లను విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. యువ భారత జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసింది. ఈ జట్టుకు స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్-2024లో అదరగొట్టిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రానాలకు భారత సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని యంగ్ ఇండియా టీమ్ జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది.పాస్ పోర్ట్ కూడా మర్చిపోయా?ఇక తొలిసారి భారత జట్టు నుంచి పిలుపురావడంపై రాజస్తాన్ రాయల్స్ యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ స్పందించాడు. "భారత జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నాను. ఇండియన్స్ జెర్సీ వేసుకోవడం వేరే ఫీల్. ఆ భావనను మాటల్లో వర్ణించలేను. అస్సా నుంచి వచ్చిన నేను భారత్కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించాలని కలలు కన్నాను. నా కలను ఎన్నాళ్లకు నెరవేర్చుకోగలిగాను. ఈ ఉత్సాహంలో పాస్పోర్టు, నా ఫోన్లు మరిచిపోయా. వాటిని పోగొట్టుకోలేదు కానీ ఎక్కడ పెట్టానో గుర్తుకు రాలేదు. అయితే సరైన సమయంలో నాకు మళ్లీ దొరికాయి. చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రయాణం చేయాలని కలలు కన్నా.ఇప్పటికే నేను చాలా మ్యాచ్లు విదేశాల్లో ఆడాను. కానీ భారత్ జెర్సీ ధరించి ప్రయాణించడం వేరు. జింబాబ్వేతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని బీసీసీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాగ్ పేర్కొన్నాడు. -
ఐపీఎల్లో అదరగొట్టాడు.. భారత జట్టులో చోటు కొట్టేశాడు
కోల్కతా నైట్రైడర్స్ పేసర్ హర్షిత్ రానాకు జాక్ పాట్ తగిలింది. హర్షిత్ రానాకు భారత సెలక్టర్ల నుంచి తొలిసారి పిలుపువచ్చింది. జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్కు రానాను సెలక్టర్లు ఎంపిక చేశారు. జింబాబ్వే సిరీస్కు తొలుత ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో బీసీసీఐ తాజాగా స్వల్ప మార్పులు చేసింది. టీ20 వరల్డ్కప్-2024లో భాగమైన సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్లను జింబాబ్వే సిరీస్కు ముందు భారత జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే రానాకు చోటు దక్కింది. రానాతో పాటు సాయిసుదర్శన్, జితేష్ శర్మలకు కూడా అవకాశం లభించింది.ఇప్పటికే భారత జట్టు జింబాబ్వేకు పయనం కాగా.. వీరు ముగ్గురు కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నారు. కాగా జితేష్ శర్మ ఇప్పటికే భారత్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేయగా.. సాయిసుదర్శన్, రానాలకు భారత టీ20 జట్టులో చోటు దక్కడం ఇదే మొదటి సారి. అయితే సాయి మాత్రం భారత తరపున వన్డేల్లో మాత్రం డెబ్యూ చేశాడు.ఐపీఎల్లో అదుర్స్..ఐపీఎల్-2024లో హర్షిత్ రానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన బౌలింగ్తో ప్రత్యర్ధిలను ముప్పుతిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చేవాడు. కేకేఆర్ ఛాంపియన్స్గా నిలవడంలో రానా కీలక పాత్ర పోషించాడు.ఓవరాల్గా ఈ ఏడాది ఐపీఎల్లో 13 మ్యాచ్లు ఆడిన రానా 19 వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ తరపున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో కూడా 7 మ్యాచ్లు ఆడిన రానా.. 28 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. అదేవిధంగా భారత-ఎ జట్టు తరపున కూడా రానా ఆడాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. కాగా ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి.జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టుశుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణా -
Shivam Dube: ఐపీఎల్లో హీరో.. ఇండియా తరఫున జీరో
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్ 2024లో టీమిండియా ఆటగాడు శివమ్ దూబే వరుసగా విఫలమవుతున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. దూబే వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూబేను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దూబే స్థానంలో రింకూ సింగ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్లలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆల్రౌండర్ కోటాలో జట్టులోకి తీసుకుంటే కనీసం బ్యాటింగ్కైనా న్యాయం చేయలేకపోతున్నాడని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024 ఫామ్ను (14 మ్యాచ్ల్లో 162.30 స్ట్రయిక్రేట్తో 396 పరుగులు, 3 అర్దసెంచరీలు) చూసి హార్దిక్తో పోల్చి తప్పు చేశామని బాధపడుతున్నారు. ఐపీఎల్లో హీరో ఇండియా తరఫున జీరో అంటూ ధ్వజమెత్తుతున్నారు. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో గోల్డెన్ డకౌట్ కావడంతో దూబేపై అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొందరు అభిమానులు దూబేపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. కీలకమైన మ్యాచ్లో కీలక సమయంలో బ్యాటింగ్కు దిగి తొలి బంతికే ఔట్ కావడాన్ని అభిమానులు సహించలేకున్నారు. వరుసగా విఫలమవుతున్నా దూబేకు అవకాశాలు ఇస్తున్నందుకు కెప్టెన్ రోహిత్ శర్మను తప్పుబడుతున్నారు. ఇచ్చిన అవకాశాలు చాలు ఫైనల్లో దూబేని తప్పించి ఇతరులకు అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నారు.కాగా, ఇంగ్లండ్తో నిన్న (జూన్ 27) జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో దూబే విఫలమైనా టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తూ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించగా.. కోహ్లి (9), దూబే (0), పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. భారత జట్టు ఇదే! ఐపీఎల్ హీరోలకు చోటు
జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అజిత్ అగార్క్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సోమవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించింది.ఈ సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ టూర్లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు.అదే విధంగా ఈ సిరీస్కు భారత జట్టులో ఐపీఎల్లో హీరోలకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో అదరగొట్టిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్, సీఎస్కే పేసర్ తుషార్ దేశ్ పాండేలకు సెలక్టర్లు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు.నితీష్ కుమార్ ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన నితీష్ కుమార్ రెడ్డి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఈ ఆంధ్ర ఆటగాడు ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ 33.67 సగటుతో 303 పరుగులతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ అద్బుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.అభిషేక్ శర్మఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ సైతం సంచలన ప్రదర్శన కనబరిచాడు. అభిషేక్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్గా ట్రావిస్ హెడ్తో కలిసి భీబత్సం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్లో రాటుదేలుతున్న అభిషేక్ శర్మ.. దేశీవాళీ క్రికెట్లో సైతం అదరగొడుతున్నాడు.రియాన్ పరాగ్..ఇక ఆస్సాం స్టార్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ సైతం ఐపీఎల్-2024లో అదరగొట్టాడు. ఓవరాక్షన్ స్టార్ అని అందరితో విమర్శలు ఎదుర్కొన్న పరాగ్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. రాజస్తాన్ రాయల్స్కు ప్రాతనిథ్యం వహిస్తున్న పరాగ్ తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అతడికి టీ20 వరల్డ్కప్ జట్టులోకి చోటు దక్కుతుందని భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్కు సీనియర్లు దూరం కావడంతో సెలక్టర్లు పరాగ్కు అవకాశమిచ్చారు. తుషార్ దేశ్పాండే..ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్పాండే కూడా తన బౌలింగ్తో అందరని ఆకట్టుకున్నాడు. గత రెండు సీజన్ల నుంచి దేశ్పాండే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు.ఐపీఎల్-2024లో 13 మ్యాచ్లు ఆడిన దేశ్పాండే 17 వికెట్లు పడగొట్టాడు. కేవలం ఐపీఎల్లో మాత్రం దేశీవాళీ క్రికెట్లో కూడా ముంబై తరపున దేశ్పాండే రాణిస్తున్నాడు. -
కోహ్లికి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? కేకేఆర్ స్టార్ రిప్లై వైరల్
ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా. జట్టును చాంపియన్గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు.ఈ మెగా టోర్నీలో హర్షిత్ మొత్తంగా 13 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. తద్వారా తాజా సీజన్లో కేకేఆర్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా.. వరుణ్ చక్రవర్తి(21 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్లో ఆటతోనే కాకుండా.. తనదైన వైల్డ్ సెలబ్రేషన్స్తోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు హర్షిత్ రాణా. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా మయాంక్ అగర్వాల్ వికెట్ తీసిన తర్వాత ఫ్లైయింగ్ కిస్తో సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ 22 ఏళ్ల రైటార్మ్ పేసర్.మ్యాచ్ ఫీజులో 60 శాతం మేర కోతఈ నేపథ్యంలో బీసీసీఐ హర్షిత్ను మందలించింది. మరోసారి ఇలాగే అతి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ.. మ్యాచ్ ఫీజులో 60 శాతం మేర కోత విధించింది.ఇక ఆ తర్వాత హర్షిత్ రాణా మరోసారి ఇలా ఏ బ్యాటర్కు సెండాఫ్ ఇవ్వలేదు. అయితే, అతడి ప్రవర్తనపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.భయ్యాతో మాట్లాడానుతాజాగా శుభాంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ హర్షిత్ రాణా ఈ విషయంపై స్పందించాడు. ‘‘నేను ఉద్దేశపూర్వకంగా ఆరోజు మయాంక్ భయ్యాకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వలేదు. మయాంక్ భయ్యా బంతిని గాల్లోకి లేపగానే తన దగ్గరగా వెళ్లాను.ఆ సమయంలో వికెట్ సెలబ్రేట్ చేసుకునే క్రమంలో సరదాగా అలా చేశాను. కెమెరామెన్ కూడా నా వైపే ఫోకస్ చేశాడు. ఆ తర్వాత నేను ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మయాంక్ భయ్యాను కలిశాను.తనను అగౌరవపరిచే ఉద్దేశం నాకు లేదని చెప్పాను. ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. మా ఇద్దరి మధ్య అవగాహన కుదిరింది’’ అని హర్షిత్ రాణా పేర్కొన్నాడు.విరాట్ కోహ్లికి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? ఈ క్రమంలో విరాట్ కోహ్లి విషయంలో కూడా ఇలాగే చేస్తావా అంటూ హోస్ట్ ప్రశ్నించగా.. ‘‘నేను ముందు చెప్పినట్లుగా.. కావాలని ఏదీ చేయను. ఆర్సీబీ మ్యాచ్లో కూడా నేను ఫ్లైయింగ్ కిస్ ఇస్తే చూడాలని చాలా మంది అనుకున్నారు.నన్ను చాలెంజ్ చేశారు. కానీ కోహ్లిని నేను ఎన్నటికీ టీజ్ చేయను. ఆయన పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. కోహ్లి భయ్యా ఒక్కడే కాదు.. ప్రతి ఒక్క ఆటగాడిని నేను గౌరవిస్తాను.ఏదేమైనా కోహ్లి ముందు మాత్రం ఇలా అస్సలు చేయను’’ అని హర్షిత్ రాణా బదులిచ్చాడు. కాగా లీగ్ దశలో దుమ్ములేపిన కేకేఆర్.. ఫైనల్లో సన్రైజర్స్ను ఓడించి 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. తద్వారా మూడో ట్రోఫీని అందుకుంది. ఇక విజయానంతరం కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ సైతం ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.చదవండి: ఐపీఎల్ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే! -
BCCI: ద్రవిడ్తో పాటు వాళ్లందరూ అవుట్! గంభీర్ కొత్త టీమ్?
టీమిండియా హెడ్కోచ్గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ నియామకం ఖరారు కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇందుకు సంబంధించిన ప్రక్రియను మంగళవారం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.రవిశాస్త్రి తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వన్డే వరల్డ్కప్-2023 నాటికే ముగిసిపోయింది. అయితే, టీ20 ప్రపంచకప్-2024 పూర్తయ్యే వరకు కొనసాగమని బీసీసీఐ కోరగా.. ద్రవిడ్ అందుకు అంగీకరించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.గంభీర్ వైపే మొగ్గుఈ క్రమంలో బీసీసీఐ ద్రవిడ్ వారసుడి ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ వైపు మొగ్గుచూపిన బోర్డు పెద్దలు.. అతడితో సంప్రదింపులు జరిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.అందుకు అనుగుణంగానే గంభీర్ సైతం తాను టీమిండియా హెడ్కోచ్గా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలపడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. ఈ క్రమంలో గంభీర్ ఒక్కడే ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం ఇంటర్వ్యూకి అతడు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులైన అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్లు గంభీర్ను జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం సహాయక సిబ్బందికి సంబంధించి.. గంభీర్ తన సొంత టీమ్ను ఎంచుకోనున్నట్లు సమాచారం.ద్రవిడ్తో పాటు వాళ్లంతా అవుట్!ద్రవిడ్తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ల పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరందరికి ఉద్వాసన పలికి.. గౌతం గంభీర్ కొత్త వాళ్లను తన టీమ్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్ పేరు వినిపిస్తుండగా.. మిగతా కోచ్లు ఎవరన్న అంశం చర్చనీయంగా మారింది.ఇదిలా ఉంటే.. సలీల్ అంకోలా స్థానంలో కొత్త సెలక్టర్ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గంభీర్కు ఇంత వరకు కోచ్గా పనిచేసిన అనుభవం లేదు. అయితే, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు మెంటార్గా వ్యవహరించాడు గంభీర్. తాజా సీజన్లో కోల్కతా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. -
భారత క్రికెట్కు శుభవార్త.. తిరిగి రంగంలోని దిగిన ఫాస్ట్ బౌలర్
భారత క్రికెట్కు శుభవార్త. ఐపీఎల్ 2024 సందర్భంగా గాయపడిన యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తిరిగి రంగంలోకి దిగాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అనంరతం మయాంక్ ఇవాళే ప్రాక్టీస్ షురూ చేశాడు. మయాంక్ నెట్స్లో సాధన చేస్తున్న దృశ్యాలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.Mayank Yadav has been gearing up for the tour against Sri Lanka and Zimbabwe in July. pic.twitter.com/PZ7WS8mFo9— Mufaddal Vohra (@mufaddal_vohra) June 11, 2024గత సీజన్తోనే లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన మయాంక్ ఆడిన 4 నాలుగు మ్యాచ్ల్లో తనేంటో రుజువు చేసుకున్నాడు. తన ప్రధాన అస్త్రమైన పేస్తో భారత క్రికెట్లో హాట్ టాపిక్ అయ్యాడు. దాదాపుగా ప్రతి బంతిని 150 కిమీ పైగా వేగంతో సంధించగల సత్తా ఉన్న మయాంక్.. తన పేస్ పదునుతో ప్రత్యర్ధులను గడగడలాడించాడు.తన అరంగేట్రం మ్యాచ్లోనే (పంజాబ్పై (4-0-27-3)) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న మయాంక్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో (4-0-14-3) మరింత రెచ్చిపోచి, వరుసగా రెండో మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. సీజన్లో ముగిసే లోపు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటాడనుకున్న తరుణంలో మాయంక్ గాయపడ్డాడు. గుజరాత్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన మయాంక్.. ఆ మ్యాచ్లో కేవలం ఒకే ఒక ఓవర్ వేసి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత అతను తిరిగి బరిలోకి దిగలేదు.తాజాగా గాయం పూర్తిగా నయం కావడంతో మయాంక్ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వచ్చే నెల (జులై) భారత జట్టు శ్రీలంక, జింబాబ్వే పర్యటనలకు వెళ్లాల్సి ఉండగా.. భారత సెలెక్టర్లు మయాంక్ పేరును పరిశీలించవచ్చని తెలుస్తుంది. -
ఐపీఎల్లో ఆడకపోవడం మంచిదైంది: ఆసీస్ స్టార్ ప్లేయర్
టీ20 వరల్డ్కప్-2024లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ మెగా టోర్నీలో గ్రూపు-బిలో ఉన్న ఆసీస్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ అద్భుతమైన విజయాలు సాధించింది. తొలుత ఒమన్ను చిత్తు చేసిన కంగారులు.. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ను ఓడించారు. తమ తదుపరి మ్యాచ్లో జూన్ 12న నమీబియాతో ఆసీస్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఆసీస్ విజయం సాధిస్తే సూపర్-8కు ఆర్హత సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఐపీఎల్-2024లో ఆడకపోవడం తనకు కలిసొచ్చిందని జంపా తెలిపాడు. ఇప్పటివరకు ఆసీస్ గెలిచిన రెండు మ్యాచ్ల్లోనూ జంపా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అయితే ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన జంపా.. ఈ ఏడాది సీజన్లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. "ఐపీఎల్-2024లో ఆడకూడదని సీజన్ ఆరంభానికే ముందే నిర్ణయించుకున్నాను. టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం నాకు సరైనదే అన్పించింది. ఎందుకంటే నిరంతర క్రికెట్తో నేను బాగా అలిసిపోయాను. ఈ లీగ్ ఆరంభ సమయానికి నేను కొంచెం మోకాలి నొప్పితో కూడా బాధపడుతున్నాను. ఒకవేళ ఐపీఎల్లో ఆడి మళ్లీ గాయం తిరగబెడితే వరల్డ్కప్నకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగాను.అదే విధంగా నాకు ఫ్యామిలీ కూడా. కొన్ని సార్లు పనికంటే ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇవ్వడం చాలా ముఖ్యమని" క్రికెట్ ఆస్ట్రేలియాతో జంపా పేర్కొన్నాడు. కాగా ఈ ప్రస్తుత పొట్టిప్రపంచకప్లో 2 మ్యాచ్లు ఆడిన జంపా 4 వికెట్లు పడగొట్టాడు. -
అభిషేక్ శర్మ ఊచకోత.. 26 బంతుల్లో శతకం.. 14 సిక్సర్లతో విధ్వంసం
ఐపీఎల్ 2024 సెన్సేషన్, సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ ఫామ్ను కొనసాగించాడు. గురుగ్రామ్లో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్లో అభిషేక్ 26 బంతుల్లో శతక్కొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. స్థానికంగా జరిగిన ఓ మ్యాచ్లో అభిషేక్ పంటర్స్ అనే క్లబ్కు ప్రాతనిథ్యం వహిస్తూ.. ప్రత్యర్థి మారియో క్రికెట్ క్లబ్ను షేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అభిషేక్ 26 బంతులు ఎదుర్కొని 14 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ సునామీ ఇన్నింగ్స్తో చెలరేగడంతో అతని జట్టు పంటర్స్.. ప్రత్యర్థిపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్లో జరిగిన ఫ్రెండ్షిప్ సిరీస్లో నిన్న పంటర్స్-మారియో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మారియో టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కృనాల్ సింగ్ (21 బంతుల్లో 60), నదీమ్ ఖాన్ (32 బంతుల్లో 74) చెలరేగడంతో మారియో టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 249 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓ ఓవర్ బౌల్ చేసిన అభిషేక్ 13 పరుగులు సమర్పించుకున్నాడు.అనంతరం 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అభిషేక్ టీమ్ (పంటర్స్) 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన అభిషేక్.. మారియో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎడాపెడా సిక్సర్లు బాది మారియో టీమ్ బౌలర్ల భరతం పట్టాడు. ఫలితంగా పంటర్స్ టీమ్ మరో 11 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. పంటర్స్ తరఫున అభిషేక్తో పాటు పునీత్ (21 బంతుల్లో 52), లక్షయ్ (29 బంతుల్లో 44 నాటౌట్) రాణించారు.కాగా, ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్కు టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ మెంటార్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. యూవీ మెంటార్షిప్లో అభిషేక్ గత ఐపీఎల్ సీజన్లో అద్భుతాలు చేశాడు. గత సీజన్లో అభిషేక్ 200కు పైగా స్ట్రయిక్రేట్తో 400 పరుగులు చేసి సన్రైజర్స్ను ఫైనల్స్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. -
ఐపీఎల్ ఫామ్ను కొనసాగించిన రుతురాజ్.. మెరుపు ఇన్నింగ్స్తో విజృంభణ
యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2024 ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు. ఈ లీగ్లో పూణేరీ బప్పాకు సారథ్యం వహిస్తున్న రుతు.. నిన్న (జూన్ 4) కొల్హాపూర్ టస్కర్స్తో జరిగిన మ్యాచ్లో అజేయ అర్దశతకం (35 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. ఫలితంగా పూణేరీ బప్పా 22 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్ తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. రుతు ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనూ పర్వాలేదనిపించాడు. ఈగల్ నాసిక్ టైటాన్స్తో జరిగిన ఆ మ్యాచ్లో 21 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. 2024 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రుతు.. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లోనూ తన జట్టుకు (పూణేరీ బప్పా) నాయకత్వం వహిస్తున్నాడు. అయితే రుతు ఐపీఎల్లోలా ఎంపీఎల్లో ఓపెనర్గా బరిలోకి దిగడం లేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ అతను మిడిలార్డర్లో బరిలోకి దిగాడు.మ్యాచ్ విషయానికోస్తే.. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పూణేరీ బప్పా 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. పూణేరీ ఇన్నింగ్స్లో రుతురాజ్ మినహా ఎవరూ రాణించలేదు. RUTURAJ GAIKWAD SHOW...!!!!- Captain Ruturaj smashed 61*(35) in 14 over game while batting in the middle order in the Maharashtra Premier League. 🔥🌟 pic.twitter.com/dumVXn87br— Johns. (@CricCrazyJohns) June 4, 2024శుభమ్ తైస్వాల్ (10), సూరజ్ షిండే (24), రాహుల్ దేశాయ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కొల్హాపూర్ టస్కర్స్ బౌలర్లలో నిహాల్ తుసామద్ 3 వికెట్లు పడగొట్టగా.. శ్రేయస్ చవాన్ 2, యశ్ కలాద్కర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టస్కర్స్ 14 ఓవర్లు బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. పూణేరీ బౌలర్లు పియుశ్ సాల్వీ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టారు. హర్ష్ సాంగ్వి (38), అంకిత్ పోర్వాల్ (28), అంకిత్ బావ్నే (21) ఓ మోస్తరు పరుగులు చేసినా టస్కర్స్కు ఓటమి తప్పలేదు. కాగా, కొద్ది రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ 2024లో రుతురాజ్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సీజన్లో అతను 14 మ్యాచ్ల్లో సెంచరీ, నాలుగు అర్దసెంచరీల సాయంతో 583 పరుగులు చేశాడు. 15 మ్యాచ్ల్లో సెంచరీ, 5 అర్దసెంచరీల సాయంతో 741 పరుగులు చేసిన ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి సీజన్ లీడింగ్ రన్స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. -
ఐపీఎల్ 2025.. చెన్నై సూపర్ కింగ్స్లోకి అశ్విన్!?
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన సొంతగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలంలో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ బాధ్యతలను అశ్విన్కు సీఎస్కే ఫ్రాంచైజీ యాజయాన్యం ఇండియా సిమెంట్స్ గ్రూప్ అప్పగించింది. దీంతో అశూతో సీఎస్కే మరోసారి ఒప్పందం కుదుర్చుకోవడం దాదాపు ఖాయమైంది. కాగా తమిళనాడులో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను తయారు చేసేందుకు సీఎస్కే ఫ్రాంచైజీ చెన్నై శివారులో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ను ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. "వేలానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆటగాళ్ల ఎంపిక అనేది వేలం డైనమిక్స్పై ఆధారపడి ఉంటుంది. ముందే మేము ఏ ప్లాన్స్ చేయలేం. అశ్విన్ను కొనుగోలు చేసే ఛాన్స్ మాకు వస్తుందో లేదో కూడా తెలియదు. అతడు మొదటగా మా హై పెర్ఫార్మెన్స్ సెంటర్ ఛీప్గా బాధ్యతలు చేపడతాడు. అక్కడ ప్రోగ్రామ్లు, క్రికెట్కు సంబంధించిన విషయాలను అతడు చూసుకుంటాడు. అతడితో మేము ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. అశూ ఇప్పుడు సీఎస్కే వెంచర్లో భాగమయ్యాడు.అదే విధంగా టీఎన్సీఎ ఫస్ట్-డివిజన్ క్రికెట్లో ఇండియా సిమెంట్స్ జట్లకు సైతం ప్రాతినిథ్యం వహిస్తాడని" ఓ ప్రకటనలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ పేర్కొన్నాడు. కాగా అశ్విన్ ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు.అయితే ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలానికి అశ్విన్ను రాజస్తాన్ విడిచిపెట్టే ఛాన్స్ ఉంది. కాగా అంతకముందు అశ్విన్ 2005 నుంచి 2015 వరకు సీఎస్కే ప్రాతినిథ్యం వహించాడు. మళ్లీ పదేళ్ల తర్వాత సీఎస్కే ఫ్యామిలీలో అశూ భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. -
Pat Cummins: ఆమెపై కోపం వచ్చింది.. కానీ!
ఇండియాలో ఉన్నన్ని రోజులు తమ కుటుంబం ఎంతో సంతోషంగా గడిపిందని ఆస్ట్రేలియా సారథి, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఐపీఎల్-2024 నేపథ్యంలో తొలిసారిగా తమ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చిందని.. ఎన్నో అందమైన జ్ఞాపకాలను పోగు చేసుకుందని పేర్కొన్నాడు.కాగా వన్డే వరల్డ్కప్-2023 విజేత అయిన ప్యాట్ కమిన్స్ను సన్రైజర్స్ యాజమాన్యం ఏకంగా రూ. 20.50 కోట్లు పెట్టి కొనుక్కున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని కెప్టెన్గా నియమించగా.. అనూహ్య రీతిలో జట్టు పుంజుకుంది.గత మూడేళ్ల వైఫల్యాలకు చరమగీతం పాడుతూ ఏకంగా ఫైనల్ చేరుకుంది. అయితే, తుదిపోరులో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్తోనే సరిపెట్టుకుంది. అయినా.. గతం కంటే మెరుగైన ప్రదర్శన కారణంగా అభిమానుల మనసు గెలుచుకుంది కమిన్స్ బృందం.ఇక ఇండియాలో ఉన్నపుడు ఆట నుంచి విరామం దొరికిన సమయంలో ప్యాట్ కమిన్స్ కుటుంబంతో కలిసి వివిధ రకాల హోటళ్లను సందర్శించి భోజనం రుచిచూశాడు. అదే విధంగా బాలీవుడ్ పాటకు స్టెప్పులేస్తూ ఫ్యామిలీ అంతా సరాదాగా గడిపారు.తాజాగా ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్యాట్ కమిన్స్.. ఆసకిక్తకర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ సాంగ్కు డాన్స్ చేయడం ఎలా అనిపించింది అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నా సోదరి పట్టుబట్టడం వల్లే నేను డాన్స్ చేయాల్సి వచ్చింది.తనే నన్ను బాలీవుడ్ డాన్సింగ్ క్లాసుకు తీసుకువెళ్లింది. ఆ తర్వాత తనే మా డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో నాకు చాలా కోపం వచ్చింది.అయితే, ఇప్పుడు అదెంతో గొప్పగా అనిపిస్తోంది. ఐపీఎల్ కోసం అక్కడ ఉన్నన్ని రోజులు ఎంతో ఎంజాయ్ చేశాం. ఎక్కడికి వెళ్లాలి? ఎలాంటి ఫుడ్ తినాలి? అన్న విషయాల గురించి నా సహచర ఆటగాళ్లు మంచి సలహాలు ఇచ్చారు.తొలిసారి నా ఫ్యామిలీ ఇండియా సందర్శించి.. అందమైన జ్ఞాపకాలు పోగు చేసుకుంది’’ అని ప్యాట్ కమిన్స్ ఈఎస్పీఎన్క్రిక్ ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు. కాగా కమిన్స్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీగా ఉన్నాడు. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో జూన్ 5 ఆసీస్ ఒమన్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. Pat Cummins dancing on a Bollywood song wasn't on my Bingo Card 😂😂👏👏👏 pic.twitter.com/OZgP6qtJ8G— aman (@bilateral_bully) May 8, 2024 -
ఇలా అయితే.. టీమిండియాలో ఛాన్స్ రానేరాదు!
సూటిగా.. సుత్తి లేకుండా మాట్లాడటం తనకు అలవాటు అంటున్నాడు రాజస్తాన్ రాయల్స్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్. టీ20 ప్రపంచకప్-2024కు ఎంపిక చేసిన జట్టులో తనకు స్థానం లేదని.. కాబట్టి మ్యాచ్లు చూసి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం తనకు లేదంటున్నాడు.కాగా అసోం ఆల్రౌండర్ రియాన్ పరాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గత ఐదేళ్లుగా రాజస్తాన్ ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నాడు. క్యాష్రిచ్ లీగ్ కెరీర్ ఆరంభంలో సరిగ్గా ఆడకపోయినా మేనేజ్మెంట్ అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. అయినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలయ్యాడు.ఈ క్రమంలో ఒకానొక సమయంలో జట్టులో స్థానం కోల్పోయిన రియాన్ పరాగ్.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు. అదే జోరును ఐపీఎల్-2024లోనూ కొనసాగించి.. విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు.తాజా ఐపీఎల్ ఎడిషన్లో 14 ఇన్నింగ్స్ ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. ఏకంగా 573 పరుగులతో దుమ్ములేపాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లి(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాతి స్థానంలో నిలిచాడు.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 ద్వారా రియాన్ పరాగ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్రౌండర్ను సెలక్టర్లు పరగణనలోకి తీసుకోలేదు. అనుభవం లేని రియాన్ పరాగ్ను కనీసం స్టాండ్బై ప్లేయర్గా కూడా ఎంపిక చేయలేదు.ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ స్పందిస్తూ.. ఏదో ఒక రోజు సెలక్టర్లు తనను టీమిండియాకు ఎంపిక చేయక తప్పదని.. ఇది తాను అహంభావంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానంటూ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈసారి వరల్డ్కప్ టోర్నీని చూడాలనే ఆసక్తి తనకు ఏమాత్రం లేదంటూ కుండబద్దలు కొట్టాడు.టీమిండియాకు మద్దతుగా నిలిచే ‘భారత్ ఆర్మీ’తో రియాన్ మాట్లాడుతున్న క్రమంలో.. ఈసారి వరల్డ్కప్ సెమీ ఫైనలిస్టులు ఎవరు అనుకుంటున్నారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంటే పక్షపాత ధోరణితో మాట్లాడినట్లే అవుతుంది.నిజానికి నేను ఈసారి అసలు వరల్డ్కప్ మ్యాచ్ చూడాలనే అనుకోవడం లేదు. ఫైనల్లో ఎవరు గెలిచారు? ట్రోఫీ ఎవరు అందుకున్నారని మాత్రమే చూస్తాను. ఒకవేళ నేను ప్రపంచకప్ టోర్నీలో గనుక ఆడుతూ ఉన్నట్లయితే.. కచ్చితంగా ఈ టాప్-4 వగైరాల గురించి పట్టించుకునేవాడిని’’ అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘రియాన్ పరాగ్ మరో ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్ అవడం ఖాయం. ఇలాంటి ఆటిట్యూడ్ ఉంటే నీకు ఛాన్సులెలా వస్తాయి? ఓవరాక్షన్ స్టార్ అనే బిరుదు సార్థకం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నావా ఏంటి?’’ అని విమర్శిస్తున్నారు.కాగా బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించారనే కారణంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తూ ఇటీవల బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
పెళ్లి పీటలెక్కిన టీమిండియా క్రికెటర్.. (ఫొటోలు)
-
టీమిండియా హెడ్కోచ్గా పనిచేసేందుకు నేను రెడీ: గంభీర్
భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్ పదవిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మే 27తో దరఖాస్తు గడువు తేదీ ముగిసినా ఎవరెవరు పోటీలో ఉన్నారు? అనే విషయంపై బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే భారత హెడ్కోచ్ రేసులో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే మరి కొన్ని రిపోర్ట్లు మాత్రం గంభీర్కు హెడ్కోచ్ పదవిపై ఆసక్తి లేదని పేర్కొంటున్నాయి. కాగా గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు మెంటార్గా పనిచేస్తున్నాడు. ఐపీఎల్-2024లో కేకేఆర్ను ఛాంపియన్స్గా నిలిపిన తర్వాత గంభీర్ వరుస కార్యక్రమాలతో బీజీబీజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అబుదాబిలోని మెడియర్ ఆసుపత్రిలో విద్యార్థులతో గౌతీ ఇంటరాక్టయ్యాడు. ఈ నేపథ్యంలో భారత హెడ్కోచ్ పదవిపై తన అభిప్రాయాలను చెప్పమని గౌతీని విద్యార్థులు ప్రశ్నించారు. జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్గా వ్యవహరించడం కంటే గొప్ప గౌరవం మరొకటి లేదని గంభీర్ చెప్పుకొచ్చాడు. "భారత జట్టు హెడ్కోచ్ పనిచేసేందుకు నేను ఇష్టపడతాను. జాతీయ జట్టుకు కోచ్ చేయడం కంటే గొప్ప గౌరవం ఇంకొకటి ఉండదు. మేము దేశంలో ఉన్న 140 కోట్ల భారతీయుల తరపున ఆడుతాము. అంతకంటే అదృష్టం ఇంకేమి ఉంటుందని" గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC: సునీల్ గవాస్కర్ను కలిసిన బాబర్ ఆజం.. వీడియో వైరల్ -
పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్.. ఫొటో వైరల్
టీమిండియా క్రికెటర్, కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పెళ్లి పీటలెక్కాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్ మెడలో ఆదివారం మూడు ముళ్లు వేశాడు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నడుమ వెంకీ- శృతిల పెళ్లి సంప్రదాయ పద్ధతిలో వైభవోపేతంగా జరిగినట్లు తెలుస్తోంది.కాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 1994, డిసెంబరు 25న జన్మించాడు వెంకటేశ్ అయ్యర్. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాలో స్థానం సంపాదించాడు.టీమిండియా తరఫున అరంగేట్రంభారత్ వేదికగా 2021లో న్యూజిలాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన వెంకీ.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.తన అంతర్జాతీయ కెరీర్లో వెంకటేశ్ ఇప్పటి వరకు.. 2 వన్డే, 9 టీ20 మ్యాచ్లు ఆడి వరుసగా 24, 133 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టాడు.ఇక ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వెంకటేశ్ అయ్యర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా! అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే హార్దిక్ పాండ్యా వారసుడంటూ ప్రశంసలు అందుకున్నాడు.రాణించలేక అవకాశాలు కరువుకానీ అంచనాలు అందుకోలేక చతికిలపడి.. నిరాశజనక ప్రదర్శనతో టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు వెంకటేశ్ అయ్యర్. మొత్తంగా 13 ఇన్నింగ్స్ ఆడి 370 పరుగులు సాధించాడు.ఐపీఎల్-2024 ఫైనల్లో అదరగొట్టిముఖ్యంగా ఫైనల్లో ఒంటిచేత్తో కేకేఆర్ను గెలిపించి చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగి 26 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు.ఆఖరి వరకు అజేయంగా నిలిచి కేకేఆర్ను విజయతీరాలకు చేర్చాడు.ఈ క్రమంలో మరోసారి టీమిండియా తలుపులు తట్టే అవకాశం దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడిలా వ్యక్తిగత జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ఆరంభించాడు వెంకటేశ్ అయ్యర్. అతడి శ్రీమతి శృతి రఘునాథన్ నిఫ్ట్(NIFT) నుంచి ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో ఆమె పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది నవంబరులో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా -
ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా ఉద్వేగం
‘‘ఏదేమైనా యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత మనం అక్కడే ఉండి పోరాడాలి. ఒక్కోసారి జీవితం మనల్ని విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది.అయితే, నేను మాత్రం ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఆటను వదిలిపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా. ఒకవేళ యుద్ధ రంగంలో వెన్నుచూపితే మనం అనుకున్న ఫలితాలు రాబట్టలేం కదా!ఇక్కడ కూడా అంతే.. ఆట ద్వారా మనమేం పొందాలనుకుంటున్నామో.. వాటిని సాధించాలంటే కాస్త ఓపికగా ఎదురుచూడాలి. ఒక్కోసారి అది చాలా కష్టంగా ఉంటుందన్న మాట వాస్తవం.అయితే, నేను ఎప్పుటికప్పుడు మా మనసుని తేలిక చేసుకుంటాను. అంతకు ముందు ఎలా ఉన్నానో.. క్లిష్ట పరిస్థితుల్లోనూ అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తాను.జీవితంలో మంచి రోజులు, గడ్డు పరిస్థితులు.. వస్తూ పోతూ ఉంటాయి. నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. వాటిని దాటుకుని విజయవంతంగా ముందడుగు వేశాను.నిజానికి నేను సక్సెస్ను అంత సీరియస్గా తీసుకోను. నేను బాగా ఆడిన రోజును మర్చిపోతాను. అదే విధంగా.. చేదు అనుభవాలను కూడా!అలా అని పరిస్థితుల నుంచి పారిపోను. ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాను. ఏదో ఒకరోజు వాటి నుంచి బయటపడతాను. ఆట, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ.. కఠిన శ్రమకోరుస్తూ ముందుసాగితే తప్పకుండా ఫలితం ఉంటుంది.అలాగే ఎల్లప్పుడూ చిరునవ్వును మాత్రం వీడకూడదు’’ అంటూ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ మధ్యలోనే గాయపడిన పాండ్యా మిగతా మ్యాచ్లకు దూరమైన విషయం తెలిసిందే.విమర్శల వర్షంఈ క్రమంలో ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ బరోడా క్రికెటర్.. ముంబై కెప్టెన్గా కొత్త బాధ్యతలు చేపట్టాడు. అయితే, రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా రావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు అతడిపై ఆగ్రహం వెళ్లగక్కారు.స్టేడియంలో, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ హార్దిక్ పాండ్యాపై విరుచుకుపడ్డారు. ఇక కెప్టెన్గానూ హార్దిక్ విఫలం కావడంపై అతడిపై విమర్శల వర్షం కురిసింది. అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిపోయింది.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 జట్టులో స్థానమే ప్రశ్నార్థకమైన వేళ.. బీసీసీఐ సెలక్టర్లు హార్దిక్ పాండ్యాపై నమ్మకం ఉంచి ఏకంగా వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 1న బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని 40 పరుగులతో అజేయంగా నిలిచి ఈ పేస్ ఆల్రౌండర్.. తదుపరి ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తాను ఫుల్ ఫామ్లోకి వచ్చినట్లేనని పాండ్యా సంకేతాలు ఇచ్చాడు.భార్యతో విభేదాలు.. విడాకులంటూ ప్రచారంకాగా ఐపీఎల్-2024లో చెత్త ప్రదర్శన ద్వారా విమర్శలపాలైన హార్దిక్ పాండ్యా.. వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. భార్య నటాషా స్టాంకోవిక్తో అతడికి విభేదాలు తలెత్తాయని.. ఈ క్రమంలో ఆమె విడాకులకు అప్లై చేసిందనే ప్రచారం జరుగుతోంది.అంతేకాదు భరణంగా హార్దిక్ పాండ్యా ఆస్తిలో డెబ్బై శాతం వాటా కూడా నటాషాకు లభించనుందని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. కాగా సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా.ఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే హార్దిక్- నటాషా విడిపోతున్నారనే వార్తలు అభిమానులను కలవర పెడుతున్నాయి. ఇక వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ షోలో పైవిధంగా ఉద్వేగ పూరితంగా మాట్లాడటం గమనార్హం.చదవండి: రోహిత్, విరాట్ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ -
IPL 2024: కేకేఆర్ స్టార్ పేసర్కు గ్రాండ్ వెల్కమ్
ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ గెలిచాక సొంత పట్టణం అంబాలకు (హర్యానా) విచ్చేసిన కేకేఆర్ స్టార్ పేసర్ వైభవ్ అరోరాకు ఘన స్వాగతం లభించింది. వైభవ్ను అతని సన్నిహితులు, అభిమానులు, అంబాల వాసులు డప్పు వాయిద్యాల మధ్య పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైభవ్తో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. అనంతరం వైభవ్ ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఐపీఎల్ 2024 సీజన్ ముగిసి వారం రోజులు పూర్తయినా జనాలు ఇంకా అదే మూడ్లో ఉన్నారు. 27 ఏళ్ల వైభవ్ ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనలతో చెలరేగాడు. వైభవ్ ఈ సీజన్లో 10 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. Vaibhav Arora gets a hero's welcome to his hometown after IPL win. 🏆pic.twitter.com/PhWOMk76Y6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన వైభవ్.. సహచరుడు హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్లతో కలిసి కేకేఆర్ పేస్ అటాక్ను లీడ్ చేశాడు. లోయర్ ఆర్డర్లో ఉపయోగకర బ్యాటర్ కూడా అయిన వైభవ్ను కేకేఆర్ ఈ సీజన్ వేలంలో 60 లక్షలకు సొంతం చేసుకుంది. వైభవ్ ఇప్పటివరకు 21 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ దేశవాలీ క్రికెట్లో హిమాచల్ ప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తాడు. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ ఆ సీజన్లో కేకేఆర్కు ఆడి ఆతర్వాతి సీజన్లో (2022) పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో వైభవ్ తిరిగి కేకేఆర్ పంచన చేరాడు. ఈ సీజన్లో వైభవ్కు చాలా పాపులారిటీ వచ్చింది. సన్రైజర్స్తో జరిగిన ఫైనల్లో వైభవ్ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి అత్యంత కీలకమైన ట్రవిస్ హెడ్ వికెట్ తీశాడు. ఈ సీజన్ ప్రదర్శనల కారణంగా కేకేఆర్ తదుపరి సీజన్లోనూ ఇతన్ని రీటెయిన్ చేసుకునే అవకాశం ఉంది. -
త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
తాను త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమంటున్నాడు రియాన్ పరాగ్. సెలక్టర్లు ఏదో ఒకరోజు తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయక తప్పదని.. ఈ విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.అసోంకు చెందిన 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్. కుడిచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన ఈ యంగ్స్టర్.. రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ కూడా! ఐపీఎల్లో గత ఐదేళ్లుగా రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అయితే, ఆరంభంలో నామమాత్రపు స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్న రియాన్ పరాగ్ ఈ ఏడాది మాత్రం అద్భుతంగా రాణించాడు. దేశవాళీ క్రికెట్లో సూపర్ ఫామ్ అందుకున్న అతడు .. ఐపీఎల్-2024లోనూ దానిని కొనసాగించాడు.రాజస్తాన్ తరఫున 14 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 573 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లి(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.సీజన్ ఆసాంతం మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకుని రాజస్తాన్ను ప్లే ఆఫ్స్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు రియాన్ పరాగ్. ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లోనూ పరుగుల వరద పారిస్తున్న ఈ అసోం ఆటగాడు త్వరలోనే టీమిండియాకు ఎంపిక కానున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడిన రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఏదో ఒకరోజు వాళ్లు నన్ను సెలక్ట్ చేయక తప్పదు కదా! నేను టీమిండియాకు ఆడతాననే నమ్మకం నాకుంది.ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నేను లెక్కచేయను.నేను పరుగులు సాధించని సమయంలోనూ ఇదే తరహా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నాపై నాకున్న నమ్మకం అది.ఇదేమీ నేను అహంభావంతో చెబుతున్న మాట కాదు. పదేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి మా నాన్న, నేను ఇదే అనుకున్నాం. ఏదేమైనా ఏదో ఒకరోజు కచ్చితంగా జాతీయ జట్టుకు ఆడటమే మా ధ్యేయం అని ఫిక్సైపోయాం’’ అని రియాన్ పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.వచ్చే ఆరునెలల కాలంలో కచ్చితంగా టీమిండియా తరఫున తాను అరంగేట్రం చేసే అవకాశం ఉందని రియాన్ నమ్మకంగా చెప్పాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ సందర్భంగా ఐపీఎల్-2024లో దుమ్ములేపిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా తదితరులు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. -
T20 WC 2024: అత్యధిక వికెట్లు పడగొట్టేది అతడే!
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. గత కొన్నేళ్లుగా బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడని.. టీ20 ప్రపంచకప్-2024లోనూ కచ్చితంగా ప్రభావం చూపుతాడని అభిప్రాయపడ్డాడు.కాగా వెన్నునొప్పి కారణంగా బుమ్రా టీ20 ప్రంపచకప్-2022కు దూరమైన విషయం తెలిసిందే. నాటి టోర్నీలో టీమిండియా ప్రధాన పేసర్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో రోహిత్ సేన సెమీస్లోనే ఇంటిబాట పట్టి విమర్శలు మూటగట్టుకుంది.పునరాగమనంలోఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత 2023లో పునరాగమనం చేసిన బుమ్రా.. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో దుమ్ములేపాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో కెప్టెన్గానూ రాణించాడు.ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున 13 మ్యాచ్లు ఆడి 20 వికెట్లు తీసిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఎకానమీ రేటు 6.48.పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీకి ముందు బుమ్రా ఈ మేరకు రాణించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్ బుమ్రానే అని ధీమా వ్యక్తం చేశాడు.లీడింగ్ వికెట్ టేకర్ జస్ప్రీత్ బుమ్రానే‘‘నా అంచనా ప్రకారం.. ఈసారి లీడింగ్ వికెట్ టేకర్ జస్ప్రీత్ బుమ్రానే. అతడొక అద్భుతమైన ఆటగాడు. చాలా ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవలి ఐపీఎల్ సీజన్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. న్యూ బాల్ చేతికి ఇస్తే ఓ ఫాస్ట్బౌలర్ ఏం చేయగలడో అన్నీ చేయగల సమర్థుడు.బంతిని సూపర్గా స్వింగ్ చేస్తాడు. ఇక ఎకానమీ విషయానికొస్తే.. ఐపీఎల్ తాజా ఎడిషన్లో ఓవర్కు ఏడు పరుగుల చొప్పున ఇచ్చి వికెట్లు తీశాడు. కఠిన సమయాల్లోనూ బంతితో మ్యాజిక్ చేశాడు.టీ20 క్రికెట్లో ఎలా ఆడాలో అలాగే ఆడాడు. కాబట్టి ఈసారి అతడే లీడింగ్ వికెట్ టేకర్ అవుతాడని భావిస్తున్నా’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్-2024లో జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది.చదవండి: ఇది నిజంగా సిగ్గు చేటు.. దేశం పరువు పోతుంది: డివిలియర్స్ -
అతడు గర్ల్ఫ్రెండ్ను తీసుకురావచ్చా? అని అడిగాడు: గంభీర్
ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్కతా నైట్రైడర్స్ నిలిచిన విషయం విధితమే. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కేకేఆర్.. టోర్నీ అసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ముచ్చటగా మూడో సారి టైటిల్ను ముద్దాడింది.అయితే కేకేఆర్ విజేతగా నిలవడంలో ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ ది కీలక పాత్ర. కేకేఆర్ ఫ్రాంచైజీకి కెప్టెన్గా రెండు సార్లు ఛాంపియన్గా నిలిపిన గౌతీ.. ఈసారి మెంటార్గా ట్రోఫీని అందించాడు. అయితే ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ విజేతగా కేకేఆర్ నిలిచిన అనంతరం గంభీర్ ఇంటర్వ్యూలతో బీజీబీజీగా ఉన్నాడు. తాజాగా ఎన్డీటీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్.. కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నరైన్తో తనకు మంచి అనుబంధం ఉందని, తను ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా సునీల్ నరైన్ తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి కేకేఆర్ ఫ్రాంచైజీలోనే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో నరైన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఓపెనర్గా వచ్చి ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు.ఓవరాల్గా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సునీల్.. కేకేఆర్ మూడోసారి ఛాంపియన్గా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. అయితే నరైన్ను ఓపెనర్గా పరిచయం చేసింది గౌతం గంభీర్నే. 2012 సీజన్లో నరైన్ను ఓపెనర్గా పరిచియం చేసి విజయవంతమైన గంభీర్.. సారథిగా కేకేఆర్కు తొలి టైటిల్ను అందించాడు.నా గర్ల్ఫ్రెండ్ను ఐపీఎల్కు తీసుకురావచ్చా?"నాది, సునీల్ నరైన్ మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది. అదే విధంగా మేము ఇద్దరం కూడా పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వము. ఐపీఎల్-2012 సీజన్లో తొలిసారి నరైన్తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో జై పూర్లో మా ప్రాక్టీస్ను ముగించుకుని లంచ్ చేసేందుకు సిద్దమయ్యాం.. ఈ క్రమంలో నరైన్కు లంచ్కు పిలిచాను. నాకు ఇప్పటికి బాగా గుర్తు ఉంది. నేను పిలవగానే అతను చాలా సిగ్గుపడ్డాడు. లంచ్ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. నా గర్ల్ఫ్రెండ్ను ఐపీఎల్కు తీసుకురావచ్చా? అని అడిగాడు. నరైన్ తన మొదటి సీజన్లో చాలా సైలెంట్గా ఉన్నాడు. కానీ నరైన్ ఇప్పుడు ఒకప్పుడులా లేడు. అతడితో నేను ఎదైనా మాట్లాడవచ్చు. సునీల్ కూడా నాతో స్వేఛ్చగానే మాట్లాడుతాడు. నేను ఎప్పుడు అతడిని సహచరుడిగా, స్నేహితుడిగా చూడలేదు. సునీల్ నా సొంత సోదరుడిలా భావించాను. తనకు ఏ అవసరమోచ్చినా నేను ముందుంటాను. అదే విధంగా నాకు ఏ సమస్య ఉన్నా తను కూడా ముందుంటాడు. మేము ఆడంబరంగా ఉండం. కానీ మా బాధ్యతను 100 శాతం నిర్వర్తించేందుకు అన్ని విధాలగా ప్రయత్నిస్తామని" ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. -
MS Dhoni: ధోని కాళ్లు మొక్కాను.. సర్జరీ చేయిస్తా అన్నారు!
మహేంద్ర సింగ్ ధోని.. ఈ టీమిండియా దిగ్గజ కెప్టెన్ తన అద్బుత ఆట తీరు, నిరాండంబరతతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ తర్వాత కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా జట్టును రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్గా నిలిపి.. ‘తలా’గా అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకున్నాడు. అయితే, ధోని మైదానంలో దిగుతున్నాడంటే సీఎస్కే ఫ్యాన్స్కు మాత్రమే కాదు.. జట్లకు అతీతంగా అందరిలోనూ ఉత్సాహం నిండిపోతుంది.ఏ జట్టుకు మద్దతు ఇచ్చే వారైనా ధోని బ్యాటింగ్కు వచ్చాడంటే .. క్రీజులో ఉన్నంత సేపు అతడికే మద్దతుగా నిలుస్తారు. ఇక మరికొంత మందైతే తలాను నేరుగా కలిసేందుకు దెబ్బలు తినైనా సరే మైదానంలోకి దూసుకువస్తారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.ధోని బ్యాటింగ్కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పిఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగానూ ఓ వ్యక్తి ఇలాగే ఫీల్డ్లోకి దూసుకువచ్చాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ధోని బ్యాటింగ్కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పి లోపలికి ప్రవేశించి.. ధోని పాదాలను చుట్టేశాడు.ఆ సమయంలో ధోని ఏమాత్రం సహనం కోల్పోకుండా తన అభిమాని సమస్యను అర్థం చేసుకోవడమే గాకుండా.. సర్జరీ చేయిస్తానని మాట ఇచ్చాడట. నాడు ధోనిని కలిసిన సదరు వ్యక్తి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు.ధోని కాళ్లు మొక్కాను.. సర్జరీ చేయిస్తా అన్నారు!‘‘ధోనిని చూడగానే నా చుట్టూ ఏం జరుగుతుందో అంతా మర్చిపోయాను. మైదానంలోకి పరిగెత్తుకు వెళ్లాను. మహీ భాయ్ అప్పుడు.. ‘సరదా కోసమే ఇక్కడికి వచ్చావు కదా’ అన్నాడు.మహీ భాయ్ను చూశానన్న ఆనందంలో నాకైతే పిచ్చిపట్టినట్లయింది. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయనొక లెజెండ్. నేరుగా ఆయనను చూడగానే నా కళ్లలో నీళ్లు వచ్చాయి.ఆ సమయంలో నేను భారంగా శ్వాస తీసుకోవడం గమనించి.. ఏమైందని అడిగారు. నా ముక్కు సరిగా పనిచేయదని.. శ్వాస విషయంలో ఇబ్బంది పడుతున్న అని చెప్పాను. వెంటనే ఆయన.. ‘బాధపడకు.. నీ సర్జరీ గురించి నేను చూసుకుంటా. నీకేం కానివ్వను’ అని భరోసా ఇచ్చారు’’ అని సదరు అభిమాని ఫోకస్డ్ ఇండియన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ధోని గ్రేట్అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ధోని గ్రేట్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. కాగా 42 ఏళ్ల వయసులో సీఎస్కే కెప్టెన్గా వైదొలిగిన ధోని.. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు.గైక్వాడ్ సారథ్యంలో వికెట్ కీపర్బ్యాటర్గా కొనసాగాడు ధోని. అయితే, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్Conversation between @msdhoni and fan 🥹💛Fan told him he has some breathing issues and there is surgery of it. He wanted to meet him before surgery. Mahi replied "Teri surgery ka mai dekh lunga. Tujhe kuch nahi hoga, tu ghabara mat. Mai tujhe kuch nahi hone dunga" pic.twitter.com/wKz9aZOVGQ— ` (@WorshipDhoni) May 29, 2024 -
టీమిండియా హెడ్కోచ్గా కాదు!.. గంభీర్ వ్యాఖ్యలు వైరల్
టీమిండియా కొత్త కోచ్ ఎవరన్న అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తొలుత విదేశీ కోచ్ల పేర్లు వినిపించగా.. ఐపీఎల్-2024 ఫైనల్ తర్వాత మాత్రం ఇండియన్నే ఈ పదవి చేపట్టనున్నాడనే అభిప్రాయాలు బలపడ్డాయి.రాహుల్ ద్రవిడ్ స్థానంలో మాజీ ఓపెనర్, కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ ఈ బాధ్యతలు స్వీకరించనున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఐపీఎల్ తాజా సీజన్ ఫైనల్ అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా గౌతీతో సుదీర్ఘ చర్చలు జరపడం.. గంభీర్ సైతం హెడ్కోచ్ పదవి పట్ల ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు ఇందుకు ఊతమిచ్చాయి.అయితే, తాజాగా గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తాను భారత ప్రధాన కోచ్ పదవి చేపట్టడం లేదని గంభీర్ ఒక రకంగా స్పష్టం చేశాడు. ఇంతకీ గౌతీ ఏమన్నాడంటే..‘‘కేకేఆర్ మూడో ట్రోఫీ గెలిచింది కాబట్టి.. డ్రెస్సింగ్రూం వాతావరణం మొత్తం సంతోషంతో నిండిపోయిందని మీరు అంటున్నారు. అయితే, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కంటే మేము ఇంకా రెండు టైటిళ్లు వెనుకబడి ఉన్నాం.ఈ సీజన్ బాగా సాగింది. అయితే, ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలవాలంటే మేమింకా మూడుసార్లు చాంపియన్లుగా నిలవాలి. అందుకు ఎంతో కఠినంగా శ్రమించాల్సి ఉంటుంది.కాబట్టి మా తదుపరి మిషన్.. అదే. కేకేఆర్ను మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా చేయగలగాలి. అంతకంటే గొప్ప అనుభూతి నాకు మరొకటి ఉండదు. అయితే, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది’’ అని స్పోర్ట్స్కీడా ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు.ఈ వ్యాఖ్యలను బట్టి గంభీర్ కేకేఆర్తో తన ప్రయాణం కొనసాగిస్తాడని స్పష్టమవుతోంది. ఇక టీమిండియా హెడ్ కోచ్గా ఉండాలంటే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, ఇతర జట్లతో సదరు వ్యక్తికి సంబంధం ఉండకూడదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేకేఆర్ మెంటార్గా కొనసాగేందుకే గంభీర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
Rohit Sharma- MI: ఆఖరి మ్యాచ్ ఆడేశాడు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్లోనే 2024 సీజన్ను ఓ చేదు జ్ఞాపకంగా చెప్పవచ్చు. 2011లో ముంబై ఇండియన్స్ కుటుంబంలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఓపెనర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.ఆ తర్వాత రెండేళ్లకే కెప్టెన్గా ప్రమోట్ అయిన హిట్మ్యాన్.. సారథిగా తొలి ప్రయత్నంలోనే ముంబై ఇండియన్స్కు టైటిల్ అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు సార్లు జట్టును చాంపియన్గా నిలిపి.. అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తొలి కెప్టెన్గా రికార్డు సృష్టించాడు.ఇక గతేడాది ముంబైని ప్లే ఆఫ్స్నకు చేర్చిన రోహిత్ శర్మకు.. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ముంబై మేనేజ్మెంట్ షాకిచ్చింది. కెప్టెన్గా రోహిత్పై వేటు వేసి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి పాండ్యాను ట్రేడ్ చేసుకుని మరీ కెప్టెన్గా నియమించింది. అయితే, అతడి సారథ్యంలో ముంబై ఈసారి చెత్తగా ఆడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. రోహిత్ శర్మ సైతం ఓపెనర్గా ఆకట్టుకోలేకపోయాడు.ఆడిన 14 మ్యాచ్లలో కలిపి కేవలం 417 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ముంబై మేనేజ్మెంట్ వైఖరితో విసిగిపోయిన రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ఆ ఫ్రాంఛైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2025 వేలానికి ముందు ముంబై రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.‘‘నాకు తెలిసి వాళ్లు ఇషాన్ కిషన్ను వదిలేస్తారు. అతడి కోసం రైట్ టూ మ్యాచ్ కార్డు వాడతారనుకుంటా. ఎందుకంటే ఇషాన్ కోసం 15.5 కోట్లు వెచ్చించడం సరికాదు.కాబట్టి వాళ్లు అతడిని వదిలేస్తారు. ఇక రోహిత్ శర్మ ఇప్పటికే ముంబై ఇండియన్స్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. తనను ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోవాలని అతడు కోరుకోవడం లేదు.అదే విధంగా ఫ్రాంఛైజీ కూడా అతడిని అట్టిపెట్టుకోవాలని భావించడం లేదు. ఇప్పటికే ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ దారులు వేరయ్యాయి. రోహిత్ను మరోసారి ముంబై జెర్సీలో చూసే అవకాశం లేదు.అయితే, ఇది కేవలం నా అంచనా మాత్రమే. ఒకవేళ ఇది నిజం కావచ్చు. కాకపోవచ్చు. ఏదేమైనా రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ముంబైకి మాత్రం ఆడబోడని నమ్మకంగా చెప్పగలను’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్లో పేర్కొన్నాడు.ఇక ముంబై రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి ఆటగాడిని.. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మను కూడా కొనసాగిస్తుందని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఐపీఎల్ పదిహేడో సీజన్లో ముంబై ఆడిన పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగే గెలిచింది. -
‘ఐపీఎల్లో చెత్తగా ఆడినా.. వరల్డ్కప్లో మాత్రం దుమ్ములేపుతాడు’
ఐపీఎల్-2024లో దారుణంగా విఫలమైన ఆటగాళ్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘స్టార్’ గ్లెన్ మాక్స్వెల్ ఒకడు. ఈ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఏకంగా రూ. 11 కోట్లు ఖర్చు చేసింది.మాక్సీ ఆట తీరుపై నమ్మకంతో ఈ మేరకు భారీ మొత్తానికి అతడిని రీటైన్ చేసుకుంది. కానీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ మేనేజ్మెంట్, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు.పదిహేడో ఎడిషన్ ఆరంభం నుంచే పేలవ ప్రదర్శనతో చతికిల పడ్డ మాక్స్వెల్.. మానసిక ఒత్తిడిని కారణంగా చూపి మధ్యలో కొన్ని మ్యాచ్లలో దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ కొన్ని మ్యాచ్లు ఆడగా.. మాక్సీ తిరిగి వచ్చి మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.అయితే, ఓవరాల్గా ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో ముఖ్యంగా కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.ఇదిలా ఉంటే.. మాక్సీ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీ కానున్నాడు. అయితే, ఐపీఎల్-2024లో అతడి ఫామ్లేమి ప్రభావం ఆస్ట్రేలియా జట్టుపై పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్ ఫామ్తో అసలు సంబంధమే లేదు. మాక్సీ ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. సుదీర్ఘకాలంగా మెగా టోర్నీల్లో అద్భుతంగా రాణించే ఆటగాడు.. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా ఆడటంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు.టీ20 క్రికెట్లో మిడిలార్డర్లో ఆడుతున్నపుడు కొన్నిసార్లు రిస్క్ తీసుకోకతప్పదు. ఒక్కసారి క్రీజులో కుదురుకుని మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే తనకు తిరుగే ఉండదు.గతం గురించి చర్చ అనవసరం. గతాన్ని అతడు మార్చలేడు. అయితే, భవిష్యత్తును మాత్రం అందంగా మలచుకోగల సత్తా అతడికి ఉంది’’ అని ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చెప్పుకొచ్చాడు.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్. -
చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2024
ఐపీఎల్ 2024 సీజన్ సెంచరీల విషయంలో ఆల్టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 14 సెంచరీలు నమోదయ్యాయి. గతంలో ఏ సీజన్లోనూ ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. 2023 సీజన్లో నమోదైన 12 సెంచరీల రికార్డును ఈ సీజన్ బద్దలు కొట్టింది. ఈ సీజన్లో వివిధ ఫ్రాంచైజీలకు చెందిన 13 మంది ప్లేయర్లు శతక్కొట్టారు. వీరిలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ రెండుసార్లు సెంచరీ మార్కును తాకాడు. సీజన్ తొలి సెంచరీని లక్నో ఆటగాడు మార్కస్ స్టోయినిస్ (63 బంతుల్లో 124*) నమోదు చేయగా.. విరాట్ కోహ్లి (72 బంతుల్లో 113*), సునీల్ నరైన్ (56 బంతుల్లో 109), రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108*), జానీ బెయిర్స్టో (48 బంతుల్లో 108*), జోస్ బట్లర్ (60 బంతుల్లో 107*), రోహిత్ శర్మ (63 బంతుల్లో 105*), యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 104*), శుభ్మన్ గిల్ (55 బంతుల్లో 104), సాయి సుదర్శన్ (51 బంతుల్లో 103), సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102*), ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102), జోస్ బట్లర్ (58 బంతుల్లో 100*), విల్ జాక్స్ (41 బంతుల్లో 100*) వరుసగా సెంచరీలు చేశారు. ఈ సీజన్ వేగవంతమైన సెంచరీ రికార్డు ట్రవిస్ హెడ్, విల్ జాక్స్ పేరిట సంయుక్తంగా నమోదై ఉంది. హెడ్ ఆర్సీబీపై.. జాక్స్ గుజరాత్పై 41 బంతుల్లో శతక్కొట్టారు.సీజన్ల వారీగా సెంచరీలు..2024- 14 సెంచరీలు2023- 12 సెంచరీలు2022- 8 సెంచరీలు2021- 4 సెంచరీలు2020- 5 సెంచరీలు2019- 6 సెంచరీలు2018- 5 సెంచరీలు2017- 5 సెంచరీలు2016- 7 సెంచరీలు2015- 4 సెంచరీలు2014- 3 సెంచరీలు2013- 4 సెంచరీలు2012- 6 సెంచరీలు2011- 6 సెంచరీలు2010- 4 సెంచరీలు2009- 2 సెంచరీలు2008- 6 సెంచరీలుఓవరాల్గా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 101 సెంచరీలు నమోదయ్యాయి. -
ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
ఐపీఎల్-2024లో కోల్కతా నైట్రైడర్స్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. కేకేఆర్ మూడో సారి ఛాంపియన్స్గా నిలవడంలో వెంకటేష్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. కీలకమైన క్వాలిఫయర్-1, ఫైనల్లోనూ అయ్యర్ అదరగొట్టాడు. క్వాలిఫయర్-1లో 52 పరుగులు చేసిన అయ్యర్.. ఫైనల్లో 52 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఓవరాల్గా 13 ఇన్నింగ్స్లో వెంకటేష్ అయ్యర్.. 46.25 సగటుతో 370 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వెంకటేష్ అయ్యర్పై భారత మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గత సీజన్తో పోలిస్తే అయ్యర్ తన బ్యాటింగ్ టెక్నిక్ను మెరుగుపరుచుకున్నాడని సునీల్ గవాస్కర్ కొనియాడాడు. ఈ ఏడాది సీజన్లో వెంకటేష్ అయ్యర్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు."గత సీజన్తో పోలిస్తే అతడి బ్యాటింగ్ స్టైల్లో మార్పు కన్పించింది. అతడు ఆలోచించి సరైన టెక్నిక్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయ్యర్ బౌలింగ్ కూడా చేయడం మొదలు పెడితే, మరోసారి భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అతడొక మంచి ఫీల్డర్ కూడా. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు ఇటువంటి లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అవసరం. అతడికి బౌలింగ్ చేసే కూడా సత్తా ఉంది. కాబట్టి అతడు కొంచెం కష్టపడితే మళ్లీ భారత జెర్సీ ధరించవచ్చు. భారత తరపున అరంగేట్రం చేసిన తర్వాత అయ్యర్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కన్పించింది. అందుకే జట్టులో అతడి స్ధానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్(2023)లో కూడా పెద్దగా రాణించలేకపోయాడు. ముంబై ఇండియన్స్పై సెంచరీ చేసినప్పటికి.. మిగితా మ్యాచ్ల్లో నిరాశపరిచాడు. అతడు క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ షాట్లకు ప్రయత్నించి తన వికెట్ను సమర్పించుకునేవాడు.కానీ ఇప్పుడు అతడి మైండ్ సెట్ మారింది అంటూ" స్టార్ స్పోర్ట్స్ షోలో సన్నీ పేర్కొన్నాడు. కాగా 2022లో భారత జట్టు తరపున అరంగేట్రం చేసిన అయ్యర్.. తనకు ఇచ్చి అవకాశాలను సద్వినియోగపరుచుకోలేకపోయాడు. వరుసగా విఫలమకావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. -
ఆరెంజ్ క్యాప్ తో ఐపీఎల్ ట్రోఫీని గెలవలేరు.. కోహ్లిపై రాయుడు ఫైర్!?
ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా కోల్కతా నైట్రైడర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసి కేకేఆర్ ముచ్చటగా మూడో సారి టైటిల్ను ఎగరేసుకుపోయింది. అయితే కేకేఆర్ విజయం అనంతరం మాట్లాడిన టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు.. సంబంధం లేకుండా ఆర్సీబీ ప్రస్తావన తీసుకువచ్చాడు. అంతేకాకుండా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని రాయుడు మరోసారి టార్గెట్ చేశాడు. ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేమని, సమష్టి ప్రదర్శనలే ఛాంపియన్గా నిలబెడుతాయని పరోక్షంగా కోహ్లిపై రాయుడు విమర్శలు గుప్పించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్లో నిష్క్రమించినప్పటకి.. ఆ జట్టు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా విరాట్ నిలిచాడు.ఛాంపియన్స్గా నిలిచిన కేకేఆర్కు కంగ్రాట్స్. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్ వంటి దిగ్గజ ఆటగాళ్లకు ఆ జట్టు అండగా నిలిచింది. ఈ దిగ్గజాలు జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించేలా సపోర్ట్ చేసింది.ఐపీఎల్లో ఓ జట్టు గెలుపొందాలంటే సమిష్టి కృషి అవసరం. అంతే తప్ప ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేం. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు 300 లేదా 400 పరుగులు చేస్తేనే జట్టు విజయం సాధ్యమవుతోందని"జియో సినిమా షోలో రాయుడు పేర్కొన్నాడు. కాగా విరాట్పై రాయుడు విమర్శల గుప్పించం ఇదేమి తొలిసారి కాదు. ఎలిమేనిటర్లో ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత కూడా విరాట్ను పరోక్షంగా ఉద్దేశించి రాయుడు ఓ పోస్ట్ చేశాడు. జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం టీమ్కు మంచిది కాదుంటా రాయుడు ఎక్స్లో రాసుకొచ్చాడు. -
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్గా
ఐపీఎల్-2024 సీజన్కు ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్తో ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ ముగిసింది. ఈ ఏడాది సీజన్ విజేతగా కోల్కతా నైట్రైడర్స్ నిలిచింది. ఇక ఇది ఇలా ఉండగా ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా టీమిండియా స్టార్, ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి నిలవగా.. పర్పుల్ క్యాప్ హోల్డర్గా పంజాబ్ కింగ్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన హర్షల్.. 24 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో హర్షల్ పటేల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు పర్పుల్ క్యాప్ను అవార్డును సొంతం చేసుకున్న మూడో క్రికెటర్గా హర్షల్ పటేల్ నిలిచాడు. ఈ జాబితాలో హర్షల్ పటేల్ భువనేశ్వర్ కుమార్, డ్వేన్ బ్రావో ఉన్నారు. భువనేశ్వర్ (2016, 2017), బ్రావో (2013, 2015) సీజన్లలో సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఈ అవార్డును గెలుచుకున్నారు. హర్షల్ పటేల్ అంతకుముందు 2021 సీజన్లో ఆర్సీబీ తరపున పర్పుల్ క్యాప్ను దక్కించుకున్నాడు.అదే విధంగా మరో రికార్డును కూడా పటేల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు వేర్వేరు జట్లు తరపున పర్పుల్ క్యాప్ గెలిచిన తొలి ఆటగాడిగా హర్షల్ నిలిచాడు. -
IPL 2024: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. చాంపియన్గా కేకేఆర్
-
మమ్మల్ని గర్వపడేలా చేశారు.. అందరికి ధన్యవాదాలు: కావ్య మారన్
ఐపీఎల్-2024 సీజన్ రన్నరప్గా సన్రైజర్స్ హైదరాబాద్ నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ కీలకమైన ఫైనల్లో మాత్రం చేతులేత్తేసింది. చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. మరోవైపు కేకేఆర్ ముచ్చటగా మూడో సారి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఎస్ఆర్హెచ్ ఓటమి అనంతరం ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ భావోద్వేగానికి లోనయ్యారు. కావ్య స్టాండ్స్లో తమ ఆటగాళ్ల పోరాటాన్ని అభినందిస్తూ కన్నీటి పర్యంతమైంది.ఆటగాళ్లను ఓదార్చిన కావ్య..అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కావ్య అంతటి బాధలోనూ సన్రైజర్స్ డ్రెస్సింగ్ రూమ్ను సందర్శించింది. తమ జట్టు ఆటగాళ్లకు కావ్య ధైర్యం చెప్పి ఓదార్చింది. "మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీ ఆటతో టీ20 క్రికెట్కు కొత్త ఆర్ధం చెప్పారు. అందరూ మన గురించి మాట్లాడేలా చేశారు. ఈ రోజు మనం ఓడిపోవాలని రాసి పెట్టింది. కాబట్టి మనం ఓడిపోయాం. కానీ మన బాయ్స్ అంతా అద్బుతంగా ఆడారు.బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో బాగా రాణించారు. అందరికి ధన్యవాదాలు. అదే విధంగా మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు స్టేడియం వచ్చిన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ డ్రెస్సింగ్ రూమ్లో ఇచ్చిన స్పీచ్లో కావ్య పేర్కొంది. -
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఐపీఎల్ వేలం మొదలు... స్టేడియంలో తన జట్టును ఉత్సాహపరచడం.. గెలిచినపుడు చిన్న పిల్లలా సంబరాలు చేసుకోవడం.. ఓడినపుడు అంతే బాధగా మనసు చిన్నబుచ్చుకోవడం..అంతలోనే ఆటలో ఇవన్నీ సహజమే కదా అన్నట్లుగా ప్రత్యర్థిని అభినందిస్తూ చప్పట్లు కొట్టడం.. ఇలా ప్రతీ విషయంలోనూ ఆమె ఓ ప్రత్యేక ఆకర్షణ. క్యాష్ రిచ్ లీగ్ను ఫాలో అయ్యే వాళ్లలో చాలా మందికి ఆమె కంటే క్రష్.ఆమె మ్యాచ్ వీక్షించడానికి వచ్చిందంటే చాలు.. ఆద్యంతం తను పలికించే హావభావాలు.. స్టాండ్స్లో చుట్టుపక్కల వారితో తను మెదిలే విధానం.. ఆనాటి హైలైట్స్లో ముఖ్యమైనవిగా నిలుస్తాయనడం అతిశయోక్తి కాదు.తను నవ్వితే అభిమానులూ నవ్వుతారు. తను భావోద్వేగంతో కంటతడి పెడితే తామూ కన్నీటి పర్యంతమవుతారు. ఐపీఎల్-2024 ఫైనల్ సందర్భంగా ఇలాంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఆమె పేరేంటో అర్థమైపోయిందనుకుంటా.. యెస్.. కావ్యా మారన్. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓనర్.వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలుదేశంలోనే అతి పెద్ద మీడియా గ్రూపులో ఒకటైన సన్ టీవీ గ్రూప్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్- కావేరీ మారన్ దంపతుల ఏకైక కుమార్తె. వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు.తమిళనాడులోని చెన్నైలో ఆగష్టు 6, 1992లో జన్మించారు కావ్య. అక్కడే స్టెల్లా మేరీ కాలేజీలో బీకామ్ చదివిన ఆమె.. 2016లో ఇంగ్లండ్లోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.తల్లిదండ్రులు ఇద్దరూ వ్యాపారవేత్తలే కావడంతో కావ్య కూడా అదే బాటలో పయనిస్తున్నారు. 2018లో సన్రైజర్స్ సీఈఓగా ఎంట్రీ ఇచ్చిన కావ్య.. అంతకంటే ముందే సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్ఎం రేడియోలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.తీవ్ర స్థాయిలో విమర్శలుఇక ఐపీఎల్లో వేలం మొదలు కెప్టెన్ నియామకం వరకు అన్ని విషయాల్లోనూ భాగమయ్యే కావ్యా మారన్.. ఈ ఏడాది అనుకున్న ఫలితాలు రాబట్టడంలో సఫలమయ్యారు. కానీ.. సీజన్ ఆరంభంలో మాత్రం తీవ్ర విమర్శల పాలయ్యారు కావ్య.ఆస్ట్రేలియా కెప్టెన్, వన్డే వరల్డ్కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా.. రూ. 20.50 కోట్లు ఖర్చు చేయడం.. అతడిని కెప్టెన్గా నియమించడం, బ్రియన్ లారా స్థానంలో డానియల్ వెటోరీని కోచ్గా తీసుకురావడం వంటి నిర్ణయాలను మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు.ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి వాళ్లు జట్టులో ఉండటంతో తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందో అంటూ ఎద్దేవా చేశారు. పేపర్ మీద చూడటానికి జట్టు బాగానే కనిపిస్తున్నా.. మైదానంలో తేలిపోవడం ఖాయమంటూ విమర్శించారు.సంచలన ప్రదర్శనఅయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సన్రైజర్స్ ఈసారి అద్భుతాలు చేసింది. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన హైదరాబాద్ ఈసారి సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరింది.విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా నిలిచి లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులు సృష్టించింది. అయితే, తుదిమెట్టుపై కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలై రన్నరప్తో సరిపెట్టుకుంది.చెన్నై వేదికగా సాగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం.. కేకేఆర్ ఏకపక్షంగా గెలవడంతో కావ్యా మారన్ కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే కేకేఆర్ను అభినందించారు కూడా!ఈ నేపథ్యంలో కావ్య మంచి మనసును కొనియాడుతూ ఆమె అభిమానులు సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో సన్ నెట్వర్క్ మాజీ ఉద్యోగిగా చెప్పుకొన్న ఓ నెటిజన్ పెట్టిన పోస్టు వైరల్గా మారింది.ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!‘‘తన తలిదండ్రుల కంటే కూడా కావ్య ఎంతో గొప్ప వ్యక్తి. మంచి మనసున్న అమ్మాయి. కానీ ఎందుకో తనకు ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండరు. సన్ మ్యూజిక్, ఎస్ఆర్హెచ్ మినహా ఇతర కంపెనీ బాధ్యతలేవీ తల్లిదండ్రులు ఆమెకు అప్పగించరు.ఇది కూడా ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!ఐపీఎల్ వేలం సమయంలో కావ్య గురించి చాలా మంది జోకులు వేశారు. కానీ క్రికెట్ పట్ల తనకున్న ప్యాషన్ వేరు. వేలం నుంచి ఫైనల్ దాకా ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేయగలిగింది. తను కోరుకున్న ఫలితాలు రాబట్టింది.కావ్య మిలియనీర్ అయినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్(సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్ను బహిరంగంగానే తిట్టడం)లా కాదు. ఫైనల్లో తమ జట్టు ఓటమిపాలైనా కన్నీళ్లు దిగమింగుకుంటూ నవ్వడానికి ప్రయత్నించిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి’’ అని సదరు నెటిజన్ పేర్కొన్నారు.ఒంటరితనమా? ఎందుకు?తన పోస్టులో సదరు నెటిజన్ కావ్య ఒంటరితనం నుంచి విముక్తి పొందడం కోసమే ఈ వ్యాపకాలు అంటూ పేర్కొనడం చర్చనీయాంశమైంది. తోబుట్టువులు, స్నేహితులు(ఎక్కువగా) లేరు కాబట్టి ఇలా అన్నారా?లేదంటే 32 ఏళ్ల కావ్య వ్యక్తిగత జీవితంలో ఏమైనా దెబ్బతిన్నారా? అనే చర్చ జరుగుతోంది. కాగా కావ్య ప్రస్తుతం సింగిల్గానే ఉన్నారు. గతంలో.. తమిళ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, టీమిండియా స్టార్ రిషభ్ పంత్తో కావ్య పేరును ముడిపెట్టే ప్రయత్నం చేశారు గాసిప్రాయుళ్లు.అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. మరికొన్ని సైట్లు మాత్రం కావ్య ఓ బిజినెస్మేన్తో గతంలో ప్రేమలో ఉన్నారని కథనాలు ఇచ్చాయి. కానీ.. అవి కూడా రూమర్లే! ప్రస్తుతానికి కావ్య తన కెరీర్, తన తండ్రి వ్యాపారాలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న విషయాల మీద మాత్రమే దృష్టి సారించారని సమాచారం.సౌతాఫ్రికాలో దుమ్ములేపుతూఅందుకు తగ్గట్లుగానే ఆమె అడుగులు సాగుతున్నాయి. కేవలం ఐపీఎల్లోనే కాకుండా సౌతాఫ్రికా టీ20 లీగ్లోనూ కావ్య కుటుంబానికి ఫ్రాంఛైజీ ఉంది. సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ పేరిట నెలకొల్పిన ఈ జట్టుకు ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్. 2023 నాటి అరంగేట్ర సీజన్లో, ఈ ఏడాది కూడా సన్రైజర్స్కు అతడు టైటిల్ అందించాడు. సౌతాఫ్రికాలో వరుసగా రెండుసార్లు ట్రోఫీ సాధించిన సన్రైజర్స్.. ఐపీఎల్-2024లో ఆఖరి పోరులో ఓడి టైటిల్ చేజార్చుకుంది. -
భార్యతో విడాకులు?.. విదేశాల్లో హార్దిక్ పాండ్యా ఒక్కడే!
