ఇంగ్లండ్‌ లక్ష్యం 371: ప్రస్తుతం 114/4 | England is heading towards defeat | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ లక్ష్యం 371: ప్రస్తుతం 114/4

Jul 2 2023 2:45 AM | Updated on Jul 2 2023 2:45 AM

England is heading towards defeat - Sakshi

లండన్‌: యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగడంతో ఇంగ్లండ్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. 371 పరుగుల లక్ష్యంతో  రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆసీస్‌ సీమర్లు స్టార్క్‌ (2/40), కమిన్స్‌ (2/20) వణికించారు. దీంతో ఆట నిలిచే సమయానికి ఇంగ్లండ్‌ 31 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. డకెట్‌  (50 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), స్టోక్స్‌ (29 బ్యాటింగ్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నారు.

సీమర్‌ స్టార్క్‌ ధాటికి ఓపెనర్‌ క్రాలీ (3), ఒలీ పోప్‌ (3) నిలువలేకపోయారు. కమిన్స్‌... రూట్‌ (18; 2 ఫోర్లు), బ్రూక్‌ (4)లను అవుట్‌ చేశాడు. విజయానికి ఇంకా 257 పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లండ్‌ చేతిలో 6 వికెట్లున్నాయి. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 130/2తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ్రస్టేలియా 101.5 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌటైంది.

డ్రింక్స్‌ విరామం వరకు ఖ్వాజా (77; 12 ఫోర్లు), స్మిత్‌ (34; 5 ఫోర్లు) బాగానే ఆడినప్పటికీ తర్వాత స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరితో పాటు హెడ్‌ (7) వికెట్‌ను కోల్పోయింది. రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 40 పరుగుల వ్యవ ధిలో మిగతా సగం వికెట్లను కోల్పోయి ఆలౌటైంది. బ్రాడ్‌ 4, టంగ్, రాబిన్సన్‌ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఆసీస్‌ ప్రత్యర్థి ముందు 371 లక్ష్యాన్ని నిర్దేశించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement