Chennai Super Kings
-
టీమిండియా క్రికెటర్ మంచి మనసు.. రూ.7 లక్షల ఆర్ధిక సాయం
టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే తన మంచి మనసును చాటుకున్నాడు. తమిళనాడుకు చెందిన పది మంది యువ, ప్రతిభావంతులైన క్రీడాకారులకు రూ.7 లక్షల ఆర్ధిక సాయాన్ని దూబే చేశాడు. మంగళవారం జరిగిన తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TNSJA) అవార్డ్స్ అండ్ స్కాలర్షిప్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో యంగ్ అథ్లెట్స్కు దూబే చెక్లను అందజేశాడు.ఈ కార్యక్రమానికి దూబే ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అదేవిధంగా యువ అథ్లెట్లకు వారి విజయాలకు గుర్తింపుగా తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కూడా రూ. 30,000 స్కాలర్షిప్లను అందజేసింది. ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ.. "ఈ కార్యక్రమం యువ అథ్లెట్లందరికీ చాలా ప్రోత్సాహకరంగా ఉందని నేను భావిస్తున్నాను.ఈ చిన్న విజయాలను గుర్తించి వారిలో కొత్త ఉత్సహాన్ని తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నింపుతోంది. వారు మరింత కష్టపడి పనిచేసి దేశానికి గర్వకారణంగా నిలుస్తారు ఆశిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రామానికి నన్ను ఆహ్వానించిందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముంబైలో కూడా ఇటువంటి కార్యాక్రమాలు నేను చూశాను. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా యువ క్రీడాకారులకు మద్దతునిచ్చే పోగ్రామ్స్ నిర్వహిస్తుండడం చాలా సంతోషంగా ఉందని" అన్నాడు.నగదు సాయం అందుకున్న తమిళనాడు అథ్లెట్లు వీరే..పిబి అభినంద్ (టేబుల్ టెన్నిస్)కెఎస్ వెనిస శ్రీ (ఆర్చరీ)ముత్తుమీనా వెల్లసామి (పారా అథ్లెటిక్స్)షమీనా రియాజ్ (స్క్వాష్)ఎస్ నంధన (క్రికెట్)కమలి పి (సర్ఫింగ్)ఆర్ అభినయ (అథ్లెటిక్స్)ఆర్సి జితిన్ అర్జునన్ (అథ్లెటిక్స్)తక్షంత్ (చెస్)జయంత్ ఆర్కే (క్రికెట్) -
సీఎస్కే స్టార్ ఓపెనర్ ఇంట తీవ్ర విషాదం..
న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి డెంటాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని సీఎస్కే అధికారికంగా ధ్రువీకరించింది. "ఈ క్లిష్ట సమయంలో కాన్వే కుటుంబానికి మద్దతుగా ఉంటాము. డెంటాన్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము" అని సీఎస్కే యాజమాన్యం ఎక్స్లో రాసుకొచ్చింది. కాగా కాన్వే తండ్రి మృతికి సంతాపంగా ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఆటగాళ్లు నల్లటి బ్యాండ్లు ధరించి మైదానంలో దిగారు. కాగా కాన్వే ఇప్పటికే న్యూజిలాండ్కు చేరుకున్నాడు. అతడు ఈ ఏడాది ఐపీఎల్లో చివరగా ఏప్రిల్ 11న సీఎస్కే తరపున ఆడాడు.దక్షిణాఫ్రికాకు చెందిన డెంటాన్ కాన్వే కుటంబం.. డెవాన్ కాన్వే చిన్నతనంలో న్యూజిలాండ్కు మకాం మార్చారు. ఈ క్రమంలోనే కాన్వే దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా ప్రదర్శన చేసి కివీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతి తక్కువ కాలంలోనే బ్లాక్క్యాప్స్ జట్టులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్-2025లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన డెవాన్.. 27.03 స్ట్రైక్ రేట్తో 94 పరుగులు చేశాడు. కాన్వే తిరిగి రావడంపై మాత్రం సీఎస్కే ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ ఏడాది సీజన్లో సీఎస్కే దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. చెన్నై జట్టు ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది. -
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. సీఎస్కే నిర్ధేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ముంబై స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(76), సూర్యకుమార్ యాదవ్(68) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగలు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా(53), శివమ్ దూబే(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. మంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. చాహర్, శాంటర్న్ తలా వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన ముంబై..ఇక ఈ మ్యాచ్లో సీఎస్కేను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను మూడు సార్లు తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.ముంబై కంటే ముందు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయింది. 2008 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేను తొలిసారిగా ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత 2020 సీజన్లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నైపై 10 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చెన్నైను 9 వికెట్ల తేడాతో హార్దిక్ సేన ఓడించింది. కాగా ఈ ఓటమితో సీఎస్కే తమ ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు 8 మ్యాచ్ల ఆడిన చెన్నై కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IPL 2025: 'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్ -
CSK Vs MI: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ఆది నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ సీజన్లో తొలిసారి సామర్థ్యం మేరకు సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్) కూడా పర్వాలేదనిపించాడు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. -
MI VS CSK: సూర్యవంశీ తరహాలో ఇరగదీసిన ఆయుశ్ మాత్రే.. అరంగేట్రంతో రికార్డు
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో ఆయుశ్ మాత్రే సీఎస్కే తరఫున అరంగేట్రం చేస్తున్నాడు. మాత్రే ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మాత్రే 17 ఏళ్ల 278 రోజుల వయసులో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు. మాత్రేకు ముందు ఈ రికార్డు అభినవ్ ముకుంద్ పేరిట ఉండేది. ముకుంద్ 18 ఏళ్ల 139 రోజుల వయసులో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు.ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కులైన ఆటగాళ్ళు17y 278d - ఆయుశ్ మాత్రే vs MI, వాంఖడే, 2025*18y 139d - అభినవ్ ముకుంద్ vs RR, చెన్నై, 200819y 123d - అంకిత్ రాజ్పూత్ vs MI, చెన్నై, 201319y 148d - మతీష పతిరన vs GT, వాంఖడే, 202220y 79d - నూర్ అహ్మద్ vs MI, చెన్నై, 2025మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే 16 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ బౌలింగ్లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి రచిన్ రవీంద్ర (5) ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆయుశ్ మాత్రే తన తొలి ఇన్నింగ్స్లోనే ఇరగదీశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్లో సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. #RRvLSG: 14-year-old Vaibhav Suryavanshi's first three balls vs LSG on IPL debut: 𝐒𝐈𝐗, 1 RUN, 𝐒𝐈𝐗,#MIvCSK: 17-year-old Ayush Mhatre's first four balls vs MI on IPL debut: 1 RUN, 𝗙𝗢𝗨𝗥, 𝐒𝐈𝐗, 𝐒𝐈𝐗,WHAT A WAY TO ANNOUNCE YOUR ARRIVAL! | 📸: JioStar pic.twitter.com/WRVTwqEt2f— CricTracker (@Cricketracker) April 20, 20256.5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 57/2గా ఉంది. షేక్ రషీద్కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్లోకి వచ్చాడు. కాగా, నిన్న జరిగిన మ్యాచ్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) ఎలా రెచ్చిపోయాడో, ఈ మ్యాచ్లో ఆయుశ్ మాత్రే కూడా అలాగే ఇరగదీశాడు. సూర్యవంశీ తన అరంగేట్రం ఇన్నింగ్స్లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. -
IPL 2025: సీఎస్కేపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
సీఎస్కేపై ముంబై ఇండియన్స్ ఘన విజయంచెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ముంబై 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ముంబైని విజయతీరాలకు చేర్చారు. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను ముగించాడు.సూర్యకుమార్ హాఫ్ సెంచరీస్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 146/1గా ఉంది.టార్గెట్ 177.. 13 ఓవర్లలో ముంబై స్కోర్ 127/1రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మరోహిత్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్లో సూర్యకుమార్ 32 పరుగులతో (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా ఉన్నాడు. 12 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 112/1గా ఉంది. టార్గెట్ 177.. 9 ఓవర్లలో ముంబై స్కోర్ 88/1రోహిత్ శర్మ (27 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 14; ఫోర్, సిక్స్)తొలి వికెట్ కోల్పోయిన ముంబై6.4వ ఓవర్- 63 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో ఆయుశ్ మాత్రేకు క్యాచ్ ఇచ్చి రికెల్టన్ (24) ఔటయ్యాడు.టార్గెట్ 177.. 6 ఓవర్లలో ముంబై స్కోర్ 62/0రోహిత్ శర్మ (18 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రికెల్టన్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్)టార్గెట్ 177.. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ177 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతుంది. రోహిత్ శర్మ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. 3 ఓవర్లలో ముంబై స్కోర్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులుగా ఉంది. రోహిత్ 10 బంతుల్లో 2 ఫోర్లు,2 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేశాడు. రికెల్టన్ 8 బంతుల్లో 2 బౌండరీల సాయంతో 11 పరుగులు చేశాడు. రాణించిన దూబే, జడేజా.. గౌరవప్రదమైన స్కోర్ చేసిన సీఎస్కేటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే గౌరవప్రమదై స్కోర్ చేసింది. శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. ధోని ఔట్18.4వ ఓవర్- 156 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ధోని (4) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. దూబే ఔట్16.2వ ఓవర్- 142 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో విల్ జాక్స్కు క్యాచ్ ఇచ్చి శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న దూబేఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన శివమ్ దూబే అదరగొడుతున్నాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. దూబేకు జతగా రవీంద్ర జడేజా (19) క్రీజ్లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 118/3గా ఉంది.మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే7.6వ ఓవర్- 63 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో షేక్ రషీద్ (19) స్టంపౌటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 66/3గా ఉంది. రవీంద్ర జడేజా (6), శివమ్ దూబే (1) క్రీజ్లో ఉన్నారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔటైన ఆయుశ్ మాత్రేఅరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే తన తొలి ఇన్నింగ్స్లోనే అదరగొట్టాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్లో సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 6.5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 57/2గా ఉంది. షేక్ రషీద్కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే3.1వ ఓవర్- 16 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ తన స్పెల్ తొలి బంతికే రచిన్ రవీంద్ర (9 బంతుల్లో 5) వికెట్ తీశాడు. ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ 10 బంతుల్లో బౌండరీ సాయంతో 11 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. రషీద్కు జతగా అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే క్రీజ్లోకి వచ్చాడు.ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మ్హత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, MS ధోని(కెప్టెన్/వికెట్కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరణఇంపాక్ట్ సబ్లు: అన్షుల్ కాంబోజ్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, సామ్ కర్రాన్, రవిచంద్రన్ అశ్విన్ -
IPL 2025: సీఎస్కే అభిమానులకు అదిరిపోయే వార్త.. జట్టులోకి చిచ్చరపిడుగు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తూ, పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తమ బ్యాటింగ్ విభాగాన్ని పటిష్ట పరచుకునే పనిలో పడింది. ఇప్పటికే గాయపడిన కెప్టెన్ రుతురాజ్ స్థానాన్ని ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రేతో భర్తీ చేసిన సీఎస్కే యాజమాన్యం తాజాగా మరో గాయపడిన ఆటగాడికి రీప్లేస్మెంట్ను ప్రకటించింది. లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన గుర్జప్నీత్ సింగ్ ఈ సీజన్ ఆరంభ దశలో గాయపడగా.. తాజాగా అతని స్థానాన్ని సౌతాఫ్రికా చిచ్చరపిడుగు, బేబీ ఏబీడీగా పిలువబడే డెవాల్డ్ బ్రెవిస్తో భర్తీ చేసింది. బ్రెవిస్ ఈ సీజన్ మెగా వేలంలో 75 లక్షల బేస్ ధర విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ.. సీఎస్కే మేనేజ్మెంట్ అతనికి బంపరాఫర్ ఇచ్చి ఏకంగా రూ. 2.2 కోట్లకు డీల్ సైన్ చేసుకుంది. వాస్తవానికి ఈ సీజన్లో సీఎస్కేకు ఓ ఓవర్సీస్ బెర్త్ ఖాళీగా ఉంది. ఎవరికీ రీప్లేస్మెంట్గా కాకుండానే బ్రెవిస్ను ఎంపిక చేసుకునే అవకాశం ఆ జట్టుకు ఉండింది. అయినా ఎందుకో వేచి చూసే ధోరణిని అవళంభించి గుర్జప్నీత్కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంది. విధ్వంసకర వీరుడిగా పేరు తెచ్చుకున్న బ్రెవిస్ను ఈ సీజన్ మెగా వేలంలో ఎందుకో ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు. బ్రెవిస్ గతంలో ముంబై ఇండియన్స్కు ఆడాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీల్లోనూ అతను ముంబై సిస్టర్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 21 ఏళ్ల బ్రెవిస్ సౌతాఫ్రికా తరఫున కేవలం రెండు మ్యాచ్లే ఆడినప్పటికీ.. అతన్ని ఆ దేశ దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్తో పోలుస్తారు. బ్రెవిస్ ఓవరాల్గా 81 టీ20లు ఆడి 145 స్ట్రయిక్రేట్తో పరుగులు చేశాడు. బ్రెవిస్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. సౌతాఫ్రికా దేశవాలీ సీజన్లో ఫార్మాట్లకతీతంగా అదరగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్లోనూ బ్రెవిస్ మంచి ప్రదర్శనలు చేశాడు. బ్రెవిస్ ఫామ్ కష్టాల్లో ఉన్న సీఎస్కేను గట్టెక్కిస్తుందేమో చూడాలి. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ను ఢీకొట్టబోతుంది. ఈ మ్యాచ్ వాంఖడే వేదికగా ఏప్రిల్ 20న జరుగనుంది. ఈ సీజన్లో సీఎస్కే తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసి ఆతర్వాత వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడింది. తాజా లక్నోతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే మళ్లీ గెలుపు గుర్రం ఎక్కింది. ఈ సీజన్లో సీఎస్కే ఏడు మ్యాచ్ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించి, నాలుగు పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ సీజన్లో సీఎస్కే బ్యాటింగ్ విభాగంలో చాలా బలహీనంగా కనిపిస్తుంది. రుతురాజ్ వైదొలగడంతో ఆ జట్టు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ చేరికతో సీఎస్కే బ్యాటింగ్ కష్టాలు తీరుతాయేమో చూడాలి. ఈ సీజన్లో సీఎస్కే బౌలింగ్లో పర్వాలేదనిపిస్తుంది. రుతరాజ్ గైర్హాజరీలో సీఎస్కే కెప్టెన్గా ధోని వ్యవహరిస్తున్నాడు. లక్నోపై గెలుపులో ధోని కీలకపాత్ర పోషించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, ఖలీల్ అహ్మద్, పతిరణ అద్భుతంగా రాణిస్తున్నారు. -
ఐపీఎల్ టీమ్లతో మాస్టర్ కార్డ్ జట్టు
క్రికెట్ అభిమానులను, ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై మక్కువ ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని మాస్టర్ కార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) భాగస్వామ్యంతో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ఆవిష్కరించింది. డైనింగ్ డిస్కౌంట్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ప్రయాణ సౌకర్యాలను అందించడం ద్వారా క్రికెట్ ఔత్సాహికులకు సేవలందించడానికి ఈ కార్డులను రూపొందించినట్లు తెలిపింది.మాస్టర్ కార్డ్, సిటీ యూనియన్ బ్యాంక్(సీయూబీ) భాగస్వామ్యంతో సీఎస్కే, ఎస్ఆర్హెచ్ను రిప్రెజెంట్ చేసేలా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తయారు చేసింది. ఇందులో సీయూబీ సీఎస్కే మాస్టర్ కార్డ్ ప్లాటినం క్రెడిట్ కార్డు, సీయూబీ సీఎస్కే వరల్డ్ మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డు, సీయూబీ ఎస్ఆర్హెచ్ మాస్టర్ కార్డ్ ప్లాటినం క్రెడిట్ కార్డు, సీయూబీ ఎస్ఆర్హెచ్ వరల్డ్ మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డులున్నాయి.ఇదీ చదవండి: ఇంకా చాలామంది మోసగాళ్లు దాక్కున్నారు..మాస్టర్ కార్డ్ దక్షిణాసియా డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ మాట్లాడుతూ ‘సీఎస్కే మాస్టర్ వరల్డ్, మాస్టర్ కార్డ్ వన్ డైన్స్ ఫ్రీ ప్రోగ్రామ్ను అందిస్తున్నాయి. ఇది ఆసియా పసిఫిక్ అంతటా ప్రముఖ రెస్టారెంట్లలో కాంప్లిమెంటరీ మెయిన్ కోర్సును అందిస్తుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రధాన నగరాల్లోని టాప్ రెస్టారెంట్లలో భోజనం చేసేటప్పుడు కాంప్లిమెంటరీ మెయిన్ కోర్సును వెసులుబాటు ఉంటుంది. మాస్టర్ కార్డ్ కలినరీ క్లబ్ ప్రోగ్రామ్ భారతదేశంలోని కొన్ని ఉత్తమ రెస్టారెంట్లలో 30% వరకు తగ్గింపును అందిస్తుంది. అంతేకాక, ఈ క్రెడిట్ కార్డు మాస్టర్ కార్డ్ వన్ నైట్ ఫ్రీ ప్రోగ్రామ్కు కూడా అర్హత కలిగి ఉంటుంది. దీనిలో కార్డుదారుడు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని భాగస్వామ్య హోటళ్లు, రిసార్ట్ల్లో కాంప్లిమెంటరీగా ఒక రాత్రి బస చేసేందుకు అవకాశం ఉంటుంది’ అన్నారు.స్వాగత బహుమతిగా జెర్సీసిటీ యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం సీయూబీ సీఎస్కే మాస్టర్ కార్డ్ ప్లాటినం క్రెడిట్ కార్డు నిర్దిష్ట ఖర్చు పరిమితికి లోబడి సీఎస్కే జెర్సీని స్వాగత బహుమతిగా అందిస్తున్నట్లు తెలిపింది. సీయూబీ సీఎస్కే వరల్డ్ మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డు ఒరిజినల్ ధోని నెం 7 జెర్సీని ఎటువంటి నిబంధనలు లేకుండా స్వాగత బహుమతిగా అందిస్తుంది. -
చరిత్ర సృష్టించిన గుంటూరు కుర్రాడు.. తొలి సీఎస్కే ప్లేయర్గా
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాల తర్వాత తిరిగి పుంజుకుంది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో సీఎస్కే గెలుపొందింది. ఈ విజయంలో కెప్టెన్ ధోని(26), దూబే(43), రచిన్ రవీంద్ర(37)లది కీలక పాత్ర.సీఎస్కే గెలుపులో వీరు ముగ్గురుతో పాటు మరో యువ ఆటగాడు కూడా తన వంతు పాత్ర పోషించాడు. అతడే భారత అండర్-19 టీమ్ మాజీ వైస్ కెప్టెన్, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్. షేక్ రషీద్ సీఎస్కే తరపున తన ఐపీఎల్ అరంగేట్రంలోనే అందరిని ఆకట్టుకున్నాడు.167 పరుగుల లక్ష్య చేధనలో దూకుడుగా ఆడుతూ చెన్నైకి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ మ్యాచ్లో 19 బంతులు ఎదుర్కొన్న రషీద్.. 6 ఫోర్లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ రచిన్ రవీంద్రతో కలిసి తొలి వికెట్కు 52 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.సామ్ కుర్రాన్ రికార్డు బద్దలు..ఈ మ్యాచ్లో షేక్ రషీద్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో సీఎస్కే తరపున ఇన్నింగ్స్ను ప్రారంభించిన అతి పిన్న వయస్కుడిగా రషీద్ నిలిచాడు. ఈ ఆంధ్రా ఆటగాడు కేవలం 20 ఏళ్ల 202 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కుర్రాన్ పేరిట ఉండేది.కుర్రాన్ ఐపీఎల్-2020లో సీఎస్కే తరపున 22 ఏళ్ల 132 రోజుల వయస్సులో ఇన్నింగ్స్ను ఓపెన్ చేశాడు. తాజా మ్యాచ్తో కుర్రాన్ ఆల్టైమ్ రికార్డును రషీద్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రషీద్ను రూ.30 లక్షల బేస్ ప్రైస్కు సీఎస్కే కొనుగోలు చేసింది. రషీద్ తన కెరీర్లో ఇప్పటివరకు 19 ఫస్ట్ క్లాస్లు మ్యాచ్లు ఆడి 37. 62 సగటుతో 1204 పరుగులు చేశాడు. అంతేకాకుండా 12 లిస్ట్-ఎ, 17 టీ 20 మ్యాచ్లు ఆడాడు.చదవండి: ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని -
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
ఐపీఎల్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మరో చారిత్రక మైలురాయిని అందుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో 200 డిస్మిసల్స్ను (క్యాచ్లు లేదా స్టంపింగ్స్) పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా (ఫీల్డర్ లేదా వికెట్ కీపర్) చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 14) లక్నోతో జరిగిన మ్యాచ్లో ఆయుశ్ బదోనిని స్టంపౌట్ (రవీంద్ర జడేజా బౌలింగ్లో) చేయడంతో ఈ ఘనత సాధించాడు. 𝙀𝙖𝙨𝙞𝙡𝙮 𝘿𝙤𝙣𝙚 😎Dismissal No.2⃣0⃣0⃣ for MS Dhoni Wicket No.2⃣ for Ravindra Jadeja tonight 🎥 @ChennaiIPL fans have plenty to celebrate here 💛Updates ▶ https://t.co/jHrifBkT14 #TATAIPL | #LSGvCSK | @msdhoni | @imjadeja pic.twitter.com/UHwLwpJ4XK— IndianPremierLeague (@IPL) April 14, 2025ఈ మ్యాచ్లో ధోని మరో ఇద్దరిని ఔట్ చేయడంలో కూడా భాగమయ్యాడు. పతిరణ బౌలింగ్లో వైడ్బాల్ను కలెక్ట్ చేసుకుని అద్భుతమైన డైరెక్ట్ త్రోతో (నాన్ స్ట్రయికర్ ఎండ్) అబ్దుల్ సమద్ను రనౌట్ చేసి.. ఆ మరుసటి బంతికే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. పంత్ క్యాచ్తో ఐపీఎల్లో ధోని డిస్మిసల్స్ సంఖ్య 201కి చేరింది. ధోని తన 270వ ఇన్నింగ్స్లో డిస్మిసల్స్ డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.Thala doing it all tonight, in his own style😎What a precise underhand throw that was by Dhoni 🔥#LSGvsCSK #LSGvCSK #CSKvLSG pic.twitter.com/kIuPayt8t4— Aditya Singh Rawat (@Catslayer_999) April 14, 2025ఐపీఎల్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన ఆటగాళ్లు (ఫీల్డర్ లేదా వికెట్ కీపర్)201* - ఎంఎస్ ధోని (155 క్యాచ్లు, 46 స్టంపింగ్లు)182 - దినేష్ కార్తీక్126 - ఏబీ డివిలియర్స్124 - రాబిన్ ఉతప్ప118 - వృద్ధిమాన్ సాహా116 - విరాట్ కోహ్లీలక్నో మ్యాచ్లో తొలుత అద్భుతమైన వికెట్కీపింగ్తో అదరగొట్టిన ధోని ఆతర్వాత బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు. 11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 26 పరుగులు చేసి సీఎస్కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా (3-0-24-2), పతిరణ (4-0-45-2), నూర్ అహ్మద్ (4-0-13-0), ఖలీల్ అహ్మద్ (4-0-38-1), అన్షుల్ కంబోజ్ (3-0-20-1) రాణించడంతో నామమాత్రపు స్కోర్కే (166/7) పరిమితమైంది.లక్నో ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భీకర ఫామ్లో ఉన్న పూరన్ (8), మార్క్రమ్ (6) ఈ మ్యాచ్లో విఫలమయ్యారు.అనంతరం 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే.. తొలి 15 ఓవర్ల వరకు (115/5) పరాజయం దిశగా సాగింది. ధోని రాకతో సీఎస్కేలో గెలుపు జోష్ వచ్చింది. ధోని వచ్చీ రాగానే ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అప్పటివరకు నిదానంగా ఆడిన శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధోని అండతో గేర్ మార్చాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 3 బంతులు మిగిలుండగానే సీఎస్కేను విజయతీరాలకు చేర్చారు.సీఎస్కే ఇన్నింగ్స్లో తెలుగు కుర్రాడు షేక్ రషీద్ (27), రచిన్ రవీంద్ర (37) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రాహుల్ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7), విజయ్ శంకర్ (9) నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ సింగ్ రాఠీ (4-0-23-1), రవి బిష్ణోయ్ (3-0-18-2), మార్క్రమ్ (4-0-25-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. శార్దూల్ ఠాకూర్, ఆకాశ్దీప్, ఆవేశ్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. -
కొంప ముంచిన పంత్ నిర్ణయం!.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..
ఐపీఎల్-2025 (IPL 2025)లో వరుస విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్కు ఎదురుదెబ్బ తగిలింది. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే, డెత్ ఓవర్లలో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీసుకున్న నిర్ణయాలే లక్నో ఓటమికి ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి.49 బంతుల్లో 63 రన్స్లక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్లో చెన్నై (LSG vs CSK)తో తలపడ్డ పంత్ సేన.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఐడెన్ మార్క్రమ్ (6) విఫలం కాగా.. మిచెల్ మార్ష్ (30) ఫర్వాలేదనిపించాడు. అయితే, ఇన్ఫామ్ బ్యాటర్ నికోలస్ పూరన్ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలో నాలుగో స్థానంలో ఆడిన పంత్ 49 బంతుల్లో 63 రన్స్ చేయగా.. ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) అతడికి సహకారం అందించారు. ఫలితంగా లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ (నాలుగు ఓవర్లలో 13 రన్స్) పొదుపుగా బౌలింగ్ చేశాడు. పేసర్లలో మతీశ పతిరణ రెండు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు చెన్నై తడబడింది.శివం దూబేతో కలిసి ధోనిఓపెనర్లు షేక్ రషీద్ (19 బంతుల్లో 27), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37) ఓ మోస్తరుగా ఆడగా.. రాహుల్ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7) పూర్తిగా విఫలమయ్యారు. వీరిద్దరు లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయి బౌలింగ్లో వెనుదిరిగారు. ఇలాంటి తరుణంలో శివం దూబేతో కలిసి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.రవి బిష్ణోయిని కాదని.. ఈ క్రమంలో ఆఖరి నాలుగు ఓవర్లలో చెన్నై విజయానికి 44 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఒత్తిడిలో కూరుకుపోయిన లక్నో సారథి పంత్ బౌలింగ్ చాయిస్ విషయంలో తప్పటడుగు వేశాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసిన రవి బిష్ణోయిని కాదని.. పేస్ ద్వయం ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ను నమ్ముకున్నాడు.ఇక దూబే (37 బంతుల్లో 43), ధోని (11 బంతుల్లో 26) వారి బౌలింగ్లో పరుగులు పిండుకుని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే చెన్నైని విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయి పంత్ నిర్ణయంపై స్పందించాడు.నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..‘‘నేను పంత్తో ఏమీ మాట్లాడలేదు. అయితే, వికెట్ స్వభావాన్ని బట్టి నన్ను పిలుస్తాడేమోనని రెండు, మూడు సార్లు అతడికి దగ్గరగా వెళ్లాను. కానీ తన ప్రణాళికలు వేరేగా ఉన్నాయి. కాబట్టి నన్ను పట్టించుకోలేదేమో!ఇలాంటి కీలక సమయంలో కెప్టెన్గా, వికెట్ కీపర్గా తనకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి. మా కంటే అతడే గొప్పగా పరిస్థితులను అంచనా వేయగలడు. అందుకే తన నిర్ణయం సరైందనే భావనతో ముందుకు వెళ్లి ఉంటాడు.ఏదైమైనా మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను, రాఠి, మార్క్రమ్ ఉన్నాం. కాబట్టి అదనపు స్పిన్నర్ అవసరం లేదు. ఇక మహీ భాయ్ గురించి చెప్పేదేముంది?!.. బంతి తన ఆధీనంలో ఉందంటే దానిని బౌండరీకి తరలించడమే తరువాయి’’ అని రవి బిష్ణోయి పరోక్షంగా పంత్ నిర్ణయాన్ని విమర్శించాడు.కాగా లక్నో బౌలర్లలో స్పిన్నర్లు రవి బిష్ణోయి మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దిగ్వేశ్ సింగ్ రాఠీ, మార్క్రమ్ ఒక్కో వికెట్ తీయగా.. పేసర్లలో ఆవేశ్ ఖాన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.చదవండి: MS Dhoni On POM Award: ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది The IMPACT player does it with MAX IMPACT 🤩Shivam Dube 🤝 MS Dhoni with a match-winning partnership 💛@ChennaiIPL are 🔙 to winning ways 😎Scorecard ▶ https://t.co/jHrifBlqQC #TATAIPL | #LSGvCSK pic.twitter.com/AI2hJkT9Dt— IndianPremierLeague (@IPL) April 14, 2025 -
LSG VS CSK: చరిత్ర సృష్టించిన ధోని
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై గెలిచిన తొలి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్లో ధోని ముగ్గురిని ఔట్ చేయడంలో భాగం కావడంతో పాటు ఛేదనలో అతి మూల్యమైన ఇన్నింగ్స్ (11 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) ఆడాడు. ఫలితంగా సీఎస్కే లక్నోను వారి సొంత ఇలాకాలో (అటల్ బిహారీ వాజ్పేయ్ స్టేడియం) చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ప్రదర్శనకు గానూ ధోని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకునే సమయానికి ధోని వయసు 43 ఏళ్ల 282 రోజులు. ధోనికి ముందు ఈ రికార్డు మాజీ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ప్రవీణ్ తాంబే పేరిట ఉండేది. ప్రవీణ్ 42 ఏళ్ల 200 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2014 సీజన్లో అబుదాబీలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ప్రవీణ్ ఈ ఘనత సాధించాడు.ఐపీఎల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న అతి పెద్ద వయస్కులుఎంఎస్ ధోని- 43 ఏళ్ల 282 రోజులుప్రవీణ్ తాంబే- 42 ఏళ్ల 200 రోజులుషేన్ వార్న్- 41 ఏళ్ల 211 రోజులుఆడమ్ గిల్క్రిస్ట్- 41 ఏళ్ల 181 రోజులుమ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా (3-0-24-2), పతిరణ (4-0-45-2), నూర్ అహ్మద్ (4-0-13-0), ఖలీల్ అహ్మద్ (4-0-38-1), అన్షుల్ కంబోజ్ (3-0-20-1) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భీకర ఫామ్లో ఉన్న పూరన్ (8), మార్క్రమ్ (6) ఈ మ్యాచ్లో విఫలమయ్యారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే.. ఓ దశలో కష్టాలు ఎదుర్కొన్నటికీ శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని సత్తా చాటడంతో మరో 3 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. సీఎస్కే ఇన్నింగ్స్కు తెలుగు కుర్రాడు షేక్ రషీద్ (27), రచిన్ రవీంద్ర (37) గట్టి పునాది వేశారు. వీరిద్దరు తొలి వికెట్కు 52 పరుగులు జోడించారు. రాహుల్ త్రిపాఠి (9) వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. రవీంద్ర జడేజా (7), విజయ్ శంకర్ (9) కూడా నిరాశపరిచారు. ధోని, దూబే ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి సీఎస్కేను గెలిపించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ సింగ్ రాఠీ (4-0-23-1), రవి బిష్ణోయ్ (3-0-18-2), మర్క్రమ్ (4-0-25-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. శార్దూల్ ఠాకూర్, ఆకాశ్దీప్, ఆవేశ్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. సీఎస్కే విజయానికి చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు అవసరమైనప్పుడు.. దూబే, ధోని జోడీ శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు రాబట్టింది. చివరి ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. మూడో బంతికి దూబే బౌండరీ బాది సీఎస్కేను విజయతీరాలు దాటించాడు. -
ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది: ధోని
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2025 (IPL 2025)లో గెలుపు బాట పట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs CSK)పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. తమ పరాజయ పరంపరకు బ్రేక్ వేసింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సీజన్లో రెండో గెలుపు నమోదు చేసింది.రిషభ్ పంత్ తొలిసారిలక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు రాణించడంతో లక్నోను 166 పరుగులకు కట్టడి చేయగలిగింది. లక్నో ఆటగాళ్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సీజన్లో తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. 49 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. ఇక సీఎస్కే బౌలర్లలో మతీశ పతిరణ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.పొదుపుగా బౌలింగ్ చేసిన నూర్మిగతా వాళ్లలో నూర్ అహ్మద్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ స్పిన్ బౌలర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 13 పరుగులే ఇచ్చాడు. ఇక లక్నో విధించిన లక్ష్యాన్ని ధోని సేన 19.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు షేక్ రషీద్ (19 బంతుల్లో 27), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించగా.. శివం దూబే (37 బంతుల్లో 43 నాటౌట్) నిలకడగా ఆడాడు. ఆఖర్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి దూబేతో కలిసి జట్టు గెలుపును ఖరారు చేశాడు.ఈ నేపథ్యంలో విజయానంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తూ వివిధ కారణాల వల్ల మేము ఆరంభ మ్యాచ్లలో విఫలమయ్యాం. సొంత మైదానం చెపాక్లో ఓటములు చవిచూశాం.ఘనమైన భవిష్యత్తుఇలాంటి సమయంలో ఇతర వేదికపై గెలవడం కాస్త ఊరట కలిగించే అంశం. జట్టులో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపిన విజయం ఇది. పవర్ ప్లేలో మేము ఈసారి కూడా ఇబ్బందిపడ్డాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం.అయినప్పటికీ తిరిగి పుంజుకున్నాం. ఈరోజు మా బౌలర్లు, బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. షేక్ రషీద్ మాతో చాన్నాళ్లుగా ప్రయాణం చేస్తున్నాడు. నెట్స్లో స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొంటున్నాడు. ఈరోజు అతడు మ్యాచ్ ఆడాడు. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో గొప్పగా రాణించగల సత్తా అతడికి ఉంది.ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సిందిఇక ఈరోజైతే నాకు.. ‘నాకు ఎందుకు ఈ అవార్డు ఇస్తున్నారు?’ అని అనిపించింది. నిజానికి నూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు కదా!’’ అని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను నూర్ అహ్మద్కు ఇచ్చి ఉంటే బాగుండేదని ధోని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్లో ముంబైని ఓడించిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడింది. తాజాగా లక్నోపై గెలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివర్లోనే కొనసాగుతోంది.ఐపీఎల్ 2025: లక్నో వర్సెస్ చెన్నై👉లక్నో స్కోరు: 166/7 (20)👉చెన్నై స్కోరు: 168/5 (19.3)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో లక్నోపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహేంద్ర సింగ్ ధోని.చదవండి: IPL 2025: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు.. The IMPACT player does it with MAX IMPACT 🤩Shivam Dube 🤝 MS Dhoni with a match-winning partnership 💛@ChennaiIPL are 🔙 to winning ways 😎Scorecard ▶ https://t.co/jHrifBlqQC #TATAIPL | #LSGvCSK pic.twitter.com/AI2hJkT9Dt— IndianPremierLeague (@IPL) April 14, 2025 -
CSK Vs LSG: చెన్నై గెలిచిందోచ్...
మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్కు కాస్త ఊరట... వరుసగా ఐదు పరాజయాల తర్వాత పూర్తిగా ఆట మరచినట్లు కనిపించిన జట్టు ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి లక్నోను ఆ జట్టు వేదికపైనే స్పిన్తో కట్టడి చేసిన సీఎస్కే ఆ తర్వాత మరో మూడు బంతులు మిగిలి ఉండగా లక్ష్యం చేరింది. బౌలింగ్లో నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించగా, బ్యాటింగ్లో శివమ్ దూబే రాణించాడు. అన్నింటికి మించి మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగా క్రీజ్లోకి వచ్చిన ధోని తడబాటు లేకుండా, దూకుడుగా ఆడి జట్టుకు అవసరమైన ‘విలువైన’ పరుగులు సాధించడం మరో సానుకూలాశం. మరోవైపు ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీద కనిపించిన లక్నో సమష్టి వైఫల్యంతో ఓటమిని ఆహా్వనించింది. లక్నో: ఐపీఎల్లో ఎట్టకేలకు మూడు వారాల విరామం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) గెలుపు రుచి చూసింది. సోమవారం జరిగిన పోరులో సీఎస్కే 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెపె్టన్ రిషభ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా, మిచెల్ మార్‡్ష (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) గెలుపు దిశగా నడిపించగా, ఎమ్మెస్ ధోని (11 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 28 బంతుల్లో అభేద్యంగా 57 పరుగులు జోడించారు. పంత్ హాఫ్ సెంచరీ... తొలి ఓవర్లోనే మార్క్రమ్ (6) అవుట్ కాగా, టోర్నీ ప్రస్తుత టాప్ స్కోరర్ నికోలస్ పూరన్ (8) కూడా విఫలం కావడంతో లక్నోకు సరైన ఆరంభం లభించలేదు. ఖలీల్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి మార్‡్ష జోరు ప్రదర్శించగా, పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 42 పరుగులకు చేరింది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 80 స్ట్రయిక్రేట్తో 40 పరుగులే చేసిన పంత్ ఈ మ్యాచ్లో పట్టుదలగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్లో మార్‡్షను జడేజా వెనక్కి పంపగా... ఒవర్టన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టిన ఆయుశ్ బదోని (17 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్లు) కూడా జడేజా బౌలింగ్లోనే అవుటయ్యాడు. అప్పటి వరకు మెరుగ్గానే ఆడిన పంత్ను చెన్నై స్పిన్నర్లు పూర్తిగా కట్టిపడేశారు. ముఖ్యంగా నూర్ బౌలింగ్లో 15 బంతులు ఆడిన పంత్ 10 బంతుల్లో సింగిల్ కూడా తీయలేకపోయాడు! అయితే ఆ తర్వాత పతిరణ ఓవర్లో 2 సిక్స్లు బాదడంతో 42 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. చివరి 3 ఓవర్లలో లక్నో 45 పరుగులు సాధించింది. కీలక భాగస్వామ్యం... 2023 సీజన్ నుంచి చెన్నై జట్టుతో ఉన్న ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ (19 బంతుల్లో 27; 6 ఫోర్లు)కు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. కొన్ని చక్కటి షాట్లతో అతను ఆకట్టుకున్నాడు. ఆకాశ్దీప్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను, శార్దుల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టడం విశేషం. అయితే అవేశ్ ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మరో ఎండ్లో రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37; 5 ఫోర్లు) కూడా వేగంగా ఆడటంతో పవర్ప్లేలో చెన్నై 59 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత తక్కువ వ్యవధిలో జట్టు రచిన్, త్రిపాఠి (9), జడేజా (7), విజయ్శంకర్ (9) వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. విజయానికి 30 బంతుల్లో 56 పరుగులు కావాల్సిన స్థితిలో దూబే, ధోని జత కలిశారు. తాను ఆడిన తొలి బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్స్ బాది ధోని దూకుడు ప్రదర్శించడంలో ఒత్తిడి కాస్త తగ్గింది. చివరి 2 ఓవర్లలో 24 పరుగులు అవసరమయ్యాయి. శార్దుల్ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ సహా 19 పరుగులు రాబట్టి విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్న చెన్నై... మరో మూడు బంతుల్లో లాంఛనం పూర్తి చేసింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) త్రిపాఠి (బి) అహ్మద్ 6; మార్‡్ష (బి) జడేజా 30; పూరన్ (ఎల్బీ) (బి) కంబోజ్ 8; పంత్ (సి) ధోని (బి) పతిరణ 63; బదోని (స్టంప్డ్) ధోని (బి) జడేజా 22; సమద్ (రనౌట్) 20; మిల్లర్ (నాటౌట్) 0; శార్దుల్ (సి) రషీద్ (బి) పతిరణ 6; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–6, 2–23, 3–73, 4–105, 5–158, 6–158, 7–166. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–38–1, అన్షుల్ కంబోజ్ 3–0–20–1, ఒవర్టన్ 2–0–24–0, జడేజా 3–0–24–2, నూర్ అహ్మద్ 4–0–13–0, పతిరణ 4–0–45–2. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) పూరన్ (బి) అవేశ్ 27; రచిన్ (ఎల్బీ) (బి) మార్క్రమ్ 37; రాహుల్ త్రిపాఠి (సి అండ్ బి) రవి బిష్ణోయ్ 9; జడేజా (సి) మార్క్రమ్ (బి) రవి బిష్ణోయ్ 7; శివమ్ దూబే (నాటౌట్) 43; విజయ్శంకర్ (సి) అవేశ్ (బి) దిగ్వేశ్ రాఠీ 9; ధోని (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–52, 2–74, 3–76, 4–96, 5–111. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–56–0, ఆకాశ్దీప్ 1–0–13–0, దిగ్వేశ్ రాఠీ 4–0–23–1, అవేశ్ ఖాన్ 3.3–0–32–1, రవి బిష్ణోయ్ 3–0–18–2, మార్క్రమ్ 4–0–25–1. ఐపీఎల్లో నేడుపంజాబ్ X కోల్కతా వేదిక: ముల్లాన్పూర్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
రఫ్పాడించిన ధోని.. చెన్నై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించాడు.ధోని కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్స్తో 26 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా 167 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో చేధించింది. రచిన్ రవీంద్ర(37), షేక్ రషీద్(27) పరుగులతో రాణించారు.లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. దిగ్వేష్, మార్క్రమ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.49 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్ష్(30), బదోని(22) రాణించారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా,పతిరానా తలా రెండు వికెట్లు సాధించగా.. ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ ఒక్క వికెట్ పడగొట్టారు.చదవండి: IPL 2025: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు.. -
IPL 2025: ధోని మెరుపులు.. లక్నోపై సీఎస్కే విజయం
LSG vs CSK Live Updates: సీఎస్కే ఘన విజయంఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించాడు. ధోని కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్స్తో 26 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా 167 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో చేధించింది. 18 ఓవర్లకు స్కోర్: 143/518 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(26), ధోని(20) ఉన్నారు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 127/516 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(19), ధోని(9) ఉన్నారు. సీఎస్కే విజయానికి 24 బంతుల్లో 44 పరుగులు కావాలి.సీఎస్కే నాలుగో వికెట్ డౌన్..జడేజా రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జడేజా.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.రవీంద్ర ఔట్..రచిన్ రవీంద్ర రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. మార్క్రమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.సీఎస్కే తొలి వికెట్ డౌన్..షేక్ రషీద్ రూపంలో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన షేక్ రషీద్.. అవేష్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్కే వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర(25), రాహుల్ త్రిపాఠి(5) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న సీఎస్కే167 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. క్రీజులో షేక్ రషీద్(22), రచిన్ రవీంద్ర (15) ఉన్నారు.రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే?ఎక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్ష్(30), బదోని(22) రాణించారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా,పతిరానా తలా రెండు వికెట్లు సాధించగా.. ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ ఒక్క వికెట్ పడగొట్టారు.రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ..రిషబ్ పంత్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. లక్నో వేదికగా సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. 55 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 18 ఓవర్లు ముగిసే సరికి లక్నో నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.లక్నో మూడో వికెట్ డౌన్..మిచెల్ మార్ష్ రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన మార్ష్.. రవీంద్ర జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(29), బదోని(20) ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్..నికోలస్ పూరన్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన పూరన్.. కాంబోజ్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు 42 పరుగులు చేసింది. క్రీజులో పంత్(6), మార్ష్(22) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లక్నో..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నోకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 6 పరుగులు చేసిన మార్క్రమ్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది.ఐపీఎల్-2025లో ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో సీఎస్కే రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్కు డెవాన్ కాన్వే, అశ్విన్ దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో షేక్ రషీద్, ఓవర్టన్ వచ్చారు.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జామీ ఓవర్టన్, MS ధోని(కెప్టెన్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ -
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గత మ్యాచ్కు ముందు సీఎస్కేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోచేతి ఫ్రాక్చర్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గైక్వాడ్ గైర్హాజరీలో ఎంఎస్ ధోని కెప్టెన్గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్ మొత్తంలో ధోనినే సీఎస్కే కెప్టెన్గా కొనసాగనున్నాడు.సీఎస్కే యాజమాన్యం తాజాగా రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసుకుంది. ముంబై చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రేను జట్టులోకి తీసుకుంది. రుతురాజ్ ప్రత్యామ్నాం కోసం సీఎస్కే మేనేజ్మెంట్ మాత్రేతో పాటు పృథ్వీ షా (ముంబై), ఉర్విల్ పటేల్ (గుజరాత్), సల్మాన్ నిజర్ (కేరళ) పేర్లను పరిశీలించినప్పటికీ, చివరికి మాత్రేకే ఓటు వేసింది. మాత్రేను సీఎస్కే 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. మాత్రే ఈ సీజన్ మెగా వేలంలో పోటీపడినప్పటికీ ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయలేదు. మాత్రేపై సీఎస్కే మొదటి నుంచి సానుకూలంగా ఉన్నా ఎందుకో మెగా వేలంలో కొనుగోలు చేయలేదు. గతేడాది సీఎస్కే మాత్రేను ట్రయల్స్కు కూడా పిలిపించుకుంది.మాత్రేను వీలైనంత త్వరగా జట్టులో చేరాలని సీఎస్కే మేనేజ్మెంట్ కబురు పెట్టినట్లు తెలుస్తుంది. ఎల్ఎస్జీతో మ్యాచ్ కోసం సీఎస్కే ప్రస్తుతం లక్నోలో ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ (ఏప్రిల్ 14) రాత్రి జరుగనుంది. అయితే ఈ మ్యాచ్కు మాత్రే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఏప్రిల్ 20న సీఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్కు మాత్రే అందుబాటులోకి రావచ్చు.కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ అయిన మాత్రేకు ముంబై క్రికెటింగ్ సర్కిల్స్లో మంచి గుర్తింపు ఉంది. మాత్రే ముంబై తరఫున అతి తక్కువ మ్యాచ్లు ఆడినా టాలెంటెడ్ ఆటగాడిగా పేరు గడించాడు. మాత్రే 9 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 504 పరుగులు చేశాడు. 7 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 2 సెంచరీల సాయంతో 458 పరుగులు చేశాడు. గతేడాది అక్టోబర్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మాత్రే అతి తక్కువ కాలంలోనే టీమిండియా మెటీరియల్గా ముద్ర వేసుకున్నాడు. -
CSK Vs LSG: చెన్నై కోలుకునేనా!
లక్నో: వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు... ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్తో పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి పోరులో గెలుపొందగా... ఆ తర్వాత వరుసగా ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ ఓడింది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకొని లీగ్లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై... తిరిగి గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టోర్నీకి దూరం కాగా... గత మ్యాచ్లోనే ‘మాస్టర్ మైండ్’ మహేంద్రసింగ్ ధోని జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే పరాజయాలతో డీలా పడ్డ జట్టును అతడి సారథ్యం కూడా గట్టెక్కించలేకపోయింది. కోల్కతాతో జరిగిన పోరులో బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో చెన్నై ఘోర పరాజయం మూటగట్టుకుంది. వాటన్నింటిని పక్కన పెట్టి తిరిగి సత్తా చాటాలని ధోనీ సేన భావిస్తోంది. మరోవైపు రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సీజన్లో 6 మ్యాచ్లాడి 4 విజయాలు, 2 పరాజయాలు నమోదు చేసుకుంది. గత మూడు మ్యాచ్ల్లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్, గుజరాత్ టైటాన్స్లపై గెలిచి లక్నో ఫుల్ జోష్లో ఉంది. మరి లక్నో జోరును అడ్డుకొని చెన్నై విజయాల బాట పడుతుందా చూడాలి! హిట్టర్లతో దట్టంగా... గత మూడు మ్యాచ్ల్లోనూ పవర్ప్లే వికెట్లు కోల్పోని లక్నో జట్టు... హిట్టర్లతో దట్టంగా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల గుజరాత్తో మ్యాచ్కు అందుబాటులో లేని మిచెల్ మార్ష్... చెన్నైతో పోరులో బరిలోకి దిగడం ఖాయమే. మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్తో లక్నో టాపార్డర్ శత్రుదుర్బేధ్యంగా ఉంది. గత కొన్నాళ్లుగా కేవలం సిక్స్లు కొట్టడమే తన లక్ష్యం అన్నట్లు చెలరేగిపోతున్న పూరన్ను అడ్డుకోవడం చెన్నై బౌలర్లకు కత్తి మీద సామే!ఈ సీజన్లో సీఎస్కే ప్లేయర్లంతా కలిసి 32 సిక్స్లు బాదితే... పూరన్ ఒక్కడే 31 సిక్స్లు కొట్టాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగుతున్న ఈ విండీస్ వీరుడు మరోసారి చెలరేగితే లక్నో జైత్రయాత్ర కొనసాగినట్లే. రిషబ్ పంత్, ఆయుశ్ బదోనీ, అబ్దుల్ సమద్లతో మిడిలార్డర్ బలంగా ఉండగా... డేవిడ్ మిల్లర్ ఫినిషింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇక అనూహ్యంగా జట్టులోకి వచ్చిన పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ చక్కటి బౌలింగ్తో ఆకట్టుకుంటుండగా... యువ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ... ‘సంతకం’ సంబరాలు కొనసాగించాలని చూస్తున్నాడు. అవేశ్ ఖాన్, ఆకాశ్దీప్, రవి బిష్ణోయ్తో లక్నో బౌలింగ్లో మంచి వైవిధ్యం ఉంది. లోపాలు దిద్దుకుంటేనే! చెన్నైకు ఈ సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు. నిలకడ కనబర్చలేకపోతున్న ఆ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర రూపంలో మంచి ఓపెనర్లు ఉన్నా... ఆ తర్వాత ఇన్నింగ్స్ను నడిపించే వారు కరువయ్యారు. రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో అశ్విన్ తర్వాత క్రీజులోకి వస్తున్న ధోని... గతంలో మాదిరిగా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం కనబర్చ లేకపోతున్నాడు. ఇతర జట్లలో దేశీయ ఆటగాళ్లు చెలరేగుతుంటే... చెన్నైలో ఆ బాధ్యత తీసుకునే ప్లేయర్లు కనపించడం లేదు. కోల్కతాతో జరిగిన చివరి మ్యాచ్లో అయితే చెన్నై మరీ పేలవ ఆటతీరు కనబర్చింది. ప్లే ఆఫ్స్ రేసులో ముందంజ వేయాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఆటగాళ్లంతా సమష్టిగా సత్తాచాటాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ వరుసగా ఐదు మ్యాచ్లు ఓడని సీఎస్కే... మరో పరాజయం మూటగట్టుకుంటే ఇక కోలుకోవడం కష్టమే. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న చెన్నై బ్యాటర్లు... దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయ్లను ఎలా ఎదుర్కంటారనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్ ), మార్క్రమ్, మిచెల్ మార్ష్, పూరన్, పంత్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దుల్, ఆకాశ్దీప్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్ ), కాన్వే, రచిన్, త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అశ్విన్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరణ. -
IPL 2025: అప్పుడే అంతా అయిపోలేదు.. వరుస ఓటములు ఎదురవుతున్నా సీఎస్కే కోచ్ ధీమా
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్లో వరుసగా ఐదు పరాజయాలు మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్లో సీఎస్కే మరో 8 మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్కు చేరుతుందని సొంత అభిమానులకే ఆశ లేదు.సొంత మైదానంలో కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం అనంతరం ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడే అంతా అయిపోలేదు. సీఎస్కే ప్లే ఆఫ్స్కు చేరే అవకాశాలు ఇంకా ఉన్నాయి. లీగ్ మ్యాచ్లన్నీ పూర్తయ్యే సరికి కనీసం నాలుగో స్థానంతోనైనా ప్లే ఆఫ్స్కు చేరుకుంటాము. ఐపీఎల్ సుదీర్ఘంగా సాగే టోర్నీ. ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాము. ఒక్కసారి ఊపు అందుకున్నామంటే తిరిగి వెనక్కు చూడము.ప్రస్తుతానికి మేము మంచి క్రికెట్ ఆడటం లేదు. అయితే పరిస్థితులు త్వరలోనే మారతాయి. ఇందు కోసం చాలా కష్టపడుతున్నాము. పరాజయాల బాట వీడి ఒక్క విజయం సాధించినా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ప్లేఆఫ్స్ సమయం వచ్చేసరికి చివరి స్థానాల్లో ఏదో ఒకదాన్ని చేరుకోగలము. ఇలా చేయగలమని ఇప్పటికీ నమ్ముతున్నాను. సత్ఫలితాలు సాధించాలంటే సమూహంగా రాణించాలి. జట్టులో ప్రతి ఒక్కరూ పాటు పడాలి.వరుసగా ఓడిపోతున్నామని ఆటగాళ్లను వారి సహజ శైలికి భిన్నంగా ఆడమని చెప్పలేము. వారు సొంత శైలిలో అద్భుతంగా ఆడారు కాబట్టే ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో ఆడే అవకాశం పొందారు. పరిస్థితులు మెరుగుపడటానికి ముందు అధ్వానంగా మారతాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా అనుభవజ్ఞులకే పెద్ద పీట వేస్తున్నామనడం వాస్తవం కాదు. జట్టు అవసరాల దృష్ట్యా అప్పటికి ఎవరు అవసరమో వారినే తుది జట్టులోకి తీసుకుంటాము. కఠిన సమయాల్లో అభిమానులందరూ మద్దతుగా ఉండాలి. ఇప్పటికీ ఏమీ మించి పోలేదు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే సత్తా మాకు ఉందని హస్సీ అన్నాడు.కాగా, సొంత మైదానం చెపాక్లో నిన్న జరిగిన మ్యాచ్లో సీఎస్కే కేకేఆర్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం కేకేఆర్ ఆడుతూపాడుతూ 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది (2 వికెట్లు కోల్పోయి). ఈ మ్యాచ్లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. కెప్టెన్గా ధోని వ్యూహాలు ఈ మ్యాచ్లో పని చేయలేదు. రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ధోని కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 14న లక్నో హోం గ్రౌండ్లో జరుగనుంది. -
CSK Vs KKR: చెపాక్లో చెన్నై చిత్తుగా...
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వరుసగా ఐదో పరాజయం... మొదటిసారి సొంతగడ్డ చెపాక్ మైదానంలో వరుసగా మూడో ఓటమి... ధోని కెపె్టన్సీ పునరాగమనంలో సీఎస్కే మరింత పేలవ ప్రదర్శన కనబర్చింది. కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) పదునైన బౌలింగ్ ముందు చేతులెత్తేసిన సీఎస్కే భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫటాఫట్గా 61 బంతుల్లోనే లక్ష్యాన్ని అందుకున్న కోల్కతా రన్రేట్ను ఒక్కసారిగా పెంచుకొని దూసుకుపోయింది. చెన్నై: ఐపీఎల్ 18వ సీజన్లో ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. సొంత మైదానంలో బ్యాటింగ్ వైఫల్యంతో జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం జరిగిన ఈ పోరులో కోల్కతా నైట్రైడర్స్ 8 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేయగలిగింది. శివమ్ దూబే (29 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, విజయ్శంకర్ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించాడు. అనంతరం కోల్కతా 10.1 ఓవర్లలో 2 వికెట్లకు 107 పరుగులు సాధించి గెలిచింది. సునీల్ నరైన్ (18 బంతుల్లో 44; 2 ఫోర్లు, 5 సిక్స్లు) శుభారంభంతో మరో 59 బంతులు మిగిలి ఉండగానే విజయం జట్టు సొంతమైంది. పేలవ బ్యాటింగ్... ఓపెనర్లు కాన్వే (12), రచిన్ (4) ఒకే స్కోరు వద్ద వెనుదిరగ్గా... రెండు సార్లు అదృష్టం కలిసొచ్చిన విజయ్ శంకర్ కొన్ని పరుగులు రాబట్టాడు. 0, 20 పరుగుల వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్లను నరైన్, వెంకటేశ్ అయ్యర్ వదిలేశారు. రాహుల్ త్రిపాఠి (16) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత చెన్నై 9 పరుగుల తేడాతో అశ్విన్ (1), జడేజా (0), దీపక్ హుడా (0), ధోని (1) వికెట్లను కోల్పోయింది. 71/6 వద్ద బ్యాటింగ్ కుప్పకూలే పరిస్థితి ఉండటంతో చెన్నై ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బ్యాటర్ హుడాను తీసుకు రాగా, అతనూ డకౌటయ్యాడు. వరుసగా 63 బంతుల పాటు జట్టు ఫోర్ కొట్టలేకపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా...మరో ఎండ్లో నిలబడిన దూబే తన 20వ బంతికి గానీ తొలి ఫోర్ కొట్టలేకపోయాడు. చివరి ఓవర్లో అతను మరో రెండు ఫోర్లు కొట్టడంతో ఎట్టకేలకు స్కోరు 100 పరుగులు దాటింది. చకచకా లక్ష్యం వైపు... ఛేదనలో కోల్కతాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. క్వింటన్ డికాక్ (16 బంతుల్లో 23; 3 సిక్స్లు), నరైన్ ధాటిగా ఆడుతూ 26 బంతుల్లోనే 46 పరుగులు జోడించారు. ఖలీల్ ఓవర్లో డికాక్ 2 సిక్స్లు బాదగా, అశ్విన్ ఓవర్లో నరైన్ ఫోర్, సిక్స్ కొట్టాడు. ఖలీల్ తర్వాత ఓవర్లో కేకేఆర్ 2 సిక్స్లు, ఫోర్తో 18 పరుగులు రాబట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 71 పరుగులకు చేరింది. ఆపై అశ్విన్ ఓవర్లో నరైన్ మరో 2 సిక్స్లు బాదాడు. విజయానికి 19 పరుగుల దూరంలో నూర్ అహ్మద్ అతడిని అవుట్ చేసినా... అజింక్య రహానే (17 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), రింకూ సింగ్ (12 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి పని పూర్తి చేశారు. ధోని అవుటా...నాటౌటా! ఎప్పటిలాగే అభిమానులు ఎదురు చూసేలా చేసీ చేసీ చివరకు 9వ స్థానంలో ధోని బ్యాటింగ్కు దిగాడు. నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతను నరైన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ అవుట్గా ప్రకటించగా ఈ నిర్ణయంపై ధోని ‘రివ్యూ’ కోరాడు. బంతి బ్యాట్ను దాటుతున్న సమయంలో ‘స్నికో’లో కాస్త కదలిక కనిపించినా... టీవీ అంపైర్ వినోద్ శేషన్ దీనిని లెక్కలోకి తీసుకోకుండా అవుట్గా ఖాయం చేశాడు. దీనిపై ఫోర్త్ అంపైర్ తన్మయ్ శ్రీవాత్సవను కలిసి చెన్నై కోచ్ ఫ్లెమింగ్ తన అసంతృప్తిని ప్రదర్శించడం కనిపించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) రహానే (బి) హర్షిత్ 4; కాన్వే (ఎల్బీ) (బి) అలీ 12; త్రిపాఠి (బి) నరైన్ 16; విజయ్ శంకర్ (సి) అలీ (బి) వరుణ్ 29; శివమ్ దూబే (నాటౌట్) 31; అశ్విన్ (సి) అరోరా (బి) హర్షిత్ 1; జడేజా (సి) డికాక్ (బి) నరైన్ 0; హుడా (సి) అరోరా (బి) వరుణ్ 0; ధోని (ఎల్బీ) (బి) నరైన్ 1; నూర్ (సి) వరుణ్ (బి) అరోరా 1; అన్షుల్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 103. వికెట్ల పతనం: 1–16, 2–16, 3–59, 4–65, 5–70, 6–71, 7–72, 8–75, 9–79. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–31–1, మొయిన్ అలీ 4–1–20–1, హర్షిత్ రాణా 4–0–16–2, వరుణ్ చక్రవర్తి 4–0–22–2, సునీల్ నరైన్ 4–0–13–3. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) అన్షుల్ 23; నరైన్ (బి) నూర్ 44; రహానే (నాటౌట్) 20; రింకూ సింగ్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 5; మొత్తం (10.1 ఓవర్లలో 2 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–46, 2–85. బౌలింగ్: ఖలీల్ 3–0–40–0, అన్షుల్ 2–0–19–1, అశ్విన్ 3–0–30–0, నూర్ 2–0–8–1, జడేజా 0.1–0–9–0. ఐపీఎల్లో నేడులక్నో x గుజరాత్ వేదిక: లక్నోమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి హైదరాబాద్ x పంజాబ్ వేదిక: హైదరాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: ధోనిది ఔటా? నాటౌటా? అంపైర్పై ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో సీఎస్కే వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. శుక్రవారం చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే పరాజయం పాలైంది. మరోసారి సీఎస్కే బ్యాటర్లు తేలిపోయారు. కేకేఆర్ బౌలర్ల దాటికి చెన్నై బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్కు చేరారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా కేకేఆర్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరైన్(18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 44) టాప్ స్కోరర్గా నిలవగా.. డికాక్(23 ), రహానే(20 నాటౌట్), రింకూ సింగ్(15 నాటౌట్) తమ వంతు పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్లో ధోని ఔట్ చర్చనీయాశంగా మారింది. ధోని ఔట్గా ప్రకటిస్తూ థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది.ధోనిది ఔటా? నాటౌటా?సీఎస్కే ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన సునీల్ నరైన్ బౌలింగ్లో మూడో బంతిని ధోని ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్కు దగ్గరగా వెళ్తూ ధోని ప్యాడ్కు తాకింది. వెంటనే బౌలర్తో పాటు వికెట్ కీపర్ ఎల్బీకి అప్పీల్ చేశారు.దీంతో ఫీల్డ్ అంపైర్ క్రిస్ గాఫ్నీ ఔట్ అని వేలు పైకెత్తాడు. ఈ క్రమంలో ధోని అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రివ్యూ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ తొలుత అల్ట్రా ఎడ్జ్ను చెక్ చేశాడు. అయితే బంతి బ్యాట్ను దాటినప్పుడు కాస్త కదలిక కన్పించింది. దీంతో అంపైర్ నాటౌట్గా ప్రకటిస్తాడని అంతాభావించారు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం క్లియర్గా బ్యాట్, బాల్కు మధ్య గ్యాప్ ఉందని థర్డ్ అంపైర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత బాల్ ట్రాకింగ్లో బంతి స్టంప్లను తాకుతోందని స్ఫష్టం కావడంతో అంపైర్ ఔట్గా ప్రకటించాడు. దీంతో చెపాక్ మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కామెంటేటర్లు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంతో షాక్ అయిపోయారు. అంపైర్ నిర్ణయాన్ని చాలా మంది తప్పు బడతున్నారు. అది క్లియర్గా నాటౌట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో ధోని కేవలం ఒక్క మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు.చదవండి: IPL 2025: నరైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్కేపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ -
నరైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్కేపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైంది. మరోసారి సీఎస్కే బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. విజయ్ శంకర్(29) కాస్త ఫర్వాలేదన్పించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు కీలక మూడు వికెట్లు పడగొట్టి సీఎస్కే పతనాన్ని శాసించాడు. నరైన్తో పాటు హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు, వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు. కెప్టెన్ ధోని(1) సైతం తీవ్రనిరాశపరిచాడు.సునీల్ నరైన్ విధ్వంసం..అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరైన్(18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 44) టాప్ స్కోరర్గా నిలవగా.. డికాక్(23 ), రహానే(20 నాటౌట్), రింకూ సింగ్(15 నాటౌట్) రాణించారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా వికెట్ సాధించారు. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన సునీల్ నరైన్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా సీఎస్కేకు వరుసగా ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే -
CSK Vs KKR: సునీల్ నరైన్ అరుదైన ఫీట్.. రెండో బౌలర్గా రికార్డు
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన స్పిన్ మయాజాలంతో సీఎస్కే బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అతడిని ఆడటం ఎవరి తరం కాలేదు. త్రిపాఠి, రవీంద్ర జడేజా, ధోని వంటి కీలక వికెట్లను పడగొట్టి సీఎస్కేను దెబ్బతీశాడు.నరైన్ తన నాలుగు ఓవర్లలో కోటాలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో సునీల్ నరైన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా నరైన్ రికార్డులెక్కాడు.సునీల్ ఇప్పటివరకు చెన్నై జట్టుపై 26 వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ హార్బజన్ సింగ్(24) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో భజ్జీ రికార్డును సునీల్ బ్రేక్ చేశాడు.ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ(31) ఉన్నాడు. ఐపీఎల్లో సీఎస్కేపై అత్యధిక వికెట్లు బౌలర్లు వీరే31 - లసిత్ మలింగ26 - సునీల్ నరైన్24 - హర్భజన్ సింగ్ 22 - పీయూష్ చావ్లా103 పరుగులకే..ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సీఎస్కే.. కేకేఆర్ బౌలర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. విజయ్ శంకర్(29) కాస్త ఫర్వాలేదన్పించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే
ఎంఎస్ ధోని.. 689 రోజుల తర్వాత తిరిగి కెప్టెన్గా మైదానంలో అడుగు పెట్టాడు. ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోని వ్యహరిస్తున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగడంతో ధోని తిరిగి సీఎస్కే బాధ్యతలు చేపట్టాడు.ఈ క్రమంలో 43 ఏళ్ల ధోని పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మొదటి అన్క్యాప్డ్ కెప్టెన్గా ధోని రికార్డులెక్కాడు. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడినైనా అనక్యాప్డ్ ప్లేయర్గా పరిగణించవచ్చు. ధోని 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్పై తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలోనే ధోనిని అన్క్యాప్డ్ కోటాలో రూ. 4 కోట్లు వెచ్చించి చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. ధోనితో పాటు టీమిండియా వెటరన్ ప్లేయర్లు సందీప్ శర్మ, మోహిత్ శర్మ కూడా రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరఫున అన్క్యాప్డ్ ప్లేయర్స్గా ఆడుతున్నారు. అదేవిధంగా ఈ క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో కెప్టెన్గా ఎంపికైన అతి పెద్ద వయష్కుడిగా ధోని నిలిచాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్గా ధోని తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ధోనీ కెప్టెన్సీలోనే చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021, 2023లో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలను అందుకుంది. అంతేకాకుండా పది సార్లు ఫైనల్స్కు కూడా మిస్టర్ కూల్ చేర్చాడు.చదవండి: PSL 2025: వరుస షాక్లు.. పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్ -
సీఎస్కేను చిత్తు చేసిన కేకేఆర్..
Csk vs KKR Live Updates: సీఎస్కేను చిత్తు చేసిన కేకేఆర్..చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరైన్(18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 44) టాప్ స్కోరర్గా నిలవగా.. డికాక్(23 ), రహానే(20 నాటౌట్), రింకూ సింగ్(15 నాటౌట్) రాణించారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. విజయ్ శంకర్(29) కాస్త ఫర్వాలేదన్పించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..104 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డికాక్(9), సునీల్ నరైన్(9) ఉన్నారు.103 పరుగులకే పరిమితమైన సీఎస్కేచెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్ల దాటికి సీఎస్కే బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. ఏ ఒక్క బ్యాటర్ కూడా కేకేఆర్ బౌలర్లను సరిగ్గా ఎదుర్కోలేకపోయాడు. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. విజయ్ శంకర్(29) కాస్త ఫర్వాలేదన్పించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు.సీఎస్కే ఎనిమిదో వికెట్ధోని రూపంలో సీఎస్కే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ధోని.. సునీల్ నరైన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 8 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.72 పరుగులకే 7 వికెట్లు ..సీఎస్కే 72 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అశ్విన్(1), రవీంద్ర జడేజా(0), దీపక్ హుడా(0) వరుస క్రమంలో ఔటయ్యారు.కష్టాల్లో సీఎస్కే..చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. 65 పరుగులకే సీఎస్కే నాలుగు వికెట్లు కోల్పోయింది. 29 పరుగులు చేసిన విజయ్ శంకర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔట్ కాగా.. త్రిపాఠి(16) సునీల్ నరైన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.సీఎస్కే రెండో వికెట్ డౌన్రచిన్ రవీంద్ర రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రవీంద్ర.. హర్షిత్ రాణా బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. సీఎస్కే తొలి వికెట్ డౌన్..డెవాన్ కాన్వే రూపంలో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన కాన్వే.. మోయిన్ అలీ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు.3 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 16/0టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో డెవాన్ కాన్వే(12), రచిన్ రవీంద్ర(4) పరుగులతో ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో రసవత్తర పోరుకు తేరలేచింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పెన్సార్ జాన్సన్ స్దానంలో మోయిన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో సీఎస్కే కెప్టెన్గా ఎంఎస్ ధోని వ్యవహరిస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరం కావడంతో ధోని తిరిగి పగ్గాలు చేపట్టాడు. రుతురాజ్ స్ధానంలో రాహుల్ త్రిపాఠి తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లుసీఎస్కేతో మ్యాకోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్చ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ -
సీఎస్కేతో మ్యాచ్.. కేకేఆర్ స్టార్ ఓపెనర్ పై వేటు! అతడి ఎంట్రీ?
ఐపీఎల్-2025లో కోల్కతా నైట్రైడర్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో కేకేఆర్ తలపడనుంది. గత మ్యాచ్లో లక్నోపై అనుహ్య ఓటమి చవిచూసిన కేకేఆర్.. ఇప్పుడు సీఎస్కేపై గెలిచి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.వరుస మ్యాచ్ల్లో విఫలమవుతున్న స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్పై వేటు వేయాలని కేకేఆర్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతడి స్దానంలో అఫ్గానిస్తాన్ ఓపెనర్ రెహ్మతుల్లా గుర్బాజ్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. అదేవిధంగా సీఎస్కేతో మ్యాచ్కు పేసర్ స్పెన్సర్ జాన్సెన్ను కూడా కేకేఆర్ పక్కన పెట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. చెపాక్ పిచ్ ఎక్కువగా స్పిన్కు అనుకూలించనున్న నేపథ్యంలో స్పిన్ ఆల్రౌండర్ మోయిన్ అలీని తుది జట్టులోకి తీసుకురావాలని కేకేఆర్ కోచ్ అండ్ కెప్టెన్ భావిస్తున్నట్లు వినికిడి. కాగా ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ మూడు మ్యాచ్లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్కతా 4 పాయింట్లతో ఆరో స్ధానంలో కొనసాగుతోంది. మరోవైపు సీఎస్కే కెప్టెన్గా ఎంఎస్ ధోని తిరిగి బాధ్యతలు చేపట్టాడు. రెగ్యూలర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగడంతో ధోని మరోసారి చెన్నై జట్టును నడిపించనున్నాడు. సీఎస్కేకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన సూపర్ కింగ్స్ కేవలం ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించింది. రుతురాజ్ స్ధానంలో రాహుల్ త్రిపాఠి తుది జట్టులో వచ్చే ఛాన్స్ ఉంది.తుది జట్లు(అంచనా)కేకేఆర్రెహ్మతుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, మొయిన్ అలీ, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిసీఎస్కేరచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్చదవండి: PSL 2025: వరుస షాక్లు.. పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్ -
కెప్టెన్ గా ఎంఎస్ ధోని.. ఫ్యాన్స్ కు పండగే
-
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్-2025 సీజన్ నుంచి వైదొలిగాడు. రుతురాజ్ స్ధానంలో సీఎస్కే కెప్టెన్గా స్టార్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నైకి ఇప్పుడు గైక్వాడ్ దూరం కావడం నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి.ఈ క్రమంలో గైక్వాడ్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సీఎస్కే మెనెజ్మెంట్ పడింది. టీమిండియా ఓపెనర్, ముంబై స్టార్ ప్లేయర్ పృథ్వీ షాని తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో కొన్ని సీజన్ల పాటు ఓ వెలుగు వెలిగిన పృథ్వీ షా.. తొలిసారి ఈ క్యాష్ రిచ్ లీగ్కు దూరంగా ఉన్నాడు.ఐపీఎల్-2025 మెగా వేలంలో పృథ్వీ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో సతమతవుతున్నందున షాను ఏ ఫ్రాంచైజీ కూడా సొంతం చేసునేందుకు ముందుకు రాలేదు. తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం అతడిని తిరిగి సొంతం చేసుకునేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. అయితే మరోసారి పృథ్వీ షాకు రుతురాజ్ గాయం రూపంలో అవకాశం లభించే సూచనలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్లో ఇప్పటివరకు 79 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన షా.. 147.47 స్ట్రైక్ రేట్తో 1,892 పరుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: #Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. -
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఎంఎస్ ధోని..
ఐపీఎల్-2025లో వరుస ఓటములతో సతమతవుతున్న చెన్నై సూపర్ కింగ్స్కు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్దానంలో లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని(MS DHONI)కి మరోసారి తమ జట్టు పగ్గాలను సీఎస్కే మేనెజ్మెంట్ అప్పగించింది."రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఎముక విరిగింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి రుతురాజ్ తప్పుకున్నాడు. అతడి స్ధానంలో ఎంఎస్ ధోని కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు" అని కేకేఆర్తో మ్యాచ్కు ముందు గురువారం విలేకరుల సమావేశంలో ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. కాగా గైక్వాడ్ మార్చి 30న గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గైక్వాడ్ గైక్వాడ్ కుడి మోచేయికి గాయమైంది. ఆ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ వేసిన ఓ షార్ట్ బాల్ గైక్వాడ్ మోచేయికి బలంగా తాకింది. వెంటనే రుతు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడాడు. ఆ తర్వాత ఫిజియో సాయం తీసుకుని తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు.ఆ తర్వాతి మ్యాచ్లకు రుతురాజ్ దూరంగా ఉంటాడని వార్తలు వినిపించాయి. కానీ ఫిట్నెస్ సాధించడంతో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లు గైక్వాడ్ అందుబాటులో ఉన్నాడు. అయితే నొప్పితోనే ఈ రెండు మ్యాచ్ల్లో కూడా అతడు ఆడినట్లు తెలుస్తోంది. తాజా స్కాన్ రిపోర్ట్లో మోచేయి ఎముక విరిగినట్లు తేలింది. ఈ క్రమంలో ఈ ఏడాది సీజన్లో మిగిలన మ్యాచ్ల మొత్తానికి రుతు దూరమయ్యాడు.ధోని.. శుక్రవారం(ఏప్రిల్ 11) చెపాక్ వేదికగా కేకేఆర్తో జరిగే మ్యాచ్తో తిరిగి సీఎస్కే కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. కెప్టెన్గా ధోనికి అపారమైన అనుభవం ఉంది. అతడి సారథ్యంలోనే సీఎస్కే ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలిచింది. మిస్టర్ కూల్ 235 మ్యాచ్ల్లో సీఎస్కేకు నాయకత్వం వహించాడు. మరోసారి తన కెప్టెన్సీ మార్క్ను చూపించేందుకు ఈ జార్ఢండ్ డైనమేట్ సిద్దమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన చెన్నై.. కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. 🚨 OFFICIAL STATEMENT 🚨Ruturaj Gaikwad ruled out of the season due to a hairline fracture of the elbow. MS DHONI TO LEAD. 🦁GET WELL SOON, RUTU ! ✨ 💛#WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/U0NsVhKlny— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2025 -
నేను ఎప్పటికీ ధోనీ ఫ్యాన్నే.. ఎవరేమనుకున్నా ఫర్వాలేదు: రాయుడు
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తన వివాదస్పద వ్యాఖ్యలతో ఇటీవల తరుచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న రాయుడు.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనిని అతిగా ప్రశంసిస్తున్నందుకు సోషల్ మీడియాలో ట్రోల్స్కు గురవతున్నాడు.గతంలో సీఎస్కే ఆడిన రాయుడు.. ప్రస్తుత సీజన్లో ధోని క్రీజులోకి వస్తే చాలు పోగడ్తలతో ముంచెత్తున్నాడు. జట్టుతో, మ్యాచ్తో సంబంధం లేకుండా ధోనీ నామస్మరణలోనే అతడు మునిగిపోతున్నాడు. అతడి అతి కామెంట్రీ చాలా మందికి విసుగు తెప్పిస్తుంది. ఏప్రిల్ 8న ముల్లాన్పూర్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో ధోని క్రీజులోకి వస్తున్నప్పుడు అతడిని కత్తి పట్టుకున్న యోధుడితో రాయుడు పోల్చాడు. ధోనీ ఖడ్గాన్ని పట్టుకుని వస్తున్నట్లు ఉంది. ఆ ఖడ్గం కచ్చితంగా ఫలితం సాధిస్తుంది అని రాయుడు వ్యాఖ్యనించాడు. ఆ తర్వాత అతడి వ్యాఖ్యలకు సహచర హిందీ కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కౌంటరిచ్చాడు. ధోనీ క్రికెట్ ఆడటానికి వచ్చాడు. యుద్ధంలో పాల్గొనడానికి కాదు సిద్దూ తన ఎక్స్లో రాసుకొచ్చాడు. అదేవిధంగా అభిమానులు కూడా రాయుడు టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు.నేనెప్పటికీ తలా ఫ్యాన్నేతనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోల్స్పై రాయుడు స్పందించాడు. ట్రోల్స్ చేస్తున్న వారికి రాయుడు ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. తను ఎప్పుడూ ధోని ఫ్యాన్నే అని, ఎవరేమనుకున్నా పర్వాలేదు అని అంబటి అన్నాడు"నేనెప్పటికీ తలా అభిమానినే. ఎవ్వరేం అనుకున్నా, ఎవ్వరేం చేసినా సరే ఈ విషయంలో ఒక్క శాతం కూడా మార్పు రాదు. కాబట్టి పెయిడ్ పీఆర్ కోసం డబ్బులు ఖర్చు చేయడం ఆపేయండి. ఆ డబ్బులను ఏదైనా ఛారిటీకి ఇవ్వండి. అలా చేస్తే ఎంతోమంది పేదలకు సాయం చేసిన వారు అవుతారని" ఎక్స్లో రాయుడు రాసుకొచ్చాడు.కాగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కాస్త ముందుగా బ్యాటింగ్కు వచ్చిన ధోని.. కేవలం 12 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 3 సిక్స్లు, ఒక ఫోర్ ఉన్నాయి. అయితే ఈమ్యాచ్లో 18 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది.I was a Thala’s fan I am a Thala’s fan I will always be a Thala’s fan.No matter what anyone thinks or does. It will not make a one percent difference.So please stop spending money on paid pr and donate that to charity. Lot of underprivileged people can benefit.— ATR (@RayuduAmbati) April 10, 2025I was a Thala’s fan I am a Thala’s fan I will always be a Thala’s fan.No matter what anyone thinks or does. It will not make a one percent difference.So please stop spending money on paid pr and donate that to charity. Lot of underprivileged people can benefit.— ATR (@RayuduAmbati) April 10, 2025 -
సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి ‘అద్భుతం’ అతడే!
ప్రియాన్ష్ ఆర్య.. 24 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రాడి పేరు క్రికెట్ వర్గాల్లో మారుమ్రోగిపోతోంది. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో కేవలం 39 బంతుల్లోనే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ శతకం బాదాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు.సంచలన ఇన్నింగ్స్చెన్నైతో మ్యాచ్లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya).. ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో ఏకంగా 103 పరుగులు సాధించాడు. 245కు స్ట్రైక్రేటుతో దంచికొట్టి చెన్నైపై పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 88 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన సంచలన ఇన్నింగ్స్తో గట్టెక్కించిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.This is what we pay our internet bills for... ❤️pic.twitter.com/mE38MmXFB0— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025 సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి ‘అద్భుతం’!ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రియాన్ష్ ఆర్యను ఆకాశానికెత్తాడు. టీమిండియా దిగ్గజం, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తర్వాత అంతటి అద్భుతాన్ని ఇప్పుడే చూశానంటూ అతడిని కొనియాడాడు. మైదానం నలుదిశలా షాట్లతో హోరెత్తించాడని.. సీఎస్కేలో ఉన్న ప్రపంచస్థాయి బౌలర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు అమోఘమని ప్రశంసించాడు.‘‘ప్రియాన్ష్ ఆర్య... టీమిండియాకు సుదీర్ఘకాలం పాటు ఆడగల సత్తా ఉన్న ఆటగాడు. సచిన్ టెండుల్కర్ తర్వాత.. విపత్కర పరిస్థితుల్లో అంత గొప్పగా ఆడిన రెండో ఆటగాడు ఇతడే. సచిన్ తర్వాత నేను చూసిన అద్భుతం ఇతడే.క్లిష్ట పరిస్థితుల్లో మేటి బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీ చేయడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా ఇంచుమించు 250 స్ట్రైక్రేటుతో శతక్కొట్టడం ఊహకు అందని విషయం. శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, ప్రభ్సిమ్రన్ సింగ్ అవుటైన తర్వాత.. ఒంటిచేత్తో పంజాబ్ను ఆదుకున్నాడు.ఆకాశమే హద్దుగాపాయింట్, కవర్లు.. ఒక్కటేమిటి మైదానం అన్ని వైపులకు బంతిని తరలిస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు. పతిరణ, జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్ వంటి బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో పంజాబ్ను గెలిపించాడు’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రియాన్ష్ ఆర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వీడియోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.వరుసగా నాలుగో ఓటమికాగా ముల్లాన్పూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత తొలుత బ్యాటింగ్ చేసింది. చెన్నై ఆరంభంలోనే వికెట్లు తీసి శుభారంభం అందించినా.. ప్రియాన్ష్ ఆర్య (103), శశాంక్ సింగ్ (52 నాటౌట్), మార్కో యాన్సెన్ (34 నాటౌట్) దంచికొట్టడంతో.. పంజాబ్ 20 ఓవర్లలో 219 పరుగులు స్కోరు చేసింది.లక్ష్య ఛేదనలో చెన్నై 201 పరుగులకే పరిమితమైపోయింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (23 బంతుల్లో 36), డెవాన్ కాన్వే (49 బంతుల్లో 69 రిటైర్డ్ అవుట్), శివం దూబే (42), మహేంద్ర సింగ్ ధోని (27) ఓ మోస్తరుగా ఆడారు. అయితే, విజయానికి 18 పరుగులు దూరంలో చెన్నై నిలిచిపోయింది. ఇక ఐపీఎల్-2025లో చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా.. పంజాబ్ ఇప్పటికి నాలుగింట మూడు గెలిచింది.ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ చెన్నై స్కోర్లుపంజాబ్: 219/6 (20)చెన్నై: 201/5 (20)ఫలితం: 18 పరుగుల తేడాతో చెన్నైపై పంజాబ్ గెలుపుచదవండి: ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్ -
చరిత్ర సృష్టించిన డెవాన్ కాన్వే
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే (Devon Conway) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా ఈ న్యూజిలాండ్ క్రికెటర్ ఈ ఘనత సాధించాడు.అంతా తలకిందులుకాగా ముల్లాన్పూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ .. సీఎస్కేను బౌలింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (0)ను డకౌట్ చేసి ముకేశ్ చౌదరి చెన్నైకి శుభారంభం అందించాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్, విధ్వంసకర బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (9)ను ఖలీల్ అహ్మద్ పెవిలియన్కు పంపాడు.ఇక స్టొయినిస్ (4) వికెట్ను కూడా ఖలీల్ తన ఖాతాలో వేసుకోగా.. నేహాల్ వధేరా (9), గ్లెన్ మాక్స్వెల్ (1)లను రవిచంద్రన్ అవుట్ చేశాడు. అయితే, వీళ్లందరినీ తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగిన చెన్నై బౌలర్లు ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, లోయర్ఆర్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్, మార్కో యాన్సెన్లను మాత్రం అడ్డుకోలేకపోయారు.ప్రియాన్ష్ 42 బంతుల్లో 103 పరుగులతో చెలరేగగా.. శశాంక్ 36 బంతుల్లో 52, యాన్సెన్ 19 బంతుల్లో 34 రన్స్తో అజేయంగా నిలిచారు. ఫలితంగా పంజాబ్ నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్లు నష్టపోయి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది.కాన్వే నెమ్మదిగా..లక్ష్య ఛేదనలో సీఎస్కే ఓపెనర్లలో రచిన్ రవీంద్ర కాస్త వేగంగా (23 బంతుల్లో 36) ఆడగా.. డెవాన్ కాన్వే మాత్రం నెమ్మదిగా ఆడాడు. 49 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 69 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. అతడిని రిటైర్డ్ అవుట్గా నాయకత్వ బృందం వెనక్కి పిలిపించింది.Devon Conway with his maiden fifty this season ✅Shivam Dube flexing his arms ✅#CSK puts the foot on the accelerator 📈They need another 75 runs from 30 deliveries. Updates ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK | @ChennaiIPL pic.twitter.com/5JLVV9wc4u— IndianPremierLeague (@IPL) April 8, 202518 పరుగుల తేడాతో ఓటమిమిగతా వాళ్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) విఫలం కాగా.. శివం దూబే (42), ధోని (27) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగుల వద్ద నిలిచి ఓటమిని ఆహ్వానించింది.ఇదిలా ఉంటే.. కాన్వే పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా హాఫ్ సెంచరీ బాది.. ఐపీఎల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్లో అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న మూడో క్రికెటర్గా చరిత్రకెక్కాడు. కాన్వే 24 ఇన్నింగ్స్లోనే మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో షాన్ మార్ష్, లెండిల్ సిమ్మన్స్ ఈ న్యూజిలాండ్ బ్యాటర్ కంటే ముందున్నారు.ఐపీఎల్లో తక్కువ ఇన్నింగ్స్లో (ఫాస్టెస్ట్) వెయ్యి పరుగుల మార్కు చేరుకున్న క్రికెటర్లు1. షాన్ మార్ష్- 21 ఇన్నింగ్స్లో2. లెండిల్ సిమ్మన్స్- 23 ఇన్నింగ్స్లో3. డెవాన్ కాన్వే- 24 ఇన్నింగ్స్లో4. మాథ్యూ హెడెన్- 25 ఇన్నింగ్స్లో5. సాయి సుదర్శన్- 25 ఇన్నింగ్స్లో6. జానీ బెయిర్స్టో- 26 ఇన్నింగ్స్లో7. క్రిస్ గేల్- 27 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించారు.చదవండి: హై రిస్క్ బ్యాటింగ్.. అతడు అద్భుతం.. ఆ తప్పులే మా కొంప ముంచాయి: రుతురాజ్ Back to winning ways this season ✅First home win this season ✅@PunjabKingsIPL compile a comprehensive 1⃣8⃣-run victory over #CSK ❤️Scorecard ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/HtcXw4UYAK— IndianPremierLeague (@IPL) April 8, 2025 -
‘ఆ తప్పులే మా కొంప ముంచాయి.. అతడి బ్యాటింగ్ అద్భుతం’
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన సీఎస్కే.. తాజాగా పంజాబ్ కింగ్స్ చేతిలోనూ చేదు అనుభవం ఎదుర్కొంది. ముల్లాన్పూర్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్ వరకు పోరాడి విజయానికి పద్దెనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయింది.ఆ తప్పులే మా కొంప ముంచాయిఈ నేపథ్యంలో ఓటమి అనంతరం చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) స్పందిస్తూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ఫీల్డింగ్ తప్పిదాలే తమ కొంపముంచాయని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘గత నాలుగు మ్యాచ్లలో ఒకే పొరపాటు.. అదే ఫీల్డింగ్. మేము క్యాచ్లు డ్రాప్ చేస్తూనే ఉన్నాం.అతడి బ్యాటింగ్ అద్భుతంతద్వారా ఆ బ్యాటర్లు అదనంగా 15, 20, 30 పరుగులు చేసేందుకు ఆస్కారం ఇస్తున్నాం. ఈరోజు ప్రియాన్ష్ ఆర్య అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి హై రిస్క్తో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, పరిస్థితులు అతడికి అనుకూలించాయి.ఇదే వికెట్పై మేమూ బ్యాటింగ్ చేశాం. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. అంతకుముందు కీలక సమయాల్లో క్యాచ్లు కూడా డ్రాప్ చేశాం. ఇంకో 10- 15 పరుగులు కట్టడి చేయాల్సింది. అలాగే ఇంకో మూడు- నాలుగు సిక్సర్లు బాదాల్సింది.బ్యాటింగ్ పరంగా పర్లేదుఏదేమైనా మా ఉత్తమ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే పవర్ ప్లేలో రాణించడం సానుకూలాంశం. బ్యాటింగ్ పరంగా మేము పర్లేదు. ముందుగా చెప్పినట్లు ఫీల్డింగ్లో మెరుగుపడాల్సి ఉంది’’ అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. ఫీల్డింగ్ను ఆస్వాదిస్తేనే తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయని.. టెన్షన్ పడితే మరిన్ని పొరపాట్లకు ఆస్కారం ఉంటుందే తప్ప లాభమేమీలేదని తమ ఫీల్డర్లకు సందేశం ఇచ్చాడు.క్యాచ్లు డ్రాప్ చేసి.. మూల్యం చెల్లించారుకాగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన సీఎస్కే ఆరంభంలోనే వరుస వికెట్లు తీసింది. కానీ యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య మెరుపు సెంచరీ (42 బంతుల్లో 103)తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ప్రియాన్ష్ ఇచ్చిన క్యాచ్ను బౌలర్ మిస్ చేశాడు.అదే విధంగా ఐదో ఓవర్ రెండో బంతికి స్టొయినిస్ ఇచ్చిన క్యాచ్ను విజయ శంకర్ వదిలేశాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి ప్రియాన్ష్ బంతిని గాల్లోకిలేపగా.. శంకర్ మరోసారి డ్రాప్ చేశాడు. ఇక అశ్విన్ బౌలింగ్లో పన్నెండవ ఓవర్ రెండో బంతికి ప్రియాన్ష్ సిక్సర్ బాదగా.. బంతిని అందుకున్న ముకేశ్ చౌదరి బౌండరీ లైన్ను తాకాడు.I.C.Y.M.I 𝗣𝗼𝘄𝗲𝗿💪. 𝗣𝗿𝗲𝗰𝗶𝘀𝗶𝗼𝗻👌. 𝗣𝗮𝗻𝗮𝗰𝗵𝗲💥. Priyansh Arya graced the home crowd with his effortless fireworks 🎆Updates ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/7JBcdhok58— IndianPremierLeague (@IPL) April 8, 2025ఆ తర్వాత పదిహేడో ఓవర్లో నూర్ అహ్మద్ బౌలింగ్లో శశాంక్ సింగ్ ఇచ్చిన సిట్టర్ను రచిన్ రవీంద్ర డ్రాప్ చేశాడు. ఇలా సీఎస్కే ఫీల్డింగ్ తప్పిదాల వల్ల పంజాబ్ బ్యాటర్లు.. ముఖ్యంగా ప్రియాన్ష్ చాలాసార్లు లైఫ్ పొందాడు. అతడికి తోడుగా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్) దుమ్ములేపారు.తప్పని ఓటమిఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సీఎస్కే ఐదు వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమై.. 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్కే బ్యాటర్లలో ఓపెనర్లు రచిన్ రవీంద్ర (23 బంతుల్లో 36), డెవాన్ కాన్వే (49 బంతుల్లో 69 రిటైర్డ్ అవుట్), శివం దూబే (27 బంతుల్లో 42) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో ధోని మెరుపు ఇన్నింగ్స్ (12 బంతుల్లో 27) ఆడాడు. అయితే, వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) మాత్రం మరోసారి విఫలమయ్యాడు.చదవండి: గ్లెన్ మాక్స్వెల్కు షాకిచ్చిన బీసీసీఐ! Back to winning ways this season ✅First home win this season ✅@PunjabKingsIPL compile a comprehensive 1⃣8⃣-run victory over #CSK ❤️Scorecard ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/HtcXw4UYAK— IndianPremierLeague (@IPL) April 8, 2025 -
PBKS Vs CSK: గ్లెన్ మాక్స్వెల్కు షాకిచ్చిన బీసీసీఐ!
పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell)కు ఐపీఎల్ పాలక మండలి షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత విధించింది. చెన్నై సూపర్ కింగ్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో అనుచిత ప్రవర్తనకు గానూ ఈ మేర జరిమానా వేసింది.ప్రియాన్ష్ మెరుపు శతకంఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్- చెన్నై జట్లు తలపడ్డాయి. సొంత మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర శతకం (42 బంతుల్లో 103) చెలరేగగా.. లోయర్ ఆర్డర్లో శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్) మెరుపులు మెరిపించారు. దీంతో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టినా.. ఈ ముగ్గురి ఇన్నింగ్స్ కారణంగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది.చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 201 పరుగులకే పరిమితమైంది. 18 పరుగుల తేడాతో చెన్నై ఓటమిఓపెనర్ రచిన్ రవీంద్ర (36) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం అర్ధ శతకం(49 బంతుల్లో 69) రాణించాడు.కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశపరచగా.. శివం దూబే 27 బంతుల్లో 42 రన్స్తో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో ధోని ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కానీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Sights we have come to cherish over many years 💛MS Dhoni produced a fighting knock of 27(12) 🔥Scorecard ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK | @msdhoni pic.twitter.com/Y3ksZl8ozS— IndianPremierLeague (@IPL) April 8, 2025 కీలక వికెట్ తీసిఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లోనూ గ్లెన్ మాక్స్వెల్ బ్యాటింగ్లో విఫలమయ్యాడు. ఆరో స్థానంలో వచ్చి రెండు బంతులు ఎదుర్కొని అశ్విన్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే, రచిన్ రవీంద్ర రూపంలో కీలక వికెట్ తీసి పంజాబ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కానీ అనుచిత ప్రవర్తనకు గానూ అతడు పనిష్మెంట్ ఎదుర్కోవాల్సి వచ్చింది.జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్ఇందుకు సంబంధించి.. ‘‘గ్లెన్ మాక్స్వెల్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2లో గల లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు. నిబంధనల ప్రకారం అతడి మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నాం’’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.అదే విధంగా.. మాక్సీ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జత చేసింది. అయితే, ఏ ఘటనలో అతడికి జరిమానా విధించిందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రూపొందించిన నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా వికెట్లను తన్నడం, బాదడం.. అడ్వర్టైజ్ బోర్డులు, బౌండరీ ఫెన్సింగ్, డ్రెసింగ్ రూమ్ అద్దాలు, కిటికీలు.. ఇతర సామాగ్రి దెబ్బతినేలా ప్రవర్తించడం వంటివి చేస్తే ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయి.చదవండి: IPL 2025: ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా -
చెన్నైపై పంజాబ్ ఘన విజయం
-
PBKS vs CSK: ప్రియాంశ్ పటాకా
‘కింగ్స్’ పోరులో చెన్నైపై పంజాబ్దే పైచేయి అయింది. యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య మెరుపులకు శశాంక్ సింగ్, యాన్సెన్ ఫినిషింగ్ టచ్ తోడవడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగా... ఛేదనలో చెన్నై చతికిలబడింది. కాన్వే, దూబే రాణించినా... మధ్య ఓవర్లలో పంజాబ్ బౌలర్లు పుంజుకోవడంతో చెన్నైకి వరుసగా నాలుగో పరాజయం తప్పలేదు. ‘ఫినిషర్’ ధోని దూకుడు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది! ముల్లాన్పూర్: యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (42 బంతుల్లో 103; 7 ఫోర్లు, 9 సిక్స్లు) రికార్డు సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నైకిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రియాంశ్ ఆర్య సెంచరీతో కదంతొక్కగా... శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్స్లు), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9)తో పాటు ప్రభ్సిమ్రన్ సింగ్ (0), స్టొయినిస్ (4), నేహల్ వధేరా (9), మ్యాక్స్వెల్ (1) విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కాన్వే (49 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకం సాధించగా... రచిన్ (37; 6 ఫోర్లు), శివమ్ దూబే (27 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ధోని (12 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు) పోరాడారు. ఫటాఫట్... ఖలీల్ అహ్మద్ వేసిన తొలి బంతికే పాయింట్ మీదుగా సిక్స్ కొట్టిన ప్రియాంశ్ ఆర్య... రెండో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని ఈ 24 ఏళ్ల కుర్రాడు అదే ఓవర్లో మరో సిక్స్ బాదాడు. రెండో ఓవర్లో ప్రభ్సిమ్రన్ డకౌట్ కాగా... ఆర్య ఇంకో సిక్స్ ఖాతాలో వేసుకున్నాడు. ఖలీల్ తదుపరి ఓవర్లో శ్రేయస్ను క్లీన్బౌల్డ్ చేయగా... నాలుగో ఓవర్లో ఆర్య ‘హ్యాట్రిక్’ ఫోర్లతో విరుచుకుపడ్డాడు.స్టొయినిస్ క్రీజులోకి వచ్చినంతసేపు కూడా నిలవలేకపోగా... అశ్విన్ ఓవర్లో 4, 6తో ఆర్య 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అశ్విన్ ఒకే ఓవర్లో నేహల్ , మ్యాక్స్వెల్ను ఔట్ చేశాడు. వికెట్లు పడుతున్నా దూకుడు తగ్గించని ఆర్య... అశ్విన్ ఓవర్లో మూడు సిక్స్లతో చెలరేగిపోయాడు. పతిరణ ఓవర్లో వరుసగా 6, 6, 6, 4 కొట్టిన ప్రియాంశ్ 13వ ఓవర్లోనే 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తదుపరి ఓవర్లో ఆర్య ఔట్ కాగా... చివర్లో యాన్సెన్, శశాంక్ చక్కటి షాట్లతో పంజాబ్కు భారీ స్కోరు అందించారు. 39 ప్రియాంశ్ ఆర్య సెంచరీకి తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది నాలుగో వేగవంతమైన శతకం. గేల్ (30 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో), మిల్లర్ (38 బంతుల్లో) ట్రావిస్ హెడ్ (39 బంతుల్లో) ముందున్నారు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాంశ్ ఆర్య (సి) శంకర్ (బి) నూర్ 103; ప్రభ్సిమ్రన్ (బి) ముకేశ్ 0; శ్రేయస్ (బి) ఖలీల్ 9; స్టొయినిస్ (సి) కాన్వే (బి) ఖలీల్ 4; నేహల్ (సి) ధోని (బి) అశ్విన్ 9; మ్యాక్స్వెల్ (సి అండ్ బి) అశ్విన్ 1; శశాంక్ (నాటౌట్) 52; యాన్సెన్ (నాటౌట్) 34; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–17, 2–32, 3–54, 4–81, 5–83, 6–154. బౌలింగ్: ఖలీల్ 4–0–45–2; ముకేశ్ 2–0–21–1; అశ్విన్ 4–0–48– 2; జడేజా 3–0–18–0; నూర్ 3–0–32–1; పతిరణ 4–0–52–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (స్టంప్డ్) ప్రభ్సిమ్రన్ (బి) మ్యాక్స్వెల్ 37; కాన్వే (రిటైర్డ్ అవుట్) 69; రుతురాజ్ (సి) శశాంక్ (బి) ఫెర్గూసన్ 1; దూబే (బి) ఫెర్గూసన్ 42; ధోని (సి) చహల్ (బి) యశ్ 27; జడేజా (నాటౌట్) 9; శంకర్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–61, 2–62, 3–151, 4–171, 5–192, బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–39–0; యశ్ 4–0–39–1; మ్యాక్స్వెల్ 2–0–11–1; యాన్సెన్ 4–0–48–0; ఫెర్గూసన్ 4–0–40–2; స్టొయినిస్ 1–0–10–0; చహల్ 1–0–9–0.ఐపీఎల్లో నేడుగుజరాత్ X రాజస్తాన్ వేదిక: అహ్మదాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: మారని సీఎస్కే తీరు.. వరుసగా నాలుగో ఓటమి
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో సీఎస్కే పరాజయం పాలైంది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాన్ కాన్వే(49 బంతుల్లో 69) టాప్ స్కోరర్గా నిలవగా.. శివమ్ దూబే(27 బంతుల్లో 42), రచిన్ రవీంద్ర(36), ధోని(27) పర్వాలేదన్పించారు. ఈ మ్యాచ్లో కూడా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(1) నిరాశపరిచాడు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాక్స్వెల్,యష్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు. డెవాన్ కాన్వే రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగాడు. సీఎస్కేకు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.ఆర్య విధ్వంసం.. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య(7 ఫోర్లు, 9 సిక్స్లతో 103) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రియాన్ష్ కేవలం 39 బంతుల్లోనే తొలి ఐపీఎల్ శతకాన్ని అందుకున్నాడు.అతడితో పాటు శశాంక్ సింగ్(52), జాన్సెన్(34) పరుగులతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించగా.. నూర్, ముఖేష్ చెరో వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
ఐపీఎల్-2025లో ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో వికెట్ కీపర్గా ధోని తన 150వ క్యాచ్ను అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ నేహల్ వధేరా క్యాచ్తో ధోని ఈ ఫీట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్లో 150 క్యాచ్లు పట్టిన తొలి వికెట్ కీపర్గా ధోని రికార్డులకెక్కాడు. ఈ ఫీట్ను ఇప్పటివరకు ఎవరూ సాధించలేకపోయారు. ధోని ఓవరాల్గా ఐపీఎల్లో 154 క్యాచ్లు తీసుకున్నాడు. అందులో నాలుగు క్యాచ్లు ఫీల్డర్గా తీసుకున్నాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో ధోని తర్వాతి స్ధానంలో దినేష్ కార్తీక్(137) ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న వికెట్ కీపర్లు వీరే..ఎంఎస్ ధోని-150 క్యాచ్లుదినేష్ కార్తీక్-137వృద్దిమాన్ సహా-87రిషబ్ పంత్-76క్వింటన్ డికాక్-66ఆర్య సూపర్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య(7 ఫోర్లు, 9 సిక్స్లతో 103) సెంచరీతో చెలరేగగా.. శశాంక్ సింగ్(52), జాన్సెన్(34) పరుగులతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించగా.. నూర్, ముఖేష్ చెరో వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా -
సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం..
IPL 2025 PBKS vs CSK Live Updates: సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం..ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ మళ్లీ విన్నింగ్ ట్రాక్లో పడింది. ముల్లాన్పూర్ వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాన్ కాన్వే(49 బంతుల్లో 69) టాప్ స్కోరర్గా నిలవగా.. శివమ్ దూబే(27 బంతుల్లో 42), రచిన్ రవీంద్ర(36), ధోని(27) పర్వాలేదన్పించారు. జాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాక్స్వెల్,యష్ ఠాకూర్ ఓ వికెట్ సాధించారు.సీఎస్కే మూడో వికెట్ డౌన్..శివమ్ దూబే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన దూబే.. ఫెర్గూసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. సీఎస్కే విజయానికి 18 బంతుల్లో 59 పరుగులు కావాలి. క్రీజులో కాన్వే(67), ధోని(3) ఉన్నారు.13 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 120/213 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజులో డెవాన్ కాన్వే(44), శివమ్ దూబే(30) ఉన్నారు.గైక్వాడ్ ఔట్..220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే రెండు వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర(36) మాక్స్వెల్ బౌలింగ్లో స్టంపౌట్ కాగా.. రుతురాజ్ గైక్వాడ్(1) లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో పెవిలయన్కు చేరాడు. 8 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 69/24 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 45/04 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో డెవాన్ కాన్వే(15), రచిన్ రవీంద్ర(24) ఉన్నారు.సీఎస్కే ముందు భారీ టార్గెట్..ముల్లాన్పూర్ వేదికగా చెన్నై సూపర్కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య(7 ఫోర్లు, 9 సిక్స్లతో 103) సెంచరీతో చెలరేగగా.. శశాంక్ సింగ్(52), జాన్సెన్(34) పరుగులతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించగా.. నూర్, ముఖేష్ చెరో వికెట్ సాధించారు.17 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 182/617 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. క్రీజులో శశాంక్ సింగ్(41), జాన్సెన్(11) పరుగులతో ఉన్నారు.ప్రియాన్ష్ ఆర్య సూపర్ సెంచరీ..పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య సూపర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీని ఆర్య అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లలో 7 ఫోర్లు, 9 సిక్స్లు ఉన్నాయి. ఐపీఎల్లో ఆర్యది 4వ ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. 13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.అశ్విన్ ఆన్ ఫైర్..పంజాబ్ కింగ్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. నేహల్ వధేరా(9), మాక్స్వెల్(0)ను అశ్విన్ పెవిలియన్కు పంపాడు. 9 ఓవర్లు మగిసే సరికి పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(53), శశాంక్ సింగ్(4) ఉన్నారు.పంజాబ్ మూడో వికెట్ డౌన్మార్కస్ స్టోయినిష్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిష్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లు మగిసే సరికి పంజాబ్ మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(53), వధేరా(7) ఉన్నారు. ఆర్యకు ఇదే తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.పంజాబ్ రెండో వికెట్ డౌన్..శ్రేయస్ అయ్యర్ రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి స్టోయినిష్ వచ్చాడు. పంజాబ్ తొలి వికెట్ డౌన్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ముఖేష్ చౌదరి బౌలింగ్లో ప్రభుసిమ్రాన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(22), శ్రేయస్ అయ్యర్(1) ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరన -
నాన్నంటే భయం.. అన్నయ్యతో పాటూ నేనూ అక్కడే: ధోని
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటల్ని లిఖించుకున్న దిగ్గజ కెప్టెన్. రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేసిన ఈ జార్ఖండ్ ‘డైనమైట్’.. తన ఆటతో పేరుప్రఖ్యాతులతో పాటు కోట్ల సంపదను ఆర్జించాడు.టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్తో అభిమానులను అలరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. 43 ఏళ్ల తలా రిటైర్మెంట్పై ఎప్పటికప్పుడు వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా ధోని తల్లిదండ్రులు కూడా చెపాక్ స్టేడియానికి రావడం ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది.తొలిసారి స్టేడియానికి!సాధారణంగా ధోని భార్య సాక్షి (Sakshi Singh), కూతురు జీవా (Ziva Dhoni) మాత్రమే స్టేడియానికి వచ్చి సందడి చేస్తూ ఉంటారు. కానీ ఈసారి అతడి తల్లిదండ్రులు కూడా రావడం ఆసక్తిని రేకెత్తించింది. అయితే, రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇంకా పది నెలల సమయం ఉందంటూ ధోని వదంతులను కొట్టిపారేశాడు.PC: CSKఇదిలా ఉంటే.. ధోని తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడడన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా రాజ్ షమానీ షోలో మాత్రం మొదటిసారి తన బాల్యం, తమ తండ్రి గురించి ధోని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.ఆడంబరాలు లేవు‘‘మేము చిన్నపిల్లలుగా ఉన్నపుడు జీవితంలో అభద్రతా భావం అన్న మాటకు మాకు అర్థం తెలియదు. రోజులు అలా గడిచిపోతూ ఉండేవి. ఉన్నంతలో దేనికీ లోటు లేకుండా మా తల్లిదండ్రులు చూసుకునేవారు. ఆడంబరాలు లేవు. ఫోన్లు వగైరా లాంటివేమీ లేవు.అన్నయ్యతో పాటూ నేనూ అక్కడేమా కాలనీలోనే స్కూల్ ఉండేది. టీచర్లంతా చుట్టుపక్కలే ఉండేవారు. కాబట్టి ఎల్లప్పుడూ గంభీర వాతావరణమే ఉండేది. బద్మాషీ వేషాలు వేసేందుకు ఆస్కారమే లేదు. మా అన్నయ్యకు నాకు వయసులో పదేళ్ల వ్యత్యాసం. ఇద్దరమూ ఒకే స్కూల్కు వెళ్లేవాళ్లం.మా కుటుంబం గురించి టీచర్లందరికీ తెలుసు. అయితే, కాలనీలో ఆటలు మాత్రం బాగా ఆడేవాళ్లం. ఒకరోజు ఓడితే.. మరో రోజు గెలవాల్సిందే. అంతలా పట్టుదలకు పోయేవాళ్లం.నాన్నంటే భయం.. కానీఅయితే, నాన్నను చూస్తే మాత్రం నేను భయపడిపోయేవాడిని. ఆయన చాలా స్ట్రిక్ట్. క్రమశిక్షణతో ఉండేవారు. సమయపాలన ఎక్కువ. మా నాన్న మమ్మల్ని ఎప్పుడూ కొట్టలేదు. తిట్టలేదు. కానీ ఆయనను చూస్తే చాలు భయం వేసేది.బహుశా.. అది ఆయన మీద ఒకరకమైన గౌరవమే అనుకుంటా . మా దోస్తులు చెట్లు ఎక్కుతూ, గెంతుతూ అల్లరి చేసేవాళ్లు. కానీ నేను మాత్రం ఎప్పుడూ ఆ పనిచేయలేదు. బయట ఉన్నపుడు మా నాన్న ఒక్క చూపు చూశారంటే.. అక్కడి నుంచి మాయమయ్యే వాడిని.నిజానికి నాన్న ఏమీ అనేవారు కాదు. కానీ అంతే ఆయనంటే ఓ రకమైన భయం ఉండేది. ఆయన క్రమశిక్షణే నాకూ అలవడింది’’ అని ధోని తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా ధోని ఇప్పటి వరకు ఐపీఎల్-2025లో నాలుగు మ్యాచ్లలో కలిపి 76 పరుగులే చేశాడు. ఇక ఈ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్.. జట్టును ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన మేటి కెప్టెన్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో సీఎస్కేకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ధోని కుటుంబం ఇదేధోని తల్లిదండ్రులు దేవకీ దేవి- పాన్ సింగ్. అన్న నరేంద్ర సింగ్ ధోని, అక్క జయంతి గుప్తా. ధోని భార్య సాక్షి సింగ్ ధోని, కుమార్తె జీవా సింగ్ ధోని. ధోని తండ్రి ఉక్కు పరిశ్రమలో జూనియర్ మేనేజర్గా పనిచేసేవారు. తల్లి గృహిణి.చదవండి: సొంతంగా పళ్లు కూడా తోముకోలేని దుస్థితి.. ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి: పంత్ గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్The loudest cheer, from the closest hearts! 💛#CSKvDC #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/upbKdG7DZe— Chennai Super Kings (@ChennaiIPL) April 6, 2025 -
కోహ్లి, రోహిత్ కాదు.. వారితోనే ఆడాలని ఉంది: ఎంఎస్ ధోని
ఎంఎస్ ధోని.. భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్గా, ఆటగాడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. టీమిండియాకు కెప్టెన్గా మూడు ఐసీసీ టైటిల్స్ను అందించిన ఘనత అతడిది. ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి, ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు మిస్టర్ కూల్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ధోని తాజాగా రాజ్ షమానీ యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ధోనికి హోస్ట్ నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్నఎదురైంది. తన ఆల్ టైమ్ ప్లేయింగ్ను ఎంచుకోమని అతడిని అడిగారు. అందుకు ధోని తక్షణమే తిరస్కరించాడు. బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకోపోయినప్పటికి, ఎప్పటికీ తను కలిసి ఆడడానికి ఇష్టపడే నలుగురు ఆటగాళ్లను మాత్రం ధోని షార్ట్లిస్ట్ చేశాడు. మాజీ లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ, దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేర్లను ధోని ఎంచుకున్నాడు. అయితే ధోని ఎంచుకున్న ఈ నలుగురు ప్లేయర్లలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పేర్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లి ప్రస్తుతం ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ధోని కెప్టెన్సీలో విరాట్ ఓంటి చేత్తో ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. అయినప్పటికి ధోని మాత్రం తన ఎంపిక అత్యుత్తమ నలుగురు ఆటగాళ్లలో చోటు ఇవ్వలేదు. అదేవిధంగా ఇదే ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురుంచి వస్తున్న వార్తలపై ధోని స్పందించాడు. "నేను ఇంకా ఐపీఎల్లో ఆడుతున్నా. ప్రతీ ఏడాది సమీక్షించకున్నాకే ఐపీఎల్లో పాల్గోంటున్నాను. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. ఈ జూలై నాటికి నాకు 44 ఏళ్లు వస్తాయి. తదుపరి సీజన్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు 10 నెలల సమయం ఉంది. నా రిటైర్మెంట్ ఎప్పుడు అని నిర్ణయించేది నేను కాదు.. నా శరీరం. నా శరీరం సహకరిస్తోందనపిస్తే కచ్చితంగా వచ్చే ఏడాది కూడా ఆడుతా" అని రాజ్ షమానీ పాడ్ కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ధోని తన మార్క్ను చూపించలేకపోయాడు. 4 మ్యాచ్లు ఆడి కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు. -
జట్టుకు భారం!.. ధోని ఎప్పుడో రిటైర్ కావాల్సింది: పాక్ మాజీ క్రికెటర్
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఆకట్టుకోలేకపోతున్నాడు. వికెట్ కీపర్గా తనదైన మెరుపు విన్యాసాలతో అలరిస్తున్నా.. బ్యాటర్గా మాత్రం విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అత్యుత్తమ ఫినిషర్గా పేరొందిన ‘తలా’.. ఇప్పుడు జట్టుకు భారంగా మారాడనే విమర్శలు వస్తున్నాయి.క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడి 76 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్రేటు 138.18. ఇక ఈ సీజన్లో తమ ఆరంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గెలిచిన సీఎస్కే (CSK).. ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది.ఉన్న పేరు చెడగొట్టుకోవద్దుఈ నేపథ్యంలో ధోని ఇక రిటైర్ అయి.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా చెన్నై ఆటతీరును విమర్శించే క్రమంలో ధోని బ్యాటింగ్ వైఫల్యాన్ని హైలైట్ చేస్తూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని చాన్నాళ్ల క్రితమే రిటైర్ కావాల్సిందని.. జిడ్డు బ్యాటింగ్ కారణంగా తన కీర్తికి తానే మచ్చ తెచ్చుకునే ప్రయత్నాలు మానివేయాలని సూచించాడు.ఈ మేరకు IANSతో మాట్లాడుతూ.. ‘‘ధోని చాలా ఏళ్ల క్రితమే ఆటగాడిగా వీడ్కోలు తీసుకోవాల్సింది. సాధారణంగా వికెట్ కీపర్లు 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆటను కొనసాగించలేరు. అందుకు నేనే ఓ ఉదాహరణ.సీఎస్కే ఇకనైనా గుర్తించాలివయసు మీద పడుతున్నా... ఇంకా టీవీల్లో కనిపిస్తూ.. నా ప్రదర్శన బాగా లేదనేలా విమర్శలు వస్తూ ఉంటే.. నా గత కీర్తి మసకబారిపోతుంద కదా! పదిహేనేళ్ల పాటు గొప్ప ఆటగాడిగా నీరాజనాలు అందుకున్నా .. ఇప్పుడిలా పేలవ ప్రదర్శన కనబరిస్తే యువ తరానికి అంతగా రుచించదు.నిజానికి 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీలో అతడి ఆట జట్టుకు ఏమాత్రం మేలు చేకూర్చలేదు. అప్పుడే వాళ్లు (టీమిండియా యాజమాన్యం అన్న అర్థంలో), అతడు పరిస్థితిని అంచనా వేసుకున్నారు. తర్వాత అతడు తప్పుకొన్నాడు.ఏదేమైనా జట్టు కంటే ఆటగాడికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మాత్రం ఆటకు మీరు అన్యాయం చేసినట్లే. అందుకే సీఎస్కేను అందరూ ట్రోల్ చేస్తున్నారు. గత 2-3 మ్యాచ్లలో ధోని రాగానే ప్రేక్షకుల నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి.#MSDhoni, the Thala, walks into his Chepauk Den and the crowd makes DHO-NOISE!Can he finish it off in style for #CSK tonight with his parents cheering for him?Watch LIVE action ➡ https://t.co/4Kn2OwL1UW#IPLonJioStar 👉 #CSKvDC, LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi… pic.twitter.com/1TkzYloNwL— Star Sports (@StarSportsIndia) April 5, 2025 కానీ సీఎస్కేకు ఇప్పుడు విజయాలు, పాయింట్లు కావాలి. ప్రస్తుతం వారు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించి.. సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని రషీత్ లతీఫ్ చెన్నై జట్టు యాజమాన్యానికి సూచించాడు.ఆడుతూనే ఉంటాడు..కాగా ఢిల్లీ చేతిలో ఓటమి తర్వాత ధోని రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురుకాగా... ‘‘అతడితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదిస్తున్నా.. ఈ విషయంలో నాకు ఎలాంటి సమాచారం లేదు.ఇప్పటికీ అతడు ఫిట్గానే ఉన్నాడు’’ అని సీఎస్కే హెడ్కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. మరోవైపు.. ధోని కూడా తన శరీరమే తన రిటైర్మెంట్ అంశాన్ని నిర్ణయిస్తుందంటూ.. ఇప్పట్లో వీడ్కోలు పలికే అవకాశం లేదని స్పష్టం చేశాడు.చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ -
చెపాక్ మళ్లీ చేజారె...
చెన్నై: ఐపీఎల్లో తమకు కోటలాంటి చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ పట్టు చేజారిపోతోంది. 17 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో బెంగళూరు చేతిలో ఓడిన సూపర్ కింగ్స్... ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ చేతుల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన పోరులో క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో చెన్నైని ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77; 6 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీకి తోడు అభిõÙక్ పొరేల్ (20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.అనంతరం చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులే చేసింది. విజయ్శంకర్ (54 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎమ్మెస్ ధోని (26 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. తొలి ఓవర్లోనే జేక్ ఫ్రేజర్ (0) వెనుదిరగ్గా...రాహుల్, పొరేల్ 54 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యంలో ఢిల్లీ కోలుకుంది. ముకేశ్ చౌదరి ఓవర్లో పొరేల్ వరుసగా 4, 6, 4, 4తో చెలరేగిపోగా, పవర్ప్లే ముగిసే సరికి స్కోరు 51 పరుగులకు చేరింది. ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఆడిన రాహుల్ తొలి 20 బంతుల్లో 25 పరుగులే చేశాడు. ఆ తర్వాత ధాటిగా ఆడిన అతను తర్వాతి 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 36 పరుగులు సాధించాడు. పొరేల్ వెనుదిరిగిన తర్వాత అక్షర్ పటేల్ (14 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), సమీర్ రిజ్వీ (15 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కొద్ది సేపు రాహుల్కు అండగా నిలిచాడు. 33 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఒకే ఓవర్లో రాహుల్, అశుతోష్ (1) అవుటైనా...చివర్లో స్టబ్స్ (12 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు సాధించాడు. సమష్టి వైఫల్యం... ఛేదనలో చెన్నై ఆరంభం నుంచే తడబడింది. పిచ్ నెమ్మదిస్తూ పోవడంతో పరుగులు రావడంతో కష్టంగా మారిపోయింది. టాప్–6లో విజయ్శంకర్ మినహా అంతా విఫలమయ్యారు. ఆరు పరుగుల వ్యవధిలో రచిన్ (3), రుతురాజ్ (5) అవుట్ కాగా, కాన్వే (13) విఫలమయ్యాడు. ఆ తర్వాత 9 పరుగుల తేడాతో శివమ్ దూబే (18), రవీంద్ర జడేజా (2) కూడా వెనుదిరిగారు. ఆ తర్వాత విజయ్ బాగా నెమ్మదిగా ఆడగా, ధోని కూడా ప్రభావం చూపలేదు. తాను ఆడిన తొలి 31 బంతుల్లో విజయ్ ఒక్కటే ఫోర్ కొట్టగలిగాడు! వీరిద్దరు కలిసి ఆరో వికెట్కు 57 బంతుల్లో 84 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: జేక్ ఫ్రేజర్ (సి) అశ్విన్ (బి) అహ్మద్ 0; రాహుల్ (సి) «ధోని (బి) పతిరణ 77; పొరేల్ (సి) పతిరణ (బి) జడేజా 33; అక్షర్ (బి) నూర్ 21; రిజ్వీ (సి) జడేజా (బి) అహ్మద్ 20; స్టబ్స్ (నాటౌట్) 24; అశుతోష్ (రనౌట్) 1; నిగమ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–0, 2–54, 3–90, 4–146, 5–179, 6–180. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–25–2, ముకేశ్ చౌదరి 4–0–50–0, అశ్విన్ 3–0–21–0, జడేజా 2–0–19–1, నూర్ అహ్మద్ 3–0–36–1, పతిరణ 4–0–31–1. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) అండ్ (బి) ముకేశ్ 3; కాన్వే (సి) పటేల్ (బి) నిగమ్ 13; రుతురాజ్ (సి) జేక్ ఫ్రేజర్ (బి) స్టార్క్ 5; విజయ్శంకర్ (నాటౌట్) 69; దూబే (సి) స్టబ్స్ (బి) నిగమ్ 18; జడేజా (ఎల్బీ) (బి) కుల్దీప్ 2; ధోని (నాటౌట్) 30; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–14, 2–20, 3–41, 4–65, 5–74. బౌలింగ్: స్టార్క్ 4–0–27–1, ముకేశ్ కుమార్ 4–0–36–1, మోహిత్ శర్మ 3–0–27–0, విప్రాజ్ నిగమ్ 4–0–27–2, కుల్దీప్ యాదవ్ 4–0–30–1, అక్షర్ పటేల్ 1–0–5–0. ధోని మళ్లీ అలాగే... ‘ధోని గతంలోలాగా ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయలేడు కాబట్టి కావాలనే ఆలస్యంగా వస్తున్నాడు’...చెన్నై కోచ్ ఫ్లెమింగ్ వివరణ ఇది. శనివారం తప్పనిసరి పరిస్థితుల్లో అతను 74/5 వద్ద 11వ ఓవర్ ఐదో బంతికే బ్యాటింగ్కు వచ్చాడు. 56 బంతుల్లో 110 పరుగులు చేయాల్సిన స్థితిలో అతనిపై పెద్ద బాధ్యత కనిపించింది. కానీ అతను భారీ షాట్లు ఆడలేక మళ్లీ అభిమానులను నిరాశపర్చాడు. 16 సింగిల్స్, 2 సార్లు రెండేసి పరుగులు తీసిన అతని బ్యాటింగ్లో ఆరు ‘డాట్బాల్స్’ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనట్లు అతని తల్లిదండ్రులిద్దరూ ఈ మ్యాచ్కు హాజరు కావడం విశేషం! దాంతో అతని కెరీర్ ముగింపుపై మరోసారి చర్చ మొదలైంది. -
అదే మా కొంపముంచింది.. ఏదీ కలిసి రావడం లేదు: సీఎస్కే కెప్టెన్
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 25 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ చెన్నై తేలిపోయింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో విజయ్ శంకర్ 69 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఎంఎస్ ధోని(30 నాటౌట్) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, స్టార్క్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫ్యలమే తమ ఓటమికి కారణమని గైక్వాడ్ వెల్లడించాడు."గత కొన్ని మ్యాచ్ల నుంచి మాకు ఏదీ కలిసి రావడం లేదు. ప్రతీ మ్యాచ్లోనూ మేము మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నాము. కానీ మేము ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో ఎక్కువగా వికెట్లు కోల్పోయాము. బౌలింగ్లో కూడా మేము చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాము. అదనంగా 15 నుంచి 20 పరుగులు అదనంగా ఇస్తున్నాం. లేదంటే పవర్ ప్లేలోనే ఎక్కువ వికెట్లు కోల్పోతున్నాం. లోపాలను సరిదిద్దుకోవాడనికి ప్రయత్నిస్తున్నాము. కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. పవర్ ప్లేలో మేం అతి జాగ్రత్తగా బ్యాటింగ్, బౌలింగ్ చేస్తుండటం మాకు నష్టం కలిగిస్తోంది అన్పిస్తోంది.పవర్ ప్లేలో ఎక్కువగా వికెట్లు కోల్పోతుండడంతో బ్యాక్ఫుట్లో ఉండిపోతున్నాము. అందరూ సమిష్టిగా రాణించాల్సిన అవసరముంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ కండీషన్స్ను చక్కగా ఉపయోగించుకున్నారు. శివమే దూబే క్రీజులో ఉన్నప్పుడు మేము ఆ మూమెంటమ్ అందుకుంటామని భావించాము. కానీ అలా జరగలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో గైక్వాడ్ పేర్కొన్నాడు. -
కేఎల్ రాహుల్ సూపర్ ఫిప్టీ.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విన్
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో విజయ్ శంకర్ 69 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఎంఎస్ ధోని(30 నాటౌట్) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, స్టార్క్ తలా వికెట్ సాధించారు. సీఎస్కేకు ఇది వరుసగా మూడో ఓటమి కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్కు వరుసగా మూడో విజయం కావడం గమనార్హం.రాహుల్ సూపర్ ఫిప్టీ.. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 51 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 6 ఫోర్లు, 3 సిక్స్లతో 77 పరుగులు చేశాడు. రాహుల్తో పాటు పోరెల్(33), స్టబ్స్(24), రిజ్వీ(21) రాణించారు. సీఎస్కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరానా తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: ధోని ఐపీఎల్కు గుడ్ బై చెప్పనున్నాడా? ఫ్యామిలీ ఫోటోలు వైరల్ -
ధోని ఐపీఎల్కు గుడ్ బై చెప్పనున్నాడా? ఫ్యామిలీ ఫోటోలు వైరల్
ఐపీఎల్-2025 తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని (Ms Dhoni).. అన్ని ఫార్మాట్ల క్రికెట్కు విడ్కోలు పలకనున్నాడా? అంటే అవునానే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఈ ఏడాది సీజన్ అనంతరం 43 ఏళ్ల ధోని తన రిటైర్మెంట్ను ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో సీఎస్కే తలపడుతోంది. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు ధోని కుటంబ సభ్యులు స్టేడియం వచ్చారు. ఈ మ్యాచ్ను చూసేందుకు అతడి తల్లిదండ్రులు కూడా స్టేడియంకు రావడం గమనార్హం. దీంతో ధోని ఐపీఎల్కు గుడ్బై చెప్పనున్నడంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపుందుకుంది. ధోని తల్లిదండ్రులు మ్యాచ్ను వీక్షించేందుకు మైదానం రావడం చాలా అరుదు. ధోని ఫ్యామిలీ మ్యాచ్ చూస్తున్న సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ధోని తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 267 మ్యాచ్లు ఆడి 39.18 సగటుతో 5,289 పరుగులు చేశాడు. ఈ లెంజడరీ వికెట్ కీపర్ చెన్నై సూపర్ కింగ్స్కు 237 మ్యాచ్ల్లో ప్రాతినిథ్యం వహించాడు. సీఎస్కే తరపున 40.30 సగటుతో 4,715 పరుగులు చేశాడు. అంతేకాకుండా సారథిగా సీఎస్కేను ఐదు సార్లు ఛాంపియన్స్గా నిలిపాడు. -
కేఎల్ రాహుల్ అరుదైన ఫీట్.. గంభీర్ రికార్డు సమం
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అద్భుతైన ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని రాహుల్ సాధించాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్.. ప్రత్యర్ధి బౌలర్లను ఆ ఆట ఆడేసి కున్నాడు. పవర్ప్లేలో దూకుడుగా ఆడిన రాహుల్, ఆ తర్వాత తన క్లాసీ బ్యాటింగ్తో స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. పోరెల్, అక్షర్ పటేల్, రిజ్వీ, స్టబ్స్తో కలిసి కీలక భాగస్వామ్యాలను కేఎల్ నెలకొల్పాడు. 51 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 6 ఫోర్లు, 3 సిక్స్లతో 77 పరుగులు చేసి ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. కాగా కేఎల్ రాహుల్కు సీఎస్కేపై ఇది ఆరో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా రాహుల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కేపై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన నాలుగో ఆటగాడిగా గౌతం గంభీర్ రికార్డును రాహుల్ సమం చేశాడు. గంభీర్ తన కెరీర్లో ఆరు సార్లు ఏభై పైగా పరుగులు చేయగా.. రాహుల్ కూడా సరిగ్గా ఆరు సార్లే ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. ఇక రేర్ ఫీట్ సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. వార్నర్ తన కెరీర్లో 9 సార్లు సీఎస్కేపై 6 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. ఈ లిస్ట్లో వార్నర్ తర్వాతి స్దానాల్లో విరాట్ కోహ్లి(9), శిఖర్ ధావన్(8), గంభీర్(6), రాహుల్(6) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(77)తో పాటు పోరెల్(33), స్టబ్స్(24), రిజ్వీ(21) రాణించారు. సీఎస్కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరానా తలా వికెట్ సాధించారు.చదవండి: రూ. 18 కోట్లు! .. ఒక్క మ్యాచ్లోనూ రాణించలేదు.. అందరి కళ్లు అతడి మీదే.. -
ధోని సారథ్యంలో?
చెన్నై: వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్కు సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ... ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించింది. మరోవైపు విజయంతో లీగ్ను ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్... ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడింది. రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ఈ మ్యాచ్లో ‘మాస్టర్మైండ్’ మహేంద్ర సింగ్ ధోని చెన్నై జట్టును నడిపించే అవకాశాలున్నాయి. చెపాక్ స్టేడియంలో మెరుగైన రికార్డు ఉన్న చెన్నై జట్టు... చివరగా ఇక్కడ ఆడిన మ్యాచ్లో బెంగళూరు చేతిలో పరాజయం పాలైంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో... ఈ మ్యాచ్లో స్పిన్ను సమర్థవంతంగా ఆడిన జట్టు ముందంజ వేయనుంది. రాజస్తాన్ రాయల్స్తో పోరులో గాయపడ్డ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో... అతడు బరిలోకి దిగడంపై సందేహాలు నెలకొన్నాయి. మ్యాచ్ సమయానికి అతడు సిద్ధంగా లేకుంటే... ధోని చెన్నై కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ధోనితో చెన్నై బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్లో నూర్ అహ్మద్ విజృంభిస్తుండగా... పతిరణ, ఖలీల్ అహ్మద్, అశ్విన్, జడేజా అతడికి అండగా నిలుస్తున్నారు. మరోవైపు ఢిల్లీ జట్టులో కూడా నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, నూర్ అహ్మద్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. డుప్లెసిస్, మెక్గుర్క్తో ఢిల్లీ ఓపెనింగ్ బలంగా ఉండగా... ఫామ్లో ఉన్న అభిషేక్ పొరెల్, కేఎల్ రాహుల్, అక్షర్, స్టబ్స్, అశుతోష్ శర్మ మిడిలార్డర్లో బ్యాటింగ్కు రానున్నారు. గతంలో చెన్నైకి ప్రాతినిధ్యం వహించిన డు ప్లెసిస్కు చెపాక్ పిచ్పై మంచి రికార్డు ఉంది. ఇక పేస్ బౌలింగ్ తురుపుముక్క మిచెల్ స్టార్క్ తన విలువ చాటుకుంటుండటం ఢిల్లీకి అదనపు ప్రయోజనం చేకూరుస్తోంది. చెపాక్ వేదికగా చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య 9 మ్యాచ్లు జరగగా... అందులో ఏడింట చెన్నై విజయం సాధించింది. తుది జట్లు (అంచనా) చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ (కెప్టెన్ ), కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, విజయ్ శంకర్, జడేజా, ఓవర్టన్/రచిన్ రవీంద్ర, ధోని, అశ్విన్, ఖలీల్, నూర్, పతిరణ. ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ (కెప్టెన్ ), డు ప్లెసిస్, మెక్గుర్క్, అభిషేక్ పొరెల్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, కుల్దీప్, స్టార్క్, ముకేశ్, మోహిత్ శర్మ. -
IPL 2025: సీఎస్కే కెప్టెన్గా ఎంఎస్ ధోని?
ఐపీఎల్-2025లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నైసూపర్ కింగ్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం(ఏప్రిల్ 5) చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు సీఎస్కేకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఢిల్లీతో మ్యాచ్కు దూరమయ్యే అవకాశముంది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గైక్వాడ్ గైక్వాడ్ కుడి మోచేయికి గాయమైంది. దీంతో అతడు అప్పటి నుంచి నెట్ప్రాక్టీస్కు దూరమయ్యాడు. తాజాగా రుతురాజ్ అందుబాటుపై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ సందేహం వ్యక్తం చేశాడు. ఒకవేళ రుతురాజ్ దూరమైతే అతడి స్ధానంలో ఎంఎస్ ధోని సీఎస్కే కెప్టెన్గా వ్యవహరించే అవకాశముందని హస్సీ తెలిపాడు."రేపటి మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ ఆడుతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. అతడు ఎంపిక అనేది కోలుకునే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇంకా అతడు నొప్పితో బాధపడుతున్నాడు. నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తను ఆడకపోతే, ఎవరు నాయకత్వం వహిస్తారో మేము ఇంకా నిర్ణయించలేదు. కానీ యువ వికెట్ కీపర్ ధోని కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు" అని హస్సీ పేర్కొన్నాడు. కాగా రుతురాజ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. రాజస్తాన్పై ఓటమి పాలైనప్పటికి రుతు 61 పరుగులతో రాణించాడు.కాగా ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో మూడు మ్యాచ్లు ఆడిన సీఎస్కే కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఢిల్లీతో జరగనున్న మ్యాచ్కు సీఎస్కే చాలా కీలకం.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), శివమ్ దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), జామీ ఓవర్టన్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, షేక్రన్ కాన్వే, షేక్రాన్ కాన్వే, సమ్కో కాన్వే శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి, దీపక్ హుడాచదవండి: IPL 2025: ముంబైకి భారీ షాక్.. రోహిత్ శర్మకు గాయం -
IPL 2025: సీఎస్కే జట్టులో మార్పు..? ముంబై బ్యాటర్కు పిలుపు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విభాగంలో బలహీనంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో కెప్టెన్ రుతురాజ్, ఓపెనర్ రచిన్ రవీంద్ర మాత్రమే రాణించారు. మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి అవకాశం వచ్చిన మూడు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. దీపక్ హుడా ఆడిన రెండు మ్యాచ్ల్లో నిరాశపరిచాడు. గత సీజన్లో మెరుపులు మెరిపించిన శివమ్ దూబే ఈ సీజన్లో స్థాయికి తగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. మూడో మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న విజయ్ శంకర్ కూడా ఫెయిలయ్యాడు. జడేజా, ధోని పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా సీఎస్కే ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట ఓడింది. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం తమ బ్యాటింగ్ విభాగాన్ని బలపరచుకునే యోచనలో పడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ముంబై యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రేను ట్రయల్స్కు పిలిచింది. దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న మాత్రేను సీఎస్కే గత సీజన్లో కూడా ట్రయల్స్కు పిలిచింది. అతని పెర్ఫార్మెన్స్తో సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఈ సీజన్లో ఎందుకో అతన్ని ఎంపిక చేసుకోలేదు.మాత్రే గతేడాది జరిగిన U19 ఆసియా కప్లో అద్భుతంగా రాణించాడు. 44 సగటున, 135.38 స్ట్రైక్ రేట్తో 176 పరుగులు చేశాడు. కుడిచేతి వాటం స్టైలిష్ బ్యాటర్ అయిన మాత్రే.. గత సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో కూడా సత్తా చాటాడు. 65.43 సగటున, 135.50 స్ట్రైక్ రేట్తో 458 పరుగులు చేశాడు.మాత్రేను ట్రయల్స్కు పిలిచిన విషయాన్ని అంగీకరించిన సీఎస్కే యాజమాన్యం అవసరమైతేనే (ఎవరైనా గాయపడితే) అతన్ని జట్టుకు ఎంపిక చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికైతే కొత్తగా ఎవరినీ జట్టులో చేర్చుకోబోమని స్పష్టం చేసింది. కాగా, తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై విజయం సాధించి, ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన సీఎస్కే తమ నాలుగో మ్యాచ్లో పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ను సీఎస్కే తమ సొంత మైదానమైన చెపాక్లో ఏప్రిల్ 5వ తేదీ మధ్యాహ్నం (3:30) ఆడుతుంది.బెంచ్ కూడా బలహీనమేఈ సీజన్లో సీఎస్కే జట్టు ఎంపిక అస్సలు బాగోలేదు. ఆ జట్టు బెంచ్ కూడా చాలా బలహీనంగా ఉంది. వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లను తప్పిస్తే ఆ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాళ్లు కూడా లేరు. ఈ సీజన్లో సీఎస్కే ఎంపిక చేసుకున్న విదేశీ ఆటగాళ్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు. బౌలర్లలో నూర్ అహ్మద్ ఒక్కడే రాణిస్తున్నాడు. పతిరణ పర్వాలేదనిపిస్తున్నాడు. ఆల్రౌండర్ సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్ తేలిపోయారు. బ్యాటింగ్లో రచిన్ రవీంద్ర ఒక్కడే రాణిస్తున్నాడు. డెవాన్ కాన్వేను తుది జట్టులోకి తెద్దామనుకుంటే నలుగురు ఆటగాళ్ల నియమం అడ్డొస్తుంది.సీఎస్కే పూర్తి జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని (వికెట్కీపర్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్కోటి, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, షేక్ రషీద్, శ్రేయస్ గోపాల్, డెవాన్ కాన్వే, ముఖేష్ చౌదరి, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి -
IPL 2025: రాయల్స్ చేతిలో పరాజయం.. సెంచరీ కొట్టిన సీఎస్కే
ఐపీఎల్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల సెంచరీని పూర్తి చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో సీఎస్కే ఈ ల్యాండ్ మార్కును తాకింది. తద్వారా ఐపీఎల్లో 100 పరాజయాలు పూర్తి చేసుకున్న ఏడో జట్టుగా నిలిచింది. సీఎస్కేకు ముందు ఢిల్లీ (134), పంజాబ్ (133), ఆర్సీబీ (128), కేకేఆర్ (118), ముంబై ఇండియన్స్ (117), రాజస్థాన్ రాయల్స్ (108) 100 పరాజయాల మార్కును తాకాయి. మధ్యలో రెండు సీజన్లు మినహా ఐపీఎల్ మొత్తంలో పాల్గొన్న సీఎస్కే ఇప్పటివరకు 242 మ్యాచ్లు ఆడి 139 విజయాలు, 100 పరాజయాలను ఎదుర్కొంది. ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో సీఎస్కే రెండో స్థానంలో ఉంది. ముంబై (142) టాప్లో ఉండగా.. సీఎస్కే (139), కేకేఆర్ (131), ఆర్సీబీ (123), ఢిల్లీ (114), రాజస్థాన్ (111), పంజాబ్ (110) వరుస స్థానాల్లో ఉన్నాయి.కాగా, ఐపీఎల్-2025లో భాగంగా నిన్న (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ గెలిచిన ఆ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్లో నితీశ్తో పాటు శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2), ఖలీల్ అహ్మద్ (4-0-38-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్), జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), ధోని (11 బంతుల్లో 16; ఫోర్, సిక్స్) పోరాడినా లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రాయల్స్ బౌలర్లలో హసరంగ (4-0-35-4), ఆర్చర్ (3-1-13-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరి ఓవర్లో సీఎస్కే గెలుపుకు అవసరం కాగా.. సందీప్ శర్మ 13 పరుగులకే ఇచ్చి రాయల్స్కు ఈ సీజన్లో తొలి గెలుపును అందించాడు. -
RR VS CSK: చివరి ఓవర్లో ధోని ఔట్.. సీఎస్కే ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ చూడండి..!
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి వరకు పోరాడి 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో సీఎస్కే 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 176 పరుగుల వద్ద ఆగిపోయింది. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోని చెన్నైని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.Shimron Hetmeyer took a brilliant catch in the final over to dismiss MS Dhoni and potentially save the match for Rajasthan !! 👏👏#RRvCSK #RRvsCSK pic.twitter.com/AGhS9ZM2cU— Cricketism (@MidnightMusinng) March 30, 2025చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. ధోని తొలి బంతికే ఔటయ్యాడు. సందీప్ శర్మ బౌలింగ్లో హెట్మైర్ బౌండరీ లైన్ వద్ద అద్బుతమైన క్యాచ్ పట్టాడు. ఇది చూసి ధోనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ ఫ్యాన్ గర్ల్ తట్టుకోలేకపోయింది. ఎంత పని చేశావు రా అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. హెట్మైర్ పక్కనే ఉంటే ఆ అభిమాని చేతిలో తన్నులు తినుండే వాడు. ఈ ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. దీనిపై రకరకాల మీమ్స్ వస్తున్నాయి.Reaction of a Dhoni fan when Hetmyer took his catch! Thala for a reason! 🔥 pic.twitter.com/0RmHT4kfcw— Keh Ke Peheno (@coolfunnytshirt) March 31, 2025కాగా, ధోని ఔటైన అనంతరం గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో నిశ్శబ్దం ఆవహించింది. ఈ మ్యాచ్లో ధోని సీఎస్కేను గెలిపిస్తాడని అంతా అనుకున్నారు. రాయల్స్ సైతం ధోనికి బయపడుతూనే సందీప్ శర్మకు చివరి ఓవర్ ఇచ్చింది. అప్పటికే 10 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 16 పరుగులు చేసిన ధోని మంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. Wake up babe new meme template just dropped #CSKvsRR #Dhoni pic.twitter.com/J5jMnZKp4W— Ganeshan (@ganeshan_iyer) March 30, 2025అయితే హెట్మైర్ డీప్ మిడ్ వికెట్ వద్ద అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టి చెన్నై అభిమానుల ఆశలను అడియాసలు చేశాడు. ధోని ఔటైన వెంటనే సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. నాలుగో బంతికి ఓవర్టన్ సిక్సర్ కొట్టినా ఎలాంటి ప్రయోజనం లేదు.ఛేదనలో సీఎస్కే ఆదిలోనే ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర వికెట్ కోల్పోయినా కెప్టెన్ రుతురాజ్ చక్కటి అర్ద సెంచరీతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. ఆఖర్లో జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) పోరాడినా ఫలితం లేదు. ఇన్నింగ్స్ మధ్యలో హసరంగ ప్రతి ఓవర్లో ఓ వికెట్ తీసి సీఎస్కేను దెబ్బకొట్టాడు. శివమ్ దూబే లాంటి భారీ హిట్టర్ కొన్ని ఓవర్ల పాటు క్రీజ్లో ఉండివుంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ దూబేను రియాన్ పరాగ్ అద్బుతమైన క్యాచ్తో పెవిలియన్కు పంపాడు.అంతకుముందు నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో రాయల్స్ 182 పరుగులు చేసింది. వాస్తవానికి రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేయాల్సింది. అయితే నితీశ్ను ఔట్ చేశాక సీఎస్కే బౌలర్లు నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2), ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పరిస్థితికి అదుపులోకి తెచ్చుకున్నారు. ఈ మ్యాచ్లో ఓటమితో సీఎస్కే రన్రేట్ కూడా బాగా దెబ్బతినింది. ఈ సీజన్లో ఆ జట్టుకు మూడు మ్యాచ్ల్లో ఇది రెండో ఓటమి. తొలి మ్యాచ్లో ముంబైపై విజయం సాధించిన ఎల్లో ఆర్మీ.. ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాయల్స్ చేతుల్లో పరాజయంపాలైంది. -
RR VS CSK: 20 పరుగులు తక్కువ చేశామనిపించింది.. ఫీల్డింగ్తో కవర్ చేశాము: రియాన్ పరాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయం నమోదు చేసింది. సీఎస్కేపై గెలుపుతో రాయల్స్ ఖాతాను ఓపెన్ చేసింది. సొంత మైదానంలో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్లో రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి 182 పరుగులు చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్లో రాయల్స్కు లభించిన మెరుపు ఆరంభాన్ని బట్టి చూస్తే ఇంకా భారీ స్కోర్ చేసుండాలి. కానీ సీఎస్కే బౌలర్లు పరిస్థితులను అదుపులోకి తెచ్చుకున్నారు. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. రాణా ఔటయ్యాక రాయల్స్ ఇన్నింగ్స్ ఢీలా పడింది. శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2) మరోసారి అద్భుతమైన స్పెల్స్ వేశారు. ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పర్వాలేదనిపించాడు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఓవర్టన్ (2-0-30-0), అశ్విన్ (4-0-46-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కేకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. అనంతరం రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హసరంగ (4-0-35-4) తన స్పెల్ ప్రతి ఓవర్లో వికెట్ తీసి సీఎస్కేను ఇరకాటంలో పడేశాడు. అయినా సీఎస్కేకు గెలుపు అవకాశాలు ఉండేవి. చివరి 3 ఓవర్లలో 45 పరుగులు చేయాల్సి ఉండింది. ధోని, జడ్డూ భారీ షాట్లు ఆడిన సీఎస్కే లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివరి ఓవర్లో 20 పరుగులు కాపాడుకోవాల్సిన తరుణంలో ఆర్చర్కు (3-1-13-1) బౌలింగ్ ఇవ్వకుండా సందీప్ శర్మకు బంతినప్పగించి రియాన్ పెద్ద సాహసమే చేశాడు. ఇది వర్కౌటైంది. సందీప్ 13 పరుగులు మాత్రమే ఇవ్వడంతో రాయల్స్ ఊపిరిపీల్చుకుంది.మ్యాచ్ అనంతరం రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. సమయం తీసుకున్నా ఈ గెలుపు ఆనందానిచ్చింది. తొలి రెండు మ్యాచ్లు కఠినంగా సాగాయి. 20 పరుగులు తక్కువ చేశామని భావించాము. మిడిల్ ఓవర్లలో బాగానే ఆడినప్పటికీ.. వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయాము.మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారు మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేశారు. తొలి మ్యాచ్లో 287 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయాము. రెండో మ్యాచ్లో 151 పరుగల టార్గెట్ను కాపాడుకోలేకపోయాము. అదృష్టవశాత్తు ఈ రోజు ఆటలో మాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నితీశ్తో పాటు నేను కూడా బాగానే ఆడానుకుంటున్నాను. చివరి ఓవర్ను ఆర్చర్కు కాకుండా సందీప్ శర్మకు ఇవ్వడంపై స్పందిస్తూ.. కెప్టెన్గా నాకు అనిపించి చేశాను. బ్యాటింగ్లో తక్కువ చేశామని భావిస్తున్న 20 పరుగులను ఫీల్డింగ్లో కవర్ చేశాము. ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్తో కలిసి చాలా వర్కౌట్ చేశాము. ఫలితం వచ్చింది. -
RR VS CSK: మేము చరుగ్గా లేము.. అందుకు సంతోషమే: రుతురాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. నిన్న (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. గౌహతిలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో రాయల్స్ కీలకమైన క్షణాలన్నిటినీ అధిగమించి విజేతగా నిలిచింది. ఈ సీజన్లో రాయల్స్కు ఇది తొలి విజయం.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ మ్యాచ్లో రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేసుండాల్సింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) రాయల్స్కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో రాయల్స్ ఊహించిన దానికంటే 20-30 పరుగులు తక్కువ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్లో నితీశ్తో పాటు శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నితీశ్ను ఔట్ చేశాక సీఎస్కే పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకుంది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసింది. నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2) మరోసారి అద్భుతమైన స్పెల్స్ వేశారు. ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పర్వాలేదనిపించాడు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఓవర్టన్ (2-0-30-0), అశ్విన్ (4-0-46-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కేకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను ఈ సీజన్లో చెత్త ఫామ్లో ఉన్న జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. అనంతరం రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హసరంగ (4-0-35-4) తన స్పెల్ ప్రతి ఓవర్లో వికెట్ తీసి సీఎస్కేను ఇరకాటంలో పడేశాడు. సీఎస్కే గెలుపుకు చివరి 3 ఓవర్లలో 45 పరుగులు కావాల్సి ఉండింది. ధోని, జడ్డూ క్రీజ్లో ఉన్నారు. వీరిద్దరు నిలబడితే సీఎస్కే ఎలాగైనా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడే తీక్షణ మ్యాజిక్ చేశాడు. 18వ ఓవర్లో అతను కేవలం 6 పరుగులే ఇచ్చి సీఎస్కేకు లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్లో తుషార్ దేశ్పాండే బౌలింగ్లో జడ్డూ, ధోని చెలరేగగా (బౌండరీ, 2 సిక్సర్లు) చివరి ఓవర్లో సీఎస్కే లక్ష్యం 20 పరుగులుగా మారింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆర్చర్కు (3-1-13-1) చివరి ఓవర్ ఇవ్వకుండా రాయల్స్ కెప్టెన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆర్చర్కు బదులుగా సందీప్ శర్మను నమ్ముకోగా.. అతను కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి బంతికే ధోని వికెట్ తీసి ఆతర్వాత రెండు బంతులను సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో సీఎస్కే గెలుపుకు చివరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు అవసరమయ్యాయి. అక్కడికీ ఓవర్టన్ నాలుగో బంతికి సిక్సర్ బాది సీఎస్కే గెలుపు ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే ఐదో బంతికి రెండు పరుగులే రావడంతో సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. చివరి ఓవర్ను సందీప్ శర్మకు ఇవ్వడంతో టెన్షన్ పడ్డ రాయల్స్ అభిమానులు చివరికి ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు (రెండు మ్యాచ్ల తర్వాత) రియాన్ పరాగ్ కెప్టెన్గా తన తొలి విజయాన్ని నమోదు చేశాడు. ఈ గెలుపు సొంత అభిమానుల మధ్య దక్కడం అతనికి మరింత స్పెషల్.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నితీశ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లేలో అతని ఆటతీరు అమోఘం. నితీశ్ ఎక్కువగా వెనుక భాగంలో షాట్లు ఆడుతున్నాడని తెలిసి కూడా మేము చురుగ్గా లేము. అతన్ని వికెట్కు ముందు ఆడించే ప్రయత్నం చేసుండాల్సింది. మిస్ ఫీల్డ్ల ద్వారా అదనంగా 8-10 పరుగులు సమర్పించుకున్నాము. ఫీల్డింగ్లో చాలా మెరుగుపడాలి. ఈ వికెట్పై 180 పరుగులు ఛేదించదగ్గ టార్గెటే. ఇన్నింగ్స్ బ్రేక్లో సంతోషపడ్డాను. వారు 210 పరుగులకు పైగా స్కోర్ చేస్తారని అనుకున్నాను. మా బౌలర్లు బాగా కంట్రోల్ చేశారు. జరగాల్సిన నష్టం ఆదిలోనే జరిగిపోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత కొన్ని సీజన్లలో రహానే 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాయుడు మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకునేవాడు. నేను కూడా మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకోవడానికి కొంచెం ఆలస్యంగా వస్తే మంచిదని భావించాము. అయితే అది వర్కౌట్ కాలేదు. మూడు మ్యాచ్ల్లోనూ ఆట ప్రారంభంలోనే బ్యాటింగ్కు దిగాల్సి వచ్చింది. వేలం సమయంలోనే నేను మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగాలని నిర్ణయించబడింది. ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దురదృష్టవశాత్తు ఈ సీజన్లో మాకు మంచి ఆరంభాలు లభించడం లేదు. ఒక్కసారి మా ఓపెనర్లిద్దరూ టచ్లోకి వస్తే పరిస్థితులు మారతాయి. ఎప్పటిలాగే నూర్ బాగా బౌలింగ్ చేశాడు. ఖలీల్, జడ్డూ కూడా సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో కొంత ఊపు అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా రాణిస్తే మా జట్టుకు తిరుగుండదు. -
రాజస్తాన్ ఖాతా తెరిచింది
గువాహాటి: ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండు ఓటముల నుంచి రాజస్తాన్ రాయల్స్ కోలుకుంది. తమ మూడో మ్యాచ్లో విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ చేసింది. ఆదివారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో రాజస్తాన్ 6 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. చెన్నైకిది వరుసగా రెండో పరాజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... రవీంద్ర జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. రాణా మెరుపులు... తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (4) వెనుదిరగ్గా... సంజు సామ్సన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), రాణా కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ముఖ్యంగా రాణా ఏ బౌలర్నూ వదలకుండా చెలరేగిపోయాడు. ఒవర్టన్ వరుస రెండు ఓవర్లలో కలిపి 3 ఫోర్లు, సిక్స్ కొట్టాక అశ్విన్ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4 బాదాడు. ఆ తర్వాత ఖలీల్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన రాణా 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. సామ్సన్ అవుటయ్యాక కొద్దిసేపు రాణాకు పరాగ్ అండగా నిలిచాడు. అశ్విన్ ఓవర్లో మళ్లీ వరుసగా 6, 4 కొట్టాక తర్వాతి బంతికి స్టంపౌట్ కావడంతో రాణా మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. అయితే అతను అవుటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చెన్నై బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో రాయల్స్ ఆశించిన స్కోరుకు చాలా దూరంలో ఆగిపోయింది. రాణా వెనుదిరిగాక 51 బంతుల్లో 58 పరుగులు మాత్రమే చేయగలిగిన జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. పవర్ప్లేలో 79 పరుగులు చేసిన రాజస్తాన్ మిగిలిన 14 ఓవర్లలో కలిపి 103 పరుగులు మాత్రమే సాధించింది. రుతురాజ్ హాఫ్ సెంచరీ... ఛేదనలో చెన్నై మొదటి ఓవర్లోనే రచిన్ రవీంద్ర (0) వికెట్ కోల్పోగా, ఐదు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, సిక్స్ కొట్టి ధాటిని ప్రదర్శంచిన రాహుల్ త్రిపాఠి (19 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. మరోవైపు రుతురాజ్ మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. సందీప్ ఓవర్లో అతను 3 ఫోర్లు కొట్టాడు. పరాగ్ అద్భుత క్యాచ్కు శివమ్ దూబే (18) వెనుదిరగ్గా, విజయ్శంకర్ (9) విఫలమయ్యాడు. 37 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రుతురాజ్ను కీలక సమయంలో హసరంగ అవుట్ చేశాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని (11 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజ్లోకి వచ్చాడు. అయితే అతనూ ప్రభావం చూపలేకపోగా, మరో ఎండ్లో జడేజా కూడా జట్టును గెలిపించడంలో సఫలం కాలేకపోయాడు. ఆఖరి 2 ఓవర్లలో విజయానికి 39 పరుగులు అవసరం కాగా, చెన్నై 32 పరుగులు రాబట్టగలిగింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) అశ్విన్ (బి) అహ్మద్ 4; సామ్సన్ (సి) రచిన్ (బి) నూర్ 20; నితీశ్ రాణా (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 81; పరాగ్ (బి) పతిరణ 37; జురేల్ (సి) పతిరణ (బి) నూర్ 3; హసరంగ (సి) శంకర్ (బి) జడేజా 4; హెట్మైర్ (సి) అశ్విన్ (బి) పతిరణ 19; ఆర్చర్ (సి) గైక్వాడ్ (బి) అహ్మద్ 0; కార్తికేయ (రనౌట్) 1; తీక్షణ (నాటౌట్) 2; దేశ్పాండే (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–4, 2–86, 3–124, 4–134, 5–140, 6–166, 7–174, 8–175, 9–176. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–38–2, ఒవర్టన్ 2–0–30–0, అశ్విన్ 4–0–46–1, నూర్ అహ్మద్ 4–0–28–2, పతిరణ 4–0–28–2, జడేజా 2–0–10–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 0; త్రిపాఠి (సి) హెట్మైర్ (బి) హసరంగ 23; రుతురాజ్ (సి) జైస్వాల్ (బి) హసరంగ 63; శివమ్ దూబే (సి) పరాగ్ (బి) హసరంగ 18; విజయ్శంకర్ (బి) హసరంగ 9; జడేజా (నాటౌట్) 32; ధోని (సి) హెట్మైర్ (బి) సందీప్ 16; ఒవర్టన్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–0, 2–46, 3–72, 4–92, 5–129, 6–164. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 3–1–13–1, తుషార్ దేశ్పాండే 4–0–45–0, సందీప్ శర్మ 4–0–42–1, మహీశ్ తీక్షణ 4–0–30–0, హసరంగ 4–0–35–4, కార్తికేయ 1–0–10–0. -
IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
CSK vs RR live updates and highlights: ఐపీఎల్-2025లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతున్నాయి.బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ బోణీ కొట్టింది. గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రవీంద్ర జడేజా(32) పర్వాలేదన్పించాడు.రాజస్తాన్ బౌలర్లలో వనిందు హసరంగా నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆర్చర్, సందీప్ శర్మ ఓ వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్(37), శాంసన్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, పతిరాన, నూర్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు సాధించగా.. జడేజా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.సీఎస్కే ఐదో వికెట్ డౌన్.. గైక్వాడ్ ఔట్రుతురాజ్ గైక్వాడ్(63) రూపంలో సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. హసరంగా బౌలింగ్లో గైక్వాడ్ ఔటయ్యాడు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 129/5సీఎస్కే నాలుగో వికెట్ డౌన్.. శంకర్ ఔట్92 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన విజయ్ శంకర్.. హసరంగా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే నాలుగు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(8), గైక్వాడ్(55) ఉన్నారు.సీఎస్కే మూడో వికెట్ డౌన్..ఇంపాక్ట్ ప్లేయర్ శివమ్ దూబే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది.18 పరుగులు చేసిన దూబే.. హసరంగా బౌలింగ్లో ఔటయ్యాడు.సీఎస్కే రెండో వికెట్ డౌన్..రాహుల్ త్రిపాఠి రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన త్రిపాఠి.. హసరంగా బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. క్రీజులో దూబే(8), గైక్వాడ్ ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రుతురాజ్..6 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(20), రాహుల్ త్రిపాఠి(21) ఉన్నారు.సీఎస్కే తొలి వికెట్ డౌన్.. రవీంద్ర ఔట్183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. సూపర్ ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్ర.. ఆర్చర్ బౌలింగ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు.నితీష్ రాణా సూపర్ హాఫ్ సెంచరీ.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే?గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్(37), శాంసన్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, పతిరాన, నూర్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు సాధించగా.. జడేజా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.రాజస్తాన్ ఆరో వికెట్ డౌన్..రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన పరాగ్.. పతిరాన బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్.. జురెల్ ఔట్ధ్రువ్ జురెల్ రూపంలో రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన జురెల్.. నూర్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్..నితీష్ రాణా రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81).. అశ్విన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 129/3రాజస్తాన్ రెండో వికెట్ డౌన్.. శాంసన్ ఔట్సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన శాంసన్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ పరాగ్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్.. రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(61), రియాన్ పరాగ్(1) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రాణా..5 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(44), సంజూ శాంసన్(15) ఉన్నారు.రాయల్స్ తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో అశ్విన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఐపీఎల్-2025లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో సీఎస్కే రెండు మార్పులతో బరిలోకి దిగింది. సామ్ కుర్రాన్, దీపక్ హుడా స్ధానాల్లో ఓవర్టన్, విజయ్ శంకర్ వచ్చారు. రాయల్స్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పు చేయలేదు.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణరాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ -
IPL 2025: అత్యంత దయనీయంగా సీఎస్కే బ్యాటింగ్.. ఆ ఇద్దరికి ప్రత్యామ్నాయాలు కూడా లేరు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చాలా బలహీనంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓపెనర్ రచిన్ రవీంద్ర ఒక్కడే రాణించాడు. తొలి మ్యాచ్లో రచిన్ సత్తా చాటడంతో సీఎస్కే ముంబైను ఓడించింది. ఆ మ్యాచ్లో రుతురాజ్ కూడా రాణించినా.. ఆర్సీబీతో మ్యాచ్లో డకౌటయ్యాడు. సీఎస్కే తరఫున రెండు మ్యాచ్ల్లో ఓపెనర్గా దిగిన రాహుల్ త్రిపాఠి దారుణంగా విఫలమయ్యాడు. దీపక్ హుడా పరిస్థితి కూడా అలాగే ఉంది. రాజస్థాన్ రాయల్స్తో నేడు జరుగబోయే మ్యాచ్లో త్రిపాఠి, హుడాలకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోకపోతే సీఎస్కే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. వీరిద్దరిని ఇలాగే కొనసాగిస్తే రాయల్స్ చేతిలో కూడా పరాభవం (ఆర్సీబీ చేతిలో ఓడింది) తప్పకపోవచ్చు.ఆల్రౌండర్ సామ్ కర్రన్ కూడా తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. అతనిపై కూడా సీఎస్కే మేనేజ్మెంట్ దృష్టి సారించాలి. సామ్ బౌలర్గా కూడా విఫలమయ్యాడు. మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సైతం ఈ సీజన్లో అంతంతమాత్రంగానే ఉన్నాడు. బౌలర్గా పూర్తిగా విఫలమైన జడ్డూ బ్యాటింగ్లో మమ అనిపించాడు. గత సీజన్లో సీఎస్కే తరఫున మెరుపులు మెరిపించిన శివమ్ దూబే ఈ సీజన్లో పూర్తిగా తేలిపోయాడు. దూబే కూడా రెండు మ్యాచ్ల్లో నిరాశపరిచాడు. అశ్విన్ లాంటి బౌలింగ్ ఆల్రౌండర్ నుంచి బ్యాటింగ్లో మెరుపులు ఆశించడం అత్యాశే అవుతుంది.తొలి మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొని ఖాతా ఓపెన్ చేయని ధోని.. ఆర్సీబీతో మ్యాచ్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి బ్యాట్ ఝులిపించాడు. ధోని ఇదే తరహా హిట్టింగ్ను మున్ముందు కూడా కొనసాగిస్తే సీఎస్కే మేలవుతుంది. ఇక మిగిలింది బౌలర్లు. వారి విభాగం వరకు వారు పర్వాలేదనిపించారు. నూర్ అహ్మద్ అద్భుతంగా రాణిస్తూ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. ఖలీల్ అహ్మద్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆడే అవకాశం దక్కని పతిరణ.. ఆర్సీబీతో మ్యాచ్లో 2 వికెట్లతో రాణించాడు. సీనియర్ స్పిన్ ద్వయం అశ్విన్, జడ్డూ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారు. వీరిద్దరు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు వికెట్లు కూడా తీయలేకపోతున్నారు. సీఎస్కే మేనేజ్మెంట్ వీరిద్దరి ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి పెట్టాలి.బెంచ్ కూడా బలహీనమేఈ సీజన్లో సీఎస్కే జట్టు ఎంపిక అస్సలు బాగోలేదు. ఆ జట్టు బెంచ్ కూడా చాలా బలహీనంగా ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడాలను తప్పిస్తే.. ఆ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాళ్లు కూడా లేరు. ప్రస్తుతం విజయ్ శంకర్ ఒక్కడే వీరికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. విదేశీ బ్యాటర్ డెవాన్ కాన్వేను తుది జట్టులోకి తెద్దామనుకుంటే నలుగురు ఆటగాళ్ల నియమం అడ్డొస్తుంది. మిగిలిన ఆటగాళ్లలో షేక్ రషీద్, ఆండ్రీ సిద్దార్థ్, వన్ష్ బేడి మాత్రమే స్పెషలిస్ట్ బ్యాటర్లు. ఈ లెక్కన చూస్తే.. వరుసగా విఫలమవుతున్నా త్రిపాఠి, హుడాలలో ఒకరిని ఖచ్చితంగా తుది జట్టులో ఆడించాల్సిన పరిస్థితి ఉంది. సీఎస్కేలా బ్యాటింగ్ వనరుల కొరత ఈ సీజన్లో ఏ ఫ్రాంచైజీకి లేదు. ఈ జట్టుతో సీఎస్కే ఆరోసారి టైటిల్ గెలవాలనుకోవడం అత్యాశే అవుతుంది.సీఎస్కే పూర్తి జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని (వికెట్కీపర్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్కోటి, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, షేక్ రషీద్, శ్రేయస్ గోపాల్, డెవాన్ కాన్వే, ముఖేష్ చౌదరి, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి -
ఐపీఎల్-2025లో నేడు (మార్చి 30) రెండు భారీ మ్యాచ్లు.. ఢిల్లీతో సన్రైజర్స్ 'ఢీ'
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 30) రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొట్టనుండగా.. రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్కింగ్స్తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఎస్ఆర్హెచ్, ఢిల్లీ మ్యాచ్కు వైజాగ్ వేదిక కానుండగా.. సీఎస్కే, రాయల్స్ మ్యాచ్ గౌహతిలో జరుగనుంది.ఎస్ఆర్హెచ్, ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ అత్యంత హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లలో భయంకరమైన హిట్టర్లు ఉన్నారు. విశాఖ పిచ్పై పరుగుల వరద పారిన చరిత్ర ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. తొలి మ్యాచ్లో పోలిస్తే ఢిల్లీ ఈ మ్యాచ్లో మరింత బలపడనుంది. పితృత్వ సెలవుపై ఉండిన ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులో చేరాడు.ఈ సీజన్లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై సంచలన విజయం సాధించి జోష్ మీద ఉంది. సన్రైజర్స్ తమ తొలి మ్యాచ్లో రాయల్స్పై అద్భుత విజయం సాధించి, ఆతర్వాతి మ్యాచ్లో లక్నో చేతిలో పరాభవం ఎదుర్కొంది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 24 మ్యాచ్ల్లో తలపడగా.. సన్రైజర్స్ 13, ఢిల్లీ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.జట్లు (అంచనా)..సన్రైజర్స్: ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్, ఆడమ్ జంపాఢిల్లీ: జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్కీపర్), కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్సీఎస్కే, రాయల్స్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ కూడా హోరీహోరీగా సాగే అవకాశం ఉంది. బ్యాటింగ్కు పెద్దగా సహకరించని ఈ పిచ్పై ఏ జట్టు ఆధిపత్యం సాధిస్తుందో చూడాలి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నా బౌలర్లే కీలకపాత్ర పోషించవచ్చు. రాజస్థాన్ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లో పరాజయంపాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. సీఎస్కే రెండింట ఒక మ్యాచ్లో విజయం సాధించింది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్ల్లో తలపడగా.. రాయల్స్ 13, సీఎస్కే 16 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి.తుది జట్లు (అంచనా).. రాజస్థాన్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ (కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్ (వికెట్కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, శుభమ్ దూబే, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, కుమార్ కార్తికేయ/సందీప్ శర్మసీఎస్కే: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), శివమ్ దూబే, దీపక్ హుడా/విజయ్ శంకర్, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ -
చరిత్ర సృష్టించిన జడ్డూ భాయ్.. ఐపీఎల్లో తొలి మొనగాడు
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 100 వికెట్లతో పాటు 3000 పరుగులు పూర్తి చేసి తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మార్చి 28) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో జడ్డూ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు చేసిన జడేజా.. తన చివరి పరుగు వద్ద ఐపీఎల్లో 3000 పరుగుల మార్కును తాకాడు. జడేజా ఖాతాలో 160 ఐపీఎల్ వికెట్లు కూడా ఉన్నాయి. జడ్డూ తన ఐపీఎల్ కెరీర్లో 242 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది.ఐపీఎల్లో ఇప్పటివరకు 27 మంది 3000 పరుగులు స్కోర్ చేయగా.. అందులో జడేజా మాత్రమే 100కుపైగా వికెట్లు కూడా తీశాడు. 3000 పరుగులు చేసిన మరో ఇద్దరు మాత్రమే 50కి పైగా వికెట్లు తీశారు. వీరిలో ఒకరు షేన్ వాట్సన్ కాగా.. మరొకరు కీరన్ పోలార్డ్. వాట్సన్ 145 ఐపీఎల్ మ్యాచ్ల్లో 3874 పరుగులతో పాటు 92 వికెట్లు తీయగా.. పోలార్డ్ 189 ఐపీఎల్ మ్యాచ్ల్లో 3412 పరుగులు చేసి 69 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 50 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో సీఎస్కే అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. తొలుత బౌలింగ్ చేసి 20-30 పరుగులు అదనంగా సమర్పించుకోవడంతో పాటు కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేసింది. అనంతరం బ్యాటింగ్లో కనీస పోరాటం కూడా చూపలేక ప్రత్యర్థికి దాసోహమైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్లోగా ఉన్న పిచ్పై ఇది చాలా మంచి స్కోర్. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్ అహ్మద్ (4-0-28-1) బాగానే బౌలింగ్ చేసినా అశ్విన్ (2-0-22-1), జడ్డూ (3-0-37-0) సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సీఎస్కే ఆదిలోనే చేతులెత్తేసింది. 8 పరుగులకే (రెండో ఓవర్లో) 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఆతర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. హాజిల్వుడ్ (4-0-21-3), లవింగ్స్టోన్ (4-0-28-2), యశ్ దయాల్ (3-0-18-2) వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది. సీఎస్కే ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర (41) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. -
ఈ పిచ్పై 170 పరుగులే ఎక్కువ.. ఇంకా భారీ తేడాతో ఓడిపోనందుకు సంతోషించాలి: రుతురాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై గెలుపుతో ప్రారంభించింది. అయితే రెండో మ్యాచ్లో మాత్రం సీఎస్కే బొక్క బోర్లా పడింది. నిన్న (మార్చి 28) సొంత మైదానం చెపాక్లో జరిగిన మ్యాచ్లో రుతురాజ్ సేన ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయాన్ని (50 పరుగుల తేడాతో) ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన సీఎస్కే స్థాయి తగ్గట్టుగా ఆడలేకపోయింది. తొలుత బౌలింగ్లో పట్టులేక ప్రత్యర్ధిని 196 పరుగులు చేయనిచ్చింది. ఆతర్వాత ఛేదనలో కనీస పోరాటం కూడా ప్రదర్శించలేక 146 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్తో పోలిస్తే సీఎస్కే బ్యాటింగ్లో దారుణంగా విఫలమైంది. రచిన్ రవీంద్ర (41) ఒక్కడే కాస్త పోరాడే ప్రయత్నం చేశాడు. చివర్లో ధోని (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించినా అప్పటికే సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. ఈ మ్యాచ్లో సీఎస్కే ఫీల్డింగ్లోనూ దారుణంగా విఫలమైంది. కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేయడంతో పాటు లేని పరుగులు సమర్పించుకుంది.మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. వాస్తవానికి ఈ వికెట్పై 170 పరుగులే చాలా ఎక్కువ. అలాంటిది ఆర్సీబీ 196 పరుగులు చేసి, మా బ్యాటింగ్ను మరింత సంక్లిష్టం చేసింది. వారి బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ రోజు ఫీల్డింగ్లోనూ మేము గొప్పగా లేము. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాం. ఊహించిన దానికంటే అదనంగా 20 పరుగులను ఛేదిస్తున్నప్పుడు పవర్ ప్లేలో మా బ్యాటింగ్ స్టయిల్ భిన్నంగా ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. తొలి ఐదు ఓవర్లు కొత్త బంతి కూడా ఇబ్బంది పెట్టింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. రాహుల్ త్రిపాఠి, నేను చాలా కాన్ఫిడెంట్గా షాట్లు ఆడాము. కానీ వర్కౌట్ కాలేదు. మా స్పిన్ త్రయాన్ని ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు. కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేశాము. అది కూడా మా ఓటమికి కారణమైంది. తదుపరి మ్యాచ్ కోసం మానసికంగా సిద్దంగా ఉండాలి. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో బ్యాటింగ్, బౌలింగ్లో చెడు రోజు ఉంటుంది. మేము ఫీల్డింగ్లో చాలా మెరుగుపడాలి.రచిన్ సరిగ్గా ముందుకు సాగలేకపోయాడు. హుడా పరిస్థితి కూడా అలాగే ఉండింది. దూబే నుంచి ప్రామిసింగ్ ఇన్నింగ్స్ ఆశించాము. యశ్ దయాల్ డబుల్ స్ట్రయిక్ (ఒకే ఓవర్లో 2 వికెట్లు) మా ఓటమిని ఖరారు చేసింది. చివర్లో జడేజా, ధోని భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓవరాల్గా ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసింది. -
చెన్నైని గెలిచారు...
ఎప్పుడో 2008లో తొలి ఐపీఎల్లో చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఆ తర్వాత ఈ మైదానంలో తలపడిన ఎనిమిది మ్యాచుల్లోనూ చెన్నై చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు చెన్నై గడ్డపై సీఎస్కేపై ఆర్సీబీ పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్లో మెరుగైన స్కోరు సాధించిన బెంగళూరు, ఆపై పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని పూర్తిగా కట్టిపడేసింది. స్పిన్నర్ల రాజ్యం సాగే నెమ్మదైన తన సొంత మైదానంలో చెన్నై జట్టు ప్రభావం చూపించ లేకపోగా...స్ఫూర్తిదాయక బౌలింగ్ ప్రదర్శనతో ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై: ఐపీఎల్ సీజన్లో బెంగళూరు వరుసగా రెండు ప్రత్యర్థి వేదికలపై వరుస విజయాలు అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పాటీదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా...ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులకే పరిమితమైంది. రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41; 5 ఫోర్లు), ఎమ్మెస్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. పాటీదార్ అర్ధ సెంచరీ... ఓపెనర్ సాల్ట్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించగా, మరో ఎండ్లో కోహ్లి మాత్రం కాస్త తడబడ్డాడు. తన స్థాయికి తగినట్లుగా వేగంగా ఆడలేకపోయాడు. ఖలీల్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సాల్ట్...అశి్వన్ వేసిన తర్వాత ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు బాదాడు. అయితే ధోని అద్భుత స్టంపింగ్కు సాల్ట్ వెనుదిరగ్గా, దేవ్దత్ పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజ్లో ఉన్నంత సేపు ధాటిని ప్రదర్శించాడు.జడేజా ఓవర్లోనే అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. ఎట్టకేలకు పతిరణ ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్ కొట్టినా...నూర్ బౌలింగ్లో అవుటై నిరాశగానే వెనుదిరిగాడు. మరో వైపు జడేజా ఓవర్లో సిక్స్, 2 ఫోర్లతో పాటీదార్ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో 30 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. ఇలాంటి స్థితిలో ఐదు పరుగుల వ్యవధిలో జితేశ్ శర్మ (12), పాటీదార్, కృనాల్ పాండ్యా (0) వికెట్లు తీసి బెంగళూరును కొద్ది సేపు చెన్నై నిలువరించగలిగింది. అయితే స్యామ్ కరన్ వేసిన ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) వరుసగా మూడు సిక్సర్లు బాది స్కోరును 200కు చేరువగా తీసుకొచ్చాడు. సమష్టి వైఫల్యం... ఛేదనలో చెన్నై తీవ్రంగా ఇబ్బంది పడింది. రచిన్ కొన్ని చక్కటి షాట్లు ఆడటం మినహా ఒక్క బ్యాటర్ కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేదు. చెప్పుకోదగ్గ భాగస్వామ్యం కూడా లేకుండా తక్కువ వ్యవధిలో సీఎస్కే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒకే స్కోరు వద్ద రాహుల్ త్రిపాఠి (5), రుతురాజ్ గైక్వాడ్ (0) వెనుదిరగ్గా, దీపక్ హుడా (4), స్యామ్ కరన్ (8) పూర్తిగా విఫలమయ్యారు. శివమ్ దూబే (15 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆర్సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ చెన్నైపై ఒత్తిడిని కొనసాగించారు. ఆరంభంలో పవర్ప్లే ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేసిన చెన్నై ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ఆఖర్లో 28 బంతుల్లో 98 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన ధోని అభిమానులను అలరించే కొన్ని షాట్లు కొట్టడం మినహా అవి జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. కృనాల్ వేసిన చివరి ఓవర్లో ధోని 2 సిక్స్లు, ఫోర్ కొట్టడానికి చాలా ముందే ఓటమి ఖాయమైపోయింది! స్కోరు వివరాలు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (స్టంప్డ్) ధోని (బి) నూర్ 32; కోహ్లి (సి) రచిన్ (బి) నూర్ 31; పడిక్కల్ (సి) గైక్వాడ్ (బి) అశ్విన్ 27; పాటీదార్ (సి) కరన్ (బి) పతిరణ 51; లివింగ్స్టోన్ (బి) నూర్ 10; జితేశ్ (సి) జడేజా (బి) అహ్మద్ 12; డేవిడ్ (నాటౌట్) 22; కృనాల్ (సి) హుడా (బి) పతిరణ 0; భువనేశ్వర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–45, 2–76, 3–117, 4–145, 5–172, 6–176, 7–177. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–28–1, రవిచంద్రన్ అశ్విన్ 2–0–22–1, స్యామ్ కరన్ 3–0–34–0, నూర్ అహ్మద్ 4–0–36–3, రవీంద్ర జడేజా 3–0–37–0, పతిరణ 4–0–36–2. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ రవీంద్ర (బి) దయాళ్ 41; త్రిపాఠి (సి) సాల్ట్ (బి) హాజల్వుడ్ 5; గైక్వాడ్ (సి) (సబ్) భాందగే (బి) హాజల్వుడ్ 0; హుడా (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 4; స్యామ్ కరన్ (సి) కృనాల్ (బి) లివింగ్స్టోన్ 8; శివమ్ దూబే (బి) దయాళ్ 19; జడేజా (సి) సాల్ట్ (బి) హాజల్వుడ్ 25; అశ్విన్ (సి) సాల్ట్ (బి) లివింగ్స్టోన్ 11; ధోని (నాటౌట్) 30; నూర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–8, 2–8, 3–26, 4–52, 5–75, 6–80, 7–99, 8–130. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–20–1, హాజల్వుడ్ 4–0–21–3, యశ్ దయాళ్ 3–0–18–2, లివింగ్స్టోన్ 4–0–28–2, సుయాశ్ శర్మ 4–0–32–0, కృనాల్ పాండ్యా 2–0–26–0. ఐపీఎల్లో నేడుగుజరాత్ X ముంబైవేదిక: అహ్మదాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
చరిత్ర సృష్టించిన ధోని.. ప్రాణ మిత్రుడి రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని సీఎస్కే చేధించలేక చతికలపడింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో సీఎస్కే ఓటమి పాలైనప్పటికి .. ఆ జట్టు లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని మాత్రం తన మెరుపు ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు. తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్కు దిగిన ధోని తనదైన స్టైల్లో షాట్లూ ఆడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరి ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్లో మిస్టర్ కూల్.. రెండు సిక్స్లు, 1 ఫోర్తో 16 పరుగులు రాబాట్టాడు. ఓవరాల్గా కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని.. 3 ఫోర్లు, 2 సిక్స్లతో 30 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ధోని ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోరి రికార్డులకెక్కాడు. ధోని ఇప్పటివరకు సీఎస్కే తరపున 236 మ్యాచ్లు ఆడి 4693 పరుగులు చేశాడు. ఇంతకుముందు వరకు రికార్డు మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా సీఎస్కే తరపున 4,687 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తన మిత్రుడి రికార్డును తలైవా బ్రేక్ చేశాడు. కాగా రైనా చాలా సీజన్ల పాటు సీఎస్కేకే ప్రాతినిథ్యం వహించాడు. ధోనికి రైనాకు మంచి అనుబంధం ఉంది. అప్పటిలో అతడిని చిన్న తలా అని అభిమానులు పిలుచుకునే వారు. చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(41) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, లివింగ్స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు.చెపాక్లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించడం 2008 సీజన్ తర్వాత ఇదే తొలిసారి. దీంతో సీఎస్కే కంచుకోటను పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2008 సీజన్ తర్వాత ఏ ఆర్సీబీ కెప్టెన్ కూడా చెపాక్లో సీఎస్కేపై తన జట్టును గెలిపించకలేకపోయాడు. ఇప్పుడు అది పాటిదార్కు సాధ్యమైంది. -
#RCB: సీఎస్కే కంచు కోట బద్దలు.. 17 ఏళ్ల తర్వాత తొలి విజయం
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(41) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో ధోని(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, లివింగ్స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు.చెపాక్లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించడం 2008 సీజన్ తర్వాత ఇదే తొలిసారి. దీంతో సీఎస్కే కంచుకోటను పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2008 సీజన్ తర్వాత ఏ ఆర్సీబీ కెప్టెన్ కూడా చెపాక్లో సీఎస్కేపై తన జట్టును గెలిపించకలేకపోయాడు. ఇప్పుడు అది పాటిదార్కు సాధ్యమైంది. కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు. -
అందుకే సన్రైజర్స్ వదిలేసింది.. అక్కడ కూడా అదే ఆటనా?
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి వరుసగా రెండో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో త్రిపాఠి దారుణ ప్రదర్శన కనబరిచాడు. మరోసారి ఓపెనర్గా బరిలోకి దిగిన త్రిపాఠి కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్లో చెత్త షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా త్రిపాఠి కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో త్రిపాఠిని సీఎస్కే ఫ్యాన్స్ దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ చెత్త ఆడినందుకే సన్రైజర్స్ వదిలేసింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా రాహుల్ త్రిపాఠి గత కొన్ని సీజన్లగా ఎస్ఆర్హెచ్కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మెగా వేలానికి ముందు ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని సీఎస్కే రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం త్రిపాఠి చేయలేకపోతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.చదవండి: #MS Dhoni: వారెవ్వా ధోని..కళ్లు మూసి తెరిచేలోపే! వీడియో వైరల్ -
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పర్వాలేదన్పించాడు. ఈ మ్యాచ్లో కోహ్లి 30 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 2 ఫోర్లు, 1 సిక్సర్తో 31 పరుగులు చేశాడు. తద్వారా కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 34 మ్యాచ్ల్లో 1068 పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ చెన్నైపై 29 మ్యాచ్ల్లో 44.04 సగటుతో మొత్తం 1,057 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీతో పాటు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాజా మ్యాచ్లో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధావన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి, ధావన్ తర్వాతి స్దానాల్లో వరుసగా రోహిత్ శర్మ(896), డేవిడ్ వార్నర్(696), కీరన్ పొలార్డ్(583) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు. -
వారెవ్వా ధోని..కళ్లు మూసి తెరిచేలోపే! వీడియో వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని మరోసారి వికెట్ల వెనక అద్బుతం చేశాడు. ఐపీఎల్-2025లో భాగంగా చెపాక్ వేదికగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో ధోని సంచలన స్టంపింగ్తో మెరిశాడు. మిస్టర్ కూల్ మెరుపు స్టంపింగ్తో ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ను పెవిలియన్కు పంపాడు.ఆర్సీబీ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన స్పిన్నర్ నూర్ ఆహ్మద్.. ఆఖరి బంతిని సాల్ట్కు గూగ్లీగా సంధించాడు. ఆ బంతిని సాల్ట్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి సాల్ట్ బ్యాట్ను మిస్స్ అయ్యి వికెట్ల వెనక ఉన్న ధోని చేతికి వెళ్లింది. వెంటనే ధోని రెప్ప పాటు వేగంతో స్టంప్స్ను గిరాటేశాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కు రిఫర్ చేసినప్పటికి.. ధోని స్టంప్స్ను పడగొట్టేటప్పటికి సాల్ట్ బ్యాక్ఫుట్ గాల్లో ఉన్నట్లు రిప్లేలో కన్పించింది. దీంతో సాల్ట్(32) నిరాశతో పెవిలియన్కు చేరక తప్పలేదు. ధోని స్టంపింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతకుముందు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లోనూ ఈ తరహాలోనే సూర్యకుమార్ యాదవ్ను పెవిలియన్కు పంపాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు2️⃣ moments of magic 2️⃣ ultra fast stumpings ⚡Which one did you enjoy the most? 🤔Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB pic.twitter.com/SxPcEphB6Y— IndianPremierLeague (@IPL) March 28, 2025 Less Than 1 Seconds And Dhoni Stumped Philip Salt 🥶⚡#CSKvsRCB #Dhoni pic.twitter.com/Y3hwNRCDp7— $achin Nayak (@SachinN18342436) March 28, 2025 -
సీఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం..
IPL2025 Csk Vs Rcb live Updates and Highlights: సీఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం..ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(41) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో ధోని(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, లివింగ్స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు. చెపాక్లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించడం 2008 సీజన్ తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు. కష్టాల్లో సీఎస్కే.. 81 పరుగులకే 6 వికెట్లుసీఎస్కే 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 13వ ఓవర్ వేసిన యశ్ దయాల్ బౌలింగ్లో తొలి బంతికి రచిన్ రవీంద్ర(41).. ఐదో బంతికి శివమ్ దూబే(19) ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 6 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది.సీఎస్కే నాలుగో వికెట్ డౌన్.. సామ్ కుర్రాన్ రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. లివింగ్ స్టోన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.సీఎస్కే మూడో వికెట్ డౌన్.. దీపక్ హుడా ఔట్దీపక్ హుడా రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన హుడా.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4.4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 26/3సీఎస్కేకు భారీ షాక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కేకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. రెండో ఓవర్ వేసిన జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్లో రెండో బంతికి రాహుల్ త్రిపాఠి(5) ఔట్ కాగా.. ఆఖరి బంతికి రుతురాజ్ గైక్వాడ్(0) పెవిలియన్కు చేరాడు.పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీఎస్కే ముందు భారీ టార్గెట్చెపాక్ వేదికగా చెన్నైసూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు.ఆర్సీబీ ఐదో వికెట్ డౌన్..జితేశ్ కుమార్ రూపంలో ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన జితేశ్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి టిమ్ డేవిడ్ వచ్చాడు.16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్16 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్రీజులో జితేశ్ శర్మ(7), రజిత్ పాటిదార్(38) ఉన్నారు.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్.. విరాట్ కోహ్లి ఔట్విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. నూర్ ఆహ్మద్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో పాటిదార్(21), లివింగ్ స్టోన్(1) ఉన్నారు.హిట్టింగ్ మొదలెట్టిన కోహ్లి11 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో రజిత్ పాటిదార్(16), విరాట్ కోహ్లి(27) ఉన్నారు. ఇప్పటివరకు నెమ్మదిగా ఆడిన కోహ్లి.. తన హిట్టింగ్ను మొదలుపెట్టాడు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. పడిక్కల్ ఔట్దేవదత్త్ పడిక్కల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 27 పరుగులతో దూకుడుగా ఆడిన పడిక్కల్.. అశ్విన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(12) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. సాల్ట్ ఔట్.. ఫిల్ సాల్ట్ రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన సాల్ట్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. వికెట్ల వెనక ధోని మరోసారి అద్భుతం చేశాడు. క్రీజులోకి దేవదత్త్ పడిక్కల్ వచ్చాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(11), పడిక్కల్(9) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(24), విరాట్ కోహ్లి(1) ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. సీఎస్కే జట్టులోకి మతీషా పతిరానా రాగా.. ఆర్సీబీ జట్టులోకి భువనేశ్వర్ కుమార్ వచ్చాడు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, యశ్ దయాల్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్ -
MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings).. ఈ రెండూ పర్యాయ పదాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభం నుంచి చెన్నై ఐకాన్గా ఉన్న ధోని.. ‘తలా’గా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ధోనికి ఉన్న క్రేజ్ గురించి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు.అతడు మైదానంలో అడుగుపెట్టాడంటే ప్రేక్షకులు ఇంకెవరినీ పట్టించుకోరు. ముఖ్యంగా తలా బ్యాట్తో రంగంలోకి దిగాడంటే.. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న తమ జట్టు ఆటగాడైనా సరే అవుటై.. ధోనికి ఫినిషింగ్ చేసే అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తారు. అయితే, ఒక్కోసారి ఈ వీరాభిమానం వల్ల ధోని సొంత జట్టు ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెన్నై మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు.ధోని క్రేజ్ వల్ల ఇతర ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని.. దీనికి ‘తలా’నే స్వయంగా స్వస్తి పలకాలని రాయుడు విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు.. ధోని ఒక్కడి చుట్టే జట్టును అభివృద్ధి చేసిన చెన్నై.. కొత్త ఆటగాళ్లకు ఇవ్వాల్సిన స్థాయిలో అవకాశాలు ఇవ్వలేదని అభిప్రాయపడ్డాడు. కేవలం ధోని ఒక్కడినే నమ్ముకున్న చెన్నై యాజమాన్యం.. అతడి నిష్క్రమణ తర్వాత ఇబ్బందులపాలు కాకతప్పదని చెప్పుకొచ్చాడు.రచిన్ రవీంద్రపై విమర్శలుకాగా ఐపీఎల్-2025లో చెన్నై శుభారంభం చేసిన విషయం తెలిసిందే. సొంతమైదానం చెపాక్లో ముంబై ఇండియన్స్పై గెలిచి ఈ సీజన్లో బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్లో లక్ష్య ఛేదనలో భాగంగా యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్)తో కలిసి ధోని క్రీజులో ఉన్నాడు.పందొమ్మిదవ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోని రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఈ క్రమంలో మరుసటి ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాది రచిన్ సీఎస్కేను గెలుపుతీరాలకు చేర్చాడు. దీంతో చెన్నై మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.ఈ నేపథ్యంలో చెన్నై విజయానికి సంతోషిస్తూనే రచిన్ను కొంతమంది పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ధోనికి ఫినిషింగ్ చేసే అవకాశం ఇవ్వలేదంటూ అతడిని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఇక సీఎస్కే తదుపరి మ్యాచ్లో ఇదే వేదికపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శనివారం తలపడనుంది.బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!ఈ నేపథ్యంలో ధోని క్రేజ్ గురించి అంబటి రాయుడు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా విచిత్రమైన విషయం. చాలా మంది సీఎస్కే కంటే ముందు ధోని అభిమానులు. కానీ వారి అభిమానం వల్ల కొత్త ఆటగాళ్లు చాలాసార్లు ఇబ్బంది పడాల్సివస్తోంది.ధోని రాగానే బిగ్గరగా అరుస్తారు. వేరే వాళ్లకు అది అసౌకర్యంగా ఉంటుంది. ఫ్రాంఛైజీ అతడి చుట్టూనే జట్టును నిర్మించింది. చాలా ఏళ్లుగా అతడినే హైలైట్ చేస్తూ వస్తోంది. అందుకే ‘తలా’గా అతడు ప్రసిద్ధి పొందాడు.చెన్నై ఫ్రాంఛైజీకి కూడా తిప్పలు తప్పవుఅతడంటే చాలా మందికి పిచ్చి ప్రేమ. అందుకే తమ జట్టు ఆటగాళ్లనే అవుట్ కావాలని కోరుకుంటూ ఉంటారు. దీంతో చాలా మంది ప్లేయర్లు ఇబ్బంది పడ్డారు. వాళ్లు బయటకు వచ్చి చెప్పకపోవచ్చు కానీ ఇదే సత్యం. దీనికి ధోని మాత్రమే చెక్ పెట్టగలడు.ఆయన బయటకు వచ్చి.. ‘వీళ్లంతా మన వాళ్లే.. నాలాగే బ్యాటింగ్ చేసేందుకు వస్తారు. వాళ్లను కూడా నాలాగే ఆదరించండి’ అని చెప్పాలి. లేదంటే.. చెన్నై ఆటగాళ్లకే కాదు.. భవిష్యత్తులో చెన్నై ఫ్రాంఛైజీకి కూడా తిప్పలు తప్పవు.స్టేడియం నిండిపోవడానికి, జనాన్ని పోగు చేయడానికి ధోని క్రేజ్ ఉపయోగపడుతుంది. ఫ్రాంఛైజీ కూడా ఎప్పుడూ అతడి మీదే ఫోకస్ ఉంచుతుంది. బ్రాండ్ వాల్యూ కోసం అలా చేస్తుంది. కానీ .. ఆ తర్వాత.. ధోని జట్టుతో లేకుంటే.. అప్పుడు పరిస్థితి ఏమిటి?.. కాబట్టి వాళ్లు కాస్త విశాలంగా ఆలోచించాలి’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: అది ప్రపంచంలోనే బెస్ట్ వికెట్.. వాళ్లు అద్భుతంగా ఆడారు: కమిన్స్ -
CSK vs RCB: 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించేనా?.. ధోని, కోహ్లిపై అందరి కళ్లు
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం చెపాక్ స్టేడియం వేదికగా ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆడుతుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో చెన్నై జట్టుదే స్పష్టమైన ఆధిక్యం కాగా... చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్పై బెంగళూరు జట్టు ఒకే ఒక్కసారి విజయం సాధించింది. అది కూడా 17 ఏళ్ల క్రితం. లీగ్ ఆరంభ సీజన్ (2008)లో చెన్నైలో బెంగళూరు జట్టు గెలుపొందింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడినా అన్నింట్లో ఆర్సీబీకి పరాజయమే ఎదురైంది. ఓవరాల్గా ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 33 మ్యాచ్లు జరగ్గా... అందులో చెన్నై 22 మ్యాచ్ల్లో గెలవగా... బెంగళూరు 11 మ్యాచ్ల్లో నెగ్గింది. చెన్నైకి ధోని అనుభవం... బెంగళూరుకు విరాట్ కోహ్లి దూకుడే ప్రధాన బలాలు.వీరిద్దరూ సారథులు కాకపోయినా... జట్టు జయాపజయాలు నిర్ణయించేది మాత్రం ఈ ఇద్దరు పాతకాపులే! చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలించనున్న నేపథ్యంలో అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ బౌలింగ్ను ఎదుర్కోవడంపైనే ఆర్సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. స్పిన్నే బలంగా... బంతి నెమ్మదిగా వచ్చే చెన్నై పిచ్పై... స్పిన్నర్లు దట్టంగా ఉన్న సూపర్ కింగ్స్ను ఎదుర్కోవడం కష్టమైన పనే. ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లరకు తోడు రచిన్ రవీంద్ర కూడా ఉపయుక్తమైన ఆల్రౌండరే కావడం చెన్నైకి మరింత బలాన్నిస్తోంది. ఇక బ్యాటింగ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివమ్ దూబే, స్యామ్ కరన్, జడేజా కీలకం కానున్నారు. గత మ్యాచ్ చివర్లో క్రీజులోకి దిగిన ధోని... పరుగులేమి చేయకపోయినా ‘తలా’ మైదానంలో అడుగు పెడుతున్న సమయంలో స్టేడియం ‘మోత’ మోగిపోయింది. మరి మహీ బ్యాట్ నుంచి ఆ మెరుపులు చూసే అవకాశం ఈ మ్యాచ్లో అయినా అభిమానులకు దక్కుతుందేమో చూడాలి. ముంబైతో ఆడిన తొలి మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన సూపర్ కింగ్స్... దాన్నే కొనసాగించాలని చూస్తోంది. బౌలింగ్లో మరోసారి నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ కీలకం కానున్నారు. విరాట్పైనే భారం సీజన్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై గెలిచి బోణీ కొట్టిన బెంగళూరు దాన్ని కొనసాగించాలని చూస్తోంది. అయితే చెన్నైలో మెరుగైన రికార్డు లేకపోవడం ఆర్సీబీని ఇబ్బంది పెడుతోంది. లీగ్ ఆరంభం నుంచి ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ప్లేయర్గా చరిత్రతెక్కిన విరాట్ కోహ్లిపైనే బెంగళూరు జట్టు ఎక్కువ ఆధారపడుతోంది. ఫిల్ సాల్ట్తో కలిసి అతడిచ్చే ఆరంభం జట్టుకు ప్రధానం కానుంది. పడిక్కల్, రజత్ పాటీదార్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్ కృనాల్ పాండ్యా రూపంలో మిడిలార్డర్లో మెరుగైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగల కోహ్లి ప్రదర్శనపైనే ఆర్సీబీ జట్టు ఆశలు పెట్టుకుంది. బౌలింగ్లో హాజల్వుడ్, యశ్ దయాళ్ కీలకం కానుండగా... గత మ్యాచ్లో తిప్పేసిన కృనాల్పై భారీ అంచనాలు ఉన్నాయి. తుది జట్లు (అంచనా) చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ (కెప్టెన్), రచిన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివమ్ దూబే, సామ్ కరన్, జడేజా, ధోని, అశ్విన్, ఎలీస్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, పడిక్కల్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్/స్వప్నిల్ సింగ్, హాజల్వుడ్, యశ్ దయాళ్, సుయశ్ శర్మ. -
సీఎస్కేతో మ్యాచ్.. ఆర్సీబీకి గుడ్ న్యూస్! స్వింగ్ కింగ్ వచ్చేస్తున్నాడు?
ఐపీఎల్-2025 సీజన్ తొలి మ్యాచ్లోనే కేకేఆర్ను చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. ఆర్సీబీ తమ రెండో మ్యాచ్లో భాగంగా మార్చి 28న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. సీఎస్కే కూడా తమ మొదటి మ్యాచ్లో ముంబై పై విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు మరోసారి అభిమానులను మునివేళ్లపై నిలబెట్టడం ఖాయం.ఇక ఈ మ్యాచ్కు ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్ ఉంది. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్కు గాయం కారణంగా దూరమైన స్పీడ్ స్టార్ భువనేశ్వర్ కుమార్.. ఇప్పుడు ఫుల్ ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. భువీ నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ను మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్సీబీ కూడా తాజాగా భువీ బంతి పట్టికుని ఉన్న ఫోటోను షేర్ చేసింది.అందుకు క్యాప్షన్గా "భువీ త్వరలోనే బంతిని స్వింగ్ చేస్తాడు. అతడు మరింత బలంగా తిరిగిరానున్నాడని" బెంగళూరు ఫ్రాంచైజీ రాసుకొచ్చింది. దీంతో ఆర్సీబీ తదుపరి మ్యాచ్లో భువనేశ్వర్ ఆడటం దాదాపు ఖాయమైనట్లే. కాగా మొదటి మ్యాచ్కు భువనేశ్వర్ కుమార్ స్ధానంలో జమ్మూ కాశ్మీర్ బౌలర్రసిఖ్ సలాం చోటు దక్కించుకున్నాడు. కానీ అతడు అంత ప్రభావం చూపలేదు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు. భువీ ఎంట్రీ ఇస్తే ధార్ సలీం బెంచ్కు పరిమితం కానున్నాడు. కాగా 35 ఏళ్ల భువనేశ్వర్ కుమార్కు అద్భుతమైన రికార్డు ఉంది. 176 ఐపిఎల్ మ్యాచ్లు ఆడిన ఈ యూపీ ఫాస్ట్ బౌలర్.. 7.56 ఎకానమీతో 181 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా గత కొన్ని సీజన్లగా సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన భువనేశ్వర్ను ఐపీఎల్-2025 వేలంలో రూ. 10.75 భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. కాగా సీఎస్కేపై భువనేశ్వర్కు అంతమంచి రికార్డు లేదు. సీఎస్కేపై 20 మ్యాచ్ల్లో అతడు 39 సగటుతో 20 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఐపీఎల్-2025కు ఆర్సీబీ తుది జట్టు ఇదేరజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, యశ్ దయాల్, జోష్ హేజిల్వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ స్వేఖ్ భండాగే, జాకబ్ బండెక్, జాకబ్ బంధేజ్ లుంగీ ఎంగిడీ, అభినందన్ సింగ్, మోహిత్ రాథీ.చదవండి: DC vs LSG: విశాఖలో మ్యాచ్.. తుదిజట్లు ఇవే!.. వర్షం ముప్పు? -
IPL 2025: దీపక్ చాహర్ను 'కట్టప్ప'తో పోల్చిన అతని సోదరి
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో సీఎస్కే విజేతగా నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. సీఎస్కే మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఈ మ్యాచ్లో ముంబై బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్గా నిలువగా.. సూర్యకుమార్ యాదవ్ (29), దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-18-4), ఖలీల్ అహ్మద్ (4-0-29-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని కట్టడి చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్లో ఉండి సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) సీఎస్కేకు దడ పుట్టించాడు. విజ్ఞేశ్తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో ఈ ముగ్గురు సత్తా చాటినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఇదిలా ఉంటే, గత ఏడు సీజన్ల పాటు చెన్నై సూపర్కింగ్స్కు ఆడిన దీపక్ చాహర్ ఈ మ్యాచ్తో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో చాహర్ తొలుత బ్యాటింగ్లో సత్తా చాటి ఆతర్వాత బౌలింగ్లో పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్కు దిగిన చాహర్ 15 బంతులు ఎదర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాహర్ బ్యాట్ ఝులిపించకపోయుంటే ఈ మ్యాచ్లో ముంబై ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. అనంతరం బౌలింగ్లోనూ చాహర్ ఆదిలోనే సీఎస్కేను దెబ్బకొట్టాడు. చాహర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే సీఎస్కే ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో చాహర్ 2 ఓవర్లలో వికెట్ తీసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు.చాహర్ ముంబై ఇండియన్స్ తరఫున గ్రాండ్గా అరంగేట్రం చేయడాన్ని అతని సోదరి మాల్తి చాహర్ ఓ హాస్యాస్పదమైన మీమ్ షేర్ చేయడం (సోషల్మీడియాలో) ద్వారా సెలబ్రేట్ చేసుకుంది. చాహర్ తన పాత జట్టుకు (సీఎస్కే) వ్యతిరేకంగా అద్భుతంగా ఆడినందుకు సరదాగా ట్రోల్ చేసింది. Malti Chahar's Instagram story. pic.twitter.com/1bfxj4kcU4— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2025చాహర్ను "బాహుబలి" సినిమాలోని కట్టప్ప పాత్రతో పోల్చింది. ఆ సినిమాలో హీరో ప్రభాస్ను (అమరేంద్ర బాహుబలి) అతని మామ కట్టప్ప వెనుక నుంచి కత్తితో పొడుస్తాడు. ఈ మ్యాచ్లో చాహర్ కూడా కట్టప్పలా తనను ధీర్ఘకాలంగా అక్కున చేర్చుకున్న సీఎస్కేను దెబ్బతీసే ప్రయత్నం చేశాడని అర్దం వచ్చేలా మాల్తి సరదాగా ఓ మీమ్ను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరలవుతుంది. -
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
చెన్నై సూపర్ కింగ్స్.. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఈ రెండు పేర్లను విడివిడిగా చూడటం కష్టం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై నిలవడానికి ప్రధాన కారణం ధోని. వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలు మొదలు.. మైదానంలో అమలు చేసే ప్రణాళికల వరకు అంతా తానే!ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ దిగ్గజ కెప్టెన్.. గతేడాది సారథ్య బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొన్నాడు. మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)ను తన వారసుడిగా ఎంపిక చేశాడు. అయితే, మైదానంలో రుతుకు సూచనలు ఇస్తూ అతడికి దిశానిర్దేశం చేసే పాత్రలో ధోని ఇప్పటికీ కొనసాగుతున్నాడు.రెప్పపాటులో స్టంపౌట్లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చే ధోని 43 ఏళ్ల వయసులోనూ.. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో పాటు.. మెరుపు వేగంతో స్టంపౌట్లు చేయడంలోనూ దిట్ట. ఐపీఎల్-2025లో తమ ఆరంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో ఆదివారం నాటి పోరులో ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు. ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను రెప్పపాటులో స్టంపౌట్ చేసి ఔరా అనిపించాడు.𝙁𝙖𝙨𝙩. 𝙁𝙖𝙨𝙩𝙚𝙧. 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 🫡📹 Watch #CSK legend's jaw-dropping reflexes behind the stumps 🔥Updates ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/S26cUYzRd8— IndianPremierLeague (@IPL) March 23, 2025ఇక మిచెల్ సాంట్నర్ వికెట్కు సంబంధించి.. డీఆర్ఎస్ విషయంలోనూ రుతును సరైన సమయంలో అలర్ట్ చేసి.. జట్టుకు వికెట్ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే సీఎస్కేను, ధోనిని వేరువేరుగా చూడలేము అనేది!అలా అయితే.. నాతో నయాపైసా ఉపయోగం ఉండదుఅయితే, ఈ మ్యాచ్కు ముందు ధోని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఒకవేళ తాను వికెట్ కీపర్గా బరిలోకి దిగకపోతే.. జట్టులో ఉండీ ఏమాత్రం ఉపయోగం లేదంటూ.. ఈ ఫైవ్టైమ్ చాంపియన్ అన్నాడు. జియోహాట్స్టార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ ఆటగాడిగా కొనసాగడం అతిపెద్ద సవాలు.ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఒకవేళ నేను కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించకపోతే.. మైదానంలో నేను ఉండీ నయాపైసా ఉపయోగం ఉండదు. ఎందుకంటే.. వికెట్ల వెనుక నుంచే నేను మ్యాచ్ పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటాను.వికెట్ల వెనుక నుంచి విశ్లేషించగలుగుతాబౌలర్ ఎలా బంతిని వేస్తున్నాడు? పిచ్ స్వభావం ఎలా ఉంది?.. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయాలి? వంటి విషయాలన్నీ ఆలోచించగలను. ముఖ్యంగా మొదటి ఆరు ఓవర్లలో కొత్త బంతి ఎలాంటి ప్రభావం చూపుతోందని గమనిస్తా.ఆ తర్వాత పరిస్థితులు ఏవిధంగా మారుతున్నాయి? బౌలర్లను మార్చాలా? లేదంటే ప్రణాళికలు మార్చాలా? లాంటి అంశాల గురించి కెప్టెన్కు సరైన సందేశం ఇవ్వగలుగుతా. ఉత్తమ బంతికి బ్యాటర్ సిక్సర్ బాదాడా?లేదంటే.. చెత్త బంతికి షాట్ కొట్టాడా? అన్నది వికెట్ల వెనుక నుంచి విశ్లేషించగలుగుతా’’ అని ధోని పేర్కొన్నాడు. కాగా కెప్టెన్గా చెన్నైని ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ధోని.. గతేడాది నుంచి వికెట్ కీపర్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు.బౌలర్ల విజృంభణఇక ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్లో చెన్నై ముంబైని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. సొంతమైదానం చెపాక్లో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన రుతుసేన తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్ల విజృంభణ కారణంగా ముంబైని 155 పరుగులకే కట్టడి చేసింది.రచిన్, రుతు హాఫ్ సెంచరీలులక్ష్య ఛేదనలో ఓపెనర్ రచిన్ రవీంద్ర అర్ధ శతకం(45 బంతుల్లో 65 నాటౌట్)తో చెలరేగగా.. కెప్టెన్ రుతురాజ్ మెరుపు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 53)తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మరో ఐదు బంతులు ఉండగానే టార్గెట్ పూర్తి చేసిన చెన్నై.. ఈ సీజన్ను విజయంతో ఆరంభించింది. ముంబైని స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ నూర్ అహ్మద్ (4/18)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోని రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా.. అజేయంగా నిలిచాడు. -
IPL 2025: ఈ ఏడాది ధోని మరింత ఫిట్గా ఉన్నాడు.. యవ్వనంగా కనిపిస్తున్నాడు: రుతురాజ్
ఐపీఎల్-2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో ఓడటం ముంబై ఇండియన్స్కు ఇది వరుసగా 13వ సారి. ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ నుంచి ఇప్పటివరకు ముంబైతో జరిగిన ఏడు మ్యాచ్ల్లో సీఎస్కే ఏడింట విజయాలు సాధించింది. నిన్నటి మ్యాచ్లో సీఎస్కేను అరంగేట్రం ఆటగాడు నూర్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శనలతో గెలిపించారు.తొలుత నూర్ (4-0-18-4) తన మాయాజాలం ప్రదర్శించి ముంబైని 155 పరుగులకే పరిమితం చేయగా.. ఆ తర్వాత రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తమ బ్యాటింగ్ విన్యాసాలతో సీఎస్కేను గెలిపించారు. ఈ మ్యాచ్లో సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ (4-0-29-3) కూడా రాణించాడు. ధోని మెరుపు స్టంపింగ్ (సూర్యకుమార్ యాదవ్) చేసి వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు.ఈ మ్యాచ్లో ముంబై స్వల్ప స్కోర్కే పరిమితమైనా.. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. ముంబై బౌలర్లు సీఎస్కేను అంత ఈజీగా గెలవనివ్వలేదు. రుతురాజ్ క్రీజ్లో ఉన్నంత సేపు సీఎస్కే వైపే ఏకపక్షంగా సాగిన మ్యాచ్.. ఆతను ఔటయ్యాక మలుపులు తిరిగింది. ఓ దశలో ముంబై అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) రెచ్చిపోవడంతో సీఎస్కే కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే రచిన్ చివరి వరకు క్రీజ్లో ఉండి సిక్సర్తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (17) రనౌట్ కావడంతో ధోని క్రీజ్లోకి వచ్చాడు. ధోని బ్యాటింగ్కు దిగినా పరుగులేమీ చేయలేదు (2 బంతులు ఎదుర్కొని). ధోని రాకతో చెపాక్ స్టేడియం హోరెత్తింది. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్కేను తెగ ఇబ్బంది పెట్టారు. అంతకుముందు ముంబై బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌటై నిరాశపర్చగా.. విధ్వంసకర ఆటగాళ్లు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. గెలిచిన జట్టులో ఉండటం ఆనందంగా ఉంది. మరింత క్లినికల్గా ఉండటం నాకు చాలా ఇష్టం. కానీ ఆట ఇలాగే సాగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో రావడంపై స్పందిస్తూ.. అది జట్టు అవసరం. నేను మూడో స్థానంలో బ్యాటింగ్ రావడం జట్టుకు మరింత సమతుల్యతను ఇస్తుంది. నా స్థానాన్ని మార్చుకోవడం (గతంలో ఓపెనర్గా వచ్చే వాడు) పట్ల నాకు ఎలాంటి బాధ లేదు. వాస్తవానికి ఇంకా సంతోషంగా ఉంది.స్పిన్నర్లు సరైన పాయింట్పై ఉన్నారు. ఈ మ్యాచ్లో వారు ముగ్గురు (నూర్, అశ్విన్, జడేజా) మంచి లయతో బౌలింగ్ చేశారు. ఇది మాకు శుభసూచకం. ఖలీల్ అనుభవజ్ఞుడు. అతని అనుభవం మాకు కలిసొచ్చింది. నూర్ ఓ ఎక్స్ ఫ్యాక్టర్, అందుకే అతన్ని జట్టులో చేర్చుకోవాలనుకున్నాము. అశ్విన్ జట్టులో ఉండటం మాకు బలాన్ని ఇస్తుంది. ధోని ఈ సంవత్సరం మరింత ఫిట్గా ఉన్నాడు. అతను ఇప్పటికీ యవ్వనంగా కనిపిస్తున్నాడు. -
IPL 2025: మా పోరాటం ప్రశంసనీయం.. రుతురాజ్ మ్యాచ్ను లాగేసుకున్నాడు: సూర్యకుమార్
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో ఓడిపోయే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై తమ తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్లో సీఎస్కే ముంబైపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ తడబడింది. సీఎస్కే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ డకౌటై నిరాశపరిచగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అరంగేట్రం ఆటగాడు రాబిన్ మింజ్ (3) తేలిపోయాడు. నమన్ ధిర్ 17, సాంట్నర్ 11 పరుగులు చేయగా.. ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-18-4) ఐపీఎల్ కెరీర్ను అద్భుతంగా ప్రారంభించాడు. ఖలీల్ అహ్మద్ (4-0-29-3) సత్తా చాటాడు. వెటరన్ రవిచంద్రన్ అశ్విన్, నాథన్ ఇల్లిస్ తలో వికెట్ తీశారు.స్లో ట్రాక్పై ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే ఆదిలోనే వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని 2 పరుగులకే ఔట్ చేశాడు. వన్డౌన్లో బరిలోకి దిగిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రుతు 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి మ్యాచ్ను ముంబై చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. మరో ఎండ్లో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి చివరి వరకు క్రీజ్లో ఉన్నాడు. సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. రుతురాజ్ ఔటయ్యాక సీఎస్కే కాస్త తడబడింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ వరుసగా తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ముంబైని తిరిగి మ్యాచ్లోకి తెచ్చినట్లు కనిపించాడు. ఈ దశలో విల్ జాక్స్, నమన్ ధిర్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. సీఎస్కే ఆటగాళ్లను కట్టడి చేసి పరుగులు రానివ్వకుండా చేశారు. అయితే అప్పటిదాకా అద్బుతంగా బౌలింగ్ చేసిన విజ్ఞేశ్ పుథుర్ను 18వ ఓవర్లో బౌలింగ్కు దించి ముంబై కెప్టెన్ స్కై పెద్ద తప్పు చేశాడు. ఆ ఓవర్లో రచిన్ చెలరేగిపోయి 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్లోనే ముంబై ఓటమి ఖరారైపోయింది. 19వ ఓవర్లో నమన్ ధిర్ జడ్డూ వికెట్ తీసి కేవలం 2 పరుగులే ఇచ్చినా చివరి ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాది రచిన్ సీఎస్కేను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ధోని సూర్యకుమార్ను మెరుపు స్టంపింగ్ చేసి వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు.మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ స్పందిస్తూ.. మేము 15-20 పరుగులు తక్కువ చేశాం. అయినా మా కుర్రాళ్ల పోరాటం ప్రశంసనీయం. యువకులకు అవకాశాలు ఇవ్వడంలో ముంబై ఇండియన్స్ ప్రసిద్ధి చెందింది . ఎంఐ స్కౌట్స్ ఏడాదిలో 10 నెలలు టాలెంట్ను వెతికే పనిలో ఉంటారు. విజ్ఞేశ్ పుథుర్ దాని ఫలితమే. తొలి మ్యాచ్లోనే విజ్ఞేశ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన తొలి 3 ఓవర్లలో 3 వికెట్లు తీసి తిరిగి తమను మ్యాచ్లోకి తెచ్చాడు. ఆట లోతుగా సాగితే అతని కోసమని ఓ ఓవర్ను స్పేర్గా ఉంచాను. అది మిస్ ఫైర్ అయ్యింది. 18వ ఓవర్ విజ్ఞేశ్కు ఇచ్చి తప్పు చేశాను. మ్యాచ్ జరుగుతుండగా మంచు ప్రభావం లేదు. కానీ కాస్త జిగటగా ఉండింది. రుతురాజ్ బ్యాటింగ్ చేసిన విధానం మ్యాచ్ను మా నుండి దూరం చేసింది. ఇది తొలి మ్యాచే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నాడు. కాగా, ముంబై తమ రెండో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ మార్చి 29న అహ్మదాబాద్లో జరుగనుంది. -
వరుసగా 13వ ఏడాది...