టీ20 వరల్డ్కప్-2024 కోసం టీమిండియా తొలి బ్యాచ్ అమెరికా గడ్డపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శుబ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ తదితరులు మొదటి విడతగా ఆదివారం అమెరికాకు చేరుకున్నారు. ఇక రెండో బ్యాచ్లో భారత స్టార్ విరాట్ కోహ్లి, రింకూ సింగ్, సంజూ శాంసన్, చాహల్ మంగళవారం అమెరికా వెళ్లే విమానం ఎక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం రెండో బ్యాచ్తో కూడా అమెరికాకు వెళ్లేందుకు సిద్దంగా లేనిట్లు సమాచారం. పాండ్యా జట్టుతో కలిసేందుకు మరి కొంత సమయం పట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా హార్దిక్ పాండ్యా-తన భార్య నటాసా స్టాంకోవిక్ విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై హార్దిక్ గానీ, నటాసా గానీ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఐపీఎల్-2024లో ఆటగాడిగా, కెప్టెన్గా ఘోర పరాభావం పొందిన పాండ్యా.. ప్రస్తుతం ఒంటరిగా విదేశాలకు వెకేషన్కు వెళ్లినట్లు ప్రముఖ క్రీడా వెబ్సైట్ క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. హార్దిక్ ఎక్కడ ఉన్నాడో తెలియదు గానీ ఫారెన్లో సేదతీరుతున్నట్లు క్రిక్బజ్ తెలిపింది. హార్దిక్ కూడా సైతం తన స్విమ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఎక్కడ ఉన్నాన్నది హార్దిక్ చెప్పలేదు. అయితూ హార్దిక్ షేర్ చేసిన ఫోటోలలో తనక్కొడే ఉండడంతో విడాకుల రూమర్స్కు మరింత ఊతమిచ్చినట్లైంది. పాండ్యా ఫారెన్లో ఉన్నప్పటికి నేరుగా త్వరలోనే న్యూయర్క్లో ఉన్న భారత జట్టుతో కలవనున్నట్లు మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా టీ20 వరల్డ్కప్-2024 జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ప్రారంభం కానుంది. భారత తమ తొలి మ్యాచ్లో జూన్ 5న ఐర్లాండ్తో తలపడనుంది. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా కోల్కతా నైట్రైడర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్.. మూడో సారి ట్రోఫీని ముద్దాడింది. కేకేఆర్ మూడో సారి టైటిల్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. అయ్యర్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదన్పంచటప్పటకి.. సారథిగా మాత్రం జట్టును అద్భుతంగా నడిపించాడు. అయ్యర్ కెప్టెన్సీ 100కు 100 మార్కులు పడాల్సిందే. తన వ్యూహాలతో ప్రత్యర్ధి జట్లను అయ్యర్ చిత్తు చేశాడు. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రం ఓడిపోయిందంటే అయ్యర్ కెప్టెన్సీ ఏ విధంగా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అయ్యర్కు ఏది కలిసిరాలేదు. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించడంతో జట్టులో చోటుతో పాటు వార్షిక కాంట్రాక్ట్ ను కూడా కోల్పోయాడు. అయితే పడిలేచిన కేరటంలా తన కెప్టెన్సీ మార్క్ను చూపించాడు. జట్టును విజయ పథంలో నడిపిస్తూ ఏకంగా టైటిల్ను అందించాడు. ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ 14 ఇన్నింగ్స్ల్లో 351 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అయ్యర్పై భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రేయస్ను కెప్టెన్గా చాలా మంది తక్కువగా అంచనా వేశారని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. "శ్రేయస్ అయ్యర్కు అద్బుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టు కెప్టెన్ అవుతాడు. నా వరకు అయితే ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో శుబ్మన్ గిల్ కంటే అయ్యరే ముందుంటాడు. అతడు జట్టును నడిపించే విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు ఈ ఏడాది సీజన్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు. అయ్యర్.. గౌతమ్ గంభీర్, చంద్రకాంత్ పండిట్, అభిషేక్ నాయర్ దిగ్గజాలతో కలిసి పనిచేశాడు. కాబట్టి ఆ అనుభవం శ్రేయస్కు కచ్చితంగా కలిసిస్తోంది. ఈ ఏడాది సీజన్కు ముందు అయ్యర్ పరిస్ధితి అంతగా బాగోలేదు. ఫిట్నెస్ లోపించడంతో జట్టులో చోటు కూడా కోల్పోయాడు. వెన్ను నొప్పితో బాధపడుతూనే అయ్యర్ ఆడుతున్నాడు. ముఖ్యంగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం, వరల్డ్కప్ చోటు దక్కకపోవడం అయ్యర్ను మానసికంగా దెబ్బతీశాయి. అయినప్పటకి అయ్యర్ తన బాధను దిగమింగుకుని కేకేఆర్ను ఛాంపియన్స్గా నిలిపాడని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉతప్ప పేర్కొన్నాడు. -
SRH: ‘హృదయం ముక్కలైంది.. బాధ పడొద్దు మామయ్యా’! ఫొటో వైరల్
ఐపీఎల్-2024 సీజన్ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్ములేపిన సన్రైజర్స్ హైదరాబాద్.. అసలు సమయం వచ్చేసరికి చేతులెత్తేసింది. ఏదైతే తమ బలం అనుకుందో అదే బలహీనతగా మారిన వేళ ప్రత్యర్థి ముందు తలవంచింది.ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్లో పెట్టనికోటగా ఉన్న ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అనూహ్య రీతిలో పూర్తిగా విఫలం కావడంతో 113 పరుగులకే కుప్పకూలింది. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ల దెబ్బకు అభిషేక్ శర్మ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులకే నిష్క్రమించగా.. పరుగుల విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన హెడ్ మరీ ఘోరంగా డకౌట్ అయ్యాడు.వీరితో పాటు వన్డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(13 బంతుల్లో 9) కూడా త్వరగానే పెవిలియన్ చేరగా.. మిగతా వాళ్లలో ఐడెన్ మార్క్రమ్(20), హెన్రిచ్ క్లాసెన్(17 బంతుల్లో 16), కెప్టెన్ ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 24) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు.ఈ క్రమంలో ఐపీఎల్ ఫైనల్లోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకుంది సన్రైజర్స్. ఈ సీజన్లో ఏకంగా 287 పరుగులతో లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ప్రశంసలు అందుకున్న కమిన్స్ బృందం.. ఫైనల్లో ఇలా తేలిపోయింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ హృదయం ముక్కలైంది.ఇక ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్ సన్రైజర్స్ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి చాంపియన్గా నిలిచింది. ఏకపక్ష విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో కేకేఆర్ శిబిరంలో సంతోషాలు వెల్లివిరియగా.. సన్రైజర్స్ క్యాంపు నిరాశలో కూరుకుపోయింది. జట్టు యజమాని కావ్యా మారన్ ఓటమిని జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకోగా.. ఆటగాళ్లు కూడా ఇంచుమించు ఇదే స్థితికి చేరుకున్నారు.ఇక ఈ సీజన్లోనే అత్యధిక సిక్సర్లు(42) బాదిన సన్రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ సమయంలో అభిషేక్ చిన్నారి మేనకోడలు అమైరా చేసిన పని నెటిజన్ల మనసు దోచుకుంది.‘‘ఏం కాదులే మామయ్య’’ అన్నట్లుగా అభిషేక్ను హత్తుకున్న అమైరా అతడిని ఓదార్చింది. తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అభిషేక్ రెండో అక్క కోమల్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా పంజాబ్కు చెందిన అభిషేక్ శర్మ తండ్రి రాజ్కుమార్ శర్మ కూడా క్రికెటర్. దేశవాళీ క్రికెట్ ఆడిన ఆయన తన కుమారుడికి మొదటి కోచ్. ఇక అభిషేక్ తల్లి పేరు మంజు శర్మ. అభిషేక్కు ఇద్దరు అక్కలు సానియా, కోమల్ ఉన్నారు. పెద్దక్క సానియా శర్మ కూతురే ఈ అమైరా!Tough day, Never give up 😔Win or lose part of the game!Chin up guys, you fought hard. ♥️ #KKRvsSRHFinal #IPLFinal #IPL2024 pic.twitter.com/ar96np1klB— Dr. Komal Sharma (@KomalSharma_20) May 26, 2024Such a sweet moment heartwarming hug Amayra encouraging his uncle. 🫂So proud of you bhaiya ❤️🥹#KKRvsSRH #IPL2024 pic.twitter.com/DlE62WtaZu— Dr. Komal Sharma (@KomalSharma_20) May 26, 2024 -
IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ఛాంపియన్గా అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడో ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ (3-0-14-2), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరెంజ్ ఆర్మీని చెడుగుడు ఆడుకున్నారు. వీరికి రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1), రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా తోడవ్వడంతో కేకేఆర్ సునాయాస విజయం సాధించింది.క్వాలిఫయర్ మ్యాచ్లోనూ వీరిద్దరే.. నిన్నటి ఫైనల్లో సన్రైజర్స్ను డామేజ్ చేసిన స్టార్క్, వెంకటేశ్ అయ్యర్లు ఇదే సన్రైజర్స్ను క్వాలిఫయర్-1లోనూ ముప్పుతిప్పలు పెట్టారు. నాటి మ్యాచ్లోనూ స్టార్క్ అద్భుతమైన గణాంకాలు (4-0-34-3) నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపిక కాగా.. వెంకటేశ్ అయ్యర్ సైతం ఫైనల్లోలానే మెరుపు ఇన్నింగ్స్తో (28 బంతుల్లో 51 నాటౌట్) విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు పోటీపడి మరీ సన్రైజర్స్పై దండయాత్ర చేసి వారికి టైటిల్ దక్కకుండా చేశారు.సీజన్ ఆరంభ మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్టార్క్ కీలకమైన ప్లే ఆఫ్స్లో ఫామ్లోని వచ్చి కేకేఆర్ పాలిట గెలుపు గుర్రంగా మారగా.. వెంకటేశ్ అయ్యర్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఓ మోస్తరు ప్రదర్శనలతో అలరించాడు. ప్లే ఆఫ్స్లో తిరుగులేని అయ్యర్.. నిన్నటి ఫైనల్తో వెంకటేశ్ అయ్యర్ ప్లే ఆఫ్స్ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. అయ్యర్కు ప్లే ఆఫ్స్లో ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ (55, 50, 51*, 52*). ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు దక్కుతుంది. రైనా ప్లే ఆఫ్స్లో ఏడు 50కి పైగా స్కోర్లు సాధించాడు.ఫైనల్స్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో కమిన్స్ (24) టాప్ స్కోరర్గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. -
ఐపీఎల్ 2024 అవార్డు విన్నర్లు వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ నిన్నటితో (మే 26) ముగిసింది. ఫైనల్లో కేకేఆర్ సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది. ఐపీఎల్లో కేకేఆర్కు ఇది మూడో టైటిల్. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్కు పదేళ్ల నిరీక్షణ అనంతరం మరో టైటిల్ను అందించాడు.కేకేఆర్ పేసర్ స్టార్క్ ఫైనల్లో అద్భుతమైన గణంకాలతో సత్తా చాటి కేకేఆర్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సునీల్ నరైన్ మూడోసారి మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా విరాట్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా హర్షల్ ఆరెంజ్, పర్పుల్ క్యాప్లను అందుకున్నారు. మరికొందరు ఆటగాళ్లు వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నారు. ఐపీఎల్ 2024 ఛాంపియన్స్- కేకేఆర్రన్నరప్- సన్రైజర్స్ హైదరాబాద్ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు)- విరాట్ కోహ్లి (ఆర్సీబీ, 15 మ్యాచ్ల్లో 741 పరుగులు)పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు)- హర్షల్ పటేల్ (పంజాబ్, 14 మ్యాచ్ల్లో 24 వికెట్లు)మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్- సునీల్ నరైన్ (కేకేఆర్, 14 మ్యాచ్ల్లో 488 పరుగులు, 17 వికెట్లు)ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్- నితీశ్ కుమార్ రెడ్డి (సన్రైజర్స్ హైదరాబాద్)ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- మిచెల్ స్టార్క్ (కేకేఆర్, 3-0-14-2)ఎలెక్ట్రిక్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్- జేక్ ఫ్రేసర్ మెక్గుర్క్ (ఢిల్లీ)గేమ్ ఛేంజర్ ఆఫ్ ద సీజన్- సునీల్ నరైన్ (కేకేఆర్)పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్- రమణ్దీప్ సింగ్ (కేకేఆర్)ఫెయిర్ ప్లే అవార్డు- సన్రైజర్స్ హైదరాబాద్విన్నర్ ప్రైజ్మనీ- రూ. 20 కోట్లు (కేకేఆర్)రన్నరప్ ప్రైజ్మనీ- రూ. 12.5 కోట్లు (సన్రైజర్స్) -
గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
కోల్కతా నైట్ రైడర్స్ పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ చాంపియన్గా అవతరించింది. క్యాష్ రిచ్ లీగ్లో మూడోసారి టైటిల్ గెలిచి ట్రోఫీని ముద్దాడింది. పదిహేడో ఎడిషన్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఫైనల్లోనూ సత్తా చాటింది.చెన్నై వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఐపీఎల్-2024 విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ క్యాంపు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లతో సహా ఫ్రాంఛైజీ యజమానులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా కుటుంబాలు ఈ సంతోషంలో పాలుపంచుకున్నాయి.విజయం పరిపూర్ణం.. వారే కారణంఇదిలా ఉంటే.. గతేడాది పేలవంగా ఆడి ఏడో స్థానానికి పరిమితమైన కేకేఆర్.. ఈసారి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. సమిష్టి కృషితో టైటిల్ సాధించింది. లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్లకు గానూ తొమ్మిది విజయాలు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది.క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ను ఓడించి ఫైనల్ చేరిన కేకేఆర్.. ఆఖరి మెట్టుపై అదే ప్రత్యర్థిని మరోసారి బోల్తా కొట్టించి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. అయితే, కేకేఆర్ సక్సెస్ వెనుక మెంటార్ గౌతం గంభీర్దే కీలక పాత్ర అని ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.గంభీర్ను మెంటార్గా రప్పించడం ద్వారా ఆటగాళ్ల ఆలోచనా తీరులో మార్పు వచ్చిందని.. గెలుపునకు బాట వేసిందని కొనియాడుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే. అయితే, గంభీర్ ఒక్కడే కాదు కేకేఆర్ విజయానికి ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్తో పాటు అసిస్టెంట్ కోచ్లు అభిషేక్ నాయర్, భరత్ అరుణ్లు కూడా ప్రధాన కారణం.ఆరు రంజీ ట్రోఫీలు.. ఇప్పుడిలా మరో టైటిల్దేశవాళీ క్రికెట్ జట్లకు కోచ్గా వ్యవహరిస్తున్న చంద్రకాంత్ పండిట్.. శిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారని పేరు. అనుకున్న ఫలితాలను రాబట్టేందుకు ఆటగాళ్లతో ఎంత హార్డ్వర్క్ చేయించడానికైనా ఆయన వెనుకాడరని ప్రతీతి.ఇక గంభీర్ రూపంలో మరో దిగ్గజం చంద్రకాంత్ పండిట్కు తోడు కావడంతో ఆయన పని మరింత సులువైంది. మూడు వేర్వేరు జట్లకు కోచ్గా వ్యహరించి.. ఆరు రంజీ ట్రోఫీలు గెలిచిన శిక్షకుడిగా పేరొందిన చంద్రకాంత్ ఖాతాలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ కూడా చేరింది.వాళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన అభిషేక్ నాయర్కేకేఆర్ గెలుపులో టీమిండియా మాజీ బ్యాటింగ్ ఆల్రౌండర్ అభిషేక్ నాయర్ది కూడా కీలక పాత్ర. ముఖ్యంగా ఇండియన్ కోర్కు సంబంధించి అతడే పూర్తి బాధ్యత తీసుకున్నట్లు సమాచారం.అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా అభిషేక్ తీర్చిదిద్దాడు. ఫైనల్ తర్వాత కేకేఆర్ స్టార్లు లీడింగ్ వికెట్ టేకర్ వరుణ్ చక్రవర్తి, ఫైనల్ టాప్ స్కోరర్ వెంకటేశ్ అయ్యర్ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం.‘‘అభిషేక్ నాయర్కు కచ్చితంగా క్రెడిట్ దక్కాల్సిందే. కొంతమంది పేర్లు పెద్దగా వెలుగులోకి రావు. కానీ.. నా వరకు అభిషేక్ విషయంలో అలా జరగకూడదనే కోరుకుంటా. ఈ ప్రపంచంలోని అన్ని రకాల ప్రశంసలకు అతడు అర్హుడు’’ అని వెంకటేశ్ అయ్యర్ అభిషేక్ నాయర్పై అభిమానం చాటుకున్నాడు.ఆ శక్తి మరెవరో కాదుఇక కేకేఆర్ విజయాల్లో బౌలింగ్ విభాగానిదే ప్రధాన పాత్ర అనడంలో సందేహం లేదు. ఫైనల్లో సన్రైజర్స్ను 113 పరుగులకే ఆలౌట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించారు కేకేఆర్ బౌలర్లు. స్పిన్నర్లు, పేసర్లు కలిసి ఈ సీజన్ ఆద్యంతం అద్భుతంగా రాణించారు. వారి వెనుక ఉన్న శక్తి పేరు భరత్ అరుణ్.𝙏𝙝𝙚 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜 𝙤𝙛 𝙀𝙪𝙥𝙝𝙤𝙧𝙞𝙖 🏆Celebrating @KKRiders' triumph in 𝙎𝙍𝙆 style ⭐️😎#TATAIPL | #KKRvSRH | #Final | #TheFinalCall | @iamsrk pic.twitter.com/OmvXa9GtJx— IndianPremierLeague (@IPL) May 27, 2024చదవండి: BCCI- IPL 2024: వారికి భారీ మొత్తం.. బీసీసీఐ కీలక ప్రకటన -
డబ్ల్యూపీఎల్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ అచ్చుగుద్దినట్లు ఒకేలా.. ఇలా ఎలా..!
క్రికెట్ గణాంకాలకు సంబంధించిన ఆట కాబట్టి అప్పుడప్పుడు ఒకే రకమైన గణాంకాలను చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే గణాంకాలు మాత్రం క్రికెట్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. ఈ గణాంకాల ముందు యాదృచ్చికం అనే మాట చిన్నబోతుంది. అంతలా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఈ గణాంకాలు.వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జరిగిన మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్).. తాజాగా నిన్న ముగిసిన ఐపీఎల్కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చి 17న జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆర్సీబీ సైతం తడబడినా మరో మూడు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరగలిగింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా భారతీయ ప్లేయరైన (టీ20 ఫార్మాట్లో భారత కెప్టెన్) స్మృతి మంధన నేతృత్వంలో ఆర్సీబీ తొలి సారి టైటిల్ కైవసం చేసుకుంది.ఐపీఎల్ 2024 ఫైనల్లోనూ అలాగే..నిన్న జరిగిన పురుషుల ఐపీఎల్ ఫైనల్లోనూ కొన్ని విషయాల్లో అచ్చుగుద్దినట్లు ఇలానే జరగడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) పాట్ కమిన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మహిళల ఐపీఎల్లోనూ ఇలాగే ఆసీస్ కెప్టెన్ (మెగ్ లాన్నింగ్) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ ఫైనల్లో కమిన్స్ ప్రత్యర్ది భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్డెన్ (ఢిల్లీ కెప్టెన్) ప్రత్యర్ది భారత ప్లేయరే (మంధన).2024 WPL Final:- Aussie Captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian captain's team won by 8 wickets.IPL 2024 Final:- Aussie captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian… pic.twitter.com/jH07ZzmAEO— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024ఐపీఎల్ 2024 ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ టాస్ గెలిచిన ఢిల్లీ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్లో భారత ప్లేయర్ అయిన శ్రేయస్.. ఆసీస్ కెప్టెన్ నేతృత్వంలోని సన్రైజర్స్ను 8 వికెట్ల తేడాతో ఓడగొట్టగా.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్టెన్ లాన్నింగ్ నేతృత్వంలోని ఢిల్లీని భారత ప్లేయర్ సారథ్యంలోని ఆర్సీబీ అదే 8 వికెట్ల తేడాతోనే ఓడగొట్టింది. ఇన్ని విషయాల్లో ఈ ఏడాది డబ్ల్యూపీఎల్, ఐపీఎల్కు పోలికలు ఉండటంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
IPL 2024: వారికి భారీ నజరానా.. బీసీసీఐ కీలక ప్రకటన
పొట్టి క్రికెట్ ప్రేమికులకు రెండున్నర నెలలుగా వినోదం అందించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్కు ఆదివారంతో తెరపడింది. చెన్నై వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.ప్యాట్ కమిన్స్ బృందాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి పదేళ్ల తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్ చాంపియన్గా నిలిచిన కేకేఆర్కు రూ. 20 కోట్ల ప్రైజ్మనీ దక్కగా.. రన్నరప్ సన్రైజర్స్కు రూ. 12.5 కోట్లు అందాయి. ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024అన్సంగ్ హీరోలకు భారీ నజరానాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ పదిహేడో సీజన్ ఇంతగా విజయవంతం కావడం వెనుక ఉన్న ‘అన్సంగ్ హీరో’లకు భారీ మొత్తం కానుకగా ప్రకటించారు.గ్రౌండ్స్మెన్, పిచ్ క్యూరేటర్లకు రూ. 25 లక్షల చొప్పున బహుమతిగా అందించనున్నట్లు ఎక్స్ వేదికగా జై షా వెల్లడించారు. ‘‘తాజా టీ20 సీజన్ను ఇంతగా సక్సెస్ కావడానికి గ్రౌండ్ సిబ్బంది నిర్విరామంగా పనిచేయడమూ కారణమే.వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా అద్భుతమైన పిచ్లను తయారు చేయడంలో వారు సఫలమయ్యారు. అందుకే గ్రౌండ్స్మెన్, క్యూరేటర్ల శ్రమను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాం.ఈ సీజన్లో రెగ్యులర్గా ఐపీఎల్ మ్యాచ్లు సాగిన 10 వేదికల సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు, అదనంగా సేవలు అందించిన మూడు వేదికల సిబ్బందికి రూ. 10 లక్షల చొప్పున అందజేస్తాం. మీ కఠిన శ్రమ, అంకితభావానికి థాంక్యూ’’ అని జై షా సోమవారం ట్వీట్ చేశారు.వేదికలు ఇవేకాగా ఐపీఎల్-2024 సీజన్లో ముంబై(ముంబై ఇండియన్స్), ఢిల్లీ(ఢిల్లీ క్యాపిటల్స్), చెన్నై(చెన్నై సూపర్ కింగ్స్), కోల్కతా(కోల్కతా నైట్ రైడర్స్), చండీఘర్(పంజాబ్ కింగ్స్), హైదరాబాద్(సన్రైజర్స్), బెంగళూరు(ఆర్సీబీ), లక్నో(లక్నో సూపర్ జెయింట్స్), అహ్మదాబాద్(గుజరాత్ టైటాన్స్), జైపూర్(రాజస్తాన్ రాయల్స్)లలో రెగ్యులర్గా మ్యాచ్లు జరగగా.. గువాహటి(రాజస్తాన్ రాయల్స్), విశాఖపట్నం(ఢిల్లీ క్యాపిటల్స్), ధర్మశాల(పంజాబ్ కింగ్స్) మైదానాల్లోనూ మ్యాచ్లు నిర్వహించారు.చదవండి: SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్: కమిన్స్The unsung heroes of our successful T20 season are the incredible ground staff who worked tirelessly to provide brilliant pitches, even in difficult weather conditions. As a token of our appreciation, the groundsmen and curators at the 10 regular IPL venues will receive INR 25…— Jay Shah (@JayShah) May 27, 2024 -
KKR Wins IPL ‘హ్యాపీ నా పప్పా’: అటు పెద్దోడు, ఇటు చిన్నోడు : తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ వీడియో
ఐపీఎల్-2024 టైటిల్ను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చేజిక్కించుకుంది. 10 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెల్చుకోడంతో కేకేఆర్ కో-ఫౌండర్ షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా మైదానంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.An emotional moment between #ShahRukhKhan and #SuhanaKhan after marvelous victory of #KKRpic.twitter.com/yO6nBBgvo1— Suhana Khan (@SuhanaKhanClub) May 26, 2024ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించిన షారుఖ్ ప్యామిలీ, పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ను అందుకున్న ఆనంద క్షణాల్లో మునిగి తేలాయి. ఈ సందర్భంగా షారుఖ్ ముద్దుల తనయ సుహానా ఖాన్ పరుగున వచ్చి ‘‘మీరు సంతోషంగా ఉన్నారా’’అడిగింది. దీంతో సూపర్ స్టార్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ తండ్రీ- కూతుళ్ల ఆనంద క్షణాలు అటు ఫ్యాన్స్ను, ఇటు నెటిజనులు సంతోషంలో ముంచేశాయి.Suhana asking Shah “Are you happy” and the way AbRam and Aryan came to hug their papa @iamsrk … I can’t help my tears 😭💜pic.twitter.com/VjCxU5Nwsz— Samina ✨ (@SRKsSamina_) May 26, 2024ఆ తరువాత కాసేపటికే షారుఖ్ చిన్న కుమారుడు అబ్రామ్, తండ్రీ-కూతురు ద్వయం పరస్వరం గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతలోనే పెద్ద కుమారుడు ఆర్యన్, హగ్గింగ్ ఫెస్ట్లో చేరి పోవడం విశేషం. అంతేకాదు చివరి పరుగుతో వెంకేటేష్ అయ్యర్ విజయాన్ని అందించడంతో బాలీవుడ్ రొమాన్స్ కింగ్ తన భార్య గౌరీ నుదిటిపై ముద్దు పెట్టుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ,ఇద్దరూ ఆనంద క్షణాల్లో మునిగి తేలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్కతా ఈ టార్గెట్ను కేవలం 10.3 ఓవర్లలోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. వెంకటేష్ అయ్యర్ విన్నింగ్ షాట్తో 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్కతా నిలిచింది. దీంతో షారుఖ్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. -
పొట్టి ప్రపంచకప్పై ఐపీఎల్ ప్రభావమెంత..?
రెండు నెలలకు పైగా జరిగిన క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిన్నటితో (మే 26) ముగిసింది. ఈ సీజన్ ఫైనల్లో కేకేఆర్.. సన్రైజర్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్గా అవతరించింది. ఐపీఎల్ ముగిసిన ఐదు రోజుల్లోనే మరో మహా క్రికెట్ సంగ్రామం మొదలుకానుంది. యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ దాదాపుగా నెల రోజుల పాటు అభిమానులకు కనువిందు చేయనుంది.పొట్టి ప్రపంచకప్ ఐసీసీ ఈవెంట్ కావడంతో అభిమానుల్లో అమితాసక్తి నెలకొని ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించే టోర్నీ కావడంతో తీవ్ర భావోద్వేగాలు ఉంటాయి. ఈ సారి వరల్ఢ్కప్లో గతంలో ఎన్నడూ లేనట్లుగా 20 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్కు ఐదు జట్ల చొప్పున మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్లుగా విభజించబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. భారత్.. చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్తో కలిసి గ్రూప్-ఏలో పోటీపడనుంది. ఈ గ్రూప్లో భారత్, పాక్లతో పాటు యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా దేశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ రెండు నెలల సుదీర్ఘ కాలంపాటు సాగిన నేపథ్యంలో ఓ ఆసక్తిర ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు (దాదాపుగా) చెందిన ఆటగాళ్లు ఇన్ని రోజుల పాటు ఐపీఎల్తో బిజీగా ఉండటంతో ఈ లీగ్ ప్రభావం పొట్టి ప్రపంచకప్పై ఏమేరకు పడనుందనే ప్రశ్న తలెత్తుతుంది. ఐపీఎల్ ముగిసి వారం రోజులు కూడా గడువక ముందే పొట్టి ప్రపంచకప్ ప్రారంభంకావడం మంచిదేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఐపీఎల్ సుదీర్ఘకాలం పాటు సాగడం వల్ల ఆటగాళ్లు అలసిపోయుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ ప్రభావం ఆటగాళ్లపై నెగిటివ్గా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లలో సీరియస్నెస్ కొరవడిందని కొందరంటున్నారు. ఐపీఎల్లో ఆడి కొందరు ఆటగాళ్లు గాయాల బారిన పడిన విషయాన్ని ఇంకొందరు ప్రస్తావిస్తున్నారు. ఐపీఎల్లో లభించే డబ్బును చూసుకుని కొందరు ఆటగాళ్లు దేశీయ విధులపై ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్ ముగిసి వారం కూడా గడవక ముందే మెగా టోర్నీ నిర్వహించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.మరోవైపు ఐపీఎల్ వల్ల మంచే జరిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ వల్ల తమ దేశ ఆటగాళ్లకు మంచే జరిగిందని ఆసీస్ అభిమానులు అనుకుంటున్నారు. కిక్కిరిసిన జనాల మధ్య ఐపీఎల్ ఆడటం వల్ల తమ దేశ క్రికెటర్లకు ఒత్తిడిని ఎదుర్కోవాలో తెలిసొచ్చి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం ఏకీభవించాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా తప్పుచేసిందని అతను అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే పొట్టి ప్రపంచకప్ ఇంకాస్త ఎక్కువగా సన్నద్దమయ్యేవారని వాన్ అన్నాడు.భారత ఆటగాళ్ల విషయానికొస్తే.. ఐపీఎల్ ప్రతిభే కొలమానంగా ప్రపంచకప్ జట్టు ఎంపిక జరిగింది. ఫామ్లో ఉన్న ఆటగాళ్లకు మాత్రమే ప్రపంచకప్ బెర్త్ దక్కింది. జట్టులో స్థానం విషయంలో సెలెక్టర్లు ఎలాంటి ములాజలకు పోకుండా అర్హులైన వారినే ఎంపిక చేశారు. ప్రపంచకప్కు సంబంధించి వ్యూహాలు వేరుగా ఉన్నప్పటికీ.. ఐపీఎల్ వల్ల భారత ఆటగాళ్లకు మేలే జరిగిందని చెప్పాలి. ఈ ఐపీఎల్ సీజన్లో కీలక ఆటగాళ్లెవరు గాయాల బారిన పడలేదు. టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యులైన ఆటగాళ్లందరూ మాంచి ఫామ్లో ఉండటంతో జట్టు ఎంపిక కూడా చాలా కష్టమైంది. కొన్ని సమీకరణల కారణంగా కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లకు అన్యాయం జరిగిందని చెప్పాలి. ఓవరాల్గా చూస్తే పొట్టి ప్రపంచకప్పై ఐపీఎల్ ప్రభావం అనే అంశంపై ఎవరి అభిప్రాయాలను వారు వినిపిస్తున్నారు. -
SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్: కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముచ్చటగా మూడోసారి ఫైనల్ ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్కు చేదు అనుభవమే మిగిలింది. ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్తో చెన్నై వేదికగా జరిగిన తుదిపోరులో పేలవ ప్రదర్శనతో పరాజయం పాలైంది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది.గతేడాదితో పోలిస్తే ఈ సీజన్ ఆసాంతం అద్భుతంగా ఆడినా అసలు మ్యాచ్లో చేతులెత్తేసింది. విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మారిన కమిన్స్ బృందం ఫైనల్లో మాత్రం తుస్సుమనిపించింది.అందుకే ఓడిపోయాంఈ నేపథ్యంలో కేకేఆర్ చేతిలో ఘోర పరాజయంపై సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని కితాబులు ఇచ్చాడు. తమ బ్యాటర్లు సీజన్ ఆరంభం నుంచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నారని.. అయితే, చెన్నై వికెట్ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నాడు.‘‘వాళ్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. స్టార్కీ(మిచెల్ స్టార్క్) మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. ఈ మ్యాచ్లో మా ఆట తీరు అస్సలు బాగాలేదు. బౌండరీలు రాబట్టానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాం. గత వారం అహ్మదాబాద్(క్వాలిఫయర్-1)లోనూ వాళ్ల బౌలర్లు అద్భుతంగా ఆడారు. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం వాళ్లకు ఇవ్వాల్సిందే. ఈ వికెట్ స్వభావాన్ని మేము పసిగట్టలేకపోయాం. కనీసం 160 పరుగులు స్కోరు చేసినా కనీస పోటీ ఉండేది’’ అని కమిన్స్ పేర్కొన్నాడు.మా వాళ్లు మాత్రం సూపర్అదే విధంగా.. ‘‘ఏదేమైనా.. ఈ సీజన్లో మాకు అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. మా వాళ్లు సూపర్గా బ్యాటింగ్ చేశారు. మూడుసార్లు 250 పరుగుల మేర స్కోరు చేశాం.తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ మ్యాచ్ను మాకు అనుకూలంగా మార్చివేశారు. హైదరాబాద్లో అభిమానులు మాకు పూర్తి మద్దతుగా నిలిచారు.ఈ సీజన్ మొత్తం అద్భుతంగా సాగింది. ఈసారి చాలా మంది కొత్త ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. భువీ, నట్టు, జయదేవ్లతో పాటు చాలా మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో మమేకమయ్యాను.సాధారణంగా టీమిండియాతో మ్యాచ్ అంటే మొత్తం నీలిరంగుతో స్టేడియం నిండిపోతుంది. అయితే, ఇప్పుడు ఇక్కడ ప్రేక్షకులు మా(నా)కు మద్దతుగా నిలవడం కొత్త అనుభూతినిచ్చింది’’ అని ప్యాట్ కమిన్స్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు.ఐపీఎల్-2024 ఫైనల్: కేకేఆర్ వర్సెస్ సన్రైజర్స్👉వేదిక: చెపాక్ స్టేడియం.. చెన్నై👉టాస్: సన్రైజర్స్.. బ్యాటింగ్👉సన్రైజర్స్ స్కోరు: 113 (18.3)👉కేకేఆర్ స్కోరు: 114/2 (10.3)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో సన్రైజర్స్ను చిత్తు చేసి చాంపియన్గా కేకేఆర్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ స్టార్క్👉ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: సునిల్ నరైన్.చదవండి: IPL 2024: ఎస్ఆర్హెచ్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య! వీడియో వైరల్ ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024 -
IPL 2024: 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు
కేకేఆర్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ ఎవరికీ సాధ్యంకాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు అత్యంత విలువైన ఆటగాడి అవార్డు (MVP) అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2012.. తన డెబ్యూ సీజన్లో తొలిసారి ఈ అవార్డు అందుకున్న నరైన్.. 2018 సీజన్లో.. తాజాగా 2024 సీజన్లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో 488 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టిన నరైన్.. 2018 సీజన్లో 357 పరుగులు, 17 వికెట్లు.. 2012 సీజన్లో 24 వికెట్లు పడగొట్టాడు.ఈ సీజన్లో మెంటార్ గంభీర్ చొరవతో ఓపెనర్గా ప్రమోషన్ పొందిన నరైన్.. సుడిగాలి ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో నరైన్ బ్యాట్ నుంచి సెంచరీ, 3 అర్దసెంచరీలు జాలువారాయి. సీజన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నరైన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో నరైన్ బౌలింగ్లోనూ సత్తా చాటాడు. 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.ఇదిలా ఉంటే, కేకేఆర్ ఐపీఎల్లో తమ మూడో టైటిల్ను సొంతం చేసుకుంది. నిన్న (మే 26) జరిగిన 2024 సీజన్ ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్గా అవతరించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ (3-0-14-2, 2 క్యాచ్లు) ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో కమిన్స్ (24) టాప్ స్కోరర్గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. -
IPL 2024: కేకేఆర్ వెనుక 'గంభీరం'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఈ సీజన్లో ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన కేకేఆర్ ఫైనల్ మ్యాచ్లోనూ అన్ని రంగాల్లో సత్తా చాటి పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.Shreyas Iyer handed the Trophy to Rinku Singh for celebration.- The Leader. 👌 pic.twitter.com/V8Pb55ZPQX— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆటగాళ్లతో సమానమైపాత్ర..ఈ సీజన్లో కేకేఆర్ విజయాల్లో ఆటగాళ్ల పాత్ర ఎంత ఉందో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా అంతే ఉంది. ఈ సీజన్తోనే కేకేఆర్ మెంటార్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. ఆ జట్టు సాధించిన ప్రతి విజయంలోనూ తనదైన ముద్ర వేశాడు.Third most successful IPL franchise in league history - KKR. pic.twitter.com/bYnKkbujXi— Johns. (@CricCrazyJohns) May 26, 2024పేరుకు తగ్గట్టుగానే గంభీరంగా..ఆన్ ఫీల్డ్ అయినా.. ఆఫ్ ద ఫీల్డ్ అయినా గంభీరంగా కనిపించే గంభీర్ పేరుకు తగ్గట్టుగానే కేకేఆర్ విజయాల్లో గంభీరమైన పాత్ర పోషించాడు. గంభీర్ తనకు మాత్రమే సాధ్యమైన సాహసోపేతమైన నిర్ణయాలతో కేకేఆర్ను గెలుపుబాట పట్టించాడు. గంభీర్ ఆధ్వర్యంలో కేకేఆర్ ఈ సీజన్లో కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే ఓడింది. Gautam Gambhir with IPL Trophy. ❤️ pic.twitter.com/LI2HLwEpiH— Johns. (@CricCrazyJohns) May 26, 2024నరైన్ సక్సెస్ వెనుక కూడా గంభీరుడే..సునీల్ నరైన్కు ఓపెనర్గా ప్రమోషన్ ఇచ్చి సత్ఫలితాలు రాబట్టిన ఘనత గంభీర్దే. అలాగే ఫైనల్స్ హీరో మిచెల్ స్టార్క్ను దక్కించుకోవడంలోనూ గంభీరే ప్రధానపాత్ర పోషించాడని అంతా అంటారు. యువ పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలను ప్రోత్సాహించడంలోనూ.. వెటరన్ ఆండ్రీ రసెల్ను వెనకేసుకురావడంలోనూ గంభీర్దే ప్రధానమైన పాత్ర. SUNIL NARINE - The MVP of IPL 2024. Greatest of KKR...!!!!! pic.twitter.com/1IBdxl1qRk— Johns. (@CricCrazyJohns) May 26, 2024శ్రేయస్ను వెన్నుతట్టి.. వెంకటేశ్పై విశ్వాసముంచి..శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్లపై విశ్వాసముంచి వారి నుంచి సత్ఫలితాలు రాబట్టిన ఘనత కూడా గంభీర్కే దక్కుతుంది. రింకూ సింగ్, రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి లాంటి లోకల్ టాలెంట్లకు కూడా గంభీర్ అండగా నిలిచాడు. ఇలా ఏరకంగా చూసుకున్నా కేకేఆర్కు పూర్వవైభవం దక్కడంలో గంభీర్ పాత్ర ప్రధానమైందనడంలో ఎలాంటి సందేహాం లేదు.KKR players taking Gautam Gambhir in their shoulders. 👌 pic.twitter.com/XspysKKbiM— Johns. (@CricCrazyJohns) May 26, 2024సొంత అభిమానులచే ఛీత్కారాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి..గడిచిన ఆరు సీజన్లలో పేలవ ప్రదర్శనతో సొంత అభిమానల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న కేకేఆర్.. గంభీర్ రాకతో ఒక్కసారిగా నూతనోత్సాహాన్ని అందుకుని టైటిల్ ఎగరేసుకుపోయింది.షారుఖ్ పట్టుబట్టి మరీ..కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ఈ సీజన్ కోసం గంభీర్ను పట్టుబట్టి మరీ ఒప్పించి లక్నో సూపర్ జెయింట్స్ నుంచి పిలిపించుకున్నాడు. మెంటార్గా గంభీర్కు కేకేఆర్ కొత్తేమో కానీ ఆటగాడిగా, కెప్టెన్గా గంభీర్ కేకేఆర్ అభిమానులకు సుపరిచితుడు. ఈ సీజన్లో మెంటార్గా కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపిన గంభీర్.. 2012, 2014 సీజన్లలో కెప్టెన్గా కేకేఆర్కు టైటిల్స్ అందించాడు. Gautam Gambhir & King of Indian Cinema Shah Rukh Khan with IPL Trophy 💜- The Frame for KKR legacy. pic.twitter.com/pfrFw9prKe— Johns. (@CricCrazyJohns) May 27, 2024కేకేఆర్ కెప్టెన్గా గంభీర్ ప్రస్తానం దీనితోనే ఆగిపోలేదు. గంభీర్ నేతృత్వంలో కేకేఆర్ 2016, 2017 సీజన్లలోనే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. దీనికి ముందు 2011 సీజన్లోనూ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ ప్లే ఆఫ్స్కు చేరింది. కేకేఆర్ కెప్టెన్గా ఏడు సీజన్ల పాటు కొనసాగిన గంభీర్ ఈ జట్టును రెండుసార్లు ఛాంపియన్గా.. మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్కు.. రెండు సీజన్లలో (2013, 2015) లీగ్ దశ వరకు విజయవంతంగా నడిపించాడు. తాజాగా మెంటార్గా బాధ్యతలు చేపట్టి తన ఆధ్వర్యంలో మూడోసారి కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపాడు. Shah Rukh Khan kissing Gautam Gambhir 💜- SRK brings back Gambhir again and he has written a great comeback story. pic.twitter.com/gcAjm1S2Bh— Johns. (@CricCrazyJohns) May 26, 2024షారుఖ్ విశ్వాసాన్ని నిలుపుకున్నాడు..కేకేఆర్ బాస్ షారుఖ్కు తనపై అపార విశ్వాసమున్నట్లు గంభీరే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ నమ్మకాన్ని నిలుపుకుంటూ గంభీర్ పదేళ్ల తర్వాత తిరిగొచ్చి కేకేఆర్కు టైటిల్ను అందించాడు. తాజాగా కేకేఆర్ టైటిల్ గెలిచిన అనంతరం షారుఖ్ ఖాన్ గంభీర్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
ఛాంపియన్ కోల్ కతా
-
కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
కోల్కత్తా: ఐపీఎల్-17(2024)లో విజేతగా నిలిచిన కోల్కత్తా నైట్రైడర్ జట్టును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డులు బద్దలు కొట్టినందుకు ప్లేయర్స్కు వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.కాగా, మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా..‘కోల్కతా నైట్ రైడర్స్ విజయంతో బెంగాల్ అంతటా సంబరాలు మిన్నంటాయి. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డు బద్దలు కొట్టినందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీని వ్యక్తిగతంగా అభినందించాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. Kolkata Knight Riders' win has brought about an air of celebration all across Bengal.I would like to personally congratulate the players, the support staff and the franchise for their record breaking performance in this season of the IPL.Wishing for more such enchanting…— Mamata Banerjee (@MamataOfficial) May 26, 2024 ఇక, ఐపీఎల్-17 సీజన్లో కేకేఆర్ అద్భుత ఆటతీరును కనబరిచింది. సీజన్ ప్రారంభం నాటి నుంచి దూకుడుగా ఆడుతూ టేబుట్ టాపర్గా నిలిచింది. చివరగా ఫైనల్గా సన్రైజర్స్ హైదరాబాద్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 114 లక్ష్యాన్ని కేవలం పదో ఓవర్లోనే పూర్తి చేసింది. కాగా, ఈ సీజన్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా కేకేఆర్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ నిలిచాడు. ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024 📽️ 𝗥𝗔𝗪 𝗥𝗘𝗔𝗖𝗧𝗜𝗢𝗡𝗦Moments of pure joy, happiness, jubilation, and happy tears 🥹 What it feels to win the #TATAIPL Final 💜Scorecard ▶️ https://t.co/lCK6AJCdH9#KKRvSRH | #Final | #TheFinalCall | @KKRiders pic.twitter.com/987TCaksZz— IndianPremierLeague (@IPL) May 26, 2024 -
IPL 2024 Final: కేకేఆర్కు అచ్చొచ్చిన 'M'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది.అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించి కేకేఆర్ను పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్గా నిలబెట్టాడు. ఫైనల్లో స్టార్క్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్రైజర్స్తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా (4-0-34-3) నిలిచాడు.సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్ను అందించాడు. ఓవరాల్గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్రైజర్స్ పాలిట విలన్గా దాపురించాడు.మరోసారి కలిసొచ్చిన 'M'ఇదిలా ఉంటే, ఐపీఎల్ ఫైనల్స్లో కేకేఆర్కు 'M' అక్షరం మరోసారి కలిసొచ్చింది. కేకేఆర్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మూడు సందర్భాల్లో ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఆటగాళ్లే ఆ జట్టు పాలిట గెలుపు గుర్రాలయ్యారు. MMM2012లో మన్విందర్ బిస్లా, 2014లో మనీశ్ పాండే, తాజాగా మిచెల్ స్టార్క్ ఫైనల్స్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లుగా నిలిచి కేకేఆర్కు టైటిల్స్ అందించారు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ ఫైనల్స్లో కేకేఆర్కు M అక్షరం సెంటిమెంట్ బాగా అచ్చొచ్చిందని స్పష్టమవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరో టైటిల్ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్తో (14 మ్యాచ్ల్లో 488 పరుగులు), బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024 Final: సన్రైజర్స్కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. తుది సమరంలో కేకేఆర్.. సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సన్రైజర్స్ తమ ప్రధాన బలమైన బ్యాటింగ్లో దారుణంగా విఫలమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. నమ్మకాన్ని వమ్ము చేయని స్టార్క్కేకేఆర్ పేసర్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనకు లభించిన ధరకు న్యాయం చేశాడు. అంతిమ సమరంలో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి సన్రైజర్స్కు గుండెకోత మిగిల్చాడు. అతను 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడుఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్రైజర్స్తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా (4-0-34-3) నిలిచాడు. సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్ను అందించాడు. ఓవరాల్గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్రైజర్స్ పాలిట విలన్లా దాపురించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి అత్యుత్సాహంగా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లైనా కూడా ఆడకుండానే (18.3 ఓవర్లు) 113 పరుగులకు చాపచుట్టేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా నిరాశపరిచారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.The winning by Celebration by Kolkata Knight Riders after winning the third IPL title. 🏆 pic.twitter.com/OgQBi87Kzt— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆడుతూ పాడుతూ..అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరో టైటిల్ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. గత సీజన్లో టేబుల్ చివర్లో ఉండిన సన్రైజర్స్ ఈ సీజన్లో రన్నరప్గా నిలవడం ఆ జట్టు అభిమానులకు ఊరట కలిగించే అంశం. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్తో (14 మ్యాచ్ల్లో 488 పరుగులు) ఇరగదీసి, బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024: కోల్కతాకే కిరీటం