సీజన్ ఆరంభ మ్యాచ్లో పరాజయం పాలయ్యే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ మరోసారి కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై జట్టు ఐపీఎల్లో తాము ఆడిన తొలి మ్యాచ్లో ఓటమి పాలైంది. గతేడాది పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. బ్యాటింగ్లో మెరుపులు మెరిపించలేకపోయిన ముంబై... బౌలింగ్లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. చెన్నై: ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్పై గెలిచింది. 2012 ఐపీఎల్లో చివరిసారి తాము ఆడిన తొలి మ్యాచ్లో నెగ్గిన ముంబై జట్టు ఆ తర్వాత ఇప్పటి వరకు మొదటి పోరులో శుభారంభం చేయలేకపోయింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ యువతార ఠాకూర్ తిలక్ వర్మ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా... రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయారు. చెన్నై బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకాలతో రాణించారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) దూబే (బి) ఖలీల్ 0; రికెల్టన్ (బి) ఖలీల్ 13; జాక్స్ (సి) దూబే (బి) అశ్విన్ 11; సూర్యకుమార్ (స్టంప్డ్) ధోని (బి) నూర్ 29; తిలక్ వర్మ (ఎల్బీ) (బి) నూర్ 31; రాబిన్ (సి) జడేజా (బి) నూర్ 3; నమన్ (బి) నూర్ 17; సాంట్నర్ (ఎల్బీ) (బి) ఎలీస్ 11; దీపక్ చాహర్ (నాటౌట్) 28; బౌల్ట్ (సి) రుతురాజ్ (బి) ఖలీల్ 1; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–21, 3–36, 4–87, 5–95, 6–96, 7–118, 8–128, 9–141. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–29–3; స్యామ్ కరన్ 1–0–13–0; ఎలీస్ 4–0–38–1; అశ్విన్ 4–0– 31–1; జడేజా 3–0–21–0; నూర్ అహ్మద్ 4–0– 18–4. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (నాటౌట్) 65; రాహుల్ త్రిపాఠి (సి) రికెల్టన్ (బి) చాహర్ 2; రుతురాజ్ (సి) జాక్స్ (బి) విఘ్నేశ్ 53; దూబే (సి) తిలక్ వర్మ (బి) విఘ్నేశ్ 9; దీపక్ హుడా (సి) సత్యనారాయణ (బి) విఘ్నేశ్ 3; కరన్ (బి) జాక్స్ 4; జడేజా (రనౌట్) 17; ధోని (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–95, 4–107, 5–116, 6–152. బౌలింగ్: బౌల్ట్ 3–0–27–0; చాహర్ 2–0–18–1; సత్యనారాయణ 1–0–13–0; సాంట్నర్ 2.1–0–24–0; జాక్స్ 4–0–32–1; విఘ్నేశ్ 4–0–32–3; నమన్ 3–0–12–0. ఐపీఎల్లో నేడుఢిల్లీ X లక్నో వేదిక: విశాఖపట్నంరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
ఐపీఎల్-2025లో బోణీ కొట్టిన సీఎస్కే.. ముంబైపై విక్టరీ
ఐపీఎల్-2025ను చెన్నై సూపర్ కింగ్స్ అద్బుతమైన విజయంతో ఆరంభించింది. చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(65 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓ దశలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటికి.. రవీంద్ర మాత్రం ఆచితూచి ఆడుతూ మ్యాచ్ను ముగించాడు.ముంబై బౌలర్లలో విఘ్నేష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జాక్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రోహిత్ శర్మ(0) ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. ఇక సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.చదవండి: IPL 2025: వారెవ్వా ధోని.. కేవలం 0.12 సెకన్లలోనే! వీడియో వైరల్ -
వారెవ్వా ధోని.. కేవలం 0.12 సెకన్లలోనే! వీడియో వైరల్
ఎంఎస్ ధోని.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. ఈ జార్ఖండ్ డైన్మేట్.. విధ్వంసకర బ్యాటింగ్తో పాటు అద్బుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్కు పెట్టింది పేరు. తాజాగా ధోని మరోసారి తన కీపింగ్ స్కిల్స్తో అభిమానులను అలరించాడు.ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే తరపున ఆడుతున్న ధోని.. అద్బుతమైన స్టంపింగ్తో మెరిశాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను మెరుపు స్టంప్ ఔట్ చేసి ధోని పెవిలియన్కు పంపిచాడు.అసలేమి జరిగిదంటే?ముంబై ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన లెగ్ స్పిన్నర్ నూర్ అహ్మద్.. మూడో బంతిని సూర్యకు గూగ్లీగా సంధించాడు. ఆ బంతిని సూర్యకుమార్ క్రీజు నంచి బయటకు వచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి అద్భుతంగా టర్న్ అయ్యి అతడి బ్యాట్ను మిస్ అయ్యి వికెట్ల వెనక ఉన్న ధోని చేతికి వెళ్లింది.ఈ క్రమంలో మిస్టర్ కూల్.. తన వింటేజ్ స్టైల్లో రెప్పపాటులో బెయిల్స్ను పడగొట్టాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కు రిఫర్ చేసినప్పటికి.. సూర్య మాత్రం కనీసం వెనక్కి తిరగకుండా మైదానం విడిచివెళ్లిపోయాడు. ధోని కేవలం 0.12 సెకండ్ల వ్యవధిలోనే స్టంప్ ఔట్ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు. 𝙁𝙖𝙨𝙩. 𝙁𝙖𝙨𝙩𝙚𝙧. 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 🫡📹 Watch #CSK legend's jaw-dropping reflexes behind the stumps 🔥Updates ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/S26cUYzRd8— IndianPremierLeague (@IPL) March 23, 2025 -
రుతురాజ్, రచిన్ హాఫ్ సెంచరీలు.. ముంబై పై సీఎస్కే విజయం
సీఎస్కే ఘన విజయం..చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(65 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో విఘ్నేష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జాక్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.సీఎస్కే ఐదో వికెట్ డౌన్..సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. విల్ జాక్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో రచిన్ రవీంద్ర(20), రవీంద్ర జడేజా(5) ఉన్నారు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 125/5సీఎస్కే మూడో వికెట్ డౌన్.. దూబే ఔట్శివమ్ దూబే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన దూబే.. విఘ్నేష్ బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 100/3.సీఎస్కే రెండో వికెట్ డౌన్.. గైక్వాడ్ ఔట్రుతురాజ్ గైక్వాడ్ రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 53 పరుగులు చేసిన రుతురాజ్ విఘ్నేష్ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 79/2.6 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 62/16 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(42), రచిన్ రవీంద్ర(20) ఉన్నారు.తొలి వికెట్ డౌన్..156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. దీపక్ చాహర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 35/1. క్రీజులోకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(18), రచిన్ రవీంద్ర(14) పరుగులతో ఉన్నారు.రాణించిన సీఎస్కే బౌలర్లు..చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.నూర్ ఆన్ ఫైర్..ముంబై ఇండియన్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ముంబై ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్లో నాలుగో బంతికి రాబిన్ మింజ్ ఔట్ కాగా.. ఆఖరి బంతికి తిలక్ వర్మ(31) పెవిలియన్కు చేరాడు. 13 ఓవర్లకు ముంబై స్కోర్: 96/6సూర్యకుమార్ ఔట్..సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన సూర్యకుమార్.. నూర్ అహ్మద్ బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. ధోని అద్భుతమైన స్టంపింగ్తో మెరిశాడు. 12 ఓవర్లకు ముంబై స్కోర్: 92/4ముంబై మూడో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన జాక్స్.. అశ్విన్ బౌలింగ్లో దూబేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. 6 ఓవర్లకు ముంబై స్కోర్: 52/3ముంబై రెండో వికెట్ డౌన్ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రికెల్టన్ ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 4 ఓవర్లకు ముంబై స్కోర్: 30/2రోహిత్ శర్మ ఔట్..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబైకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్లో దూబేకు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. 2 ఓవర్లకు ముంబై స్కోర్: 17/1ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో ఆంధ్ర ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజు ముంబై తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్కు ముంబై ఇండియన్స్ రెగ్యూలర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కావడంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు.తుది జట్లుముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజుచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్ -
CSK Vs MI: సీఎస్కేతో మ్యాచ్.. హిట్మ్యాన్కు జోడీ ఎవరు..?
ఐపీఎల్-2025లో భాగంగా ఇవాళ (మార్చి 23) రాత్రి (7:30 గంటలకు) రసవత్తర సమరం జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటున్నాయి. క్రికెట్లో ఈ రెండు జట్ల మ్యాచ్ను ఎల్ క్లాసికోగా పిలుస్తారు. ఈ మ్యాచ్పై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్లో ముంబై, సీఎస్కే జట్లు అత్యంత విజయవంతమైన జట్లు. ఈ రెండు జట్లు చెరో ఐదు సార్లు టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు నేటి మ్యాచ్తో ఆరో టైటిల్ వేటను ప్రారంభిస్తాయి.నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. నిషేధం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కు అందుబాటులో లేడు. సీఎస్కే విషయానికొస్తే.. రుతురాజ్ గైక్వాడ్ ఈ జట్టును ముందుండి నడిపించనున్నాడు.తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు కూడా అందుబాటులో లేవు. గాయం నుంచి బుమ్రా ఇంకా కోలుకోలేదు. నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తుది జట్టు కూర్పును పరిశీలిస్తే.. ఓపెనర్గా రోహిత్ శర్మ వస్తాడు. హిట్మ్యాన్ను జత ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. విల్ జాక్స్ లేదా ర్యాన్ రికెల్టన్లలో ఎవరో ఒకరు హిట్మ్యాన్తో పాటు బరిలోకి దిగుతారు. వన్ డౌన్ తిలక్ వర్మ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో ప్లేస్లో నమన్ ధిర్ రావడం ఖరారైంది. నేటి మ్యాచ్తో రాబిన్ మింజ్ ఐపీఎల్ అరంగేట్రం చేయవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా మిచెల్ సాంట్నర్, కర్ణ శర్మ బరిలో ఉంటారు. పేసర్లుగా దీపక్ చాహర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.సీఎస్కే విషయానికొస్తే.. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే బరిలో నిలిచే అవకాశం ఉంది. వన్డౌన్లో రచిన్ రవీంద్ర, ఆతర్వాత దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్) బరిలోకి దిగవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవిచంద్రన్ అశ్విన్, పేసర్లుగా సామ్ కర్రన్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.హెడ్ టు హెడ్ రికార్డ్స్ను పరిశీలిస్తే.. ఐపీఎల్లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 37 మ్యాచ్ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో సీఎస్కే 17, ముంబై 20 మ్యాచ్ల్లో గెలుపొందాయి.ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్చెన్నై సూపర్ కింగ్స్..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని , రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, సామ్ కర్రాన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, జామీ ఓవర్టన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణన్ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్దార్థ్. -
రైజర్స్ బొణీ కొట్టేనా!
బాదుడే పరామావధిగా చెలరేగి గత సీజన్లో రన్నరప్గా నిలిచిన సన్రజర్స్ హైదరాబాద్... ఈ ఏడాది అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్తో... నేడు కమిన్స్ సేన కప్ వేట ప్రారంభించనుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్తో సన్రైజర్స్ బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్బేధ్యంగా ఉండగా... యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రియాన్ పరాగ్, హెట్మైర్, ధ్రువ్ జురెల్తో సవాలు విసిరేందుకు రాజస్తాన్ రాయల్స్ రెడీ అయింది. మరి రైజర్స్ దూకుడుకు రాయల్స్ అడ్డుకట్ట వేస్తుందా చూడాలి! సాక్షి, హైదరాబాద్: గత ఏడాది అందినట్లే అంది దూరమైన ఐపీఎల్ ట్రోఫీని ఈసారైనా ఒడిసి పట్టాలనే లక్ష్యంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్కు రెడీ అయింది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా జరగనున్న తొలి ‘డబుల్ హెడర్’లో ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్తో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. ఒకప్పుడు కట్టుదిట్టమైన బౌలింగ్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన సన్రైజర్స్... గత సీజన్లో విధ్వంసక బ్యాటింగ్తో రికార్డులు తిరగరాసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నుంచి మొదలు పెట్టుకొని కెప్టెన్ కమిన్స్ వరకు ప్రతి ఒక్కరూ దూకుడుగా ఆడేవాళ్లు ఉండటం రైజర్స్కు కలిసి రానుండగా... సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. గత ఏడాది మ్యాచ్ మ్యాచ్కు మరింత రాటుదేలుతూ అరాచకం సృష్టించిన రైజర్స్ బ్యాటర్లు... ఈ సీజన్లో తొలి మ్యాచ్ నుంచే జోరు కనబర్చాలని తహతహలాడుతున్నారు. ప్రాక్టీస్ సెషన్లలో హెడ్, క్లాసెన్, అభిషేక్, నితీశ్ వంతులు వేసుకొని మరి భారీ షాట్లు సాధన చేశారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. వేలంలో కొత్తగా తీసుకున్న ఇషాన్ కిషన్ రాకతో రైజర్స్ బ్యాటింగ్ మరింత పదునెక్కింది. గతేడాది ఒకటికి మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు చేసిన రైజర్స్... ఈ సారి 300 మార్క్ అందుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మిడిలార్డర్లో కీలకం కానున్నాడు. మరోవైపు వేలి గాయంతో ఇబ్బంది పడుతున్న రాజస్తాన్ రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామన్స్ ఈ మ్యాచ్లో కేవలం ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. సీజన్ తొలి మూడు మ్యాచ్లకు సామ్సన్ స్థానంలో రియాన్ పరాగ్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సామ్సన్ ఇంపాక్ట్ ప్లేయర్గా... స్వదేశీ ఆటగాళ్ల నైపుణ్యంపైనే ప్రధానంగా ఆధారపడుతున్న రాజస్తాన్ రాయల్స్కు... రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామ్సన్ గాయం ఇబ్బంది పెడుతోంది. అతడు కేవలం బ్యాటర్గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అతడి స్థానంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించనుండగా... ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు అందుకోనున్నాడు. యశస్వి జైస్వాల్, సామ్సన్, నితీశ్ రాణా, పరాగ్, ధ్రువ్ జురేల్ ఇలా టాప్–5లో స్వదేశీ ఆటగాళ్లే బ్యాటింగ్ చేయనున్నారు. మిడిలార్డర్లో విండీస్ హిట్టర్ హెట్మైర్ కీలకం కానుండగా... ఆర్చర్, తీక్షణ, వనిందు హసరంగ బౌలింగ్ భారం మోయనున్నారు. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న రైజర్స్ బ్యాటింగ్ లైనప్ను రాయల్స్ బౌలింగ్ దళం ఎలా అడ్డుకుంటుందనే దానిపైనే ఈమ్యాచ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బ్యాటింగ్ బలంగా... ఇంటా బయటా అనే తేడా లేకుండా గతేడాది బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారించిన సన్రైజర్స్... ముఖ్యంగా ఉప్పల్లో ఊచకోత సాగించింది. లక్నో సూపర్ జెయింట్స్తో పోరులో ఆ జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఆరెంజ్ ఆర్మీ 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండానే ఛేదించి సంచలనం సృష్టించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ బంతిపై పగబట్టినట్లు విజృంభిస్తుండటం రైజర్స్కు ప్రధాన బలం కాగా... ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్తో కూడిన మిడిలార్డర్ జట్టుకు మరింత బలాన్నిస్తోంది. అయితే ఫ్రాంఛైజీ తరఫున తొలిసారి బరిలోకి దిగనున్న అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం. గాయం కారణంగా శ్రీలంకతో పర్యటనతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆ్రస్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్... గాయం నుంచి కోలుకొని జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. పేస్ బౌలింగ్లో మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ కీలకం కానుండగా, ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. తుది జట్లు (అంచనా) సన్రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, షమీ, జాంపా. రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్మైర్, హసరంగ, శుభమ్ దూబే, ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే. పిచ్, వాతావరణం గతేడాది ఉప్పల్లో జరిగిన మ్యాచ్ల్లో పరుగుల వరద పారింది. మొత్తం 13 మైదానాల్లో ఐపీఎల్ మ్యాచ్లు జరగగా... అందులో రెండో అత్యధికం (ఓవర్కు 10.54 పరుగులు) హైదరాబాద్లో నమోదైంది. ఈసారి కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. మ్యాచ్కు వర్ష సూచన లేదు. చెన్నై X ముంబైసాయంత్రం గం. 7:30 నుంచిచెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్లో అత్యంత విజయవంతమైన జట్లుగా చెరో ఐదు సార్లు ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెపాక్ వేదికగా ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది. గాయం కారణంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, నిషేధం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోగా... సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టును నడిపించనున్నాడు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్, నమన్ ధిర్తో ముంబై బ్యాటింగ్ బలంగానే ఉంది. బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్ అనుభవం ముంబైకి ప్రధానాయుధం కాగా... దీపక్ చాహర్, కరణ్ శర్మ, సాంట్నర్, ముజీబ్ ఉర్ రహమాన్ మిగిలిన బాధ్యతలు చూసుకోనున్నారు. మరోవైపు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ విరామం తర్వాత చెన్నై జట్టులో తిరిగి చేరాడు. చెపాక్ లాంటి స్లో పిచ్పై అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ను ఎదుర్కోవడం కష్టమైన పనే. ఎప్పట్లాగే మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక నుంచి చెన్నై జట్టుకు దిశానిర్దేశం చేయనుండగా... బ్యాటింగ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, స్యామ్ కరన్, జడేజా కీలకం కానున్నారు. గత సీజన్లో ఎక్కువ శాతం బ్యాటింగ్కు రాని ధోని ఈ సారి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వస్తాడా చూడాలి. ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట చెన్నై విజయం సాధించింది. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పట్టిక అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ను తాజాగా ప్రారంభించాలని చూస్తోంది. -
‘సిక్సర్’ కొట్టేదెవరో?
ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా గుర్తింపు... హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీగా రికార్డు... నైపుణ్యాన్ని వలవేసి పట్టే నేర్పరితనం... యువ ఆటగాళ్లకు అండగా నిలిచే యాజమాన్యం... వెరసి ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు గత కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతోంది. రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పగించడంతో జట్టులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అభిమానుల అసహనం, మాజీల రుసరుసలు, విశ్లేషకులు వెటకారాలతో గత సీజన్ గడిచిపోగా... 2024 ఐపీఎల్ తర్వాత భారత జట్టుకు రోహిత్ శర్మ 2 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఈ రెండింట్లో హార్దిక్ కీలకపాత్ర పోషించడంతో సమస్య సమసిపోయినట్లైంది. మరి ఈ ఏడాదైనా ముంబై సమష్టిగా సత్తాచాటి మునుపటి జోరు సాగిస్తుందా చూడాలి! ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఏదైనా ఉందంటే... అది ముమ్మాటికీ చెన్నై సూపర్ కింగ్సే! ఇప్పటి వరకు 15 సీజన్లు ఆడిన చెన్నై జట్టు అందులో 10 సార్లు ఫైనల్కు చేరి ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ గణాంకాలు చాలు ఐపీఎల్లో చెన్నై జోరు ఏంటో చెప్పేందుకు. వికెట్ల వెనక ధోని మాయాజాలం... కాన్వే, రచిన్ రవీంద్ర బ్యాటింగ్ సామర్థ్యం... శివమ్ దూబే, రవీంద్ర జడేజా ఆల్రౌండ్ మెరుపులు, అశ్విన్, పతిరణ బౌలింగ్ నైపుణ్యం ఇలా అన్నీ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్... ఆరో కప్పువేటకు సిద్ధమైంది. –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి నిలకడ కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ఆరోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని సీజన్లుగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ముంబై ఇండియన్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా సాగుతోంది. గత సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020) అందించిన ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మను కాదని... గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి సారథ్య బాధ్యతలు అప్పగించడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని దుమ్మెత్తిపోసిన అభిమానులు... మైదానంలో హార్దిక్ను గేలి చేశారు. సొంత మైదానం వాంఖడేతో పాటు... దేశంలో ఎక్కడ మ్యాచ్ ఆడేందుకు వెళ్లినా... పాండ్యాకు ఇదే అనుభవం ఎదురైంది. దీంతో సహజంగానే డ్రెస్సింగ్రూమ్ వాతావరణం దెబ్బతింది. అదే మైదానంలో ప్రస్ఫుటమైంది. గత సీజన్లో 14 మ్యాచ్లాడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 10 పరాజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచింది. గత నాలుగు సీజన్లలో ఒక్కసారి (2023లో) మాత్రమే ముంబై జట్టు ప్లే ఆఫ్స్కు చేరింది. 2022, 2024లో పట్టికలో కింది స్థానంతో లీగ్ను ముగించింది. అయితే అప్పటికీ ఇప్పటికీ జట్టులో ఎంతో తేడా కనిపిస్తోంది. ఏడాది వ్యవధిలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఐసీసీ టి20 ప్రపంచకప్తో పాటు, చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ రెండు విజయాల్లోనూ కీలకంగా నిలిచిన హార్దిక్ పాండ్యాను అభిమానులు తిరిగి అక్కున చేర్చుకున్నారు. దీనికి తోడు రోహిత్ వంటి అనుభవజ్ఞుడి సలహాలు, సూచనలు ఉంటే... పాండ్యా జట్టును మరింత ముందుకు తీసుకెళ్లడం ఖాయమే. బుమ్రా ఫిట్నెస్ సాధించేనా! ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా గాయపడ్డ భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్పై ముంబై ఆందోళన చెందుతోంది. వెన్నునొప్పితో చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఈ ఏస్ పేసర్... ఐపీఎల్ తొలి దశ మ్యాచ్లకు అందుబాటులో ఉండబోడని ఇప్పటికే ఫ్రాంచైజీ వెల్లడించింది. అయితే అతడి సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు. గతేడాది వేలంలో బుమ్రా, రోహిత్, హార్దిక్, సూర్యకుమార్తో పాటు హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. అందులో అత్యధికంగా బుమ్రాకు రూ. 18 కోట్లు కట్టబెట్టింది. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ను వేలానికి వదిలేసిన ముంబై... ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, సాంట్నర్తో బౌలింగ్ను మరింత పటిష్టం చేసుకుంది. రోహిత్తో కలిసి దక్షిణాఫ్రికా ప్లేయర్ రికెల్టన్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. భారత ఆటగాళ్ల విషయంలో పటిష్టంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్... విదేశీ ఆటగాళ్ల ఎంపిక మాత్రం కాస్త అనూహ్యంగా ఉంది. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల విదేశీ పించ్ హిట్టర్ లోటు కనిపిస్తోంది. రూ.5 కోట్ల 25 లక్షలు వెచ్చించి ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి దక్కించుకున్న నమన్ ధీర్పై భారీ అంచనాలు ఉన్నాయి. బుమ్రా గైర్హాజరీలో బౌల్ట్, సాంట్నర్, దీపక్ చాహర్, కరణ్ శర్మ పై బౌలింగ్ భారం పెరగనుంది. ఆంధ్ర ఆటగాడు పెనుమత్స సత్యనారాయణ రాజు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ జట్టులో ఉన్నా... వారికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కడం కష్టమే. ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), రోహిత్, సూర్యకుమార్, తిలక్, రాబిన్ మిన్జ్, రికెల్టన్, శ్రీజిత్ క్రిష్ణన్, జాకబ్స్, నమన్ ధీర్, జాక్స్, సాంట్నర్, అంగద్ , విఘ్నేశ్, కార్బిన్, బౌల్ట్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్వని కుమార్, టాప్లీ, వెంకట సత్యనారాయణ, అర్జున్ టెండూల్కర్, ముజీబ్, బుమ్రా. అంచనా: ముంబై ఇండియన్స్ ఆటతీరు పరిశీలిస్తే... ఆడితే అందలం, లేకుంటే అట్టడుగు స్థానం అనేది సుస్పష్టం. గత నాలుగు సీజన్లలో కేవలం ఒక్కసారే ప్లే ఆఫ్స్కు చేరిన ముంబై... స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఈ సారి కూడా ప్లే ఆఫ్స్ చేరొచ్చు. సాధారణ ఆటగాడు సైతం... అసాధారణ ప్రదర్శన చేయడం... అప్పటి వరకు జట్టులో చోటు దక్కడమే కష్టమనుకున్న ప్లేయర్ సైతం... ‘ఎక్స్’ ఫ్యాక్టర్గా మారడం... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నిత్యకృత్యం.అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో చెన్నైని మించిన జట్టు లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు 5 సార్లు (2010, 2011, 2018, 2021, 2023) ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న సూపర్ కింగ్స్ మరో 5 సార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్గా నిలిచింది. గతేడాదే రుతురాజ్ గైక్వాడ్కు సారథ్య బాధ్యతలు అప్పగించిన ఫ్రాంచైజీ... అతడితో పాటు రవీంద్ర జడేజాకు రూ. 18 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది.పతిరణను రూ. 13 కోట్లు, శివమ్ దూబేను రూ. 12 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఐదేళ్లు దాటిపోయిన మహేంద్రసింగ్ ధోనిని రూ. 4 కోట్లకు కొనసాగించింది. వీరితో పాటు రచిన్ రవీంద్రను రూ. 4 కోట్లతో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి సొంతం చేసుకుంది. ఇక సుదీర్ఘ కాలం తర్వాత రవిచంద్రన్ అశ్విన్ను తిరిగి కొనుగోలు చేసుకుంది. మరి గత కొంత కాలంగా నిలకడగా రాణించలేకపోతున్న సూపర్ కింగ్స్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. తలా... అన్నీ తానై! అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని... ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. పేరుకు రుతురాజ్ కెప్టెన్ అయినా... వికెట్ల వెనక నుంచి టీమ్కు దిశానిర్దేశం చేసేది ధోనినే అనడంలో సందేహం లేదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్న ధోనీ గతేడాది బ్యాటింగ్ ఆర్డర్లో మరీ కింది స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. మరి ఈసారైనా అతని బ్యాట్ నుంచి మెరుపులు వస్తాయోమో చూడాలి. బ్యాటింగ్లో కాన్వే, రచిన్, దూబే, రుతురాజ్, జడేజా, ధోని కీలకం కానుండగా... పతిరణ, అశ్విన్, ఖలీల్ అహ్మద్, స్యామ్ కరన్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. రచిన్, జడేజా, దూబే, దీపక్ హూడా, విజయ్ శంకర్, అశ్విన్, జేమీ ఓవర్టన్, సామ్ కరన్ ఇలా లెక్కకు మిక్కిలి ఆల్రౌండర్లు ఉండటం చెన్నైకి అదనపు బలం. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ జట్టులో ఉన్నా... అతడికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్ ), మహేంద్రసింగ్ ధోని, కాన్వే, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వన్ష్ బేదీ, సిద్ధార్్థ, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్, స్యామ్ కరన్, అన్షుల్ కంబోజ్, దీపక్ హూడా, జేమీ ఓవర్టన్, కమలేశ్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముకేశ్, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎలీస్, శ్రేయస్ గోపాల్, పతిరణ. అంచనా: ఐపీఎల్లో మిగిలిన జట్లతో పోల్చుకుంటే అత్యధిక మంది ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్న చెన్నై స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఫైనల్ చేరడం పెద్ద కష్టం కాకపోవచ్చు. -
IPL 2025: స్పిన్-టు-విన్ వ్యూహం.. ఆరో టైటిల్కు గురి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings). రికార్డు స్థాయిలో ఆరవ టైటిల్ను లక్ష్యంగా చేసుకుని ఈసారి బరిలోకి దిగుతోంది. 2024లో లీగ్ దశ నుంచి నిష్క్రమించిన బాధ ఇంకా చెన్నై ఆటగాళ్ల మనసులో కదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్లో తమ అద్భుతమైన ప్రదర్శనతో తిరిగి పూర్వ వైభవం సాధించాలని సీఎస్కే పట్టుదలతో ఉందనడంలో సందేహం లేదు.యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గత సీజన్కు ముందు కెప్టెన్గా బాధ్యతలు అప్పగించిన తర్వాత కొంత అనుభవం గడించిన నేపథ్యంలో ఈ సీజన్లో కొత్త కెప్టెన్ మరింత మెరుగ్గా వ్యవహరించే అవకాశముందని భావిస్తున్నారు. కాగా.. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ స్థానాన్ని కూడా సాధించలేకపోయింది.7 విజయాలు, 7 ఓటములతో కేవలం 14 పాయింట్లు మాత్రమే సాధించి గత సీజన్లో పేలవంగా ఐదో స్థానం తో ముగించింది. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 23న చెన్నైలోని ఎం ఎ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ తో తన టైటిల్ వేట ప్రారంభిస్తుంది.స్పిన్-టు-విన్ వ్యూహంఈ నేపథ్యంలో ఈ సారి భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరియు చెన్నై అభిమానుల ఫేవరెట్ ఆటగాడు సామ్ కుర్రాన్తో సహా అనేక సుపరిచితమైన ఆటగాళ్లను చెన్నై మళ్ళీ జట్టులోకి తీసుకుంది. భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెనుక నుంచి తన వ్యూహరచనలో జట్టును ముందుండి నడిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇక జట్టును చూస్తే, గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాల్ని ఇచ్చిన 'స్పిన్-ట్రిక్' కు కట్టుబడి ఉండాలని చెన్నై భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా రవీంద్ర జడేజా, న్యూజిలాండ్కు చెందిన భారత్ సంతతి ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రతో పాటు నూర్ అహ్మద్, అశ్విన్లను చేర్చడం, ముఖ్యంగా సొంత గడ్డ పై గరిష్ట ప్రభావాన్ని చూపడానికి టర్నర్లను ఉపయోగించాలనే వారి ధోరణిని గుర్తుచేస్తుంది.అశ్విన్, నూర్ లతో పాటు జడేజా ఎడమచేతి ఫింగర్స్పిన్, గోపాల్ లెగ్స్పిన్, ఇంకా దీపక్ హుడా పార్ట్-టైమ్ ఆఫ్స్పిన్ వంటి బౌలర్లు చెన్నై స్పిన్ బౌలింగ్ కి వెరైటీ సమకూరుస్తున్నారు. ఇది చెపాక్లో స్పిన్-టు-విన్ వ్యూహానికి సరిగ్గా సరిపోతుంది.బలీయంగా కనిపిస్తున్న బ్యాటింగ్ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, న్యూ జిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి బ్యాటింగ్ను ప్రారంభించే అవకాశముంది. ఈ జంట 2023 సీజన్లో చాలా విజయవంతమైంది. కానీ గత సీజన్లో గాయం కారణంగా కాన్వే ఆడలేక పోయాడు. ఈ సీజన్లో ఈ ఇద్దరి అద్భుతమైన భాగస్వామ్యంతో చెన్నై మళ్ళీ పుంజుకోవాలని భావిస్తోంది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజృంభించిన ఆడిన రచిన్ రవీంద్రను మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే అవకాశముంది.కీలకమైన నాల్గవ స్థానంలో దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి లేదా విజయ్ శంకర్ ఒకరు వచ్చే అవకాశముంది. ఆ తర్వాత హార్డ్ హిట్టింగ్ శివమ్ దూబేను ఐదవ స్థానంలో, ఆ తర్వాత ఆరో స్థానంలో వచ్చే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ తన నైపుణ్యంతో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు. జడేజా తర్వాత, ఎంఎస్ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశముంది. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్లో గత సీజన్లో కీలక పాత్ర పోషించిన ధోని మరోసారి ప్రభావం చూపే అవకాశం ఉంది.జట్టులో ప్రధాన ఆటగాళ్ళు:రుతురాజ్ గైక్వాడ్: గత కొన్ని సీజన్లగా చెన్నై తరఫున నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నవారిలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. రుతురాజ్ తన జట్టు బ్యాటింగ్ యూనిట్కు వెన్నెముకగా నిలిచాడు, 41.75 సగటుతో మరియు 136.86 స్ట్రైక్ రేట్తో 2380 పరుగులు సాధించాడు. అతని నాయకత్వంలో పసుపు బ్రిగేడ్ గత సీజన్లో ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేక పోయినా, గైక్వాడ్ ఈ సీజన్లో మెరుగైన ఆటతీరుతో చెన్నై ని ముందుకు నడిపించాలని పట్టుదలతో ఉన్నాడు.రవిచంద్రన్ అశ్విన్: అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన రవిచంద్రన్ అశ్విన్, తన కెరీర్ ప్రారంభ దశలో తనను వెలుగులోకి తెచ్చిన ఫ్రాంచైజీ అయిన చెన్నై కి ఐపీఎల్ టైటిల్ను అందించాలని భావిస్తున్నాడు. 212 మ్యాచ్ల్లో 7.12 ఎకానమీ రేటుతో 180 వికెట్ల తో అశ్విన్ ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదవ బౌలర్గా నిలిచాడు. అంతేకాకుండా, ఈ ఆఫ్ స్పిన్నర్ తాను బ్యాట్తో దూకుడుగా ఉండగలనని మరియు అవసరమైనప్పుడు ఫ్లోటర్గా వ్యవహరించగలనని చూపించాడు.నాథన్ ఎల్లిస్: వేగంగా బౌలింగ్ చేయగల మరియు తన వైవిధ్యాలను చాలా చక్కగా ఉపయోగించుకునే సామర్థ్యంతో, నాథన్ ఎల్లిస్ చెన్నై జట్టులో కీలకమైన బౌలర్గా రాణిస్తాడని భావిస్తున్నారు.శివం దూబే: దూకుడుతో బ్యాటింగ్ చేసే శివం దూబే చెన్నై జట్టుకు మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించాడు. సూపర్ కింగ్స్ తరఫున 39 ఇన్నింగ్స్లలో 34.47 సగటు మరియు 159.16 స్ట్రైక్ రేట్తో 1103 పరుగులు చేశాడు. చెన్నై జట్టుకి మిడిల్ ఓవర్లలో శివం దూబే ను గేమ్-ఛేంజర్ గా భావించవచ్చు.రాహుల్ త్రిపాఠి: డైనమిక్ బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మూడు లేక నాలుగో స్థానంలో ఆడే అవకాశముంది. త్రిపాఠి ఐపీఎల్లో ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 27.27 సగటుతో, 139.3 స్ట్రైక్ రేట్తో 2236 పరుగులు చేశాడు.చెన్నై సూపర్ కింగ్స్ జట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని , రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, సామ్ కర్రాన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, జామీ ఓవర్టన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణన్ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్దార్థ్.చదవండి: అందుకే ఆర్సీబీ టైటిల్ గెలవలేదు.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడికే: సీఎస్కే మాజీ స్పిన్నర్ -
ఓపెనర్లగా కాన్వే, రవీంద్ర.. సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే?