సన్రైజర్స్ అభిమానులకు తీవ్ర వేదన... లీగ్ దశలో విధ్వంసకర బ్యాటింగ్తో ఐపీఎల్కు కొత్త పాఠాలు నేర్పిన టీమ్ అదే బ్యాటింగ్ వైఫల్యంతో చివరి మెట్టుపై చతికిలపడింది. 8 బంతుల వ్యవధిలో అభిషేక్ శర్మ, హెడ్ లాంటి హిట్టర్లు వెనుదిరగ్గా... క్లాసెన్కు కూడా కాలం కలిసిరాని వేళ జట్టంతా కుప్పకూలింది. ఏ మూలకూ సరిపోని 114 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా నైట్రైడర్స్ 63 బంతుల్లోనే ఛేదించేసి సంబరాలు చేసుకుంది. దశాబ్ద కాలం తర్వాత మూడో టైటిల్ అందుకొని సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల తర్వాత ట్రోఫీ గెలవాలని ఆశించిన హైదరాబాద్ 2018 తరహాలో ఫైనల్కే పరిమితమై నిరాశలో మునిగింది. ఆసాంతం బ్యాటర్లు చెలరేగిన 2024 టోర్నీ చివరకు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముగిసింది. విజేతగా నిలిచిన కోల్కతాకు రూ. 20 కోట్లు... రన్నరప్ హైదరాబాద్ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. చెన్నై: పదేళ్ల తర్వాత కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) మళ్లీ ఐపీఎల్ చాంపియన్గా అవతరించింది. ఆదివారం చెపాక్ మైదానంలో ఏకపక్షంగా సాగిన ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ పోరులో కోల్కతా 8 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో ఇదే అత్యల్ప స్కోరు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. అనంతరం నైట్రైడర్స్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి గెలిచింది. వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రెండో వికెట్కు 45 బంతుల్లో 91పరుగులు జోడించి జట్టును గెలిపించారు. సమష్టి వైఫల్యం... తొలి ఓవర్లో స్టార్క్ వేసిన అద్భుత బంతికి అభిõÙక్ శర్మ (2) క్లీన్బౌల్డ్ కావడంతో మొదలైన సన్రైజర్స్ పతనం వేగంగా సాగింది. కోల్కతా కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఏ దశలోనూ హైదరాబాద్ తిరిగి కోలుకోలేకపోయింది. హెడ్ (0) తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఆడిన తొలి బంతికి అవుటై మరో డకౌట్ ఖాతాలో వేసుకున్నాడు. త్రిపాఠి (13 బంతుల్లో 9; 1 ఫోర్) ఈసారి ఆదుకోలేకపోగా, నితీశ్ రెడ్డి (10 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్), షహబాజ్ (7 బంతుల్లో 8; 1 సిక్స్), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. మరోవైపు మార్క్రమ్ (23 బంతుల్లో 20; 3 ఫోర్లు) పరుగులు తీయడానికి ఇబ్బంది పడగా... క్లాసెన్ (17 బంతుల్లో 16; 1 ఫోర్) కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. 14 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోరు 90/7. క్లాసెన్ క్రీజ్లో ఉండటంతో చివరి 6 ఓవర్లలోనైనా ఎక్కువ పరుగులు సాధించవచ్చని రైజర్స్ ఆశించింది. అయితే తర్వాతి బంతికే అతను బౌల్డ్ కావడంతో ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో కమిన్స్ కొన్ని పరుగులు జత చేసి స్కోరును 100 దాటించాడు. ఫటాఫట్... స్వల్ప ఛేదనలో కేకేఆర్కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. నరైన్ (2 బంతుల్లో 6; 1 సిక్స్) ఆరంభంలోనే వెనుదిరిగినా... వెంకటేశ్, గుర్బాజ్ వేగంగా జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. భువనేశ్వర్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన వెంకటేశ్, ఆ తర్వాత నటరాజన్ బౌలింగ్లో వరుసగా 4, 4, 6, 4 బాది లక్ష్యాన్ని మరింత సులువగా మార్చేశాడు. 24 బంతుల్లోనే వెంకటేశ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 12 పరుగుల దూరంలో గుర్బాజ్ అవుటైనా... వెంకటేశ్, కెపె్టన్ శ్రేయస్ (3 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) కలిసి ఆట ముగించారు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) స్టార్క్ 2; హెడ్ (సి) గుర్బాజ్ (బి) వైభవ్ అరోరా 0; త్రిపాఠి (సి) రమణ్దీప్ (బి) స్టార్క్ 9; మార్క్రమ్ (సి) స్టార్క్ (బి) రసెల్ 20; నితీశ్ కుమార్ రెడ్డి (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ రాణా 13; క్లాసెన్ (బి) హర్షిత్ రాణా 16; షహబాజ్ (సి) నరైన్ (బి) వరుణ్ 8; సమద్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 4; కమిన్స్ (సి) స్టార్క్ (బి) రసెల్ 24; జైదేవ్ ఉనాద్కట్ (ఎల్బీ) (బి) నరైన్ 4; భువనేశ్వర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–2, 2–6, 3–21, 4–47, 5–62, 6–71, 7–77, 8–90, 9–113, 10– 113. బౌలింగ్: స్టార్క్ 3–0–14–2, వైభవ్ అరోరా 3–0–24–1, హర్షిత్ రాణా 4–1–24– 2, నరైన్ 4–0–16–1, రసెల్ 2.3–0– 19–3, వరుణ్ చక్రవర్తి 2–0–9–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీ) (బి) షహబాజ్ 39; నరైన్ (సి) షహబాజ్ (బి) కమిన్స్ 6; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 52; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 11; మొత్తం (10.3 ఓవర్లలో 2 వికెట్లకు) 114. వికెట్ల పతనం: 1–11, 2–102. బౌలింగ్: భువనేశ్వర్ 2–0– 25–0, కమిన్స్ 2–0–18–1, నటరాజన్ 2–0– 29–0, షహబాజ్ 2.3–0–22–1, ఉనాద్కట్ 1–0–9–0, మార్క్రమ్ 1–0–5–0. ఐపీఎల్–17 బౌండరీ మీటర్ మొత్తం సిక్స్లు: 1260 మొత్తం ఫోర్లు: 2174 -
ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా కేకేఆర్.. ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్-2024 సీజన్కు ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్తో ఈ ఏడాది సీజన్ ముగిసింది. ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా కోల్కతా నైట్రైడర్స్ నిలిచింది.తుదిపోరులో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి టైటిల్ను సొంతం చేసుకుంది. ఇక విజేతగా నిలిచిన కేకేఆర్ ఎంత ప్రైజ్మనీని గెల్చుకుంది, రన్నరప్గా నిలిచిన హైదరాబాద్ టీమ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎన్ని కోట్లంటే?ఛాంపియన్స్గా నిలిచిన కేకేఆర్కు ప్రైజ్మనీ రూపంలో రూ.20 కోట్లు లభించాయి. అదేవిధంగా రన్నరప్తో సరిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్కు రూ.13 కోట్లు ప్రైజ్మనీ దక్కింది. ఇక మూడో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్కు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఆర్సీబీకి .రూ. 6.5కోట్లు అందాయి.⇒ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచిన విరాట్ కోహ్లికి రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు.⇒పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన హర్షల్ పటేల్కు రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన హర్షల్.. 24 వికెట్లు పడగొట్టాడు.⇒ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డికి, ప్లేయర్ ఆఫ్ది సీజన్ అవార్డు విన్నర్ సునీల్ నరైన్కు చెరో రూ. 10లక్షల ప్రైజ్మనీ లభించింది.⇒అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన సునీల్ నరైన్ రూ.12 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో నరైన్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో16 మ్యాచ్లు నరైన్.. 488 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. -
ఎస్ఆర్హెచ్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024 రన్నరప్గా సన్రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. దీంతో ముచ్చటగా మూడో సారి టైటిల్ను ముద్దాడాలన్న హైదరాబాద్ కల నేరవేరలేదు. ఇక ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా తీవ్ర నిరాశపరిచింది. బౌలింగ్ విషయం పక్కన పెడితే బ్యాటింగ్లో అయితే మరింత దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ బౌలర్ల దాటికి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. కనీసం ఏ ఒక్క ఆటగాడైనా జట్టు కోసం ఆడినట్లు అన్పించలేదు. వచ్చామా వెళ్లామా అన్నట్లు ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ కొనసాగింది. ఈ క్రమంలో 113 పరుగులకే ఎస్ఆర్హెచ్ కుప్పకూలింది. తద్వారా ఓ చెత్త రికార్డును ఎస్ఆర్హెచ్ తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్లో అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. అంతకుముందు ఈ చెత్త రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. సీఎస్కే 2013 ఫైనల్లో ముంబైపై 125 రన్స్ చేసింది. తాజా మ్యాచ్తో ముంబైను ఎస్ఆర్హెచ్ను అధిగమించింది. -
ఎస్ఆర్హెచ్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఈ ఏడాది సీజన్ ఆద్యంతం ఎస్ఆర్హెచ్ అదరగొట్టనప్పటికి ఫైనల్లో మాత్రం తేలిపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పరంగా దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ బౌలర్లలో దాటికి సన్రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం సన్రైజర్స్ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 10. 3 ఓవర్లలో ఊదిపడేసింది. నరైన్ (6) రెండో ఓవర్లోనే ఔట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (39), వెంకటేశ్ అయ్యర్ (52 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి తమ జట్టుకు మూడో టైటిల్ను అందించారు.కన్నీళ్లు పెట్టుకున్న కావ్య..ఇక ఎస్ఆర్హెచ్ ఓటమి అనంతరం ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ భావోద్వేగానికి లోనయ్యారు. సీజన్ మొత్తం ఎస్ఆర్హెచ్ ఆడే మ్యాచ్లకు హాజరై తన జట్టును సపోర్ట్ చేసిన కావ్యకు ఫైనల్ మ్యాచ్లో తీవ్ర నిరాశ ఎదురైంది. సీజన్ అసాంతం ఎంతో సందడి చేసిన కావ్య పాపం.. ఫైనల్లో తమ జట్టు ఓడిపోయాక కన్నీళ్లు పెట్టుకున్నారు. తొలుత స్టాండ్స్లో నిలబడి తమ జట్టు పోరాటాన్ని చప్పట్లు కొడుతూ అభినందించిన కావ్య.. వెంటనే వెనక్కి తిరిగి వెక్కివెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. A season to be proud of 🧡#KKRvSRH #IPLonJioCinema #IPLFinalonJioCinema pic.twitter.com/rmgo2nU2JM— JioCinema (@JioCinema) May 26, 2024 -
ఫైనల్లో ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి.. ఐపీఎల్ 2024 విజేతగా కేకేఆర్
ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా కోల్కతా నైట్రైడర్స్ నిలిచింది. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఏక పక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.కుప్పకూలిన ఎస్ఆర్హెచ్..టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కేకేఆర్ బౌలర్ల దాటికి గజగజ వణికింది. కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో సన్రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు.అయ్యర్, గుర్బాజ్ విధ్వంసం..అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ప్యాట్ కమ్మిన్స్, షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో తలా వికెట్ సాధించారు. -
#SRH: లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టారు.. ప్లే ఆఫ్స్లో తుస్సుమన్పించారు
ఐపీఎల్-2024 లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కీలకమైన ప్లే ఆఫ్స్లో చేతులెత్తేశారు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2లో నిరాశపరిచిన ఈ విధ్వంసకర జోడీ.. ఇప్పుడు చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో తస్సుమన్పించారు.ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మ రెండు పరుగులు చేయగా.. ట్రావిస్ హెడ్ అయితే ఏకంగా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. కేకేఆర్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. అద్భుతమైన బంతితో అభిషేక్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మరోవైపు హెడ్ను వైభవ్ ఆరోరా సంచలన బంతితో బోల్తా కొట్టించాడు.హెడ్ విషయానికి వస్తే.. ఆఖరి 4 మ్యాచ్ల్లో కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు సార్లు హెడ్ డకౌటయ్యాడు.అదే విధంగా అభిషేక్ కూడా ఆఖరి మూడు మ్యాచ్ల్లో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నెటిజన్లు వీరిద్దరిని ట్రోలు చేస్తున్నారు. -
IPL 2024: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. ఛాంపియన్స్గా కేకేఆర్
IPL 2024 SRH vs KKR Final Live Updates: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. ఛాంపియన్స్గా కేకేఆర్ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా కోల్కతా నైట్రైడర్స్ నిలిచింది. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఏక పక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు.కుప్పకూలిన ఎస్ఆర్హెచ్..టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కేకేఆర్ బౌలర్ల దాటికి గజగజ వణికింది. కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో సన్రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు.అయ్యర్, గుర్బాజ్ విధ్వంసం..అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్..గుర్బాజ్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన గుర్భాజ్.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. కేకేఆర్ విజయానికి ఇంకా 8 పరుగులు కావాలి.విజయం దిశగా కేకేఆర్..114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 6 ఓవర్లు మగిసే సరికి వికెట్ నష్టానికి కేకేఆర్ 72 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(21), వెంకటేశ్ అయ్యర్(40) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్..114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సునీల్ నరైన్.. కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది.113 పరుగులకే కుప్పకూలిన ఎస్ఆర్హెచ్చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న ఫైనల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్.. కేకేఆర్ బౌలర్ల దాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇదే లోయెస్ట్ టార్గెట్ కావడం గమనార్హం.16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 98/8ఎస్ఆర్హెచ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన క్లాసెన్.. హర్షిత్ రానా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులో ఉనద్కట్ వచ్చాడు. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 98/8పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 77 పరుగులకే 7 వికెట్లుఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 77 పరుగులకే సన్రైజర్స్ 7 వికెట్లు కోల్పోయింది. చక్రవర్తి బౌలింగ్లో షాబాజ్ అహ్మద్ ఔట్ కాగా.. రస్సెల్ బౌలింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సమద్ సైతం ఔటయ్యాడు. క్రీజులో క్లాసెన్(13), కమ్మిన్స్ 4 పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 82/7పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 62 పరుగులకే 5 వికెట్లు62 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన మార్క్రమ్.. రస్సెల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి షాబాజ్ అహ్మద్ వచ్చాడు.నాలుగో వికెట్ డౌన్నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన నితీష్ కుమార్.. హర్షిత్ రానా బౌలింగ్లో ఔటయ్యాడు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 21 పరుగులకే 3 వికెట్లుటాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. 21 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు.హెడ్ ఔట్..ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ గోల్డెన్ డక్గా వెనదిరిగాడు. వైబవ్ ఆరోరా బౌలింగ్లో హెడ్.. వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 3 ఓవర్లు ముగిసే సరికి సన్రైజర్స్ రెండు వికెట్లు నష్టానికి 15 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(7), మార్క్రమ్(4) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్కు బిగ్ షాక్.. అభిషేక్ ఔట్టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ను ఎస్ఆర్హెచ్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.ఐపీఎల్-2024లో ఫైనల్ పోరుకు రంగం సిద్దమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో కేకేఆర్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఎస్ఆర్హెచ్ ఒకే ఒక మార్పు చేసింది. తుది జట్టులోకి సమద్ స్ధానంలో ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ వచ్చాడు.తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిసన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ -
ఎస్ఆర్హెచ్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదు: భారత మాజీ ఓపెనర్
ఐపీఎల్-2024లో ఫైనల్ పోరుకు మరి కొన్ని తెరలేవనుంది. చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా టైటిల్ విజేతను ఎంచుకున్నాడు. కేకేఆర్ ఛాంపియన్స్గా నిలుస్తుందని చోప్రా జోస్యం చెప్పాడు. అయితే ఎస్ఆర్హెచ్ను తక్కువ అంచనా వేయద్దని, ఆ జట్టు టైటిల్ను సొంతం చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లలేదని చోప్రా చెప్పుకొచ్చాడు."ఎస్ఆర్హెచ్-కేకేఆర్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఈ మ్యాచ్ వన్సైడ్ గేమ్ అయితే కాదు. కేకేఆర్కు గెలిచే ఛాన్స్ ఉంది. అయితే హైదరాబాద్ గట్టీ పోటీ ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ సన్రైజర్స్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదు. ఈ క్యాష్రిచ్ లీగ్లో ఎస్ఆర్హెచ్కు ఇది మూడో ఫైనల్ కాగా.. కేకేఆర్కు నాలుగో ఫైనల్. ఇరు జట్లు టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఫైనల్ మ్యాచ్లో హెడ్ కంటే అభిషేక్ శర్మ కీలకంగా మారనున్నాడు. ఎందుకంటే ప్రత్యర్ధి జట్టులో లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉండడంతో హెడ్కు మరోసారి కష్టాలు తప్పవు.బౌలింగ్లో ప్యాట్ కమ్మిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ చెలరేగితే కేకేఆర్ను తక్కువ స్కోర్కే కట్టడి చేయవచ్చు. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి ఫామ్ల ఉండడం సన్రైజర్స్ కలిసొచ్చే ఆంశం. కానీ అతడు రిస్క్తో కూడిన షాట్లు ఆడుతున్నాడు. అది అన్ని సమయాల్లో జట్టుకు మంచిది కాదు. ఎస్ఆర్హెచ్ సమిష్టిగా రాణిస్తే మరోటైటిల్ను తమ ఖాతాలో వేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు -
IPL 2024 Final: వార్న్, రోహిత్, హార్దిక్ సరసన కమిన్స్ చేరేనా..?
ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ ఇవాళ (మే 26) రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్.. సన్రైజర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందులో తొలి సీజన్లోనే టైటిల్ కైవసం చేసుకున్న కెప్టెన్ల విషయం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేవలం ముగ్గురు మాత్రమే..16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకే కేవలం ముగ్గురు కెప్టెన్లు మాత్రమే తొలి సీజన్లోనే టైటిల్ గెలిచారు. తొట్ట తొలి సీజన్లో (2008) షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్), 2013 సీజన్లో రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్), 2022 సీజన్లో హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్ టైటిల్ గెలిచారు. ప్రస్తుత సీజన్ ఫైనల్లో తలపడుతున్న పాట్ కమిన్స్ కూడా కెప్టెన్ ఇదే తొలి సీజన్ కావడంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కెప్టెన్గా పాట్ ట్రాక్ రికార్డు చూస్తే వార్న్, రోహిత్, హార్దిక్ సరసన చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరి నేటి ఫైనల్లో కమిన్స్ ఏం చేస్తాడో వేచి చూడాలి. కేవలం బ్యాటింగ్ను నమ్ముకున్న సన్రైజర్స్.. అన్ని విభాగాల్లో సత్తా చాటుతున్న కేకేఆర్ను ఏమేరకు నిలువరిస్తుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అలా చూస్తే కేకేఆర్దే టైటిల్..గత ఆరు సీజన్లలో క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే టైటిల్ గెలుస్తుంది. ఈ సెంటిమెంట్నే కేకేఆర్ కొనసాగిస్తుందో లేక సన్రైజర్స్ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ ఏడాది సన్రైజర్స్ మరో టైటిల్ గెలుస్తుందా..?మరోవైపు సన్రైజర్స్కు ఈ ఏడాది బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ ఫ్రాంచైజీ ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్ గెలిచి అదే జోరును ఐపీఎల్లోనూ కొనసాగిస్తుంది. ఫైనల్లో హాట్ ఫేవరెట్ కేకేఆరే అయినప్పటికీ.. కమిన్స్ కెప్టెన్సీ సామర్థ్యం, బ్యాటర్ల విధ్వంసంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎస్ఆర్హెచ్ అభిమానులు అంచనాలు నిజమైతే ఐపీఎల్ టైటిల్ గెలిచిన నాలుగో ఆసీస్ ఆటగాడిగా కమిన్స్ రికార్డు బుక్కుల్లోకెక్కుతాడు. కేకేఆర్కు చెపాక్ స్పెషల్..మరోవైపు చెపాక్ మైదానంతో కేకేఆర్కు ప్రత్యేక అనుబంధం ఉంది. 12 ఏళ్ల క్రితం కేకేఆర్ ఇక్కడే తమ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. కేకేఆర్ చెపాక్ సెంటిమెంట్ కూడా తమకు వర్కౌట్ అవుతుందని అశిస్తుంది. ఈ సీజన్లో సన్రైజర్స్తో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం తమనే వరించడంపై కూడా కేకేఆర్ ధీమాగా ఉంది. ఫైనల్లో మరోసారి ఎస్ఆర్హెచ్ను మట్టికరిపించి ఈ సీజన్లో హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేస్తామని కేకేఆర్ ధీమాగా ఉంది. -
IPL 2024 KKR vs SRH: ఐపీఎల్ విన్నర్లు, రన్నరప్స్ వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. కేకేఆర్, సన్రైజర్స్ మధ్య నేడు (మే 26) జరుగబోయే ఫైనల్తో ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ గత సీజన్లకు భిన్నంగా సాగింది. బ్యాటింగ్కు సంబంధించి ఆల్టైమ్ రికార్డులు బద్దలుకావడంతో పాటు పలు సంచలన బౌలింగ్ ప్రదర్శనలు నమోదయ్యాయి. చెరి ఐదసార్లు ఛాంపియన్లైన ముంబై, సీఎస్కే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు కూడా చేరకుండానే నిష్క్రమించాయి. దిగ్గజ కెప్టెన్లు రోహిత్, ధోని లేకుండా జరుగుతున్న ఐదో ఐపీఎల్ ఫైనల్ ఇది.ఐపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో విజేతలు, రన్నరప్లపై ఓ లుక్కేద్దాం. ఇప్పటివరకు జరిగిన 16 ఫైనల్స్లో సీఎస్కే (2010, 2011, 2018, 2021, 2023), ముంబై (2013, 2015, 2017, 2019, 2020) చెరి ఐదుసార్లు టైటిల్ కైవసం చేసుకోగా.. కేకేఆర్ రెండు (2012, 2014), సన్రైజర్స్ (2016), రాజస్థాన్ రాయల్స్ (2008), గుజరాత్ టైటాన్స్ (2022), డెక్కన్ ఛార్జర్స్ (2009) తలో సారి టైటిల్ నెగ్గాయి. అత్యధికసార్లు రన్నరప్గా నిలిచిన ఘనత సీఎస్కేకు దక్కింది. సీఎస్కే ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) ఫైనల్లో ఓటమిపాలైంది.ఆతర్వాత ఆర్సీబీ మూడు సార్లు (2009, 2011, 2016).. ముంబై ఇండియన్స్ (2010), కేకేఆర్ (2021), సన్రైజర్స్ (2018), రాజస్థాన్ రాయల్స్ (2022), గుజరాత్ టైటాన్స్ (2023), పంజాబ్ కింగ్స్ (2014), ఢిల్లీ క్యాపిటల్స్ (2020), రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (2017) తలో సారి రన్నరప్గా నిలిచాయి.సీజన్ల వారీగా విజేతలు, రన్నరప్స్..2008- రాజస్థాన్ రాయల్స్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2009- డెక్కన్ ఛార్జర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2010- సీఎస్కే (విజేత), ముంబై ఇండియన్స్ (రన్నరప్)2011- సీఎస్కే (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2012- కేకేఆర్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2013- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2014- కేకేఆర్ (విజేత), పంజాబ్ (రన్నరప్)2015- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2016- సన్రైజర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2017- ముంబై (విజేత), పూణే (రన్నరప్)2018- సీఎస్కే (విజేత), సన్రైజర్స్ (రన్నరప్)2019- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2020- ముంబై (విజేత), ఢిల్లీ (రన్నరప్)2021- సీఎస్కే (విజేత), కేకేఆర్ (రన్నరప్)2022- గుజరాత్ (విజేత), రాజస్థాన్ (రన్నరప్)2023- సీఎస్కే (విజేత), గుజరాత్ (రన్నరప్) -
పాక్తో సిరీస్ కంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బాగుండేది..!
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ స్వదేశీ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తీసుకున్న ఓ నిర్ణయంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. సహజంగా ఇతర దేశాల ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాన్.. ఈసారి ఓ విషయంలో స్వదేశీ బోర్డుపై దుమ్మెత్తిపోశాడు.వివరాల్లోకి వెళితే.. టీ20 వరల్డ్కప్ 2024 దృష్ట్యా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా నిషేధాజ్ఞలు విధించింది. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ మెగా టోర్నీకి ముందు స్వదేశంలో పాక్తో జరిగే టీ20 సిరీస్లో తప్పక పాల్గొనాలని అల్టిమేటం జారీ చేసింది. దీంతో జోస్ బట్లర్ (రాజస్థాన్), విల్ జాక్స్ (ఆర్సీబీ), ఫిల్ సాల్ట్ (కేకేఆర్) లాంటి ఆటగాళ్లు కీలకమైన ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడకుండా స్వదేశానికి వెళ్లిపోయారు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. టీ20 వరల్డ్కప్కు ముందు ఇంగ్లండ్ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా ఈసీబీ పెద్ద తప్పిదమే చేసిందని మండిపడ్డాడు. మెగా టోర్నీకి ముందు పాక్ లాంటి జట్టుతో స్వదేశంలో సిరీస్ ఆడేకంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటేనే ఇంగ్లండ్కు మంచి జరిగి ఉండేదని అభిప్రాయపడ్డాడు. ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బట్లర్, జాక్స్, సాల్ట్లకు భారీ జనసమూహాల మధ్య ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలిసుండేదని అన్నాడు.ప్రపంచకప్కు ముందు లభించిన ఈ అరుదైన అవకాశాన్ని ఈసీబీ చేజేతులారా జారవిడ్చుకుందని ధ్వజమెత్తాడు. స్వదేశీ ఆటగాళ్ల విషయంలో ఈసీబీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యిందో అర్దం కావట్లేదని మండిపడ్డాడు.కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ స్వదేశంలో పాక్తో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 నిన్ననే ముగిసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ పాక్పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్లు 28, 30 తేదీల్లో జరుగనున్నాయి. జూన్ 1 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 ప్రపంచకప్లో పాక్, ఇంగ్లండ్ జట్లు వేర్వేరు గ్రూప్ల్లో పోటీపడుతున్నాయి. పాక్.. భారత్, కెనడా, యూఎస్ఏ, ఐర్లాండ్లతో పాటు గ్రూప్-ఏలో, ఇంగ్లండ్.. ఆసీస్, ఒమన్, నమీబియా, స్కాట్లాండ్లతో పాటు గ్రూప్-బిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
IPL 2024 ఫైనల్ జోరుగా బెట్టింగ్..
-
తుస్సుమన్న పాక్ బ్యాటర్లు.. ఇంగ్లండ్ ఘన విజయం
నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా స్వదేశంలో పాక్తో జరిగిన రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్ను చిత్తు చేసింది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 19.2 ఓవర్లలో 160 పరుగులకే చాపచుట్టేసి 23 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా 1-0 ఆధిక్యంతో సిరీస్లో ముందడుగు వేసింది. సిరీస్లో భాగంగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. మూడో టీ20 కార్డిఫ్ వేదికగా ఈ నెల 28న జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న బట్లర్ఈ మ్యాచ్లో జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్తో (51 బంతుల్లో 84; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. విల్ జాక్స్ (23 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్స్టో (18 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా నిరాశపరిచారు. ఓ దశలో (14.5 ఓవర్లలో 144/2) ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్లలో ఒక్కసారిగా లయను అందుకోవడంతో ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్తో సరిపెట్టుకోక తప్పలేదు. షాహీన్ అఫ్రిది 3, ఇమాద్ వసీం, హరీస్ రౌఫ్ తలో 2 వికెట్లతో రాణించారు.తేలిపోయిన పాక్ బ్యాటర్లు..ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫకర్ జమాన్ (45), బాబర్ ఆజమ్ (32), ఇఫ్తికార్ అహ్మద్ (23), ఇమాద్ వసీం (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతావారంతా దారుణంగా విఫలమయ్యారు. రీస్ టాప్లే భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ 3 వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్ తలో 2 వికెట్లు పడగొట్టి పాక్ను ముప్పుతిప్పలు పెట్టారు. క్రిస్ జోర్డన్, ఆదిల్ రషీద్, లివింగ్స్టోన్ తలో వికెట్ పడగొట్టి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. -
ఐపీఎల్ 17లో బద్దలైన రికార్డ్లు
-
ఫైనల్లో తలపడనున్న SRH, KKR జట్లు
-
వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
ఐపీఎల్-2024 ఫైనల్ పోరుకు సర్వం సిద్దమైంది. ఆదివారం(మే 26) చెపాక్ స్టేడియం వేదికగా ఈ టైటిల్ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి క్వాలిఫయర్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్ గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో క్వాలిఫయర్లో రాజస్తాన్ రాయల్స్ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్.. ఫైనల్కు పోరు అర్హత సాధించింది.ఈ క్రమంలో కేకేఆర్ మూడో టైటిల్పై కన్నుయేగా.. ఎస్ఆర్హెచ్ రెండో సారి టైటిల్ను ముద్దాడాలని భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్ లీగ్ దశలో పలు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆఖరి 8 లీగ్ మ్యాచ్ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ సైతం రద్దు అయింది.ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించి రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.ఫైనల్కు రిజర్వ్ డే..ఇక బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే కేటాయించింది. ఆదివారం(మే 26) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్ను నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్కడనైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ సోమవారం కూడా మ్యాచ్ను నిర్వహించేందుకు అవకాశం లేకుంటే.. పాయింట్ల పట్టికలో టాపర్గా ఉన్న కేకేఆర్ను విజేతగా ప్రకటిస్తారు. కాగా కనీసం సూపర్ ఓవర్ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా గతేడాది సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే తేలింది. -
IPL 2024 Final: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు!?
క్రికెట్ అభిమానులను రెండు నెలల పాటు అలరించిన ఐపీఎల్-2024 తుది దశకు చేరుకుంది. ఆదివారం(మే 26) జరగనున్న ఫైనల్ మ్యాచ్తో ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్కు ఎండ్ కార్డ్ పడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ట్రోఫీని ముద్దాడాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ హైవోల్ట్జ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్కు తమ ప్లేయింగ్ ఎల్వెన్లో ఒకే మార్పు చేయాలని ఎస్ఆర్హెచ్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ స్దానంలో కివీ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ను అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్లో ఫిలిప్స్కు కనీసం ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం ఛాన్స్ ఇవ్వలేదు. క్వాలిఫయర్-2కు అయినా ఫిలిప్స్కు ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు. కానీ ఎస్ఆర్హెచ్ మెనెజ్మెంట్ అతడిని కాదని మార్క్రమ్ ఛాన్స్ ఇచ్చింది. మార్క్రమ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలోనే మార్క్రమ్పై వేటు వేసి ఫిలిప్స్కు ఛాన్స్ ఇవ్వాలని మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరోవైపు కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనున్నట్ల వినికిడి.సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, జయదేవ్ ఉనద్కత్ -
ఐపీఎల్ ఫైనల్కు ముందు ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం..
ఐపీఎల్-2024లో తుది పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ పోరులో ఎలాగైనా గెలిచి టైటిల్ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముందు తమ జట్టు ఆటగాళ్లు ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి శనివారం తమ ప్రాక్టీస్ సెషన్ను ఎస్ఆర్హెచ్ మెనెజ్మెంట్ రద్దు చేసింది. చెన్నైలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ఎస్ఆర్హెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిందూస్తాన్ టైమ్స్ తమ రిపోర్ట్లో పేర్కొంది. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎస్ఆర్హెచ్ ఫైనల్ పోరులో కేకేఆర్తో అమీతుమీ తెల్చుకోనుంది.కాగా శుక్రవారం చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించి.. ఫైనల్ పోరకు అర్హత సాధించింది.చదవండి: T20 World Cup: ఇంగ్లండ్కు బిగ్ షాక్.. బట్లర్ దూరం! కొత్త కెప్టెన్ ఎవరంటే? -
సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
ఐపీఎల్-2024 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(మే26) చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. క్వాలిఫయర్ 1లో ఎస్ఆర్హెచ్పై విజయం సాధించి కేకేఆర్ తుది పోరుకు అర్హత సాధించగా.. సన్రైజర్స్ క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ విజేతను ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్ అంచనా వేశాడు. కేకేఆర్ ఛాంపియన్స్గా నిలుస్తుందని హేడెన్ జోస్యం చెప్పాడు. "ఫైనల్లో ఎస్ఆర్హెచ్పై కేకేఆర్ విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. ఫైనల్కు ముందు కేకేఆర్కు మూడు రోజుల విశ్రాంతి లభించింది. ఈ వ్యవధిలో ఎస్ఆర్హెచ్ బలాలు, బలహీనతలపై కేకేఆర్ స్పెషల్ ఫోకస్ చేసింటుంది.అంతేకాకుండా క్వాలిఫయర్-1లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన కాన్ఫిడెన్స్ కూడా కేకేఆర్కు కలిసిస్తోందని నేను భావిస్తున్నాను.అంతేకాకుండా చెపాక్లోని ఎర్రమట్టి పిచ్పై నరైన్,వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి నావరకు అయితే కేకేఆర్దే ట్రోఫీ అని" స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్లో హేడన్ పేర్కొన్నాడు. -
హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితం గురించి వదంతులు పుట్టుకొస్తున్నాయి. భార్య నటాషా స్టాంకోవిక్తో హార్దిక్కు విభేదాలు తలెత్తాయని.. వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.నటాషా తన సోషల్ మీడియా ఖాతాలలో పాండ్యా ఇంటి పేరును తొలగించిందని.. తద్వారా తాము విడిపోయామని పరోక్షంగా హింటిచ్చిందని ‘రెడిట్’ పోస్ట్ ద్వారా నెటిజన్లు ఓ అంచనాకు వచ్చారు.హార్దిక్ పాండ్యాను ఎంకరేజ్ చేసేందుకు ఐపీఎల్-2024 మ్యాచ్లకు నటాషా రాలేదని.. అతడితో కలిసి ఉన్న ఫొటోలు కూడా పోస్ట్ చేయడం లేదంటూ ఇందుకు కారణాలు వెతికే ప్రయత్నం చేశారు.వదంతులు మాత్రమేనంటూఅయితే, ఇవన్ని వట్టి పుకార్లేనని హార్దిక్ పాండ్యా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్గా నియమితుడైన తర్వాత హార్దిక్ పాండ్యా దారుణమైన ట్రోలింగ్కు గురైన విషయం తెలిసిందే.పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడంతో అతడిపై విమర్శలు మరింత పదునెక్కాయి. ఈ నేపథ్యంలో.. ఆ ప్రభావం భార్య నటాషా, కుమారుడు అగస్త్యపై పడకుండా ఉండేందుకు పాండ్యానే స్వయంగా తనతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయవద్దని భార్యకు సూచించినట్లు తెలుస్తోంది.అయితే.. ఇన్నాళ్లూ విభేదాలంటూ వార్తలు రాగా..ఈసారి గాసిప్ రాయుళ్లు మరో ముందుడుగు వేశారు. హార్దిక్ పాండ్యా తీరు నచ్చని నటాషా.. ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసిందని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.భరణం కింద ఆస్తిలో 70 శాతంఈ క్రమంలో భరణం కింద హార్దిక్ పాండ్యా ఆస్తి(స్పోర్ట్స్కీడా నివేదిక ప్రకారం సుమారు రూ. 91 కోట్లు)లో 70 శాతం మేర(దాదాపు 63 కోట్లు) ఇవ్వాలని కోరిందని.. ఇందుకు అతడు కూడా సుముఖంగానే ఉన్నట్లు నెట్టింట రూమర్లు సృష్టిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇటు హార్దిక్ పాండ్యా గానీ.. అటు నటాషా గానీ పెదవి విప్పకపోవడం గమనార్హం.మరోవైపు.. ఇటీవల నటాషా నుదిటిన బొట్టుతో ఉన్న ఫొటో పోస్ట్ చేస్తూ.. ‘‘అతడి ప్రేమ వల్లే ఇలా’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో అభిమానులు పాండ్యాను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ చేసిందని భావిస్తున్నారు.సోషల్ మీడియాలో విష్ చేయని హార్దిక్.. ఒంటరిగానే రీచార్జ్ అవుతున్నట్లుగాఅయితే, వాలంటైన్స్ డే తర్వాత.. నటాషా పుట్టినరోజున సైతం హార్దిక్పాండ్యా ఆమెకు విష్ చేస్తూ పోస్ట్ పెట్టకపోవడం గమనార్హం. కేవలం కొడుకుతో ఉన్న ఫొటోలు మాత్రమే ఇటీవల పోస్ట్ చేసిన హార్దిక్.. శుక్రవారం మరో ఫొటోతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రీచార్జ్ అవుతున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, ఇందులో నటాషా గానీ, అగస్త్య గానీ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తదుపరి ఐసీసీ ఈవెంట్లోమామూలుగా అయితే, ఆట నుంచి విరామం దొరకగానే హార్దిక్ పాండ్యా తన భార్య, కుమారుడితోనే ఎక్కువ సమయం గడుపుతాడు. హార్దిక్- నటాషాలలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందిస్తే తప్ప ఈ వదంతులకు చెక్ పడదు. కాగా హార్దిక్ సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి 2020లో పెళ్లాడాడు. పెళ్లికి ముందే తల్లిదండ్రులైన వీరు గతేడాది ఘనంగా మరోసారి వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా తదుపరి జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024కు సిద్ధం కానున్నాడు. చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)