ఐపీఎల్-2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అన్ని విధాల సిద్దమవుతోంది. చెపాక్లోని చిదంబరం స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో సీఎస్కే ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత సీజన్లో గ్రూపు స్టేజికే పరిమితమైన సీఎస్కే.. ఈ ఏడాది సీజన్లో మాత్రం అదరగొట్టాలన్న పట్టుదలతో ఉంది.రికార్డు స్ధాయిలో ఆరో ఐపీఎల్ ట్రోఫీపై మెన్ ఇన్ ఎల్లో కన్నేసింది. అందుకోసం సీఎస్కే తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ ఏడాది సీజన్ కోసం సామ్ కుర్రాన్, డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లు సీఎస్కే జట్టులోకి వచ్చారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, శివమ్ దూబే, ధోని వంటి ఆటగాళ్లతో సీఎస్కే బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కన్పిస్తోంది. బౌలింగ్లోనూ పతిరానా, నాథన్ ఈల్లీస్, నూర్ ఆహ్మద్ వంటి యువ సంచలనాలతో సీఎస్కే బలంగా ఉంది. ఈ ఏడాది సీజన్లో సీఎస్కే తమ తొలి మ్యాచ్లో మార్చి 23న చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ క్రమంలో సీఎస్కే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ను ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు అంచనా వేశాడు.సీఎస్కే ఇన్నింగ్స్ను రుతురాజ్ గైక్వాడ్తో పాటు డెవాన్ కాన్వే ప్రారంభించాలని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా గత సీజన్లో గైక్వాడ్కు ఓపెనింగ్ భాగస్వామిగా రచిన్ రవీంద్ర వచ్చాడు. కానీ గత సీజన్లో రవీంద్ర తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ క్రమంలోనే రవీంద్రను మూడో స్దానంలో బ్యాటింగ్కు పంపించాలని రాయుడు సూచించాడు. అదేవిధంగా నాలుగో స్ధానం కోసం దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ మధ్య పోటీ ఉంటుందని ఈ భారత మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఇక ఆల్రౌండర్ల కోటాలో శివమ్ దూబే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజాలకు అంబటి చోటు ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్లగా మతీషా పతిరాన, అన్షుల్ కాంబోజ్.. స్పెషలిస్టు స్పిన్నర్గా అశ్విన్కు తుది జట్టులో అతడు అవకాశమిచ్చాడు. కాగా ఐపీఎల్-18 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఈడెన్గార్డెన్స్ వేదికగా కేకేఆర్-ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి.రాయుడు ఎంపిక చేసిన సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా/రాహుల్ త్రిపాఠి/విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, సామ్ కర్రాన్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్బెంచ్: ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, జామీ ఓవర్టన్చదవండి: IPL 2025: చరిత్రకు అడుగు దూరంలో రహానే.. -
'పుష్ప'రాజ్గా జడేజా.. వీడియో రిలీజ్ చేసిన 'చెన్నై సూపర్ కింగ్స్'
అంతర్జాతీయ క్రికెట్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప మార్క్ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడు, సెంచరీ బాదినప్పుడు ఎవరైనా సంబరాలు చేసుకుంటుంటారు. కానీ, పుష్ప సినిమా విడుదల తర్వాత ట్రెండ్ మారిపోయింది. భారత క్రికెటర్స్తో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు సైతం పుష్ప మార్క్ స్టైల్లో 'తగ్గేదేలే' అంటూ బన్నీని అనుకరించడం చూశాం. తాజాగా పుష్ప2 విడుదలైంది. మార్చి 22నుంచి ఐపీఎల్-2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఒక వీడియోను పంచుకుంది. అందులో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 'పుష్ప' గాడి రూల్ సీన్ను రీక్రియేట్ చేశారు. సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ను వారు రీక్రియేట్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతుంది.కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో పుష్ప ట్రెండ్ మార్క్ తప్పకుండా కనిపిస్తుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా దగ్గర కావడంతో ఈసారి స్టేడియంలో పుష్పరాజ్ గెటప్లో చాలామంది కనిపిస్తారు. క్రికెటర్స్ వికెట్ తీసినా, సెంచరీ కొట్టినా 'తగ్గేదేలే' అంటూ ఫోజులు ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో జడేజా విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే పుష్ప స్టైల్లో తన బ్రాండ్ను చూపించాడు. ఆ విజువల్ నెట్టింట భారీగా వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా జడేజాతో పుష్ప బీజీఎమ్తో ఒక సీన్ రీక్రియేట్ చేసి సోషల్మీడియాలో పంచుకుంది. వైల్డ్ఫైర్ అంటూ తమ డెన్ పూర్తి సిద్ధంగా ఉందంటూ ఐపీఎల్ 2025 కప్ కోసం ఛాలెంజ్ విసిరింది.క్రికెట్లో పుష్ప మార్క్క్రికెట్ స్టేడియంలో బ్యాటింగ్కు దిగాడంటే రెచ్చిపోయే ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సైతం పుష్పగాడికి అభిమాని అయిపోయాడు. పలుమార్లు 'తగ్గేదేలే' అంటూ బన్నీ అభిమానులను మెప్పించాడు. రీసెంట్గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా పుష్ప మార్క్ చూపించాడు. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్పై శతకంతో అలరించిన ఆయన అర్ధశతకం నమోదు చేయగానే ‘పుష్ప’ స్టైల్లో నితీశ్ స్వాగ్ చూపించాడు. దీంతో స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు. వెస్టిండీస్ ఆల్రౌండర్ డీజే బ్రావో, పాండ్యా,నజ్ముల్ ఇస్లాం,శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ ఇలా ఎందరో పుష్పగాడి స్వాగ్కు ఫ్యాన్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
IPL 2025: సీఎస్కే ప్రకటన.. అసిస్టెంట్ కోచ్గా మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక నియామకం చేపట్టింది. తమిళనాడు మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్(Sridharan Sriram)ను తమ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా సీఎస్కేకు పేరుంది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన చెన్నై జట్టుకు.. గతేడాది కొత్త కెప్టెన్ వచ్చాడు. మహారాష్ట్ర ఆటగాడు, టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ధోని వారసుడిగా పగ్గాలు చేపట్టాడు.గతేడాది ఐదో స్థానంలోఅయితే, ఐపీఎల్-2024లో పద్నాలుగు మ్యాచ్లకు గానూ ఏడు గెలిచిన రుతుసేన నెట్రన్ రేటు తక్కువగా ఉన్న కారణంగా ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. పదిజట్లున్న ఈ క్యాష్ రిచ్ లీగ్లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు జట్టును ప్రక్షాళన చేసిన సీఎస్కే యాజమాన్యం సరికొత్త వ్యూహాలతో ఈ సీజన్లో ముందుకు రానుంది.ఈ క్రమంలో తమ సహాయక సిబ్బందిలోకి శ్రీధరన్ శ్రీరామ్ను కూడా చేర్చుకోవడం గమనార్హం. కాగా సీఎస్కే హెడ్కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉండగా.. ఎరిక్ సిమ్మన్స్ బౌలింగ్ కోచ్గా సేవలు అందిస్తున్నాడు. ఇప్పుడు అతడికి అసిస్టెంట్గా శ్రీధరన్ శ్రీరామ్ కూడా సీఎస్కే కోచింగ్ స్టాఫ్లో చేరాడు.కాగా తమిళనాడుకు చెందిన శ్రీధరన్ ఎనిమిది వన్డేలు ఆడి 81 పరుగులు చేయడంతో పాటు.. తొమ్మిది వికెట్లు కూడా తీశాడు. ఆటగాడిగా తన ప్రయాణం ముగిసిన తర్వాత ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచింగ్ విభాగంలో పనిచేశాడు. రెండేళ్ల పాటు కంగారూ టీమ్ స్పిన్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. బంగ్లాదేశ్ జట్టుకు కూడా సేవలు అందించాడు.ఇక గతేడాది లక్నో సూపర్ జెయింట్స్కు అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించిన శ్రీధరన్ తాజాగా సీఎస్కేలో చేరాడు. ఈ విషయం గురించి.. ‘‘మా అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్కు స్వాగతం. చెపాక్ స్టేడియం నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లకు కోచ్గా ఎదిగిన ఆయన ప్రయాణం మాకు గర్వకారణం’’ అని సీఎస్కే తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టురుతురాజ్ (రూ. 18 కోట్లు) జడేజా (రూ. 18 కోట్లు) పతిరణ (రూ. 13 కోట్లు) శివమ్ దూబే (రూ. 12 కోట్లు) ధోని (రూ. 4 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) ఆర్. అశి్వన్ (రూ. 9.75 కోట్లు) కాన్వే (రూ. 6.25 కోట్లు) ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు) రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) అన్షుల్ కంబోజ్ (రూ.3.40 కోట్లు) స్యామ్ కరన్ (రూ. 2.40 కోట్లు) గుర్జప్నీత్ సింగ్ (రూ. 2.20 కోట్లు) నాథన్ ఎలిస్ (రూ. 2 కోట్లు) దీపక్ హుడా (రూ.1.70 కోట్లు) జేమీ ఓవర్టన్ (రూ.1.50 కోట్లు) విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు) వంశ్ బేడీ (రూ. 55 లక్షలు) ముకేశ్ చౌదరీ (రూ. 30 లక్షలు) షేక్ రషీద్ (రూ. 30 లక్షలు) అండ్రి సిద్ధార్థ్ (రూ. 30 లక్షలు) కమలేశ్ నాగర్కోటి (రూ. 30 లక్షలు) రామకృష్ణ ఘోష్ (రూ. 30 లక్షలు) శ్రేయస్ గోపాల్ (రూ.30 లక్షలు).చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్ -
ధోని శిష్యుడి విధ్వంసం.. 20 సిక్స్లతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
బీసీసీఐ పురుషుల అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్ సమీర్ రిజ్వీ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా శనివారం త్రిపురతో జరిగిన మ్యాచ్లో సమీర్ రిజ్వీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను రిజ్వీ ఊచకోత కోశాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు.రిజ్వీ కేవలం 97 బంతుల్లో 13 ఫోర్లు, 20 సిక్సర్లతో 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీతో పాటు... శౌర్య సింగ్ (51; 9 ఫోర్లు, 1 సిక్స్), ఆదర్శ్ సింగ్ (52) హాఫ్సెంచరీలతో రాణించారు.అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన త్రిపుర జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 253 పరుగులకు పరిమితమైంది. ఆనంద్ (68), తన్మయ్ దాస్ (48) పోరాడినా లాభం లేకపోయింది. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో కునాల్ త్యాగీ 3, విజయ్ కుమార్, వన్ష్ చౌదరి చెరో రెండు వికెట్లు తీశారు.రిజ్వీ అరుదైన ఘనత..కాగా ఈ మ్యాచ్లో ద్విశతకంతో మెరిసిన సమీర్ రిజ్వీ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అండర్ 23 స్టేట్-ఎ ట్రోఫీ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ఆటగాడిగా రిజ్వీ నిలిచాడు. అయితే ఈ టోర్నీలో రిజ్వీ చేసిన డబుల్ సెంచరీ లిస్ట్-ఎ క్రికెట్ కిందకి రాదు. లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ప్రస్తుతం న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బోవ్స్ పేరిట ఉంది. కివీస్ దేశీవాళీ టోర్నీ ఫోర్డ్ ట్రోఫీలో బోవ్స్ కేవలం 103 బంతుల్లో ద్విశతకం సాధించాడు.చెన్నై టూ ఢిల్లీ.. ఐపీఎల్-2025 మెగా వేలంలో రిజ్వీని రూ. 95 లక్షలకకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు రిజ్వీ ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2024 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ సమీర్ రిజ్వీని 8.4 కోట్ల భారీ ధరకు అతడిని కొనుగోలు చేసింది. సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోనితో కలిసి ఆడాడు. అతడి సూచనలు మెరకు ఒకట్రెండు మ్యాచ్ల్లో పర్వాలేదన్పించిన రిజ్వీ.. తర్వాతి మ్యాచ్ల్లో నిరాశపరిచాడు. ఐదు మ్యాచుల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. 2️⃣0️⃣1️⃣* runs9️⃣7️⃣ balls2️⃣0️⃣ Sixes1️⃣3️⃣ foursWatch 🎥 highlights of Uttar Pradesh captain Sameer Rizvi's record-breaking fastest double century in Men's U23 State A Trophy, against Arunachal Pradesh in Vadodara 🔥#U23StateATrophy | @IDFCFIRSTBank pic.twitter.com/WiNI57Tii6— BCCI Domestic (@BCCIdomestic) December 21, 2024 -
'ధోని లాంటి కెప్టెన్ను నేను ఎప్పుడూ చూడలేదు.. అతడొక లెజెండ్'
మహేంద్ర సింగ్ ధోని.. భారత అభిమానులందరూ ఆరాధించే క్రికెటర్లలో ఒకడు. అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికి నాలుగేళ్లు అవుతున్నప్పటికి.. ఈ టీమిండియా లెజెండ్పై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు. ఏడాదికి ఓ సారి ఐపీఎల్లో ఆడే తలైవా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటారు.ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ అలరించేందుకు మిస్టర్ కూల్ సిద్దమయ్యాడు. ఐపీఎల్-2025లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో ధోనిపై లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని అద్బుతమైన కెప్టెన్ అని, అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాని గోయోంకా తెలిపాడు."భారత క్రికెట్ చరిత్రలో ధోని పేరు నిలిచిపోతుంది. ధోని లాంటి నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు. అతడి ఆలోచిన విధానం, పరిపక్వత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతి చిన్న వయస్సులోనే ఎంఎస్ తనను తను తీర్చుదిద్దుకున్న విధానం నిజంగా అద్బుతం.ధోని తన అనుభవంతో ఎంతో మంది యువ క్రికెటర్లను సైతం తీర్చిదిద్దాడు. మతీషా పతిరానానే ఉదాహరణగా తీసుకుండి. పతిరానాను ధోని ఏకంగా మ్యాచ్ విన్నర్గా తాయారు చేశాడు. తన ఆటగాళ్లను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ధోనికి బాగా తెలుసు.ధోనిని కలిసిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. ఓసారి లక్నో, చెన్నై మ్యాచ్ సందర్భంగా నేను ధోనిని కలిశాను. నాతో 11 ఏళ్ల నా మనవడు కూడా ఉన్నాడు. అతడికి క్రికెట్ అంటే పిచ్చి. ఐదారేళ్ల కిందట ధోనినే నా మనవడికి క్రికెట్ ఆడటం నేర్పించాడు.ఈ సందర్భంగా అతడు ధోనికి కంటిన్యూగా ఏవో ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అందుకు ధోని విసుగు చెందకుండా సమాధానాలు చెబుతూ వచ్చాడు. చివరికి నేనే ధోని దగ్గరకు వెళ్లి అతడిని విడిచిపెట్టేయండి అని చెప్పా. కానీ ధోని మాత్రం నా మనవుడితో సంభాషణను ఆస్వాదిస్తున్నాను చెప్పాడు.దాదాపు అరగంట పాటు అతడితో ముచ్చటించాడు. ఒక పిల్లవాడి కోసం అంత సమయం వెచ్చించిన ధోని నిజంగా గొప్పవాడు. అతడి క్యారక్టెర్ ఇతరులతో మనం ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. అందుకే అతడు ధోని అయ్యాడు. అతడు ఎప్పుడు లక్నోతో మ్యాచ్ ఆడినా, స్టేడియం మొత్తం ఎంఎస్కి సపోర్ట్గా పసుపు రంగు జెర్సీలతో నిండిపోతుంది" అని టీఆర్ఎస్ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయెంకా పేర్కొన్నాడు.చదవండి: యశస్వి జైస్వాల్పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’
‘‘లేదు.. నేను ధోనితో మాట్లాడటం లేదు. చెన్నై సూపర్ కింగ్స్కు ఆడినపుడు.. అప్పుడప్పుడు ఆట గురించి మాట్లాడుకునేవాళ్లం. అయితే, ధోనితో మనసు విప్పి మాట్లాడి పదేళ్లకు పైగానే అయింది. ఇందుకు నా దగ్గర ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు.ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదుబహుశా ధోని దగ్గర రీజన్ ఉండవచ్చు. అయితే, ఆ కారణం ఏమిటో నాకు మాత్రం తెలియదు. సీఎస్కేతో ఉన్నపుడు కూడా మైదానంలో మాత్రం అప్పుడప్పుడు మాట్లాడేవాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదు. నేను కూడా అతడి గదికి వెళ్లేవాడిని కాదు.ధోని పట్ల నాకెలాంటి వ్యతిరేక భావం లేదు. కానీ అతడికి నా మీద ఏదైనా కోపం ఉందేమో! ఒకవేళ అదే నిజమైతే అతడు ఆ విషయం గురించి నాతో మాట్లాడవచ్చు. నేనెప్పుడూ అతడికి కనీసం కాల్ కూడా చేయలేదు. ఎందుకంటే.. నేను ఫోన్ చేసినపుడు లిఫ్ట్ చేసి మాట్లాడితేనే మరోసారి ఫోన్ చేయాలనిపిస్తుంది.అలాంటి వాళ్లతో నేనెందుకు మాట్లాడాలి?లేదంటే.. అటువంటి వాళ్లను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే బంధం అనేది రెండువైపులా ఉండాలి. మనం ఎదుటివారికి గౌరవం ఇస్తేనే.. మనకు కూడా గౌరవం దక్కుతుంది. నేను రెండుసార్లు ఫోన్ చేసినా.. అటువైపు నుంచి స్పందన లేకపోతే.. నేనెందుకు అలాంటి వ్యక్తితో మాట్లాడతా!’’ అంటూ టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన మహేంద్ర సింగ్ ధోనితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. తామిద్దరి మధ్య మాటలులేక దశాబ్దకాలం గడిచిందన్నాడు భజ్జీ. తాను మాట్లాడేందుకు ప్రయత్నించినా ధోని నుంచి స్పందన లేకపోవడంతో తాను కూడా అతడికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు భజ్జీ తెలిపాడు.అదంతా నిజమేకాగా ధోని- భజ్జీ మధ్య విభేదాలున్నాయంటూ గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా క్రికెట్నెక్స్ట్తో మాట్లాడిన హర్భజన్ సింగ్ అదంతా నిజమేనని ధ్రువీకరించాడు. కాగా 2007లో ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో.. అదే విధంగా.. ధోని కెప్టెన్సీలోనే 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన టీమిండియాలోనూ హర్భజన్ సింగ్ సభ్యుడు. అంతేకాదు.. 2018 నుంచి 2020 వరకు ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున భజ్జీ ఆడటం గమనార్హం. అయితే, వీరిద్దరి బంధం బీటలు వారడానికి గల కారణంపై మాత్రం స్పష్టత లేదు. చదవండి: Asia Cup 2024: టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీ ఫైనల్లో భారత్ -
అప్పుడు రూ. 10 కోట్లు.. ఇప్పుడు అన్సోల్డ్.. నా హృదయం ముక్కలైంది!
సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ మెగా వేలం-2025 సోమవారం ముగిసింది. ఇందులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ ఆల్టైమ్ రికార్డు సృష్టించాడు.ఈసారి అతడు అన్సోల్డ్అదే విధంగా శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు- పంజాబ్ కింగ్స్), వెంకటేశ్ అయ్యర్(రూ. 23.75 కోట్లు- కోల్కతా నైట్ రైడర్స్) కూడా భారీ ధర పలికారు. అయితే, కొంతమంది టీమిండియా క్రికెటర్లను మాత్రం ఫ్రాంఛైజీలు అస్సలు పట్టించుకోలేదు. అందులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఒకడు. అతడు ఈసారి అన్సోల్డ్గా మిగిలిపోయాడు.ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ శార్దూల్ కోసం కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం తనను విస్మయపరిచిందన్నాడు. ‘‘లార్డ్ ఠాకూర్ పేరు రానేలేదు. క్రికెట్, క్రికెటేతర కారణాలు ఏవైనా కావచ్చు. అతడు రెండుసార్లు అందుబాటులోకి వచ్చాడు. అయినప్పటికీ ఒక్కరు కూడా ఆసక్తి చూపించలేదు.సీఎస్కే అందరి కోసం ట్రై చేసిందితాము వదిలేసిన ఫాస్ట్ బౌలర్లలో శార్దూల్ మినహా అందరినీ.. తిరిగి దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించింది. అతడిని మాత్రం వదిలేసింది. శార్దూల్ అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 2020-21 భాగంగా గాబా టెస్టులో అతడి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా గెలిచిన తర్వాత.. వేలంలో ఏకంగా రూ. 10 కోట్లు వచ్చాయి. కానీ.. ఈసారి రూ. 2 కోట్లకు అందుబాటులో ఉన్నా ఎవరూ కనీసం పట్టించుకోలేదు. నిజంగా అతడి పరిస్థితిని చూసి నా హృదయం ముక్కలైంది’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇప్పటి వరకు 95 మ్యాచ్లుకాగా 2015లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ముంబై ఆటగాడు శార్దూల్ ఠాకూర్.. ఈ ఏడాది చెన్నైకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే, వేలానికి ముందు అతడిని వదిలేసిన సీఎస్కే.. వేలం సందర్భంగా మొత్తానికే గుడ్బై చెప్పింది. ఇక శార్దూల్ ఠాకూర్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 95 మ్యాచ్లు ఆడి 307 రన్స్ చేయడంతో పాటు.. 94 వికెట్లు పడగొట్టాడు.చదవండి: వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్గా అతడే!? -
17 ఏళ్ల యువ సంచలనంపై కన్నేసిన సీఎస్కే.. రుతురాజ్ జోడీగా?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి సమయం అసన్నమవుతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ మెగా వేలంలో ముంబై యువ ఆటగాడు ఆయుష్ మహాత్రేపై 5 సార్లు ఛాపింయన్ చెన్నై సూపర్ కింగ్స్ కన్నేసినట్లు తెలుస్తోంది.మెగా వేలానికి ముందు మహాత్రేని సెలక్షన్ ట్రయల్ కోసం సీఎస్కే పిలిచినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. మహాత్రే సీఎస్కే టాలెంట్ స్కౌట్లతో పాటు మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని దృష్టిని కూడా ఆకర్షించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే అతడికి ఈ నెలఖారులో హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో సెలక్షన్ ట్రయల్కు హాజరు అవ్వమని సీఎస్కే పిలుపునిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 17 ఏళ్ల మహాత్రే ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ముంబై తరపున ఆడుతున్నాడు.ఈ టోర్నీలో భాగంగా ముంబై బుధవారం ప్రారంభం కానున్న తమ ఐదవ-రౌండ్ మ్యాచ్లో సర్వీసెస్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే మహాత్రేని సీఎస్కే సెలక్షన్ ట్రయల్కు హాజరు కానున్నాడు. ఆ తర్వాత నవంబర్ 23న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకు ఈ యువ ఓపెనర్ ప్రాతినిథ్యం వహించనున్నాడు.ఇరానీ కప్తో అరంగేట్రం..మహాత్రే ఈ ఏడాది అక్టోబర్లో ఇరానీ కప్లో లక్నో వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు (తొమ్మిది ఇన్నింగ్స్లు) ఆడిన అతను 35.66 సగటుతో 321 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే మహాత్రేకి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడిని వేలంలో సొంతం చేసుకుని రుతురాజ్ గైక్వాడ్తో పాటు ఓపెనర్గా పంపాలని సీఎస్కే యోచిస్తుందంట.చదవండి: BGT: పంత్ కాదు!.. అతడే ‘కొత్త రాజు’ అంటున్న ఆస్ట్రేలియా మీడియా! -
మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నాను..! ఆ ఫ్రాంఛైజీ కొనే ఛాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో ఆడాలని తాను పట్టుదలతో ఉన్నట్లు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తెలిపాడు. ఇప్పటికీ తనలో క్రికెట్ ఆడగల సత్తా ఉందని.. అందుకే మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు వెల్లడించాడు. కాగా నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.సౌదీ అరేబియాలోని జిద్దా నగరాన్ని బీసీసీఐ వేలంపాటకు వేదికగా ఎంచుకుంది. ఈ క్రమంలో 1574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో ఇంగ్లండ్ లెజెండరీ బౌలర్ ఆండర్సన్ కూడా ఉన్నాడు. అయితే, అతడు 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరఅయినప్పటికీ.. 42 ఏళ్ల ఆండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరతో తన పేరును వేలంలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ విషయం గురించి తాజాగా స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘నాలో క్రికెట్ ఆడగల సత్తా మిగిలే ఉంది. నేను వేలంలోకి రావడానికి ప్రధాన కారణం అదే.నన్ను ఎవరైనా కొనుక్కుంటారా? లేదా? అన్న అంశంతో నాకు అవసరం లేదు. నాకైతే తిరిగి మళ్లీ క్రికెట్ ఆడాలని ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఏ ఫార్మాట్లో ఆడేందుకైనా నేను సిద్ధంగా ఉన్నా’’ అని ఆండర్సన్ పేర్కొన్నాడు. అయితే, ఇప్పటి వరకు తన ఏ ఫ్రాంఛైజీ ఆశ్రయించలేదని.. అయినా తాను ఏదో ఒక జట్టుకు ఆడాతననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టెస్టుల్లో 704 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు సాధించిన పేసర్గా కొనసాగుతున్న ఆండర్సన్.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆ ఫ్రాంఛైజీ కొనే ఛాన్స్!ఆ తర్వాత వెంటనే ఇంగ్లండ్ టెస్టు జట్టు మెంటార్గా కొత్త అవతారమెత్తాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఆండర్సన్ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వెస్టిండీస్ దిగ్గజం, ఆ జట్టును వీడిన బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో స్థానంలో ఆండర్సన్ సేవలను ఉపయోగించుకునే దిశగా చెన్నై అడుగులు వేయవచ్చు.చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్గా అతడే! -
ఐపీఎల్-2025కు స్టార్ ప్లేయర్ దూరం.. కారణమిదేనా?
ఐపీఎల్-2025 సీజన్కు ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో తన పేరును నమోదు చేయకూడదని స్టోక్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది బిజీ టెస్టు షెడ్యూల్ కారణంగా స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది. టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం.. వచ్చే ఏడాది క్యాష్రిచ్ లీగ్ సీజన్ వేలానికి స్టోక్స్తో పాటు మరికొంతమంది ఇంగ్లీష్ ఆటగాళ్లు సైతం దూరంగా ఉండనున్నట్లు సమాచారం. కాగా స్టోక్సీ చివరగా ఐపీఎల్-2023 సీజన్లో ఆడాడు. సీఎస్కే అతడిని రూ.16.25 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసింది. కానీ తన ధరకు తగ్గ న్యాయం స్టోక్స్ చేయలేకపోయాడు. కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన స్టోక్స్ గాయం కారణంగా మిగిలిన సీజన్ మొత్తానికి బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్-2024 సీజన్కు ముందు స్టోక్సీను చెన్నై ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. ఐపీఎల్-2024 వేలంలోనూ ఈ ఇంగ్లీష్ క్రికెటర్ వ్యక్తిగత కారణాలతో పాల్గోలేదు. ఇప్పుడు ఐపీఎల్-2025 మెగా వేలం కూడా దూరం కానున్నాడు.రేపే లాస్ట్.. ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు గడువు ఆదివారం(నవంబర్ 3)తో ముగియనుంది. అయితే వచ్చే ఏడాది సీజన్ వేలానికి ముందు బీసీసీఐ రూల్స్ను మరింత కఠినం చేసిన సంగతి తెలిసిందే. ఒక్కసారి వేలంలో ఏదైనా జట్టు ఆటగాడిని తీసుకుంటే కనీసం మూడేళ్లపాటు ఉండాల్సిందేనని షరతు విధించింది. దీంతో చాలా మంది ఆటగాళ్లు విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవాల వద్ద అన్న సందిగ్ధంలో పడ్డారు. కాగా మెగా వేలం నవంబర్ ఆఖరిలో సౌథీ అరేబియా వేదికగా జరిగే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి -
IPL 2025: సీఎస్కే సంచలన నిర్ణయం!
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజాను వేలంలోకి విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని నిశ్చయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆ ముగ్గురిని రిటైన్ చేసుకుని...కాగా తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు ఫ్రాంఛైజీలకు గురువారం వరకే గడువు ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో పాటు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా అట్టిపెట్టుకోనుందట.ధోని వారసుడి కోసంఅయితే, లెజెండరీ వికెట్ కీపర్ ధోనికి సరైన వారసుడిని ఎంపిక చేసే క్రమంలో జడేజా విషయంలో రిస్క్ తీసుకునేందుకు సీఎస్కే సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్తో రిషభ్ పంత్ తెగదెంపులు చేసుకున్నాడన్న వార్తల నేపథ్యంలో.. అతడు వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే ఎలా?ఒకవేళ అదే జరిగితే పంత్ భారీ ధర పలకడం ఖాయం. అతడి ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నల నేపథ్యంలో సీఎస్కే తన రిటెన్షన్ లిస్టు మార్పుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పంత్ కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైన సీఎస్కే.. రవీంద్ర జడేజాను వేలంలోకి వదిలి.. రైట్ టు మ్యాచ్(RTM) కార్డు ద్వారా అతడిని మళ్లీ సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.వరల్డ్ కప్ విన్నర్.. కానీకాగా జడ్డూ ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత అతడు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. అంతేకాదు ఇటీవలి కాలంలో అతడి టీ20 గణాంకాలు ముఖ్యంగా బ్యాటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీంతో జడ్డూను విడిచిపెట్టినా.. మళ్లీ ఆర్టీఎమ్ కార్డుతో కొనవచ్చని సీఎస్కే భావిస్తోందట.అంటే.. జడ్డూకి డిమాండ్ లేకపోతే.. వేరే ఫ్రాంఛైజీ అతడిని తక్కువ ధరకు కొన్నట్లయితే.. అంతే మొత్తం చెల్లించి అతడిని తిరిగి తాము సొంతం చేసుకునేందుకు ఆర్టీఎమ్ కార్డును వాడుకోనుందన్న మాట. అలా కాకుండా ఒకవేళ జడ్డూను రిటైన్ చేసుకుంటే అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది.అందుకే రిలీజ్ చేయాలనే యోచనలోఅలా అయితే, వేలంలో పంత్ను కొనుక్కునేందుకు తగినంత సొమ్ము ఉండకపోవచ్చు. అందుకే పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని సీఎస్కే నిర్ణయించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తమ రిటెన్షన్లో భాగంగా రుతుకు రూ. 18 కోట్లు, పతిరణకు రూ. 14 కోట్లు, ధోనికి రూ. 4 కోట్లు చెన్నై ఫ్రాంఛైజీ చెల్లించనుందట!! కెప్టెన్గా నియమించినా..కాగా జడ్డూకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. జట్టును చాంపియన్గా నిలపడంలో అతడి పాత్ర కీలకం. కాగా 2012లో జట్టులో చేరిన జడ్డూ.. తర్వాత గుజరాత్ లయన్స్కు ఆడాడు. అనంతరం మళ్లీ 2018లో చెన్నైతో జట్టు కట్టిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇప్పటికీ అదే టీమ్లో ఉన్నాడు. అయితే, 2022లో కెప్టెన్గా అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో జడ్డూ 240 మ్యాచ్లు ఆడి 2959 రన్స్ చేయడంతో పాటు 160 వికెట్లు తీశాడు.చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం -
‘నీకు క్రికెట్ రూల్స్ తెలియవు.. నేను చెప్పినట్టే జరుగుతుంది’
ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఒకడు. భారత్కు మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ జార్ఖండ్ డైనమైట్ హయాంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్లు వెలుగులోకి వచ్చారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ను ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత ధోని సొంతం.అలాంటి ఈ లెజెండరీ ఆటగాడికే క్రికెట్ రూల్స్ తెలియవట!.. ఈ మాట అన్నది మరెవరో కాదు.. ధోని సతీమణి సాక్షి. ‘నీకు రూల్స్ తెలియవు.. నేను చెప్పినట్లే జరుగుతుంది’ అని భర్తకే పాఠాలు చెప్పినంత పనిచేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ధోనినే వెల్లడించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..?!బౌలర్ వైడ్ బాల్ వేశాడు‘‘ఓరోజు నేను, సాక్షి కలిసి ఇంట్లో వన్డే మ్యాచ్ చూస్తున్నాం. సాధారణంగా ఇద్దరం కలిసి టీవీ చూస్తున్నపుడు మేము క్రికెట్ గురించి మాట్లాడుకోము. అయితే, ఆరోజు మ్యాచ్లో.. బౌలర్ వైడ్ బాల్ వేశాడు. బ్యాటర్ మాత్రం షాట్ ఆడేందుకు ముందుకు రాగా.. వికెట్ కీపర్ బంతిని అందుకుని స్టంపౌట్ చేశాడు. అయితే, నా భార్య మాత్రం అతడు అవుట్కాలేదనే అంటోంది.అప్పటికు ఆ బ్యాటర్ పెవిలియన్ వైపు వెళ్లిపోతున్నాడు. అయినా సరే.. అంపైర్లు అతడిని వెనక్కి పిలిపిస్తారని.. వైడ్ బాల్లో స్టంపౌట్ పరిగణనలోకి తీసుకోరని వాదిస్తోంది. అప్పుడు నేను.. వైడ్బాల్కి స్టంపౌట్ అయినా అవుటైనట్లేనని.. కేవలం నో బాల్ వేసినపుడు మాత్రమే బ్యాటర్ స్టంపౌట్ కాడని చెప్పాను. అయినా సరే తను వినలేదు.నీకు క్రికెట్ గురించి తెలియదు.. ఊరుకో అంటూ నన్ను కసిరింది. థర్డ్ అంపైర్ నిర్ణయం తర్వాత సదరు బ్యాటర్ వెనక్కి వస్తాడు చూడంటూ చెబుతూనే ఉంది. అయితే, అప్పటికే ఆ బ్యాటర్ బౌండరీ లైన్ దాటి వెళ్లిపోవడం.. కొత్త బ్యాటర్ రావడం జరిగింది. ఏదో తప్పు జరిగిందిఅప్పుడు కూడా సాక్షి.. ‘ఏదో తప్పు జరిగింది’ అంటూ తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేసింది’’ అంటూ ధోని ఓ ఈవెంట్లో చెప్పాడు. తన భార్యతో జరిగిన సరదా సంభాషణను ప్రేక్షకులతో పంచుకుని నవ్వులు పూయించాడు. అదీ సంగతి!! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ధోని ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన ఒంట్లో శక్తి ఉన్నన్ని రోజు ఆడుతూనే ఉంటానని 43 ఏళ్ల తలా అభిమానులకు శుభవార్త అందించాడు.చదవండి: శతక్కొట్టిన కృనాల్ పాండ్యా.. ‘మా అన్న’ అంటూ హార్దిక్ పోస్ట్ వైరల్ -
'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే'
ఐపీఎల్-2025కు సంబంధించిన ఆటగాళ్ల రిటైన్షన్స్ జాబితాను సమర్పించేందుకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్ 31 సాయంత్రం ఐదు గంటల లోపు ఆయా ఫ్రాంచైజీలు వాళ్లు అట్టిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్ను బీసీసీఐకు అందజేయాల్సి ఉంది.అయితే ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు లిస్ట్ను ఖారారు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్రాంచైజీలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ను మెగా వేలంలోకి విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పంత్ కూడా ఇటీవలే చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. ఐపీఎల్ వేలంలోకి వస్తే నేను అమ్ముడుపోతానా లేదా? ఒకవేళ తీసుకుంటే ఎంతకు అమ్ముడవుతాను’’ అని ఎక్స్లో పంత్ పోస్టు చేశాడు. దీంతో పంత్ ఢిల్లీని వీడేందుకు సిద్దమయ్యాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఇదే విషయంపై న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు."రిషబ్ పంత్ వేలంలోకి వస్తే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే. చెన్నై సూపర్ కింగ్స్ అతడి కోసం ఎన్ని కోట్లనైనా వెచ్చిస్తోంది. పంత్ను మనం ఎల్లో జెర్సీలో చూడబోతున్నాం. అదే విధంగా ధోని ఒక్క ఈ సీజన్లో ఆడే అవకాశముంది.ఆ తర్వాత ధోని నుంచి వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ స్వీకరిస్తాడు అని సైమన్ డౌల్ జోస్యం చెప్పాడు. కాగా ఎప్పటి నుంచో సీఎస్కేలోకి పంత్ వెళ్లనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఏదమైనప్పటికి పంత్ ఢిల్లీలో కొనసాగుతాడా లేదా తెలియాలంటే అక్టోబర్ 31 వరకు వేచి ఉండాల్సిందే.చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్కోచ్ ఘాటు విమర్శలు -
IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల (అక్టోబరు) 31 నాటికి.. అట్టిపెట్టకునే ఆటగాళ్ల తుదిజాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) రిటెన్షన్స్కు సంబంధించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.కాగా ఐపీఎల్ పాలక మండలి రిటెన్షన్ విధానంలో భాగంగా కొత్త నిబంధనలు తెచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఫ్రాంఛైజీలు గరిష్టంగా ఆరుగురు(ఆర్టీఎమ్) ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో రిటెన్షన్ స్లాబ్లో మొదటి ఆటగాడికిరూ. 18 కోట్లు, రెండో ప్లేయర్కు రూ. 14 కోట్లు, మూడో క్రికెటర్కు రూ. 18 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 14 కోట్లు, ఐదో ఆటగాడికి రూ. 11 కోట్లు, ఆరో ఆటగాడికి రూ. 4 కోట్లు(అన్క్యాప్డ్) చెల్లించాల్సి ఉంటుంది.సీఎస్కే రిటైన్ చేసుకునేది వీరినే? ఎవరికి ఎన్ని కోట్లుఇక తాజా సమాచారం ప్రకారం సీఎస్కే తమ టాప్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్లతో పాటు రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇందులో ధోనిని అన్క్యాప్డ్ కోటాలో ఎంపిక చేసుకుని రూ. 4 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన ఫ్రాంఛైజీ.. రుతుతో పాటు జడ్డూకు రూ. 18 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.. రుతురాజ్నే కెప్టెన్గా కొనసాగించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 2008లో ఐపీఎల్ ఆరంభమైన నాటి నుంచి ధోని చెన్నై ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. జట్టును అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపి ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్గా రికార్డులకెక్కాడు. అయితే, గతేడాది సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన ధోని ఆటగాడిగా కొనసాగాడు.సీఎస్కే అంటే ధోనినిజానికి ధోని అంటే సీఎస్కే.. సీఎస్కే అంటే ధోని. ధోని బ్రాండ్ వల్లే చెన్నై ఫ్రాంఛైజీకి ఆదరణ పెరుగిందనేద కాదనలేని వాస్తవం. అంతేకాదు.. వేలం మొదలు కెప్టెన్సీ వరకు ధోని ఆజ్ఞ లేనిదే అక్కడ ఏ పని జరగదని సన్నిహిత వర్గాలు అంటాయి. మరి అలాంటి ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా ఎలా? అంటే.. బీసీసీఐ నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత ఆటగాళ్లను ఫ్రాంఛైజీలో ఈ కోటాలో వేసుకోవచ్చు.PC: BCCIఇద్దరు శిష్యులుచెన్నైకి రుతుతో పాటు జడేజా కూడా ముఖ్యం కాబట్టి వాళ్లిద్దరికి రూ. 18 కోట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. కాగా రుతురాజ 2019లో సీఎస్కేలో చేరాడు. 2020లో అరంగేట్రం చేసిన అతడు ఆ మరుసటి ఏడాదే ఆరెంజ్క్యాప్ హోల్డర్ అయ్యాడు. ఆసియా క్రీడలు-2023లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించి గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత.. ఈఏడాది సీఎస్కే పగ్గాలు చేపట్టాడు.ఇక రవీంద్ర జడేజాకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2022లో కెప్టెన్గానూ నియమితుడయ్యాడు. కానీ వరుస ఓటముల నేపథ్యంలో మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. ఈ ఇద్దరికి వరుస అవకాశాలు ఇచ్చి జట్టులో కీలక సభ్యులుగా నిలబెట్టింది మాత్రం ధోనినే!చదవండి: Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన -
ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం
మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్. అతడి సారథ్యంలో భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచింది. ఇక ఫ్రాంఛైజీ క్రికెట్లోనూ ఈ జార్ఖండ్ డైనమైట్.. 2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆది నుంచి చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు ఆడుతున్నాడు. సారథిగా సీఎస్కేను ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్గా నిలిపాడు. మరోవైపు.. రోహిత శర్మ.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్. ఇటీవలే టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు సుదీర్ఘకాలం పాటు కెప్టెన్గా ఉండి.. ధోని కంటే ముందుగానే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సారథిగా చరిత్రకెక్కాడు.ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్కాగా టీమిండియాలో ఇద్దరితో కలిసి, ఐపీఎల్లో ఈ ఇద్దరి కెప్టెన్సీలోనూ ఆడాడు టీమిండియా దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఈ నేపథ్యంలో ఇద్దరి నాయకత్వ శైలిని పోలుస్తూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్ అని తన మనసులోని మాట బయటపెట్టాడు. అందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ..ధోని ఎవరితో మాట్లాడడు‘‘ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే.. నేను ధోనిని కాదని రోహిత్ వైపే మొగ్గుచూపుతాను. ఎందుంకటే రోహిత్ ప్లేయర్స్ కెప్టెన్. ప్రతి ఒక్క ఆటగాడి దగ్గరికి వెళ్లి వాళ్లకు ఏం కావాలో అడిగి తెలుసుకుంటాడు. సహచరులతో అతడికి మంచి అనుబంధం ఉంటుంది.అయితే, ధోని కెప్టెన్సీ స్టైల్ వేరుగా ఉంటుంది. అతడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. తన మౌనం ద్వారానే ఎదుటివారికి తన మనసులోని మాట చేరాలని భావిస్తాడు. ఇతరులతో ధోని సంభాషించే విధానం ఇలాగే ఉంటుంది’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మకు స్నేహితులే తప్ప.. అతడికి విరుద్ధంగా మాట్లాడేవారు ఒక్కరూ ఉండరని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. స్పోర్ట్స్ యారీ ఇంటర్వ్యూలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం..Rohit Sharma is a better captain than MS Dhoni says Harbhajan Singh Full podcast at 9pm tonight, only on Sports Yaari YouTube Channel 🇮🇳pic.twitter.com/6tVAdJh6qx— Sushant Mehta (@SushantNMehta) October 2, 2024 -
IPL 2025: ధోని ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..?
ఐపీఎల్-2025లో భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోని ‘అన్క్యాప్డ్’ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో ‘అన్క్యాప్డ్’ ఓల్డ్ పాలసీని తిరిగి తీసుకురావాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగించేందుకు వీలు ఉంటుంది. కాగా గత నెలలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో అన్క్యాప్డ్ పాత విధానాన్ని తిరిగి తీసుకురావాలని సీఎస్కే ప్రతిపాదించింది. కానీ ఇతర ప్రాంఛైజీల నుంచి మాత్రం సీఎస్కేకు మద్దతు లభించలేదు. అయితే మిగితా ఫ్రాంచైజీల నుంచి చెన్నైకు సపోర్ట్ లభించకపోయినప్పటికి.. బీసీసీఐ మాత్రం అన్క్యాప్డ్ రిటర్న్ పాలసీని పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో ధోని మరో ఐపీఎల్ ఆడే సూచనలు కన్పిస్తున్నాయి. మిస్టర్ కూల్ను ఆన్క్యాప్డ్ ప్లేయర్గా సీఎస్కే రిటైన్ చేసుకోనుంది. అయితే అందుకు ధోని మరి ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి.‘అన్క్యాప్డ్’ పాలసీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. గత నెలలో జరిగిన సమావేశంలో ఇదే విషయంపై సుదీర్ఘంగా చర్చజరిగింది. త్వరలోనే ప్లేయర్స్ రిటెన్ష్ రూల్స్తో పాటు ఈ పాలసీ కోసం ప్రకటించే ఛాన్స్ ఉందని బీసీసీఐ మూలాలు వెల్లడించాయి.కాగా ప్రస్తుత రూల్స్ ప్రకారం మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవాలి. అయితే ఈ రిటైన్ చేసే ఆటగాళ్ల సంఖ్యలను పెంచాలని ఆయా ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం అందుకు మొగ్గు చూపడం లేదు. బీసీసీఐ మెగా వేలాన్ని నిర్వహించాలనే పట్టుదలతో ఉంది.అసలేంటి ఈ అన్క్యాప్డ్ పాలసీ?ఐపీఎల్ తొలి సీజన్(2008)లో అన్క్యాప్డ్ పాలసీని నిర్వహకులు తీసుకువచ్చారు. ఈ విధానం ప్రకారం.. గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడనైనా అనక్యాప్డ్ ప్లేయర్గా పరిగణించవచ్చు. కానీ ఈ నియమాన్ని ఫ్రాంచైజీలు పెద్దగా ఉపయోగించకోకపోవడంతో ఐపీఎల్ నిర్వహకులు 2021 సీజన్లో తొలగించారు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ నియమం మళ్లీ అమలులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. -
సూపర్ కింగ్స్లోకి టీ20 వీరుడు.. ప్రకటించిన ఫ్రాంఛైజీ
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ డెవాన్ కాన్వే సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ మరో జట్టులో భాగమయ్యాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 ఎడిషన్లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ జొబర్గ్ సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇందుకు సంబంధించి జట్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.మూడు టీ20 లీగ్లలోకాగా డెవాన్ కాన్వే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా మేజర్ క్రికెట్ లీగ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. తాజాగా జొబర్గ్ టీమ్లోనూ చోటు దక్కించుకున్న కాన్వే.. సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అన్ని టీ20 జట్లకు ఆడుతున్న క్రికెటర్గా నిలిచాడు.కివీస్తో తెగిన బంధంఇక ఫ్రాంఛైజీ క్రికెట్కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును కాన్వే వదులుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కివీస్ బోర్డు గురువారం ధ్రువీకరించింది. మరుసటి రోజే అతడు జొబర్గ్తో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. డెవాన్ కాన్వేతో పాటు ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ సైతం వచ్చే ఏడాది జొబర్గ్కు ప్రాతినిథ్యం వహించబోతున్నారు.పొట్టి ఫార్మాట్ వీరుడుకాగా లెఫ్టాండర్ బ్యాటర్ అయిన డెవాన్ కాన్వే మేజర్ లీగ్ క్రికెట్ తాజా ఎడిషన్ టాప్ రన్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. ఎనిమిది మ్యాచ్లలో కలిపి 143.62 స్ట్రైక్రేటుతో 293 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఓవరాల్గా టీ20 క్రికెట్లో ఈ సౌతాఫ్రికన్- కివీ ఓపెనర్ 187 మ్యాచ్లు ఆడి 6028 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 48 అర్ధ శతకాలు ఉండటం విశేషం.ఇదిలా ఉంటే.. బొటనవేలికి గాయం కారణంగా కాన్వే ఐపీఎల్-2024కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ 2023లో ఆరంభమైంది. అరంగేట్ర సీజన్లో చాంపియన్గా నిలిచిన సన్రైజర్స్ ఈస్టర్న్కేప్.. ఈ ఏడాది కూడా టైటిల్ను నిలబెట్టుకుంది. మరోవైపు.. జొబర్గ్ రెండు సీజన్లలో సెమీస్కు అర్హత సాధించినా.. ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది.చదవండి: ’టీ20 ఫార్మాట్ క్రికెట్ను నాశనం చేస్తోంది.. ఇండియా మాత్రం లక్కీ’ -
అన్క్యాప్డ్ ప్లేయర్గా ధోని?.. కావ్యా మారన్ కామెంట్స్ వైరల్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 మెగా వేలం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) చేసిన ప్రతిపాదనను.. సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. పాత నిబంధనలు మళ్లీ ప్రవేశపెట్టి.. మహేంద్ర సింగ్ ధోని వంటి దిగ్గజాలను అవమానపరచడం సరికాదని ఆమె చెన్నై ఫ్రాంఛైజీకి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి టీమిండియా లెజెండరీ కెప్టెన్ ధోని సీఎస్కేతోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చెన్నైని అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపి.. సీఎస్కేకు పర్యాయపదంగా మారిపోయాడు ఈ మిస్టర్ కూల్. అయితే, ఐపీఎల్-2024లో రుతురాజ్ గైక్వాడ్ను తన వారసుడిగా ఎంపిక చేసుకున్న 43 ఏళ్ల ధోని.. వికెట్ కీపర్ బ్యాటర్గా మాత్రమే జట్టులో కొనసాగాడు. అవసరమైనపుడు రుతుకు సూచనలు, సలహాలు ఇస్తూ జట్టును ముందుకు నడిపించడంలో సహాయపడ్డాడు.నలుగురికే అవకాశం?అయితే, వయసు, ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ధోని వచ్చే ఏడాది ఆటగాడిగా కొనసాగే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జట్టుకు వెన్నెముక అయిన ధోనిని ఇప్పుడే వదులుకునేందుకు సీఎస్కే సిద్ధంగా లేదని.. ధోని కూడా మరో ఏడాది పాటు ఫ్రాంఛైజీతో కొనసాగాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, మెగా వేలం నేపథ్యంలో కేవలం నలుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకునే అవకాశం ఉందన్న వార్తల నడుమ.. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరానా కోసం ధోని తన స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.అదే జరిగితే.. ఒకవేళ ధోని ఇంకా ఐపీఎల్లో ఆటగాడిగా కొనసాగాలనుకుంటే వేలంలోకి రావాల్సి ఉంటుంది. అయితే, సీఎస్కే యాజమాన్యం ఇందుకు ఇష్టపడటం లేదట. ఈ నేపథ్యంలో జూలై 31న భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులతో భేటీ సందర్భంగా ఆసక్తికర చర్చ లేవలెత్తినట్లు సమాచారం. ధోని కోసం పాత రూల్ను తిరిగి తీసుకురావాలని కోరినట్లు సమాచారం.అన్క్యాప్డ్ ప్లేయర్గా ధోనిఇందులో భాగంగా ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా గుర్తించాలని బీసీసీఐకి విన్నవించినట్లు తెలుస్తోంది. కాగా ఓ క్రికెటర్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ ఏళ్లు గడిస్తే అతడిని అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలోకి తీసుకోవచ్చని.. 2008- 2021 వరకు ఐపీఎల్లో నిబంధన ఉండేది. ఈ రూల్ను తిరిగి తీసుకువస్తే.. ధోనిని ఆ విభాగంలో ఆటగాడిగా చేర్చి.. అన్క్యాప్డ్ప్లేయర్గా రిటైన్ చేసుకోవాలని సీఎస్కే తమ అభిప్రాయాన్ని సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది.అలా చేస్తే అవమానించినట్లే ఇందుకు స్పందించిన సన్రైజర్స్ ఓనర్ కావ్యా మారన్.. సీఎస్కే ప్రపోజల్ను తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో ఘనతలు సాధించిన ఆటగాళ్ల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు. ఇలా చేస్తే వారి విలువను తగ్గించినట్లే అవుతుంది. అలా కాదని.. అన్క్యాప్డ్ ప్లేయర్ కోటాలో ఇలాంటి వాళ్లను రిటైన్ చేసుకుంటే వారికి చెల్లించే మొత్తం మిగతా వాళ్లకు వేలంలో లభించే కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి పాత నిబంధనలు తిరిగి తీసుకురావాల్సిన అవసరం లేదు. ధోని ఐపీఎల్-2025 మెగా వేలంలోకి వస్తేనే మంచిది’’ అని కావ్యా మారన్ అన్నట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది. -
IPL 2025: రిషబ్ పంత్కు ఊహించని ఎదురు దెబ్బ.. !?
ఐపీఎల్-2025 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హెడ్కోచ్ రికీ పాంటింగ్పై వేటు వేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు కెప్టెన్ రిషబ్ పంత్ను కూడా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం.. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు పంత్ను రిటైన్ చేసుకోడదని ఢిల్లీ భావిస్తున్నట్లు సమాచారం. పంత్కు ఢిల్లీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మద్దతు ఉన్నప్పటికీ.. ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం అతడిని విడిచి పెట్టే అవకాశముందని దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్లు పేర్కొంది.అదేవిధంగా పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు నుంచి విడుదల చేస్తే.. అతడిని దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడే అవకాశముందని సదరు పత్రిక పేర్కొంది.సీఎస్కే వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని వచ్చే ఏడాది సీజన్లో ఆడుతాడాలేదన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ కావాలని సీఎస్కే ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పంత్ కెప్టెన్సీపై కూడా ఢిల్లీ ఫ్రాంచైజీ ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది సీజన్కు రోడ్డు ప్రమాదం కారణంగా దూరంగా ఉన్న రిషబ్. . ఈ ఏడాది సీజన్తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.అయితే పంత్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటకి.. జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని విడిచిపెట్టాలని ఢిల్లీ నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రిషబ్.. ఐపీఎల్లో ఢిల్లీ తరపున లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. -
రచిన్ రవీంద్రకు బంపరాఫర్
న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్రకు బంపరాఫర్ దక్కింది. కివీస్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో తొలిసారి అతడు చోటు దక్కించుకున్నాడు.గత ఏడాది కాలంగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న రచిన్కు బోర్డు ఈ మేరకు సముచిత స్థానం కల్పించింది. 2024- 25 ఏడాదికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రతిపాదిత జాబితాలోని 20 మంది ఆటగాళ్లలో 24 ఏళ్ల రచిన్కు చోటు ఇచ్చింది.బెంగళూరు మూలాలుభారత్లోని బెంగళూరు మూలాలు ఉన్న రచిన్ రవీంద్ర స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. గతేడాది కివీస్ తరఫున అతడు 578 పరుగులు సాధించాడు. వన్డే వరల్డ్కప్-2023లో అద్భుత ఆట తీరుతో ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.అంతేకాదు.. ఈ ఏడాది మార్చిలో.. ప్రతిష్టాత్మక సర్ రిచర్డ్ హాడ్లీ మెడల్ అందుకున్నాడు. తద్వారా ఈ మెడల్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడుతూ తాజాగా సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు.ఈ సందర్భంగా రచిన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నానని.. ఇంత త్వరగా ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బ్లాక్క్యాప్స్ తరఫున ఆడటం తనకు దక్కిన గొప్ప గౌరవమని.. ఇప్పుడిలా కాంట్రాక్టు దక్కించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. రూ. 1.8 కోట్లుకాగా రచిన్ రవీంద్రతో పాటు బెన్ సియర్స్, విల్ ఓ రూర్కే, జాకోబ్ డఫీలు కూడా తొలిసారి న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు సంపాదించారు.న్యూజిలాండ్ తరఫున ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడిన రచిన్ రవీంద్ర 519 పరుగులు చేశాడు. ఇక 25 వన్డేలు ఆడిన అతడి ఖాతాలో 820 పరుగులు ఉన్నాయి. ఇందులో మూడు సెంచరీలు. కాగా ఐపీఎల్లో రచిన్ చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది వేలంలో రూ. 1.8 కోట్లకు అతడు అమ్ముడుపోయాడు.ఇక 23 టీ20 ఆడిన రచిన్ 231 పరుగులు చేయగలిగాడు. అదే విధంగా.. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో వరుసగా 10, 18, 13 వికెట్లు పడగొట్టాడు. కాగా సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది సంబంధిత క్రికెట్ బోర్డు, క్రికెటర్ల మధ్య కుదిరే వార్షిక ఒప్పందం. అందుకు అనుగుణంగానే ప్లేయర్ల పారితోషికం, సదుపాయాలు ఉంటాయి.న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2024- 25గానూ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా:ఫిన్ అలెన్, టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రాస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ రూర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
ఐపీఎల్ ఫామ్ను కొనసాగించిన రుతురాజ్.. మెరుపు ఇన్నింగ్స్తో విజృంభణ
యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2024 ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు. ఈ లీగ్లో పూణేరీ బప్పాకు సారథ్యం వహిస్తున్న రుతు.. నిన్న (జూన్ 4) కొల్హాపూర్ టస్కర్స్తో జరిగిన మ్యాచ్లో అజేయ అర్దశతకం (35 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. ఫలితంగా పూణేరీ బప్పా 22 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్ తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. రుతు ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనూ పర్వాలేదనిపించాడు. ఈగల్ నాసిక్ టైటాన్స్తో జరిగిన ఆ మ్యాచ్లో 21 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. 2024 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రుతు.. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లోనూ తన జట్టుకు (పూణేరీ బప్పా) నాయకత్వం వహిస్తున్నాడు. అయితే రుతు ఐపీఎల్లోలా ఎంపీఎల్లో ఓపెనర్గా బరిలోకి దిగడం లేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ అతను మిడిలార్డర్లో బరిలోకి దిగాడు.మ్యాచ్ విషయానికోస్తే.. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పూణేరీ బప్పా 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. పూణేరీ ఇన్నింగ్స్లో రుతురాజ్ మినహా ఎవరూ రాణించలేదు. RUTURAJ GAIKWAD SHOW...!!!!- Captain Ruturaj smashed 61*(35) in 14 over game while batting in the middle order in the Maharashtra Premier League. 🔥🌟 pic.twitter.com/dumVXn87br— Johns. (@CricCrazyJohns) June 4, 2024శుభమ్ తైస్వాల్ (10), సూరజ్ షిండే (24), రాహుల్ దేశాయ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కొల్హాపూర్ టస్కర్స్ బౌలర్లలో నిహాల్ తుసామద్ 3 వికెట్లు పడగొట్టగా.. శ్రేయస్ చవాన్ 2, యశ్ కలాద్కర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టస్కర్స్ 14 ఓవర్లు బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. పూణేరీ బౌలర్లు పియుశ్ సాల్వీ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టారు. హర్ష్ సాంగ్వి (38), అంకిత్ పోర్వాల్ (28), అంకిత్ బావ్నే (21) ఓ మోస్తరు పరుగులు చేసినా టస్కర్స్కు ఓటమి తప్పలేదు. కాగా, కొద్ది రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ 2024లో రుతురాజ్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సీజన్లో అతను 14 మ్యాచ్ల్లో సెంచరీ, నాలుగు అర్దసెంచరీల సాయంతో 583 పరుగులు చేశాడు. 15 మ్యాచ్ల్లో సెంచరీ, 5 అర్దసెంచరీల సాయంతో 741 పరుగులు చేసిన ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి సీజన్ లీడింగ్ రన్స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. -
ఐపీఎల్ 2025.. చెన్నై సూపర్ కింగ్స్లోకి అశ్విన్!?
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన సొంతగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలంలో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ బాధ్యతలను అశ్విన్కు సీఎస్కే ఫ్రాంచైజీ యాజయాన్యం ఇండియా సిమెంట్స్ గ్రూప్ అప్పగించింది. దీంతో అశూతో సీఎస్కే మరోసారి ఒప్పందం కుదుర్చుకోవడం దాదాపు ఖాయమైంది. కాగా తమిళనాడులో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను తయారు చేసేందుకు సీఎస్కే ఫ్రాంచైజీ చెన్నై శివారులో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ను ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. "వేలానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆటగాళ్ల ఎంపిక అనేది వేలం డైనమిక్స్పై ఆధారపడి ఉంటుంది. ముందే మేము ఏ ప్లాన్స్ చేయలేం. అశ్విన్ను కొనుగోలు చేసే ఛాన్స్ మాకు వస్తుందో లేదో కూడా తెలియదు. అతడు మొదటగా మా హై పెర్ఫార్మెన్స్ సెంటర్ ఛీప్గా బాధ్యతలు చేపడతాడు. అక్కడ ప్రోగ్రామ్లు, క్రికెట్కు సంబంధించిన విషయాలను అతడు చూసుకుంటాడు. అతడితో మేము ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. అశూ ఇప్పుడు సీఎస్కే వెంచర్లో భాగమయ్యాడు.అదే విధంగా టీఎన్సీఎ ఫస్ట్-డివిజన్ క్రికెట్లో ఇండియా సిమెంట్స్ జట్లకు సైతం ప్రాతినిథ్యం వహిస్తాడని" ఓ ప్రకటనలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ పేర్కొన్నాడు. కాగా అశ్విన్ ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు.అయితే ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలానికి అశ్విన్ను రాజస్తాన్ విడిచిపెట్టే ఛాన్స్ ఉంది. కాగా అంతకముందు అశ్విన్ 2005 నుంచి 2015 వరకు సీఎస్కే ప్రాతినిథ్యం వహించాడు. మళ్లీ పదేళ్ల తర్వాత సీఎస్కే ఫ్యామిలీలో అశూ భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. -
MS Dhoni: ధోని కాళ్లు మొక్కాను.. సర్జరీ చేయిస్తా అన్నారు!
మహేంద్ర సింగ్ ధోని.. ఈ టీమిండియా దిగ్గజ కెప్టెన్ తన అద్బుత ఆట తీరు, నిరాండంబరతతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ తర్వాత కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా జట్టును రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్గా నిలిపి.. ‘తలా’గా అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకున్నాడు. అయితే, ధోని మైదానంలో దిగుతున్నాడంటే సీఎస్కే ఫ్యాన్స్కు మాత్రమే కాదు.. జట్లకు అతీతంగా అందరిలోనూ ఉత్సాహం నిండిపోతుంది.ఏ జట్టుకు మద్దతు ఇచ్చే వారైనా ధోని బ్యాటింగ్కు వచ్చాడంటే .. క్రీజులో ఉన్నంత సేపు అతడికే మద్దతుగా నిలుస్తారు. ఇక మరికొంత మందైతే తలాను నేరుగా కలిసేందుకు దెబ్బలు తినైనా సరే మైదానంలోకి దూసుకువస్తారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.ధోని బ్యాటింగ్కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పిఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగానూ ఓ వ్యక్తి ఇలాగే ఫీల్డ్లోకి దూసుకువచ్చాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ధోని బ్యాటింగ్కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పి లోపలికి ప్రవేశించి.. ధోని పాదాలను చుట్టేశాడు.ఆ సమయంలో ధోని ఏమాత్రం సహనం కోల్పోకుండా తన అభిమాని సమస్యను అర్థం చేసుకోవడమే గాకుండా.. సర్జరీ చేయిస్తానని మాట ఇచ్చాడట. నాడు ధోనిని కలిసిన సదరు వ్యక్తి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు.ధోని కాళ్లు మొక్కాను.. సర్జరీ చేయిస్తా అన్నారు!‘‘ధోనిని చూడగానే నా చుట్టూ ఏం జరుగుతుందో అంతా మర్చిపోయాను. మైదానంలోకి పరిగెత్తుకు వెళ్లాను. మహీ భాయ్ అప్పుడు.. ‘సరదా కోసమే ఇక్కడికి వచ్చావు కదా’ అన్నాడు.మహీ భాయ్ను చూశానన్న ఆనందంలో నాకైతే పిచ్చిపట్టినట్లయింది. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయనొక లెజెండ్. నేరుగా ఆయనను చూడగానే నా కళ్లలో నీళ్లు వచ్చాయి.ఆ సమయంలో నేను భారంగా శ్వాస తీసుకోవడం గమనించి.. ఏమైందని అడిగారు. నా ముక్కు సరిగా పనిచేయదని.. శ్వాస విషయంలో ఇబ్బంది పడుతున్న అని చెప్పాను. వెంటనే ఆయన.. ‘బాధపడకు.. నీ సర్జరీ గురించి నేను చూసుకుంటా. నీకేం కానివ్వను’ అని భరోసా ఇచ్చారు’’ అని సదరు అభిమాని ఫోకస్డ్ ఇండియన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ధోని గ్రేట్అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ధోని గ్రేట్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. కాగా 42 ఏళ్ల వయసులో సీఎస్కే కెప్టెన్గా వైదొలిగిన ధోని.. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు.గైక్వాడ్ సారథ్యంలో వికెట్ కీపర్బ్యాటర్గా కొనసాగాడు ధోని. అయితే, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్Conversation between @msdhoni and fan 🥹💛Fan told him he has some breathing issues and there is surgery of it. He wanted to meet him before surgery. Mahi replied "Teri surgery ka mai dekh lunga. Tujhe kuch nahi hoga, tu ghabara mat. Mai tujhe kuch nahi hone dunga" pic.twitter.com/wKz9aZOVGQ— ` (@WorshipDhoni) May 29, 2024 -
MS Dhoni: ఐపీఎల్కు గుడ్బై?.. ధోని కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని.. 42 ఏళ్ల వయసులోనూ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్-2024లో వికెట్ కీపర్గా కళ్లు చెదిరే క్యాచ్లతో అదరగొట్టిన తలా.. లోయర్ ఆర్డర్లో బ్యాటర్గానూ ధనాధన్ ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు.వింటేజ్ ధోనిని గుర్తు చేస్తూ పవర్ఫుల్ సిక్సర్లతో విరుచుకుపడుతూ కావాల్సినంత వినోదం పంచాడు. అయితే, ఢిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా నిష్క్రమించడంతో అభిమానులు నిరాశ చెందారు.లీగ్ దశలోనే ముగిసిన ప్రయాణంచావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో చెన్నై ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రుతురాజ్ గైక్వాడ్ సేన ప్రయాణం లీగ్ దశలోనే ముగిసిపోయింది.అయితే, ఈ మ్యాచ్లో ధోని మెరుపులు మెరిపించడం అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. 13 బంతుల్లో 3 ఫోర్లు, ఓ భారీ సిక్సర్ సాయంతో తలా 25 పరుగులు సాధించాడు. ఇక 42 ఏళ్ల ఈ ‘జార్ఖండ్ డైనమైట్’కు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ధోని ఫిట్నెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.క్రికెటర్గా కొనసాగేందుకు ఎంతో కష్టపడాలియువ ఆటగాళ్లతో పోటీ పడటం అంత తేలికేమీ కాదని.. క్రికెటర్గా కొనసాగేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘నేను ఏడాదంతా క్రికెట్ ఆడుతూనే ఉండను.కేవలం లీగ్ క్రికెట్ కోసమే మైదానంలో దిగుతాను. అయినా ఎల్లప్పుడూ ఫిట్గానే ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్న యువ ఆటగాళ్లను ఎదుర్కోవాలి కాబట్టి నేనూ వారిలాగే ఫిట్గా ఉండాలి.వయసును సాకుగా చూపలేంఎందుకంటే ప్రొఫెషనల్ క్రికెట్లో వయసు కారణంగా ఎవరూ మనకు డిస్కౌంట్ ఇవ్వరు. ఒకవేళ మనం ఆడాలని నిర్ణయించుకుంటే కచ్చితంగా అందుకు తగ్గట్లుగా ఫిట్నెస్ మెయింటెన్ చేయాలి.వయసును సాకుగా చూపి మనం ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. అందుకే ఆహారపుటలవాట్లు మొదలు వ్యాయామం, ప్రాక్టీస్ వంటి విషయాల్లో కచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాల్సిందే’’ అని ధోని పేర్కొన్నాడు. దుబాయ్ ఐ 103.8 చానెల్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది సీఎస్కేను చాంపియన్గా నిలిపిన ధోని.. ఈ ఏడాది కెప్టెన్సీ నుంచి వైదొలిగి పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2024: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్ అయ్యర్#THALAFOREVER 🦁💛@msdhoni pic.twitter.com/zOu5KABAcP— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024 -
IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
‘‘ప్రపంచకప్ ఫైనల్ గెలిచినా.. భావోద్వేగాలు ప్రతిబింబించేలా సంబరాలు చేసుకుంటున్న సమయంలోనూ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయడం మర్యాద. ‘మన మధ్య పోరు ముగిసిపోయింది.మన మధ్య ఇక ఎలాంటి శత్రుత్వం లేదు. ఇప్పటికి ఇది ముగిసిపోయింది’ అని ఇరు జట్లు పరస్పరం చెప్పుకోవడానికి ఇది(షేక్హ్యాండ్) ప్రతీక’’- హర్షా భోగ్లే, కామెంటేటర్.‘‘అతడొక ఐకానిక్ ప్లేయర్. వచ్చే ఏడాది ఆడతాడో లేదో కూడా తెలియదు. బహుశా ఇదే చివరి మ్యాచ్ కూడా అయి ఉండవచ్చు. అలాంటి లెజెండ్ను కలవడానికి ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూడటం సహజం.ఆ తర్వాత ఎంతసేపు సంబరాలు చేసుకున్నా ఎవరూ ఏమీ అనరు. కానీ అంతా ముగిసి తెల్లారిన తర్వాత.. ‘అయ్యో.. ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు.కానీ మనం ఆయనకు డీసెంట్గా ఓ షేక్హ్యాండ్తో వీడ్కోలు పలకలేకపోయామే’ అని బాధ పడితే ప్రయోజనం ఉంటుందా?’’- ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.ధోనికి అవమానంచెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపట్ల ఇలా కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు విరుచుకుపడ్డారు. ఐపీఎల్లో రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్)తో పాటు ఐదుసార్లు ట్రోఫీ సాధించిన దిగ్గజం పట్ల ఆర్సీబీ ప్లేయర్లు ప్రవర్తించిన విధానం అవమానకరమని మండిపడుతున్నారు.ఇక ధోని అభిమానులైతే ఆర్సీబీ జట్టును సోషల్ మీడియా వేదికగా పదునైన కామెంట్లతో తూర్పారబడుతున్నారు. అయితే, తాజాగా ఓ నెటిజన్ కొత్త వీడియోను తెరమీదకు తెచ్చారు. ధోనికి మద్దతుగా మాట్లాడే వారందరూ ఒక్కసారి ఈ దృశ్యాలను చూడాలంటూ కొత్త చర్చకు దారితీశారు.ఇంతకీ ఏం జరిగింది?... ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస పరాజయాలతో చతికిలపడ్డ ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ రేసులో వరుసగా ఆరు మ్యాచ్లలో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.లీగ్ దశలో సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా చెన్నైని ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పించి.. టాప్-4 బెర్తును ఖరారు చేసుకుంది.ధోనిని పట్టించుకోని ఆర్సీబీ ఆటగాళ్లు?ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఫైనల్ గెలిచినంతంగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ధోని సహా మిగిలిన చెన్నై ఆటగాళ్లు కరచాలనం చేసేందుకు వచ్చారు. అయితే, ఆర్సీబీ సెలబ్రేషన్స్ పూర్తికాకపోవడంతో వీళ్లను పట్టించుకోలేదు. దీంతో చిన్నబుచ్చుకున్న ధోని డ్రెసింగ్రూంకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు కాసేపు వేచి చూడగా.. ఎట్టకేలకే ఆర్సీబీ ప్లేయర్లు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు.ఈ నేపథ్యంలో ధోని మూడు నిమిషాల పాటు ఎదురుచూసినా ఆర్సీబీ ఆటగాళ్లు షేక్హ్యాండ్ కోసం రాలేదని.. తలాను ఘోరంగా అవమానించారంటూ విరాట్ కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లందరిపై సీఎస్కే ఫ్యాన్స్ మండిపడ్డారు.అసలు నిజం ఇదేనంటూఈ క్రమంలో ఓ వ్యక్తి నిజం ఇదేనంటూ.. ‘‘ధోని మూడు నిమిషాలు వేచి చూశాడని అభిమానులు అంటున్నారు. అయితే, అతడు కాసేపు కూడా ఎదురుచూడకుండా వెళ్లిపోయాడు. గెలిచిన జట్టుకు ఆమాత్రం సెలబ్రేట్ చేసుకునే హక్కులేదా? సీఎస్కే గతేడాది ట్రోఫీ గెలిచినపుడు సంబరాలు చేసుకుందా? లేదంటే షేక్హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లిందా? ’’ అని ఓ వీడియోను పంచుకున్నారు. ఇది ఇప్పుడు ఆర్సీబీ- సీఎస్కే ఫ్యాన్స్ మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరతీసింది.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్I can understand he’s pissed but every other player came to shake hands. Those players deserved to have that moment. When CSK won last year should they have gone around celebrating or gone to shake hands? https://t.co/MPXQ9zVOYo pic.twitter.com/TxKA2My6xD— Pradhyoth (@Pradhyoth1) May 19, 2024#THALAFOREVER 🦁💛@msdhoni pic.twitter.com/zOu5KABAcP— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024 -
శివమ్ దూబేపై వేటు.. వరల్డ్కప్ జట్టులో ఫినిషర్కు చోటు!
ఐపీఎల్-2024 ఫస్ట్హాఫ్లో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే.. సెకెండ్ హాఫ్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. స్పిన్నర్లు అద్బుతంగా ఎదుర్కొంటాడని పేరొందిన దూబే.. ఇప్పుడు అదే స్పిన్ బౌలింగ్ అతడి వీక్నెస్గా మారింది. మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చి సీఎస్కేకు అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడడంతో ఏకంగా అతడికి టీ20 వరల్డ్కప్ భారత జట్టులో సెలక్టర్లు చోటు ఇచ్చారు. కానీ వరల్డ్కప్నకు ఎంపికైన తర్వాత అతడి ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆడుతున్నది నిజంగా దూబేనేనా అన్నట్లు ఉంది. తొలి 9 మ్యాచ్ ల్లో 172.4 స్ట్రైక్ రేట్తో 350 పరుగులు చేసిన దూబే.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. తొలి 9 మ్యాచ్ ల్లో ఏకంగా 26 సిక్సర్లు బాదిన దూబే.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 2 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్ లో దూబే 15 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టీ20 వరల్డ్కప్నకు ముందు శివమ్ దూబే ఫామ్ భారత జట్టు మెనెజ్మెంట్కు ఆందోళన కలిగిస్తోంది. అయితే వరల్డ్కప్ ప్రకటించిన జట్టులో మే 25లోపు మార్పులు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిజర్వ్ జాబితాలో ఉన్న రింకూకు ప్రధాన జట్టులోకి ప్రమోట్ చేసి.. మెయిన్ జట్టులో ఉన్న దూబేకు స్టాండ్బై లిస్ట్లోకి డిమోట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అయితే బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. -
ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై బిగ్ అప్డేట్..
ఐపీఎల్-2024 లీగ్ దశలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఆర్సీబీ చేతిలో సీఎస్కే ఓడిపోయింది. రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికి తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.సీఎస్కే, ఆర్సీబీ 14 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికి.. రన్రేట్ పరంగా బెంగళూరు మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకుంది. అయితే ఈ ఏడాది సీజన్ తర్వాత ధోని ఐపీఎల్కు విడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ధోని నుంచి అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ వార్తలపై సీఎస్కే ప్రతినిథి ఒకరు స్పందించారు. ధోని తన రిటైర్మెంట్ గురించి ఫ్రాంచైజీకి ఇప్పటి వరకు తెలియజేయలేదని సదరు ప్రతినిథి తెలిపారు."ఐపీఎల్ రిటైర్మెంట్ గురుంచి ధోని ఇప్పటివరకు సీఎస్కేలో ఎవరితోనూ చర్చించలేదు. అతడు తన నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం తీసుకుంటాని మెనెజ్మెంట్తో ధోని చెప్పాడు. అతడు ఇంకా ఫిట్గానే ఉన్నాడు. అది మాకు కలిసొచ్చే అంశం. వికెట్ల మధ్య పరిగెత్తడంలో అతడు ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చాలా మంది దిగ్గజ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ అభిమానులు అయితే వచ్చే సీజన్లో ఈ రూల్ను ఉపయోగించుకుని ధోనిని కేవలం బ్యాటింగ్కే దిగేలా చూడాలి కోరుతున్నారు. ఇది గానీ ధోని ఏమి నిర్ణయం తీసుకుంటాడో మాకు తెలియదు. తను ఏ నిర్ణయం తీసుకున్న మేము అంగీకరిస్తాం. అతను ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని ఏ నిర్ణయమైన తీసుకుంటాడని" సీఎస్కే సీనియర్ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. -
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ చివరి బెర్తును ఖరారు చేసే పోటీలో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నువ్వా- నేనా అన్నట్లుగా తలపడ్డాయి. వర్షం రాకతో ఆరంభం నుంచే ఆసక్తి రేపుతూ.. హోరీహోరీగా సాగిన ఈ పోరులో ఎట్టకేలకు ఆర్సీబీదే పైచేయి అయింది.ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్ సత్తా చాటి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో చెన్నైకి చెక్ పెట్టి టాప్-4కు అర్హత సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు ఓవర్ల పాటు ఆర్సీబీ బ్యాటింగ్ పూర్తైన తరుణంలో వరణుడి రాక అభిమానులను కలవరపెట్టింది. అయితే, కాసేపటికే మ్యాచ్ తిరిగి ఆరంభమైంది. ఈ క్రమంలో ఓపెనర్లు విరాట్ కోహ్లి(47), ఫాఫ్ డుప్లెసిస్(54).. వన్డౌన్ బ్యాటర్ రజత్ పాటిదార్(41) రాణించారు.వీరికి తోడు నాలుగో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ ధనాధన్ ఇన్నింగ్స్(17 బంతుల్లో 38 నాటౌట్)తో చెలరేగాడు. మిగతా వాళ్లలో దినేశ్ కార్తిక్ 14, మాక్స్వెల్(16) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే ఆరంభంలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర(61) రాణించగా.. అజింక్య రహానే(33) అతడికి సహకరించాడు.రవీంద్ర జడేజా సైతం 22 బంతుల్లో 42 పరుగులతో దుమ్ములేపాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా మెరుపులు(13 బంతుల్లో 25) మెరిపించాడు. కానీ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా సీఎస్కే బ్యాటర్లు చేతులెత్తేశారు.కాగా అనూహ్య రీతిలో చివరి ఓవర్లో ఆర్సీబీ సారథి డుప్లెసిస్ బంతిని యశ్ దయాల్ చేతికి ఇచ్చాడు.అతడి బౌలింగ్లో తొలి బంతికే ధోని సిక్సర్ బాది ఆశలు రేకెత్తించాడు. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా మారింది.దయాల్ అప్పటికే తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లి అతడికి దగ్గరికి దిశా నిర్దేశం చేశాడు. ధోని లాంటి లెజెండ్ క్రీజులో ఉన్నపుడు యార్కర్ కాదు స్లో బాల్ వేయాలంటూ కాస్త గట్టిగానే హెచ్చరించాడు.దీంతో యశ్ దయాల్ ధోనికి స్లో బాల్ సంధించగా.. ట్రాప్లో చిక్కుకున్న తలా స్వప్నిల్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక మిగిలిన నాలుగు బంతుల్లో సీఎస్కే కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించడంతో.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది.అలా కోహ్లి దెబ్బకు సెట్ అయిన యశ్ దయాల్ కీలక వికెట్ తీసి ఆర్సీబీ గెలుపునకు ప్రధాన కారణమయ్యాడు. కాగా ఈ మ్యాచ్లో కోహ్లి ఆద్యంతం కీలక సమయంలో ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ సానుకూల ఫలితాలు రాబట్టడం విశేషం. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఫాఫ్ డుప్లెసిస్ తన అవార్డును యశ్ దయాల్కు అంకితమివ్వడం మరో విశేషం. Nail-biting overs like these 📈Describe your final over emotions with an emoji 🔽Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvCSK pic.twitter.com/XYVYvXfton— IndianPremierLeague (@IPL) May 18, 2024pic.twitter.com/xgmfhb0Fri— The Game Changer (@TheGame_26) May 19, 2024 -
IPL 2024: సీఎస్కే పై ఆర్సీబీ ఘన విజయం (ఫోటోలు)
-
RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు.. ఆర్సీబీ నామస్మరణతో హోరెత్తుతూ ఆగని జోరు... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఐపీఎల్-2024 టైటిల్ సాధించిందా? అన్నంతగా సంబరాలు..ఖండాంతరాలు దాటిన సంబురం.. అమెరికాలోనూ పేలుతున్న విన్నింగ్ క్రాకర్స్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరిన క్రమంలో ‘నమ్మ బెంగళూరు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేషన్స్.. అంత ప్రత్యేకమాఈ విజయం అంత ప్రత్యేకమా అంటే అవుననే చెప్పాలి. ఇంత వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవనే లేదు. అయితే, అనూహ్య రీతిలో ఈసారి మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో తొలిసారి బెంగళూరు ఫ్రాంఛైజీకి ట్రోఫీ దక్కింది.స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆర్సీబీ వుమెన్ టీమ్ కప్ కొట్టింది. ఇదే జోరులో పురుషుల జట్టు కూడా ఈసారి ట్రోఫీ సాధిస్తుందని.. టైటిల్ లేదన్న వెలితిని పూరిస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే, ఆరంభ మ్యాచ్లోనే ఆర్సీబీ ఓటమిపాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయంతో సీజన్ను మొదలుపెట్టింది.ఆ తర్వాత సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్పై విజయం సాధించిన బెంగళూరు జట్టు.. అదే జోరును కొనసాగించలేకపోయింది. వరుస వైఫల్యాలతో చతికిల పడి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టు అవుతుందేమోనన్న భావన కలిగించింది. KGF త్రయంలో విరాట్ కోహ్లి రాణించినా గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంచనాలు అందుకోలేకపోయారు.మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగాఫలితంగా విమర్శల పాలయ్యారు. దీంతో మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతి మ్యాచ్లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ఇలాంటి ఒత్తిడిలో ఏ జట్టైనా చిత్తవుతుంది. కానీ ఆర్సీబీ అందుకు విరుద్ధం.ఎంత ఒత్తిడి పెరిగితే అంతగా చెలరేగిపోతాం అన్నట్లుగా వరుసగా ఆరు విజయాలు సాధించి.. ఇప్పుడిలా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఊహించని విజయం సాధించింది. రిపీట్ అవుతుందా?సీఎస్కేపై గెలిచినా నెట్ రన్రేటు పరంగా కూడా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలో ఉంటేనే టాప్-4కు అర్హత సాధిస్తుందన్న తరుణంలో అద్భుతం చేసి.. టాప్-4కు అర్హత సాధించింది. కాగా 2016లోనూ ఆరంభంలో ఆకట్టుకోలేకపోయిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి.. అటుపై ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా 2016 ఫైనల్లో ఆర్సీబీ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.ఆర్సీబీ వర్సెస్ చెన్నై స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: చెన్నై.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 218/5 (20)👉చెన్నై స్కోరు: 191/7 (20)👉ఫలితం: చెన్నైపై 27 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్స్లో ఎంట్రీ👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫాప్ డుప్లెసిస్(39 బంతుల్లో 54, కీలక సమయంలో రెండు క్యాచ్లు).చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్ Winning celebration of RCB in North America right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/2M2FipXGYX— Kohlified. (@123perthclassic) May 19, 2024Winning celebration of RCB near Trump building Chicago. right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/dy1Oko6QS7— #RCBNation (@9Sxventy3) May 19, 2024Bengaluru won't sleep tonight 😎RCB RCB all over the city @RCBTweets ❤️🔥pic.twitter.com/6jvvAAVERT— M. (@RCB_Hiv3) May 18, 2024Hear the Roar, Hear "Kohli, Kohli & RCB, RCB" Chants when they qualify for playoffs.- King Kohli & RCB are emotions..!!!! pic.twitter.com/Afqck4jNSH— Tanuj Singh (@ImTanujSingh) May 18, 2024📽️ RAW Reactions post a surreal win ❤️When emotions spoke louder than words at Chinnaswamy 🏟️A special lap of honour for the @RCBTweets fans that continue to believe in their side 👏👏#TATAIPL | #RCBvCSK pic.twitter.com/CrBQUBRKEI— IndianPremierLeague (@IPL) May 19, 2024 -
RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
#RCB Vs CSK ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ. అలాంటి ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంటర్స్(#RCB) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఐపీఎల్-17లో ప్లే ఆఫ్ల్స్కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చైన్నె సూపర్ కింగ్స్కు షాకిస్తూ మెరుగైన రన్రేట్తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్లో సీఎక్కేపై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక, ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా డూప్లిసిస్ మాట్లాడుతూ.. బెంగళూరులో ఈ సీజన్ను ముగించడం చాలా ఆనందనిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బౌలర్ యశ్ దయాల్కు అంకితమిస్తున్నాను. యశ్ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వల్లే మ్యాచ్ గెలిచాం. అందుకే తనకు అవార్డ్ను అంకితమిస్తున్నా. THE WINNING CELEBRATION FROM RCB. 🫡❤️- RCB into the Playoffs after having 1 win out of first 8 matches. 🤯🔥pic.twitter.com/LPFjay2A7C— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 ఇలాంటి పిచ్పై పరుగులు చేయడం ఎంతో కష్టం. మా బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. మా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా ఆపగలిగారు. ఈ క్రెడిట్ అంతా మా బౌలర్లదే. ఇక, మా జట్టు ఓడినా.. గెలిచినా ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. THE GREATEST COMEBACK IN IPL HISTORY. 🏆- RCB qualified for Playoffs after losing 6 consecutive matches. 🤯pic.twitter.com/eIe6J7Iqhh— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్స్..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్ (54), కోహ్లి (47), రజత్ పటీదార్ (41), గ్రీన్ (38) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్లో ఉన్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ఔటయ్యాడు. ఇక, మూడో ఓవర్లో మిచెల్ (4) కూడా నిష్క్రమించాడు. దీంతో, 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85/2 స్కోర్తో మళ్లీ రేసులో నిలిచింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్ ఫెర్గూసన్.. రహానెను ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్తో పాటు దూబె, శాంట్నర్ ఔట్ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే ఐదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాలి. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి.. 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్ (యశ్ దయాళ్) తొలి బంతికే ధోని సిక్స్ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండో బంతికి ధోనీని ఔట్ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు. -
బెంగళూరు అద్భుతం
బెంగళూరుతో మ్యాచ్లో చెన్నై విజయలక్ష్యం 219 పరుగులు...కానీ ప్లే ఆఫ్స్కు చేరాలంటే 201 పరుగులే చేస్తే చాలు...తడబడుతూనే సాగిన ఛేదన చివరిలో ఉత్కంఠను పెంచింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేస్తే చాలు... ఐపీఎల్ ప్రమాణాలు, ఈ సీజన్లో ఆట చూస్తే ఇది సునాయాసమే అనిపించింది. యశ్ దయాళ్ వేసిన తొలి బంతినే ధోని సిక్సర్గా మలచడంతో చెన్నై బృందంలో ఆనందం. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా నిలిచింది. కానీ రెండో బంతికి ధోని అవుట్ కావడంతో పరిస్థితి మారిపోయింది. తర్వాతి రెండు బంతుల్లో శార్దుల్ సింగిల్ మాత్రమే తీయగా...చివరి రెండు బంతులకు జడేజా బ్యాట్ కూడా తగిలించలేకపోయాడు! దాంతో ఆర్సీబీ సంబరాలు షురూ అయిపోయాయి. టోర్నీ తొలి 8 మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచి వరుసగా 6 ఓడి అందరూ లెక్కలోంచి తీసేసిన తర్వాత బెంగళూరు అద్భుతం చేసింది. ఇప్పుడు వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఆర్సీబీ సమష్టితత్వం ముందు ఓడిన సూపర్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైంది. ఇక మిగిలింది ధోని తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడా అనే చర్చ మాత్రమే! బెంగళూరు: ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి లీగ్ దశలో నిష్క్రమించింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో విజయాల పోరాటం చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 27 పరుగులతో గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (39 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్లు), విరాట్ కోహ్లి (29 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించారు. అనంతరం చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడింది. రచిన్ రవీంద్ర (37 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్లు), జడేజా (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. కోహ్లి, డుప్లెసిస్ దూకుడు రెండో ఓవర్ నుంచే ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. మూడో ఓవర్లో కోహ్లి రెండు భారీ సిక్సర్లు బాదగా... వర్షం వచ్చి మ్యాచ్ను ఆపేసింది. అప్పుడు ఆర్సీబీ స్కోరు 31/0. తర్వాత తెరిపినిచ్చాక స్పిన్ ప్రయోగంతో వేగం తగ్గింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది. జడేజా, సాన్ట్నర్ బౌలింగ్లో సిక్స్లు బాదిన కోహ్లి అదే ఊపులో మరో సిక్సర్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద మిచెల్కు క్యాచ్ ఇచ్చాడు. పటిదార్ క్రీజులోకి రాగా డుప్లెసిస్... జడేజా వేసిన 11వ ఓవర్లో ఫోర్, 2 సిక్స్లు బాదాడు. 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరగా డుప్లెసిస్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే సందేహాస్పద రనౌట్తో డుప్లెసిస్ క్రీజ్ వీడాడు. ఈ దశలో లైఫ్ వచ్చిన గ్రీన్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) పటిదార్తో కలిసి ధనాధన్ ఆటతీరుతో బెంగళూరు ఇన్నింగ్స్ను వేగంగా నడిపించాడు. 15 ఓవర్లలో 138/2 స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటర్ల జోరు మరింత పెరిగింది. చివరి 5 ఓవర్లలో బెంగళూరు 80 పరుగులు రాబట్టడం విశేషం. రాణించిన రచిన్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన మ్యాక్స్వెల్ తొలి బంతికే కెప్టెన్ రుతురాజ్ (0)ను డకౌట్ చేశాడు. తర్వాత మిచెల్ (4) కోహ్లి క్యాచ్తో వెనుదిరిగాడు. ఈ దశలో రహానే, రచిన్ రవీంద్ర వికెట్కు ప్రాధాన్యమివ్వడంతో వేగం మందగించింది. మూడో వికెట్కు 66 పరుగులు జోడించాక రహానె (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) నిష్క్రమించాడు. రచిన్ 31 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్వల్ప వ్యవధిలో రచిన్ రనౌట్ కాగా, దూబే (7)ను గ్రీన్ పెవిలియన్ చేర్చాడు. సాన్ట్నర్ (3)ను డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్తో పంపించాడు. ఈ దశలో జడేజా, ధోని (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆశలు రేపారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) మిచెల్ (బి) సాన్ట్నర్ 47; డుప్లెసిస్ రనౌట్ 54; పటిదార్ (సి) మిచెల్ (బి) శార్దుల్ 41; గ్రీన్ నాటౌట్ 38; దినేశ్ కార్తీక్ (సి) ధోని (బి) తుషార్ 14; మ్యాక్స్వెల్ (సి) ధోని (బి) శార్దుల్ 16; మహిపాల్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–78, 2–113, 3–184, 4–201, 5–218. బౌలింగ్: తుషార్ 4–0–49–1, శార్దుల్ 4–0–61–2, తీక్షణ 4–0–25–0, సాన్ట్నర్ 4–0–23–1, జడేజా 3–0–40–0, సిమర్జీత్ 1–0–19–0. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) యశ్ (బి) మ్యాక్స్వెల్ 0; రచిన్ రనౌట్ 61; మిచెల్ (సి) కోహ్లి (బి) యశ్ 4; రహానె (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 33; దూబే (సి) ఫెర్గూసన్ (బి) గ్రీన్ 7; జడేజా నాటౌట్ 42; సాన్ట్నర్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 3; ధోని (సి) స్వప్నిల్ (బి) యశ్ 25; శార్దుల్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–85, 4–115, 5–119, 6–129, 7–190. బౌలింగ్: మ్యాక్స్వెల్ 4–0–25–1, సిరాజ్ 4–0–35–1, యశ్ 4–0–42–2, స్వప్నిల్ 2–0–13–0, కరణ్ శర్మ 1–0–14–0, ఫెర్గూసన్ 3–0–39–1, గ్రీన్ 2–0–18–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X పంజాబ్వేదిక: హైదరాబాద్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచిరాజస్తాన్ X కోల్కతావేదిక: గువహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024: సీఎస్కేపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్కు చేరిన ఆర్సీబీ
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుపెట్టింది. ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ సత్తాచాటింది.ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్ను బెంగళూరు ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫాప్ డుప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(47), రజిత్ పాటిదార్(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(61) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 35), ధోని(25) ఆఖరిలో పోరాటం చేశారు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ రెండు వికెట్లు, మాక్స్వెల్, సిరాజ్, గ్రీన్, ఫెర్గూసన్ తలా వికెట్ సాధించారు.అయితే ఈ మ్యాచ్లో సీఎస్కే ఓడిపోయినప్పటికి.. ఛేజింగ్లో నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల మార్క్ దాటి ఉంటే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించి ఉండేది. సీఎస్కే ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి.ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చితన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. -
విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మిస్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో విరాట్ కోహ్లి సత్తాచాటాడు. తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని విరాట్ కోల్పోయాడు. 29 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 3 ఫోర్లు, 4 సిక్స్లతో 47 పరుగులు చేశాడు. సీఎస్కే స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. డారిల్ మిచెల్ అద్బుతమైన క్యాచ్తో కోహ్లిని పెవిలియన్కు పంపాడు. 10 ఓవర్ వేసిన శాంట్నర్ బౌలింగ్లో నాలుగో బంతిని కోహ్లి లాంగాన్ దిశగా బిగ్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న మిచెల్ టైమింగ్లో జంప్ చేస్తూ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. కానీ బ్యాలెన్స్ కోల్పోయిన అతడు వెంటనే చాకచక్యంగా బంతిని గాల్లోకి లేపి మళ్లీ బౌండర్ లైన్ లోపలకి వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే మిచెల్ బౌండరీ రోప్కు తాకడాని అంతా భావించారు. కానీ రీప్లేలో అతడు క్లీన్ క్యాచ్ అందుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో స్టాండ్స్లో ఉన్న కోహ్లి సతీమణి అనుష్క శర్మ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Anushka Sharma also thinks Virat Kohli was not out 😭😭😭@JayShah, please bring King Kohli back. He should be batting out there 🇮🇳💔💔💔#IPL2024 #RCBvsCSK #tapmad #HojaoADFree pic.twitter.com/5fnBv6hAJO— Farid Khan (@_FaridKhan) May 18, 2024 -
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఔటైన విధానం వివాదస్పదమైంది. ఈ మ్యాచ్లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశమైంది.ఏమి జరిగిందంటే?ఆర్సీబీ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సీఎస్కే స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఐదో బంతి స్టంప్స్ దిశగా వేశాడు. దీంతో రజిత్ పాటిదార్ ఆ డెలివరీని స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఈ క్రమంలో శాంట్నర్ బంతిని ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.అయితే బంతి మాత్రం శాంట్నర్ చేతి వేలికి దగ్గరగా వెళ్తూ నాన్స్ట్రైక్ ఎండ్లో స్టంప్స్ను తాకింది. వెంటనే సీఎస్కే ఆటగాళ్లు రనౌట్ అప్పీల్ చేశారు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కు రిఫర్ చేశాడు. తొలుత బంతి చేతి వేలికి తాకిందా లేదా అని నిర్ధారించుకోవడానికి థర్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్ అల్ట్రా ఎడ్జ్ సాయంతో చెక్చేశాడు.అయితే అల్ట్రా ఎడ్జ్లో చిన్నగా స్పైక్ రావడంతో బంతి చేతికి వేలికి తాకినట్లు అంపైర్ నిర్ధారించుకున్నాడు. అనంతరం బంతి స్టంప్స్కు తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చాడా లేదాన్నది పలు కోణాల్లో అంపైర్ పరిశీలించాడు.ఓ యాంగిల్లో బంతి వికెట్లను తాకే సమయానికే డుప్లిసిస్ తన బ్యాటను గీతను దాటించినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం బ్యాట్ గాల్లో ఉందంటూ తన నిర్ణయాన్ని ఔట్గా ప్రకటించాడు.దీంతో ఫాప్ డుప్లెసిస్తో పాటు స్టేడియంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కానీ చేసేదేమి లేక డుప్లెసిస్ (29 బంతుల్లో 54 రన్స్) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్, చెత్త అంపైరింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/4hijPiCz9A— Reeze-bubbly fan club (@ClubReeze21946) May 18, 2024 -
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగారు. సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫాప్ డుప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(47), రజిత్ పాటిదార్(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు.సీఎస్కే బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు, తుషార్ దేశ్పాండే, శాంట్నర్ తలా వికెట్ సాధించారు. ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధించాలంటే 18 పరుగుల తేడాతో సీఎస్కేను ఓడించాలి.చదవండి: టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..! -
సీఎస్కేతో ఆర్సీబీ కీలక పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కీలక మ్యాచ్లో ఇరు జట్లు ఒకే మార్పుతో బరిలోకి దిగాయి. ఆర్సీబీ జట్టులోకి విల్ జాక్స్ స్ధానంలో మ్యాక్స్వెల్ రాగా.. సీఎస్కే జట్టులోకి మిచెల్ శాంట్నర్ వచ్చాడు. కాగా ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్చెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమర్జీత్ సింగ్, మహేశ్ తీక్షణ -
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు తుది అంకానికి చేరుకుంది. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య గట్టి పోటీ నెలకొంది.బెంగళూరు వేదికగా ఈ రెండు జట్లు శనివారం తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నాయి. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దైతే మాత్రం ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా చెన్నై టాప్-4కు దూసుకువెళ్తుంది.బహుశా ఇదే ఆఖరిసారిఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ఆర్సీబీ మేటి క్రికెటర్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మహీ భాయ్.. నేను మరోసారి కలిసి(ప్రత్యర్థులుగా) ఆడబోతున్నాం.బహుశా ఇదే ఆఖరిసారి కావొచ్చేమో ఎవరికి తెలుసు! ఏదేమైనా మా అభిమానులకు ఇదొక గొప్ప కానుకలాంటిదే. టీమిండియాలో ఇద్దరం కలిసి ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాం.మహీ భాయ్ తన ఫినిషింగ్ టచ్తో ఎన్నో మ్యాచ్లలో జట్టును గెలిపించాడని అందరికీ తెలిసిందే’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఐపీఎల్లో ధోనితో కలిసి ఆడే ఆఖరి మ్యాచ్ ఇదే కావొచ్చంటూ.. ధోని రిటైర్మెంట్పై కోహ్లి సంకేతాలు ఇచ్చాడు.రుతురాజ్ గైక్వాడ్కు పగ్గాలుకాగా 42 ఏళ్ల ధోని చెన్నై సూపర్ కింగ్స్ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన తలా.. వికెట్కీపర్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో పలు మ్యాచ్లలో వింటేజ్ ధోనిని తలపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించిన మహీ.. 10 ఇన్నింగ్స్లో కలిపి 136 పరుగులు సాధించాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా సీఎస్కే తరఫున బరిలోకి దిగిన అతడు.. వచ్చే సీజన్లో ఆటకు గుడ్బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి.చదవండి: MI: అంతా ఫేక్!.. అర్జున్ టెండుల్కర్ ఓవరాక్షన్.. ఆ తర్వాత ఇలా! -
RCB Vs CSK: చివరి బెర్త్ ఎవరిదో?
బెంగళూరు: ఐపీఎల్ 17వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్... మూడుసార్లు రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధిస్తాయా లేక లీగ్ దశలోనే నిష్క్రమిస్తాయా ఈరోజే తేలిపోనుంది. ఇప్పటికే కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ‘ప్లే ఆఫ్స్’కు అర్హత పొందగా... చివరిదైన నాలుగో బెర్త్ కోసం చెన్నై, బెంగళూరు జట్లు ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం చెన్నై 14 పాయింట్లతో నాలుగో స్థానంలో... బెంగళూరు 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాయి. » చెన్నైపై బెంగళూరు గెలిస్తే... చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్లు 14 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టుకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. » బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్ల కంటే చెన్నై రన్రేట్ మెరుగ్గా ఉంది. చెన్నైపై గెలవడంతోపాటు ఆ జట్టు రన్రేట్ను అధిగమించాలంటే బెంగళూరు 18 పరుగుల తేడాతో చెన్నైను ఓడించాలి. ఒకవేళ చెన్నై లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆ లక్ష్యాన్ని బెంగళూరు 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి. అయితేనే బెంగళూరుకు ప్లే ఆఫ్స్ బెర్త్ లభిస్తుంది. » మరోవైపు చెన్నై విజయం సాధించినా లేదా వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఆ జట్టు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంటుంది. »స్థానిక వాతావరణ శాఖ ప్రకారం శనివారం బెంగళూరు నగరానికి భారీ వర్ష సూచన ఉండటం గమనార్హం. ఫలితంగా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆ జట్టు ప్రదర్శనపైనే కాకుండా వరుణ దేవుడి దయపై కూడా ఆధారపడి ఉన్నాయి. -
IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్లో మూడో బెర్తు కూడా ఖరారైంది. కోల్కతా నైట్ రైడర్స్ టేబుల్ టాపర్గా ముందుగానే టాప్-4లో తిష్ట వేయగా.. రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ కూడా అర్హత సాధించాయి.లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం(మే 14)తో ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా రాజస్తాన్.. గుజరాత్ టైటాన్స్తో గురువారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్రైజర్స్ ప్లే ఆఫ్స్లో నేరుగా చోటు దక్కించుకున్నాయి.ఆ మూడు జట్ల మధ్య పోటీఇక ప్లే ఆఫ్స్లో మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీపడుతున్నాయి. నిజానికి రన్రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకబడి ఉన్న లక్నో(12 పాయింట్లు, నెట్ రన్రేటు -0.787) ఈ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే!ఒకవేళ ఆశలు సజీవం చేసుకోవాలంటే.. ముంబై ఇండియన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో భారీ తేడాతో లక్నో గెలవాలి. అయినప్పటికీ సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అందులోనూ ఆర్సీబీని సీఎస్కే కచ్చితంగా.. అది కూడా స్వల్ప తేడాతో ఓడిస్తేనే లక్నోకు అవకాశం ఉంటుంది.సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై సర్వత్రా ఆసక్తిఈ నేపథ్యంలో.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరడం సాధ్యంకాదు. కాబట్టి ప్రధానంగా పోటీలో ఉన్నది సీఎస్కే- ఆర్సీబీ మాత్రమే అని చెప్పవచ్చు.ఈ రెండు జట్లలోనూ చెన్నై(14 పాయింట్లు, రన్రేటు 0.528) ఆర్సీబీ(12 పాయింట్లు 0.387) కంటే ఓ మెట్టు పైనే ఉంది. అయినప్పటికీ ఆర్సీబీ సీఎస్కేను దాటి ప్లే ఆఫ్స్ చేరాలంటే..? సాధ్యమయ్యే రెండు సమీకరణలు ఇలా!అలా చెన్నైపై గెలిచినా సాధ్యం కాదు1. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు తక్కువ కాకుండా స్కోరు చేయాలి. అంతేకాదు 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అంతకంటే ఒక్క పరుగు తక్కువ తేడాతో చెన్నైని ఓడించినా ఫలితం ఉండదు. నెట్ రన్రేటు ఆధారంగా చెన్నై ప్లే ఆఫ్స్ చేరితే.. ఆర్సీబీ మాత్రం ఇంటిబాట పడుతుంది.2. ఒకవేళ ఆర్సీబీ గనుక సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చి.. చెన్నై విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని.. 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ పూర్తి చేయాలి. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్ -
IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా టాప్-4 బెర్తులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది.ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఈ రేసులో ముందుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.చెన్నై ఇప్పటికి 13 మ్యాచ్లు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లు(నెట్ రన్రేటు 0.528) సాధించగా.. పన్నెండు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్రైజర్స్ నెట్ రన్రేటు (0.406) పరంగా కాస్త వెనుకబడి ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.అతిపెద్ద సానుకూలాంశంఅయితే, రైజర్స్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండటం.. అది కూడా సొంతగడ్డపై జరుగనుండటం అతిపెద్ద సానుకూలాంశం. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లలో ఏదో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కనీసం నాలుగో స్థానం ఖరారు చేసుకుంటుంది.మరోవైపు.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. మిగిలింది ఇంకొక్క మ్యాచ్. అది కూడా సీఎస్కే(మే 18)తో! ఈ మ్యాచ్లో చెన్నైని కచ్చితంగా ఓడిస్తేనే ఆర్సీబీకి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికి వెళ్లడమే తరువాయి!చెన్నై పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఓడితే ఇంటికే లేదంటే సన్రైజర్స్ మ్యాచ్ల ఫలితం తేలేవరకు వేచి చూడాలి. ఈ సమీకరణల నేపథ్యంలో ఎలా చూసినా సన్రైజర్స్ సీఎస్కే, ఆర్సీబీ కంటే ఓ మెట్టు పైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి?అయితే, టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఆర్సీబీ టాప్-4లో అడుగుపెడుతుందని జోస్యం చెప్పాడు.‘‘తదుపరి రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు కదా! ఒకవేళ హైదరాబాద్ రెండు మ్యాచ్లూ ఓడి.. ఆర్సీబీ చెన్నై మీద గెలిస్తే.. అప్పుడు రెండు జట్ల ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి.రన్రేటు పరంగా సన్రైజర్స్ కంటే ఈ రెండు జట్లు మెరుగ్గానే ఉంటాయి. అందుకే నా టాప్ 4.. కేకేఆర్, రాజస్తాన్, చెన్నై, బెంగళూరు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.భగ్గుమంటున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కాగా భజ్జీ వ్యాఖ్యలపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భగ్గుమంటున్నారు. విధ్వంసకర బ్యాటింగ్తో సొంతగడ్డపై చెలరేగే ప్యాట్ కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేయడమే గాకుండా.. అపశకునపు మాటలు మాట్లాడటం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇక సన్రైజర్స్ గురువారం నాటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ Ready to put on a show this evening 🧡💙#PlayWithFire #SRHvGT pic.twitter.com/o07Or5fu12— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024 -
MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్– రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆదివారం చెపాక్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించారు. ఈ పోటీని చూడడానికి ఢిల్లీ నుండి చెన్నైకి వచ్చిన గౌరవ్ (19) అనే యువకుడు.. చెన్నై సూపర్స్టార్ మహేంద్ర సింగ్ ధోనీని వ్యక్తిగతంగా చూసిన తరువాతనే ఢిల్లీకి వెళ్తానంటూ అభిమానాన్ని చాటుకున్నాడు.ధోనీకి వీరాభిమాని అయిన గౌరవ్ తలాను కలిసేందుకు సైకిల్పై 23 రోజుల పాటు ప్రయాణించి ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చాడు. దాదాపు 2100 కిలో మీటర్ల ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయక చెన్నై చేరుకున్నాడు. స్నేహితులు ఇచ్చిన టికెట్తో రాజస్తాన్ రాయల్స్, చెన్నై మధ్య మ్యాచ్ను చూశాడు. ఈ క్రమంలో ధోనిని వ్యక్తిగతంగా కలిసిన తర్వాత ఢిల్లీకి తిరిగి వెళుతానంటూ చేపాక్కం మైదానం 9వ గేట్ ప్రవేశ ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు. తానూ క్రీడాకారుడిగా ఎదగాలనుకుంటున్నానని.. ధోని అంటే అభిమానం ఉన్నందు వల్లే ఈ సాహసం చేశానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. From Delhi to Den! Yellove has no boundaries 🫶A tale of sheer passion and unconditional love that transcends distance and time!🥹💛#WhistlePodu #Yellove pic.twitter.com/YtrG96yHXp— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2024ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో చెన్నై రాజస్తాన్పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సంజూ శాంసన్ సేనను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసిన రుతురాజ్ గైక్వాడ్ బృందం ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకొంది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని అభిమానులకు అభివాదం చేస్తూ స్టేడియమంతా తిరుగుతూ ఉత్సాహపరిచిన విషయం తెలిసిందే. కాగా.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో భాగంగా చెన్నై జట్టు ఆర్సీబీతో తలపడనుంది. బెంగళూరు వేదికగా మే 18న ఈ మ్యాచ్ జరుగనుంది.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్పై సంచలన వ్యాఖ్యలు -
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్తో ముగుస్తుంది.. ఈ క్రమంలో హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 27గా బీసీసీఐ నిర్ణయించింది. అయితే టీమిండియా కొత్త హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.రాహుల్ ద్రవిడ్ వారసుడిగా ఫ్లెమింగ్ సరైనోడని బీసీసీఐ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అతడితో బీసీసీఐ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఫ్లెమింగ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్గా ఉన్నాడు. అతడికి కోచ్గా అపారమైన అనుభవం ఉంది.అతడి నేతృత్వంలోనే సీఎస్కే ఐదు సార్లు ఛాంపియన్స్గా నిలిచింది. అయితే బీసీసీఐ నిబంధనలను అతడు ఒప్పుకుంటాడో లేదే చూడాలి. బీసీసీ రూల్స్ ప్రకారం.. కొత్త ప్రధాన కోచ్ మూడు ఫార్మాట్లో భారత జట్టును ముందుకు నడిపించాలి.అదే విధంగా ఏడాదికి 10 నెలల పాటు జట్టుతో పాటు ఉండాలి. ఒకవేళ ఫ్లెమింగ్ భారత జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు చేపడితే సీఎస్కే ఫ్రాంచైజీతో బంధం తెంచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా హెడ్ కోచ్ రేసులో ఆసీస్ మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ఉద్దేశించి ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని పట్ల వారి అభిమానం తనకు, రవీంద్ర జడేజాకు చిరాకు తెప్పించేందన్నాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై ఒకటి. దీనికి ముఖ్య కారణం టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది యువ ఆటగాళ్లు అతడి సారథ్యంలో మెరికల్లా తయారై జాతీయ జట్ల తరఫున అదరగొడుతున్నారు.ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో జట్టుపై నిషేధం పడినా.. తిరిగి సీఎస్కేను నిలబెట్టిన ఘనత ధోని సొంతం. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్) తర్వాత రికార్డు స్థాయిలో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన కెప్టెన్గా ధోని మాత్రమే నిలవగలిగాడు.తదుపరి తన వారసుడిగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగిస్తే.. ఒత్తిడి తట్టుకోలేక 2022 మధ్యలోనే బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో 42 ఏళ్ల ధోని 2023లో టైటిల్ సాధించిన తర్వాత.. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్కు తన బాధ్యతలను బదిలీ చేశాడు.ఇక చాలా ఏళ్లుగా సీఎస్కే ముఖచిత్రమైన మిస్టర్ కూల్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలా అని ముద్దుగా పిలుచుకునే తమ నాయకుడిని చూసేందుకు కేవలం చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు.. దేశంలో ఎక్కడున్నా అతడి అభిమానులు మ్యాచ్ చూసేందుకు మైదానానికి పోటెత్తుతారు.ఈ క్రమంలో అతడు త్వరగా బ్యాటింగ్కు రావాలంటూ కోరుకునే అభిమానులు బ్యాటింగ్ ఆర్డర్లో ముందున్న జడ్డూ లాంటి వాళ్లు త్వరగా అవుట్ కావాలంటూ గతంలో ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో జడ్డూ వాళ్లపై అసహనం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డాడు. దీంతో ఫ్యాన్స్ సైతం అతడికి ధీటుగానే బదులిచ్చారు.ఈ నేపథ్యంలో అంబటి రాయుడు తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. "మనం సిక్స్, ఫోర్ కొట్టినా ప్రేక్షకులు సైలెంట్గా ఉంటారు. జడేజాకు, నాకు ఈ విషయం విసుగు తెప్పించేది.నిజానికి సీఎస్కే ఫ్యాన్స్ ముందు జట్టుకు అభిమానులు కాదు.. వాళ్లు కేవలం ధోని అభిమానులు మాత్రమే. అందుకే జడ్డూకు కూడా చిరాకు వచ్చేది. కానీ అతడు మాత్రం ఏం చేయగలడు అని వ్యాఖ్యానించాడు. కాగా 2018 నుంచి 2023 వరకు సీఎస్కే ఆడిన అంబటి రాయుడు గతేడాది ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో సీఎస్కే పదమూడింట ఏడు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. -
ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జూలు విదిల్చింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 47 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ తమ రన్రేట్ను భారీగా మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరుకుంది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి.ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే?ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధిస్తే సీఎస్కేతో పాయింట్ల పరంగా సమమవుతోంది. ఆర్సీబీ విజయంతో పాటు తమ రన్రేట్ను కూడా మెరుగు పరుచుకోవాలి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అదే ఛేజింగ్లో అయితే 18.1 ఓవర్లలోనే మ్యాచ్ను ఫినిష్ చేయాలి. ఈ క్రమంలో సీఎస్కే(+0.528) కంటే ఆర్సీబీ మెరుగైన రన్రేట్(+0.387) సాధించి ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తోంది. అంతేకాకుండా సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచ్ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలి. -
IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా
ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా చెపాక్ స్టేడియం అద్భుత దృశ్యానికి వేదికైంది. రాయల్స్పై విజయానంతరం సీఎస్కే స్టార్ మహేంద్ర సింగ్ ధోని స్టేడియమంతా కలియదిరుగుతూ టెన్నిస్ బంతులు స్టాండ్స్లోకి విసిరాడు.జట్టు వెంటరాగా ముందుండి నడుస్తూ ఉత్సాహంగా కనిపించాడు తలా. దీంతో చెపాక్లో ఒకరకమైన భావోద్వేగపూరిత వాతావరణం ఏర్పడింది. 42 ఏళ్ల ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అన్న వార్తల నేపథ్యంలో చెన్నై ఫ్యాన్స్ను తలా వీడ్కోలు పలుకుతున్నట్లుగా అనిపించింది. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl)ఇక ధోని స్టేడియాన్ని చుట్టేస్తున్న వేళ చిన్న తలా సురేశ్ రైనా కూడా జతకలిశాడు. ఈ క్రమంలో రైనాకు కూడా బంతిని ఇచ్చిన తలా.. అనంతరం అతడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ గురించి ఎదురైన ప్రశ్నకు రైనా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. జియో సినిమాలో సహ కామెంటేటర్ అభినవ్ ముకుంద్ రైనాను ఉద్దేశించి.. ఒక యుగం ముగిసిపోయినట్లేనా? అని అడిగాడు.ఇందుకు రైనా బదులిస్తూ.. ‘‘కచ్చితంగా కానే కాదు’’ అని పేర్కొన్నాడు. దీంతో తలా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మిస్టర్ ఐపీఎల్గా పేరొందిన సీఎస్కే మాజీ స్టార్ రైనా ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 లీగ్ దశలో చెన్నైలో సీఎస్కే తమ చివరి మ్యాచ్ ఆడేసింది. రాజస్తాన్పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. కాగా క్వాలిఫయర్-2, ఫైనల్ మాత్రం చెపాక్ వేదికగానే జరుగనున్నాయి.చదవండి: ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్స్టార్? గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
Obstructing field: జడ్డూ కావాలనే చేశాడా?.. సీఎస్కే కోచ్ స్పందన ఇదే!
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’గా అవుటైన మూడో బ్యాటర్గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్-2024 నేపథ్యంలో చెపాక్ వేదికగా చెన్నై- రాజస్తాన్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి కేవలం 141 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై ఐదు వికెట్లు నష్టపోయి 18.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఐదు వికెట్ల తేడాతో రాజస్తాన్ను ఓడించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ ఇదిలా ఉంటే.. సీఎస్కే ఇన్నింగ్స్లో ఆరోస్థానంలో బ్యాటింగ్కు దిగిన జడ్డూ పరుగుల తీసే క్రమంలో.. ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నట్లుగా తేలడంతో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ నిబంధన కింద అవుటయ్యాడు.అవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జడేజా లేని రెండో పరుగుకు పరుగెత్తాడు. మరో ఎండ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్తో సమన్వయలోపం కారణంగా పరుగుకు ఆస్కారం లేకపోయినా క్రీజును వీడాడు. అయితే, వెంటనే ప్రమాదం పసిగట్టి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా.. రాజస్తాన్ వికెట్ కీపర్, కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్లకు మీదకు వేసిన త్రోకు అడ్డుగా పరుగెత్తగా బంతి జడేజాకు తగిలింది.మైక్ హస్సీ స్పందనఈ నేపథ్యంలో రాయల్స్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్లు టీవీ అంపైర్కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ జడ్డూను ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ రూల్ కింద అవుట్గా ప్రకటించాడు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పందించాడు.‘‘నేను మరీ అంత దగ్గరగా గమనించలేకపోయాను. అయితే, అతడు స్ట్రెయిట్గా పరిగెత్తేక్రమంలో యాంగిల్ను మార్చుకోకుండానే ముందుకు సాగాడు.ఇరువైపులా వాదనలు ఉంటాయి. అయితే, అంపైర్దే తుదినిర్ణయం. నా అభిప్రాయం ప్రకారం.. నిబంధనలకు అనుగుణంగా ఇది సరైన నిర్ణయమే’’ అని మైక్ హస్సీ స్పష్టం చేశాడు.చదవండి: ఆర్సీబీ విజయం: అనుష్క శర్మ సెలబ్రేషన్స్.. కోహ్లి రియాక్షన్ వైరల్ Jaldi wahan se hatna tha 🫨#TATAIPL #CSKvRR #IPLonJioCinema pic.twitter.com/Op4HOISTdV— JioCinema (@JioCinema) May 12, 2024 -
IPL 2024 CSK Vs RR: గెలిచి నిలిచిన చెన్నై
చెన్నై: రాజస్తాన్ రాయల్స్... చెన్నై సూపర్కింగ్స్! మొదటి జట్టు గెలిస్తే నేరుగా ‘ప్లే ఆఫ్స్’ చేరుతుంది. రెండో జట్టు గెలిస్తే ‘ప్లే ఆఫ్స్’ వేటలో ముందడుగు వేస్తుంది. అలా కీలకమైన ఈ పోరులో సొంతగడ్డపై చెన్నై... పేస్ బౌలింగ్తో కట్టడి చేసి... అనంతరం బ్యాటింగ్లోనూ రాణించి రాయల్స్కు చెక్ పెట్టి... ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులే చేయగలిగింది. రియాన్ పరాగ్ (35 బంతుల్లో 47 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించగా... మరెవరూ 30 పరుగులైనా చేయలేకపోయారు. చెన్నై పేస్ బౌలర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిమర్జీత్ సింగ్ (3/26), తుషార్ దేశ్పాండే (2/30) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనలో చెన్నై 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్) కుదురుగా ఆడాడు. రాజస్తాన్ స్పిన్నర్ అశి్వన్కు 2 వికెట్లు దక్కాయి. జోరు తగ్గిన రాజస్తాన్ రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో వరుస విజయాలతో హోరెత్తించింది. కానీ ఈ మ్యాచ్లో బోర్ కొట్టించింది. యశస్వి (21 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), బట్లర్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు), కెప్టెన్ సంజూ సామ్సన్ (19 బంతుల్లో 15) ఇలా టాపార్డర్ వన్డేను తలపించే ఆటే ఆడటంతో పరుగుల్లో వెనుకబడింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (18 బంతుల్లో 28; 1 ఫోర్లు, 2 సిక్స్)లు కొట్టిన ఆ కాస్తా సిక్సర్లతో ఓ మోస్తరు స్కోరే చేసింది. కనీసం 150 పరుగుల మార్క్ అయిన దాటలేకపోవడంతో చెన్నైకి వారి సొంతగడ్డపై సులువైన లక్ష్యం అయ్యింది. నడిపించిన నాయకుడు రచిన్ రవీంద్ర (18 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్లు)లో ఇన్నింగ్స్ ఆరంభించిన కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ అసాంతం ఒపిగ్గా ఆడాడు. వేగంగా ఆడే క్రమంలో మిచెల్ (13 బంతుల్లో 22; 4 ఫోర్లు), శివమ్ దూబే (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుటైనా... లక్ష్యం చిన్నదైనా... రుతురాజ్ మాత్రం గెలిచేదాకా జాగ్రత్త పడ్డాడు. రిజ్వీ (8 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) బౌండరీలతో 10 బంతులు మిగిలుండగానే చెన్నై లక్ష్యాన్ని చేరింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) రుతురాజ్ (బి) సిమర్జీత్ 24; బట్లర్ (సి) తుషార్ (బి) సిమర్జీత్ 21; సామ్సన్ (సి) రుతురాజ్ (బి) సిమర్జీత్ 15; పరాగ్ (నాటౌట్) 47; జురెల్ (సి) శార్దుల్ (బి) తుషార్ 28; శుభమ్ (సి) దూబే (బి) తుషార్ 0; అశి్వన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–43, 2–49, 3–91, 4–131, 5–131. బౌలింగ్: తుషార్ 4–0–30–2, తీక్షణ 4–0–28–0, శార్దుల్ 4–0–32–0, సిమర్జీత్ 4–0–26–3, జడేజా 4–0–24–0. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి అండ్ బి) అశి్వన్ 27; రుతురాజ్ (నాటౌట్) 42; మిచెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 22; మొయిన్ అలీ (సి) అవేశ్ ఖాన్ (బి) బర్గర్ 10; దూబే (సి) పరాగ్ (బి) అశి్వన్ 18; జడేజా (అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్) 5; సమీర్ రిజ్వీ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.2 ఓవర్లలో 5 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–32, 2–67, 3–86, 4–107, 5–121. బౌలింగ్: బౌల్ట్ 2.2–0–24–0, సందీప్ శర్మ 3–0–30–0, అశ్విన్ 4–0–35–2, బర్గర్ 3–0–21–1, చహల్ 4–0–22–1, అవేశ్ ఖాన్ 2–0–12–0. -
రాజస్తాన్ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
ఐపీఎల్ - 2024 ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ మరో ముందడుగు వేసింది. రాజస్తాన్ రాయల్స్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది.చెపాక్ వేదికగా రాజస్తాన్తో ఆదివారం తలపడిన చెన్నై టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. పేసర్ సిమర్జీత్ సింగ్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్ (21) వికెట్లు పడగొట్టి శుభారంభం అందించాడు.వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్(15)ను కూడా వెనక్కి పంపి రాజస్తాన్ టాపార్డర్ను దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్(35 బంతుల్లో 47 నాటౌట్) పోరాడగా.. ధ్రువ్ జురెల్(18 బంతుల్లో 28) అతడికి సహకారం అందించాడు. మిగతా వాళ్లు చేతులెత్తేయగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి ఓపెనర్ రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్తో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆచితూచి ఆడాడు. 41 బంతులు ఎదుర్కొని 42 పరుగులు మాత్రమే చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో డారిల్ మిచెల్(22) ఫర్వాలేదనిపించగా.. మొయిన్ అలీ(10), శివం దూబే(18), రవీంద్ర జడేజా(5) విఫలమయ్యారు. ఏడో స్థానంలో వచ్చిన సమీర్ రజ్వీ ధనాధన్ ఇన్నింగ్స్(8 బంతుల్లో 15)తో చెన్నై సూపర్ కింగ్స్ను విజయతీరాలకు చేర్చాడు.సొంతమైదానంలో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు వెళ్లింది. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన సిమర్జీత్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. -
CSK Vs RR: రాజస్తాన్, సీఎస్కే రసవత్తర పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. సీఎస్కే జట్టులోకి థీక్షణ రాగా.. రాజస్తాన్ జట్టులోకి ధ్రువ్ జురెల్ వచ్చాడు.ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని రాజస్తాన్ భావిస్తుంటే.. సీఎస్కే సైతం ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమర్జీత్ సింగ్, మహేశ్ తీక్షణరాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, శుభమ్ దూబే, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజువేంద్ర చాహల్ -
అలా అయితేనే ప్లే ఆఫ్స్లో సన్రైజర్స్.. ఆ రెండు జట్లు కన్ఫామ్!?
చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కింగ్స్ టాప్-4 రేసు నుంచి నిష్క్రమించగా.. వరుస విజయాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సీఎస్కేపై తాజా విజయంతో గుజరాత్ టైటాన్స్ ఆశలను సజీవం చేసుకున్నాయి.మరోవైపు ఈ రెండు జట్ల కంటే మెరుగైన స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్పై కన్నేశాయి. ఇక ఇప్పటికే రన్రేటు పరంగా అన్ని జట్ల కంటే పటిష్ట స్థితిలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్(16 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్(16 పాయింట్లు) రెండో స్థానం ఆక్రమించింది.మూడో స్థానం కోసం జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్(12 పాయింట్లు)ను వెనక్కి నెట్టి.. సన్రైజర్స్ హైదరాబాద్(14 పాయింట్లు) ముందుకు దూసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్నకు సంబంధించిన కొన్ని సమీకరణలు ఇలా ఉన్నాయి.కేకేఆర్.. టాప్ఇప్పటికే టాప్-1లో ఉన్న కేకేఆర్ శనివారం ముంబై ఇండియన్స్తో తలపడనుంది. సొంతమైదానంలో జరిగే ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సేన ముంబైని ఓడించిందంటే మరో రెండు పాయింట్లు ఖాతాలో పడతాయి.ఫలితంగా 18 పాయింట్లతో కేకేఆర్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలుస్తుంది. అలా కాక ముంబైతో కాకుండా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్తో మిగిలిన మ్యాచ్లలో ఏ ఒక్కటి గెలిచినా బెర్తు ఖాయమే!అయితే, ఇక్కడో మెలిక ఉంది. రాజస్తాన్, సీఎస్కే, సన్రైజర్స్ లేదా లక్నో ఈ జట్లలో మూడు 18 పాయింట్లు సాధిస్తేనే కేకేఆర్ ప్రయాణం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా ముంబైతో మ్యాచ్లో ఓడినా రాజస్తాన్పై మాత్రం కచ్చితంగా గెలవాలి.రాజస్తాన్.. రైట్ రైట్చెన్నై, పంజాబ్, కేకేఆర్ రూపంలో రాజస్తాన్కు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి గెలిచినా, కేకేఆర్, సీఎస్కే, లక్నో/సన్రైజర్స్లలో ఏ జట్టు 18 పాయింట్లు సాధించినా రాజస్తాన్ బెర్త్ ఖరారవుతుంది.టాప్-2లో నిలవాలంటే కేకేఆర్ను మాత్రం ఓడించడం తప్పనిసరి.సన్రైజర్స్ రైజ్ అవ్వాలంటే!సన్రైజర్స్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ల రూపంలో ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బ తీసేందుకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నాయి.ఈ రెండు మ్యాచ్లలో సన్రైజర్స్ గెలిస్తే సన్రైజర్స్ టాప్-4కు అర్హత సాధిస్తుంది. ఏ ఒక్కటి ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పని దుస్థితి ఎదురవుతుంది.చెన్నై చమక్ అనాలంటే!డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించింది. కానీ ఆ తర్వాత పడుతూ లేస్తూ ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో ఓటమి తర్వాత సీఎస్కే కాస్త డీలా పడింది. ప్రస్తుతం సీఎస్కేకు రాజస్తాన్, ఆర్సీబీలతో మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.ఈ రెండింటిలోనూ గెలిస్తేనే సీఎస్కే ప్రయాణా సాఫీగా సాగుతుంది. లేదంటే.. లేదంటే ఢిల్లీ, లక్నోతో సీఎస్కే పోటీపడాల్సి ఉంటుంది. అయితే, రన్రేటు పరంగా సీఎస్కే ప్రస్తుతం ఆ రెండు జట్ల కంటే మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం.ఢిల్లీ దబాంగ్ అనిపించుకోవాలంటే..ఆరంభంలో అపజయాలు ఎదురైనా తిరిగి పుంజుకుని ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్తో మిగిలిన మ్యాచ్లలో గెలవడం సహా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే..ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్తో మ్యాచ్లలో తప్పక గెలవాలి. ప్రస్తుతం 12 పాయింట్లతో చెన్నై, ఢిల్లీతో సమానంగా ఉన్నా రన్రేటు పరంగా వెనుకబడి ఉంది రాహుల్ సేన.కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్లలో గెలవడంతో పాటు ప్రస్తుతం టాప్-4లో ఉన్న కేకేఆర్, రాజస్తాన్, సన్రైజర్స్, చెన్నై వీలైనన్ని మ్యాచ్లు ఓడిపోతేనే లక్నో ఆశలు సజీవంగా ఉంటాయి.ఆర్సీబీ, గుజరాత్ పరిస్థితి ఇదీ!ఆర్సీబీకి ఢిల్లీ, సీఎస్కేలతో మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ రెండూ కచ్చితంగా గెలిచి.. నెట్ రన్రేటు పరంగా మిగతా జట్ల కంటే మెరుగపడటం సహా ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాలి. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే!గుజరాత్ టైటాన్స్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. కేకేఆర్, సన్రైజర్స్తో మ్యాచ్లలో ఏ ఒక్కటి ఓడినా ప్రయాణం ముగిసినట్లే. రెండూ గెలిస్తే అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేటు తదితర అంశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
GTvsCSK: టైటాన్స్ జట్టు మొత్తానికి భారీ జరిమానా.. గిల్కు ఏకంగా!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకున్న గుజరాత్ టైటాన్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శతక వీరుడు కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు తుదిజట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు.కాగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(103), శుబ్మన్ గిల్(104) సునామీ శతకాలతో చెలరేగగా.. 231 పరుగులు స్కోరు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నైని 196 పరుగులకే కట్టడి చేసి.. ఈ సీజన్లో ఐదో విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో నిలవగలిగింది. దీంతో ఫుల్ జోష్లో ఉన్న గుజరాత్ టైటాన్స్కు జరిమానా రూపంలో భారీ షాక్ తగిలింది.నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున కెప్టెన్ శుబ్మన్ గిల్కు రూ.24 లక్షలు, ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుదిజట్టులోని ఆటగాళ్ల ఫీజులో 25 శాతం మేర బీసీసీఐ కోత విధించింది. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఈ ఎడిషన్లో గుజరాత్ టైటాన్స్ రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు కెప్టెన్కు రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత(ఏది తక్కువగా ఉంటే అది) ఫైన్ వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.గుజరాత్ వర్సెస్ చెన్నై స్కోర్లు👉వేదిక: అహ్మదాబాద్.. నరేంద్ర మోదీ స్టేడియం👉టాస్: చెన్నై.. బౌలింగ్👉గుజరాత్ స్కోరు: 231/3 (20)👉చెన్నై స్కోరు: 196/8 (20)👉ఫలితం: 35 పరుగుల తేడాతో చెన్నైపై గుజరాత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్మన్ గిల్చదవండి: Rohit Sharma: అది నా ఇల్లు.. కానీ ఇదే లాస్ట్: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్A record-breaking opening partnership followed by an effective bowling display to earn 2️⃣ points 🙌Recap the #GTvCSK clash 🎥 #TATAIPL pic.twitter.com/f9RI6iP8eL— IndianPremierLeague (@IPL) May 11, 2024 -
MS Dhoni: తలా ధోనిపై అభిమానంతో మ్యాచ్ మధ్యలో వీరాభిమాని పాదాభివందనం (ఫొటోలు)
-
మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. ‘పారిపోయిన’ ధోని! వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మిస్టర్ కూల్ అని నిరూపించుకున్నాడు. మ్యాచ్ మధ్యలో మైదానంలోకి దూసుకువచ్చిన అభిమానిని ఆలింగనం చేసుకుని సాదరంగా వీడ్కోలు పలికాడు.గుజరాత్ టైటాన్స్- సీఎస్కే మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు ఆశలను సజీవం చేసుకునే క్రమంలో ఇరు జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడ్డాయి.సొంతమైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్ల విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది.శతకాల మోతసాయి సుదర్శన్(103), శుబ్మన్ గిల్(104) శతకాల మోతతో నరేంద్ర మోదీ స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టాపార్డర్ కుప్పకూలగా.. మిడిలార్డర్ ఆదుకుంది. కానీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది.నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు మాత్రమే చేసిన చెన్నై జట్టు టైటాన్స్ ముందు తలవంచింది. 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్ తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాది ధోని జోరు మీద ఉండగా... మూడో బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీలు చేసింది ప్రత్యర్థి జట్టు. కానీ బాల్ వికెట్స్ మిస్ చేసినట్లుగా తేలడంతో ధోని నాటౌట్గా నిలిచాడు.పాదాలకు నమస్కరించగానేఅయితే, ఇదే సమయంలో ఓ యువకుడు మైదానంలోకి దూసుకువచ్చాడు. అతడి రాకను గమనించిన ధోని తొలుత దూరంగా పారిపోతున్నట్లు నటించాడు. అతడు వచ్చి పాదాలకు నమస్కరించగానే భుజం తట్టిలేపి ఆలింగనం చేసుకుని ఇక వెళ్లు అన్నట్లుగా కూల్గా డీల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలా క్రేజ్, ఫ్యాన్స్ పట్ల అతడు వ్యవహరించే తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.చదవండి: కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్లోనూ అలా! పాపం..Best moments of IPL 🥹💛That Hug and That smile Mahi The Man The Myth The Legend 🥰 Demi God for Millions of Indians 🇮🇳 Ms Dhoni 🐐 #DHONI𓃵#ChennaiSuperKings#CSKvGT #Ahmedabad #TATAIPL2024 #T20WorldCup2024 pic.twitter.com/m8MA8YdKzh— Srinivas Mallya🇮🇳 (@SrinivasMallya2) May 11, 2024Ms Dhoni knows exactly how to make the stadium roar with his mass entry 🥹🔥🔥#CSKvsGT | #DHONI𓃵pic.twitter.com/U5DA5meNaw— 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) May 10, 2024The Helicopter Shot 🚁A maximum from #CSK's Number 7️⃣💥Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #GTvCSK pic.twitter.com/2QAN3jPjTb— IndianPremierLeague (@IPL) May 10, 2024 -
గిల్, సాయి శతకాల మోత
అహ్మదాబాద్: గుజరాత్పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో పడదామనుకున్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటాన్స్ ఓపెనర్లు శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్ చుక్కలు చూపించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సూపర్కింగ్స్ ఊహించని ఉపద్రవంతో చేతులెత్తేసింది. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. మొదట టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. గిల్ (55 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్స్లు), సుదర్శన్ (51 బంతుల్లో 103; 5 ఫోర్లు, 7 సిక్స్లు) చెలరేగారు.తుషార్ దేశ్పాండేకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఓడింది. డారిల్ మిచెల్ (34 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్స్లు), మొయిన్ అలీ (36 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించారు. మోహిత్ శర్మ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. జోరు కాదు... ఓపెనర్ల హోరు... పవర్ ప్లేలో 58/0 స్కోరు చేసిన టైటాన్స్ ఓపెనర్లు ఆ తర్వాత మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలో ముందుగా సాయి సుదర్శన్ 32 బంతుల్లో, గిల్ 25 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేశారు. పేస్, స్పిన్, స్లో మీడియం ఇలా ఆరుగురు చెన్నై బౌలర్లు 17 ఓవర్ల వరకు వైవిధ్యం చూపినా... వాళ్లిద్దరు మాత్రం అడ్డు అదుపు లేకుండా శరవేగంగా పరుగుల్ని రాబట్టారు. సెంచరీ మాత్రం ముందుగా శుబ్మన్ 50 బంతుల్లో పూర్తిచేయగా, తర్వాత సుదర్శన్ కూడా 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ పరుగుల తుఫాన్ను ఎట్టకేలకు డెత్ ఓవర్లకు గానీ విడగొట్టలేకపోయారు. తుషార్ వేసిన 18వ ఓవర్లో భారీ షాట్కు యత్నించిన సాయి సుదర్శన్... శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి నిష్క్ర మించాడు.దీంతో ఓపెనింగ్ వికెట్కు 210 పరుగుల భాగస్వామ్యానికి తెరపడటంతో చెన్నై శిబిరంలో తొలిసారి ఆనందం కనబడింది. అదే ఓవర్లో కెపె్టన్ గిల్ కూడా అవుట్ కావడంతో సూపర్కింగ్స్ ఊపిరి పీల్చుకుంది. అన్ని ఫోర్లు, ఇన్ని సిక్సర్లు... ఇద్దరివే! 17.2 ఓవర్లు ఓపెనర్లే ఆడారు. దీంతో స్కోరు బోర్డు పరుగందుకుంది. మెరుపులతో జోరందుకుంది. ఓపెనింగ్కు ఇరువైపుల వేగం, వేగం కనిపించడంతో మోదీ స్టేడియం గుజరాత్ అభిమానుల కేరింతలతో మార్మోగింది. సుదర్శన్, గిల్ ఇద్దరు అదేపనిగా దంచేయడంతో ఫోర్లతో సిక్సర్లు కూడా పోటీపడ్డాయి. 14 ఫోర్లు, 13 సిక్స్లు బాదేయడంతో 210 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంలో 134 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఆరో ఓవర్లో 50కి చేరిన గుజరాత్ స్కోరు... 100 పరుగుల్ని పదో ఓవర్లో దాటింది. 150 పరుగుల్ని మరింత వేగంగా 13వ ఓవర్లోనే అధిగమించింది. 17వ ఓవర్లో 200 మైలురాయికి చేరింది. ఆరంభంలోనే దెబ్బ తొలి ఓవర్లో రచిన్ రవీంద్ర (1), రెండో ఓవర్లో రహానే (1), మూడో ఓవర్లో కెపె్టన్ రుతురాజ్ (0) వరుస కట్టడంతో కొండంత లక్ష్యఛేదన చెన్నైకి అసాధ్యంగా మారింది. మిచెల్, మొయిన్ అలీ అర్ధసెంచరీలతో చేసిన పోరాటం సూపర్కింగ్స్ ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే ఉపయోగపడింది తప్ప... లక్ష్యంవైపు నడిపించలేకపోయింది. హిట్టర్ శివమ్ దూబే (21; 2 ఫోర్లు, 1 సిక్స్), జడేజా (18; 2 ఫోర్లు, 1 సిక్స్) టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్కు తలొగ్గారు. ధోని (11 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) ఆఖర్లో సిక్సర్లతో అలరించాడు. 2 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు సాధించడం ఇది రెండోసారి. 2019లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు బెయిర్స్టో, వార్నర్ తొలుత ఈ ఘనత సాధించారు.100 శుబ్మన్ గిల్ శతకం ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 100వ సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్ ప్రారంభమైన ఏడాది 2008 ఏప్రిల్ 18న జరిగిన తొలి మ్యాచ్లోనే కోల్కతా నైట్రైడర్స్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ మొదటి సెంచరీ చేశాడు. మొత్తం 17 ఐపీఎల్ సీజన్లలో ఇప్పటి వరకు 1084 మ్యాచ్లు జరిగాయి. 2 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో తొలి వికెట్కు 200 అంతకంటే ఎక్కువ పరుగుల భాగ స్వామ్యం నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే. 2022లో కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ (68 నాటౌట్), డికాక్ (140 నాటౌట్) తొలి వికెట్కు అజేయంగా 210 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) దూబే (బి) తుషార్ 103; శుబ్మన్ గిల్ (సి) జడేజా (బి) తుషార్ 104; మిల్లర్ (నాటౌట్) 16; షారుఖ్ ఖాన్ (రనౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–210, 2–213, 3–231. బౌలింగ్: సాన్ట్నర్ 2–0–31–0, తుషార్ 4–0–33–2, శార్దుల్ 4–0–25–0, సిమర్జీత్ 4–0–60–0, జడేజా 2–0–29–0, మిచెల్ 4–0–52–0. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) తెవాటియా (బి) సందీప్ వారియర్ 1; రచిన్ (రనౌట్) 1; రుతురాజ్ (సి) రషీద్ ఖాన్ (బి) ఉమేశ్ 0; మిచెల్ (సి) షారుఖ్ (బి) మోహిత్ 63; అలీ (సి) నూర్ అహ్మద్ (బి) మోహిత్ 56; దూబే (సి) నూర్ (బి) మోహిత్ 21; జడేజా (సి) మిల్లర్ (బి) రషీద్ 18; ధోని (నాటౌట్) 26; సాన్ట్నర్ (బి) రషీద్ 0; శార్దుల్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–10, 4–119, 5–135, 6–165, 7–169, 8–169. బౌలింగ్: ఉమేశ్ 3–0–20–1, సందీప్ వారియర్ 3–0–28–1, త్యాగి 4–0–51–0, నూర్ అహ్మద్ 2–0–25–0, రషీద్ ఖాన్ 4–0–38–2, మోహిత్ 4–0–31–3. ఐపీఎల్లో నేడుకోల్కతా X ముంబై వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs GT: సాయి సుదర్శన్, గిల్ సెంచరీల మోత.. ఆల్ టైమ్ రికార్డు సమం
ఐపీఎల్-2024లో అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్ సెంచరీల మోత మోగించారు. ఈ మ్యాచ్లో సుదర్శన్ ,గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సీఎస్కే బౌలర్లను ఉతికారేశారు. 51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 104 పరుగులు చేశాడు. కాగా తొలి వికెట్కు వీరిద్దరూ 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా ఐపీఎల్లో లక్నో ఆటగాళ్లు డికాక్, కేఎల్ రాహుల్ పేరిట ఉన్న 210 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును గిల్, సుదర్శన్ జోడీ సమం చేసింది.ఐపీఎల్-2022 సీజన్లో కేకేఆర్పై డికాక్, కేఎల్ రాహుల్ తొలి వికెట్ సరిగ్గా 210 పరుగుల పార్టనర్ షిష్ నమోదు చేశారు. అదే విధంగా ఈ క్యాష్రిచ్ లీగ్ చరిత్రలో ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో జోడీ వీరిద్దరూ నిలిచారు.ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి జోడి ఉంది. వీరిద్దరూ 2016 ఐపీఎల్ సీజన్లో విరాట్, ఏబీడీ జోడీ రెండో వికెట్కు 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. -
CSK Vs GT: సెంచరీలతో చెలరేగిన గిల్, సాయి.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్లు శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్ విధ్వంసం సృష్టించారు. కీలక మ్యాచ్లో గిల్, సాయి సుదర్శన్ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. సీఎస్కే బౌలర్లను వీరిద్దరూ ఓ ఆట ఆడుకున్నారు.51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 104 పరుగులు చేశాడు. తొలి వికెట్కు వీరిద్దరూ 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. సీఎస్కే బౌలర్లలో ఒక్క తుషార్ దేశ్పాండే మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దేశ్ పాండే రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా సాయిసుదర్శన్కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. Shubman Gill is one of the most aesthetic batsman in the world right now, what a hundred by Gujarat Titans captain ⭐❤️pic.twitter.com/iJZRy0VPDC— Shubman Gang (@ShubmanGang) May 10, 2024 -
సీఎస్కేతో గుజరాత్ కీలక పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కీలక పోరుకు సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో సీఎస్కే ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ గ్లీసన్ స్ధానంలో కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర వచ్చాడు. మరోవైపు గుజరాత్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. లిటిల్, వృద్దిమాన్ సాహా స్ధానంలో మాథ్యూ వేడ్, కార్తీక్ త్యాగీ వచ్చారు. కాగా గుజరాత్ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాల్సిందే. పాయింట్ల పట్టికలో సీఎస్కే నాలుగో స్ధానంలో ఉండగా.. గుజరాత్ ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయిసుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగిచెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమర్జీత్ సింగ్ -
MS Dhoni: ధోనిని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ గురించి ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని.. అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసునని పేర్కొన్నాడు.అదే విధంగా.. ధోని ఏ స్థానంలోనైనా ఆడగలడని అందుకే గత మ్యాచ్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడని ఫ్లెమింగ్ తెలిపాడు. కాగా గతేడాది నుంచి ధోని మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.అయినప్పటికీ 42 ఏళ్ల తలా ఐపీఎల్-2024 బరిలో దిగాడు. ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్ ఆడి 110 పరుగులు చేశాడు. అయితే, ఇటీవల పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా ధోని తన టీ20 కెరీర్లో తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ధోని నిర్ణయాన్ని తప్పుబట్టారు. జట్టు కోసం అతడు ఏడో స్థానంలోనే రావాలని.. అలా కాని పక్షంలో తుదిజట్టులో ఉండకూడదని ఘాటు విమర్శలు చేశారు.ఈ క్రమంలో మోకాలి నొప్పి కారణంగానే బ్యాటింగ్ తగ్గించి.. వికెట్ కీపర్గా పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సీఎస్కే హెడ్కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తాజాగా స్పందించాడు.గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం చెన్నై మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడు కేవలం సిక్సర్లు, ఫోర్లు కొట్టడమే కాదు.. ఏ స్థానంలో వచ్చినా తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలడు.అతడు తొమ్మిదో స్థానంలో వచ్చినంత మాత్రాన ప్రభావం చూపలేడని భావించవద్దు. జట్టు కోసం తనేం చేయగలడో తప్పకుండా చేస్తాడు.అతడి సేవలను అన్ని రకాలుగా మేము ఉపయోగించుకుంటాం. అయితే, ఒత్తిడి పెంచి అతడు జట్టుకు దూరమయ్యేలా చేసుకోలేం. జట్టు కోసం తను ఎల్లప్పుడూ పరితపిస్తాడు. అభిమానుల కోసం ఏమైనా చేస్తాడు. ప్రస్తుతం తన ఫిట్నెస్కు వచ్చిన ఇబ్బందులేమీ లేవు’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.కాగా ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్కే ఆడిన 11 మ్యాచ్లలో ఆరు గెలిచింది. 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అహ్మదాబాద్లో శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో పోరులో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలని పట్టుదలగా ఉంది. చదవండి: Mohammed Shami Slams LSG Owner: కాస్తైనా సిగ్గు పడండి.. కెమెరాల ముందు ఇలా చేస్తారా? -
సీఎస్కేతో పోరు.. గుజరాత్ గెలిచేనా?
-
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్, న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ తన మంచి మనుసును చాటుకున్నాడు. ఐపీఎల్-2024లో ధర్మశాల వేదికగా మే5న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు మిచెల్ బౌండరీ లైన్ నెట్స్లో తీవ్రంగా శ్రమించాడు. మిచిల్ ఫుల్ షాట్ ఆడగా.. బంతి ప్రమాదశాత్తూ స్టాండ్స్లో ఉన్న అభిమానికి తాకింది. వెంటనే పక్క సీట్లో పడిపోయాడు. ఈ క్రమంలో అతడి చేతిలో ఉన్న ఐ ఫోన్ గ్లాస్ సైతం బ్రేక్ అయింది. అదృష్టవశాత్తూ ఆ అభిమానికి ఎటువంటి గాయం కాలేదు. కానీ అతడి ఫోన్ మాత్రం పాడైపోయింది. ఇది చూసిన మిచెల్ అతడికి క్షమపణలు తెలిపాడు. అంతేకాకుండా తర్వాత అతడికి వద్ద తన బ్యాటింగ్కు గ్లౌవ్స్ను మిచెల్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శెభాష్ మిచెల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో అహ్మదాబాద్ వేదికగా మే 10న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. A guy got hurt and broke his iPhone during practice!!!Daz gave him his Gloves as a reward!!!💛👊🏻⭐️😎 pic.twitter.com/NkfAGp8Zph— AnishCSK💛 (@TheAnishh) May 7, 2024 -
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
పంజాబ్ కింగ్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు రావడంపై క్రీడా వర్గాల్లో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ధోని నిర్ణయాన్ని తప్పుబడుతూ ఘాటు విమర్శలు చేశారు.జట్టుకు అవసరమైనపుడు ధోని బ్యాటింగ్ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ భజ్జీ వ్యాఖ్యానించాడు. ధోని ఇలాంటి తప్పు చేస్తాడని అసలు ఊహించలేదంటూ కామెంట్ చేశాడు. అతడికి బదులు జట్టులో మరో అదనపు పేసర్ను తీసుకోవాలని సూచించాడు.మరోవైపు.. ఇర్ఫాన్ పఠాన్ సైతం.. 42 ఏళ్ల పైబడినా బ్యాటింగ్ చేయగల సత్తా ధోనికి ఉందని.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కనీసం 4-5 ఓవర్ల పాటు తలా క్రీజులో ఉండాలని సలహా ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. పంజాబ్తో అంతకు ముందు మ్యాచ్లోనూ ధోని డారిల్ మిచెల్తో కలిసి పరుగు తీసేందుకు వెనుకాడగా.. అదృష్టవశాత్తూ అతడు రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్లో సీఎస్కే ఓడిపోగా.. ధోని తీరుపై విమర్శలు వచ్చాయి.ఈ రెండు సందర్భాల్లోనూ ధోనిని తప్పుబట్టిన వాళ్లకు అతడి అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఇలా చేయడానికి ఇదే కారణమంటూ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న ధోని.. వికెట్ కీపర్గా సేవలు అందించే క్రమంలో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడన్నది దాని సారాంశం.ఇందుకు సంబంధించి సీఎస్కే వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మా ద్వితీయ శ్రేణి జట్టుతోనే ఎక్కువగా ఆడుతున్నాం. ధోనిని విమర్శించే వాళ్లకు అతడు చేస్తున్న త్యాగాల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు.జట్టు కోసం అతడు ఎంతగానో పరితపిస్తాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా అవసరమైనపుడు బ్యాటింగ్ చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఐపీఎల్-2024లో కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.ఇప్పటికే అదనపు వికెట్ కీపర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ధోనినే కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అయితే, మోకాలి నొప్పి తీవ్రం కాకుండా చూసుకునేందుకే బ్యాటింగ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్లలో సీఎస్కే ఆరు గెలిచి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్లలో గెలిచి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది. -
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. తొమ్మిదో స్థానంలో అతడు బ్యాటింగ్కు వచ్చిన నేపథ్యంలో మేనేజ్మెంట్తో పాటు ధోని నిర్ణయాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని బ్యాటింగ్ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా తన టీ20 కెరీర్లో ధోని తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు.పంజాబ్ కింగ్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో బౌలింగ్ ఆల్రౌండర్లు మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో బరిలోకి దిగగా.. వారి తర్వాత వచ్చిన ధోని గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు.తుదిజట్టులో ధోని అవసరమా?పంజాబ్ పేసర్ హర్షల్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని ఒకవేళ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటే.. అతడు అసలు ఆడనేకూడదు.అలాంటపుడు ధోని బదులు తుదిజట్టులో మరో అదనపు ఫాస్ట్ బౌలర్ను తీసుకోవడం మంచిది. నిజానికి ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్నది ధోని స్వతహాగా తీసుకున్న నిర్ణయమే అయి ఉంటుంది.అలా చేయడం ద్వారా తన జట్టును ప్రమాదంలోకి నెట్టాడు. ధోని కంటే ముందు శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ రావడం ఏమిటి? ఠాకూర్ ఎప్పుడైనా హిట్టింగ్ ఆడాడా?ధోని కావాలనే చేశాడు.. నాకైతే నచ్చలేదుధోని అనుమతి లేకుండా జట్టులో ఏమీ జరుగదు. కానీ ధోని ఈరోజు ఎందుకు ఇలాంటి తప్పు చేశాడో అర్థం కావడం లేదు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాలన్న ధోని నిర్ణయం నాకైతే అస్సలు నచ్చలేదు’’ అని భజ్జీ కుండబద్దలు కొట్టాడు.డెత్ ఓవర్లలో సీఎస్కే ఎక్కువ పరుగులు రాబట్టాలనుకుంటే ధోని కచ్చితంగా ఏడో స్థానంలో బ్యాటింగ్కు వస్తేనే బాగుంటుందని హర్భజన్ సింగ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.రవీంద్రుడి మాయాజాలం కాగా ధర్మశాల వేదికగా పంజాబ్తో ఆదివారం నాటి మ్యాచ్ సీఎస్కే 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43 పరుగులు, 3/20) వల్లే ఈ గెలుపు సాధ్యమైంది. ఇక ఫినిషింగ్ స్టార్ ధోని ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 110 పరుగులు చేశాడు.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. వసీం అక్రం కౌంటర్The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d— JioCinema (@JioCinema) May 5, 2024 -
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
చెన్నై సూపర్ కింగ్స్పై జైత్రయాత్రను కొనసాగించాలనుకున్న పంజాబ్ కింగ్స్కు భంగపాటు ఎదురైంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే 28 పరుగుల తేడాతో సామ్ కరన్ బృందాన్ని చిత్తు చేసింది.తద్వారా ఐపీఎల్లో వరుసగా ఆరోసారి సీఎస్కేపై గెలుపొందాలని భావించిన పంజాబ్కు చేదు అనుభవమే మిగిలింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్ మెరుపులతో పాటు.. స్పిన్ మాయాజాలంతో గైక్వాడ్ సేనకు ఈ విజయాన్ని అందించాడు.ఫలితంగా 2021 నుంచి చెన్నైపై పంజాబ్ కొనసాగిస్తున్న ఆధిపత్యానికి గండిపడింది. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరగడం మాత్రం నిరాశను కలిగించింది.ఐపీఎల్-2024లో మూడో మ్యాచ్ నుంచి బ్యాటింగ్ మొదలుపెట్టిన తలా.. పంజాబ్తో పోరుకు ముందు ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. వింటేజ్ ధోనిని గుర్తు చేస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు.కానీ ధర్మశాల మ్యాచ్లో ఈ ఫీట్ను పునరావృతం చేయలేకపోయాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ధోని హర్షల్ పటేల్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు.ఈ నేపథ్యంలో పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్తో పాటు ఫ్రాంఛైజీ సహ యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ధోని బౌల్డ్ కాగానే సీఎస్కే ఫ్యాన్స్ అంతా సైలెంట్ అయిపోగా.. ప్రీతి జింటా అయితే సీట్లో నుంచి లేచి నిలబడి మరీ ధోని వికెట్ను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d— JioCinema (@JioCinema) May 5, 2024కాగా సీఎస్కేతో మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(21 బంతుల్లో 32), వన్డౌన్ బ్యాటర్ డారిల్ మిచెల్(19 బంతుల్లో 30)తో పాటు రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43) రాణించారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ను జడ్డూ దెబ్బ కొట్టాడు. ప్రభ్సిమ్రన్ సింగ్(30), సామ్ కరన్(7), అశుతోశ్ శర్మ(3) రూపంలో కీలక వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో సీఎస్కే పంజాబ్ను 139 పరుగులకే పరిమితం చేసి.. ‘కింగ్స్’ పోరులో తామే ‘సూపర్’ అనిపించుకుంది.Full highlight of MS DHONI's greatest knock, 0(1). pic.twitter.com/FrlDKHKE5H— bitch (@TheJinxyyy) May 5, 2024 -
రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
ధర్మశాల: ఐపీఎల్ టోరీ్నలో వరుసగా ఆరోసారి చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించాలనుకున్న పంజాబ్ కింగ్స్ ఆశలను రవీంద్ర జడేజా వమ్ము చేశాడు. 2021 నుంచి పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐదు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఆరోసారి మాత్రం గెలుపు బావుటా ఎగురవేసింది. ధర్మశాలలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై 28 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై గెలిచి గత బుధవారం పంజాబ్ చేతిలోనే ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనతో చెన్నై విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ముందుగా జడేజా 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బంతితోనూ మెరిసి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ స్యామ్ కరన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు సాధించింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (21 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్), డరైల్ మిచెల్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి రెండో వికెట్కు 57 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో రాహుల్ చహర్ వరుస బంతుల్లో రుతురాజ్, శివమ్ దూబే (0)లను అవుట్ చేయగా... మిచెల్ను హర్షల్ పటేల్ పెవిలియన్కు పంపించాడు. దాంతో చెన్నై 69/1 నుంచి 75/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో ఇతర బ్యాటర్ల సహకారంతో జడేజా చెన్నైను ఆదుకున్నాడు. జడేజా కీలక ఇన్నింగ్స్తో చెన్నై స్కోరు 160 దాటింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24) రాణించారు. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేసి ఓడిపోయింది. తుషార్ పాండే (2/35) ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బెయిర్స్టో, రోసో లను అవుట్ చేసి పంజాబ్ను దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ప్రభ్సిమ్రన్, కరన్, అశుతోష్లను జడేజా... శశాంక్ను సాన్ట్నెర్ అవుట్ చేయడంతో పంజాబ్ గెలుపుపై ఆశలు వదులుకుంది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) రబడ (బి) అర్‡్షదీప్ 9; రుతురాజ్ (సి) జితేశ్ (బి) చహర్ 32; మిచెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్ 30; శివమ్ దూబే (సి) జితేశ్ (బి) చహర్ 0; మొయిన్ అలీ (సి) బెయిర్స్టో (బి) స్యామ్ కరన్ 17; జడేజా (సి) స్యామ్ కరన్ (బి) అర్‡్షదీప్ 43; సాన్ట్నెర్ (సి) స్యామ్ కరన్ (బి) చహర్ 11; శార్దుల్ (బి) హర్షల్ 17; ధోని (బి) హర్షల్ 0; తుషార్ (నాటౌట్) 0; గ్లీసన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–12, 2–69, 3–69, 4–75, 5–101, 6–122, 7–150, 8–150, 9–164. బౌలింగ్: రబడ 3–0–24–0, అర్‡్షదీప్ 4–0–42–2, స్యామ్ కరన్ 4–0–34–1, హర్ప్రీత్ బ్రార్ 1–0–19–0, రాహుల్ చహర్ 4–0–23–3, హర్షల్ పటేల్ 4–0–24–3. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (సి) సబ్–సమీర్ రిజ్వీ (బి) జడేజా 30; బెయిర్స్టో (బి) తుషార్ 7; రోసో (బి) తుషార్ 0; శశాంక్ (సి) సిమర్జీత్ (బి) సాన్ట్నెర్ 27; స్యామ్ కరన్ (సి) సాన్ట్నెర్ (బి) జడేజా 7; జితేశ్ (సి) ధోని (బి) సిమర్జీత్ (బి) 0; అశుతోష్ శర్మ (సి) సిమర్జీత్ (బి) జడేజా 3; బ్రార్ (నాటౌట్) 17; హర్షల్ (సి) సబ్–సమీర్ రిజ్వీ (బి) సిమర్జీత్ 12; చహర్ (బి) శార్దుల్ 16; రబడ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–62, 4–68, 5–69, 6–77, 7–78, 8–90, 9–117. బౌలింగ్: సాన్ట్నెర్ 3–0–10–1, తుషార్ దేశ్పాండే 4–0–35–2, గ్లీసన్ 4–0–41–0, జడేజా 4–0– 20–3, సిమర్జీత్ 3–0–16–2, శార్దుల్ 2–0–12–1. -
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ విజయంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్లో తొలుత బ్యాటింగ్లో 42 పరుగులతో అదరగొట్టిన జడ్డూ.. బౌలింగ్లో 3 వికెట్లు పడగొట్టాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను జడ్డూకు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరిచింది.ఈ క్రమంలో జడేజా పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే తరపున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా జడ్డూ నిలిచాడు. జడేజా ఇప్పటివరకు ఈ క్యాష్రిచ్ లీగ్లో 16 సార్లు మ్యాన్ ఆఫ్ది అవార్డులను గెలుచుకున్నాడు.ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ధోని రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. అదేవిధంగా మరో రికార్డును జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 40 పైగా పరుగులు, 3 వికెట్లు తీసిన ప్లేయర్గా యువరాజ్ సింగ్, షేన్ వాట్సన్ సరసన జడేజా చేరాడు. జడేజా ఇప్పటివరకు మూడు సార్లు 40 ప్లస్ స్కోర్, 3 వికెట్లు తీశాడు. యువీ, వాట్సన్ కూడా మూడు సార్లు ర్లు 40 ప్లస్ స్కోర్, 3 వికెట్లు తీశారు. -
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో సీఎస్కే గెలుపొందింది. ఈ విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్ధానానికి చేరుకుంది. సీఎస్కే విజయంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్లో 42 పరుగులతో అదరగొట్టిన జడ్డూ.. బౌలింగ్లో 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ విజయంపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. జట్టులో కొంతమంది ఆటగాళ్లు జ్వరంతో బాధపడుతున్నప్పటికి తమకు అద్బుతమైన విజయాన్ని అందించారని రుతురాజ్ కొనియాడాడు. "ధర్మశాల వికెట్ చాలా స్లోగా ఉంది. అంతే కాకుండా బంతి బాగా లో బౌన్స్ కూడా అయింది. తొలుత బ్యాటింగ్కు వచ్చేటప్పుడే మా స్కోర్ బోర్డులో 180-200 పరుగులు ఉంచాలనకున్నాము. కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాము. ఆ సమయంలో మాకు 160 నుంచి 170 పరుగుల మధ్య స్కోర్ వస్తే చాలు అని భావించాము. మేము సరిగ్గా 167 పరుగులు సాధించాము. ఈ స్కోర్ను మేము డిఫెండ్ చేసుకుంటామన్న నమ్మకం మాకు ఉండేది. మా బౌలర్లు న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సిమర్జీత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో తను తొలి మ్యాచ్ ఆడుతున్నప్పటికి తన అనుభవాన్ని చూపించాడు. అతడు గత సీజన్లో కూడా 150 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేశాడు. ఇక వికెట్లు కోల్పోయినప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటర్గా దించాలనుకున్నాము. బ్యాటర్ అయితే 10-15 పరుగులు అదనంగా చేస్తాడని భావించాము. కానీ ఆఖరి నిమిషంలో మా నిర్ణయాన్ని మార్చుకున్నాము. ఆ నిర్ణయమే మాకు విజయాన్ని అందించింది. సిమర్జీత్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్కు ముందు మా జట్టులో కొంత మంది ఆటగాళ్లు ప్లూ జ్వరంతో బాధపడ్డారు. మ్యాచ్ ముందు వరకు ఎవరూ జట్టు సెలక్షన్కు ఉంటారో క్లారిటీ కూడా లేదు. అటువంటిది ఈ మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో రుతు పేర్కొన్నాడు. -
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్)లో 150 క్యాచ్లు పట్టిన తొలి వికెట్కీపర్గా ఎంఎస్ ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో జితేష్ శర్మ క్యాచ్ను పట్టిన ధోని.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు.ఐపీఎల్లో ధోని ఖాతాలో ఇప్పటివరకు 141 క్యాచ్లతో పాటు 42 స్టంపింగ్లు కూడా ఉన్నాయి. ఈ ఘనత సాధించిన జాబితాలో ధోని తర్వాత ఆర్సీబీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఉన్నాడు. కార్తీక్ ఇప్పటివరకు ఐపీఎల్లో 141 క్యాచ్లు అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్పై సీఎస్కే 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా 43 పరుగులు చేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డార్లీ మిచెల్(30) పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. చెన్నై బౌలర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్పాండే, సిమ్రాజిత్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.