Ashes series
-
ఇంగ్లండ్ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్
మహిళల యాషెస్ సిరీస్-2025లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (జనవరి 17) జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ ఆష్లే గార్డ్నర్ (102 బంతుల్లో 102; 8 ఫోర్లు, సిక్స్) కెరీర్లో తొలి శతకంతో కదంతొక్కగా.. బెత్ మూనీ (64 బంతుల్లో 50; 4 ఫోర్లు), తహిళ మెక్గ్రాత్ (45 బంతుల్లో 55; 8 ఫోర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (12 బంతుల్లో 38 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఫోబ్ లిచ్ఫీల్డ్ 15, అలైసా హీలీ 15, ఎల్లిస్ పెర్రీ 2, అన్నాబెల్ సదర్ల్యాండ్ 10, అలానా కింగ్ 9, కిమ్ గార్త్ 1 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, నాట్ సీవర్ బ్రంట్, చార్లీ డీన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. లారెన్ ఫైలర్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.309 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 222 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ అలానా కింగ్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ను మట్టికరిపించింది. మెగాన్ షట్ మూడు, జార్జియా వేర్హమ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ట్యామీ బేమౌంట్ (54), నాట్ సీవర్ బ్రంట్ (61) అర్ద సెంచరీలతో రాణించగా.. డాన్ వ్యాట్ హాడ్జ్ (35), ఆమీ జోన్స్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ హీథర్ నైట్ 14, చార్లీ డీన్ 12, సోఫీ ఎక్లెస్టోన్ 2, లారెన్ బెల్ 6 (నాటౌట్) పరుగులు చేయగా.. మయా బౌచియర్, అలైస్ క్యాప్సీ, లారెన్ ఫైలర్ డకౌట్ అయ్యారు.కాగా, ప్రస్తుత యాషెస్ సిరీస్లో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. మల్టీ ఫార్మాట్లో జరుగుతున్న ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో ఆస్ట్రేలియా ఖాతాలో ఆరు పాయింట్లు (ఒక్కో వన్డేకు రెండు పాయింట్లు) ఉన్నాయి. ఆసీస్ మరో రెండు పాయింట్లు సాధిస్తే యాషెస్ సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఈ సిరీస్లో ఇంగ్లండ్ గెలవాలంటే మూడు టీ20లతో పాటు ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా గెలవాల్సి ఉంటుంది. -
Ashes Series 2025: రెండో వన్డే కూడా ఆసీస్దే
మహిళల యాషెస్ వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మెల్బోర్న్ వేదికగా ఇవాళ (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44.3 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. ఎల్లిస్ పెర్రీ (60) అర్ద సెంచరీతో రాణించింది. లిచ్ఫీల్డ్ (29), అలైసా హీలీ (29), బెత్ మూనీ (12), అన్నాబెల్ సదర్ల్యాండ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆష్లే గార్డ్నర్ 2, తహిళ మెక్గ్రాత్ 1, కిమ్ గార్త్ 9 పరుగులు చేశారు. మెగాన్ షట్ డకౌట్ కాగా.. డార్సీ బ్రౌన్ 4 పరుగులతో నాటౌట్గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలఓ సోఫీ ఎక్లెస్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టగా.. అలైస్ క్యాప్సీ 3, లారెన్ బెల్ 2, లారెన్ ఫైల్ ఓ వికెట్ దక్కించుకున్నారు.181 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కూడా తడబడింది. ఆ జట్టు 48.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి 159 పరుగులకే ఆలౌటైంది. ఆమీ జోన్స్ (103 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) టెస్ట్ మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ను గెలిపించే ప్రయత్నం చేసింది. నాట్ సీవర్ బ్రంట్ 35, కెప్టెన్ హీథర్ నైట్ 18, మయా బౌచియర్ 17, టామీ బేమౌంట్ 3, డానియెల్ వ్యాట్ హాడ్జ్ 0, అలైస్ క్యాప్సీ 14, చార్లోట్ డీన్ 3, సోఫీ ఎక్లెస్టోన్ 0, లారెన్ ఫైలర్ 7, లారెన్ బెల్ 1 పరుగు చేశారు. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్ మూడు, మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ వన్డే సిరీస్లో తొలి వన్డే కూడా ఆసీస్సే గెలిచింది. నామమాత్రపు మూడో వన్డే జనవరి 17న జరుగనుంది. -
యాషెస్ సిరీస్లో బోణీ కొట్టిన ఆసీస్
మహిళల యాషెస్ సిరీస్-2025లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఇవాళ (జనవరి 12) జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆష్లే గార్డ్నర్ ఆల్రౌండ్ షోతో (3/19, 42 నాటౌట్) అదరగొట్టి ఆసీస్ను గెలిపించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 43.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఆష్లే గార్డ్నర్ మూడు, కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్ల్యాండ్, అలానా కింగ్ తలో రెండు, డార్సీ బ్రౌన్ ఓ వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ హీథర్ నైట్ (39), వ్యాట్ హాడ్జ్ (38), ఆమీ జోన్స్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. టామీ బేమౌంట్ (13), నాట్ సీవర్ బ్రంట్ (19), సోఫీ ఎక్లెస్టోన్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. మయా బౌచియర్ 9, అలైస్ క్యాప్సీ 4, చార్లీ డీన్ 1, లారెన్ బెల్ 1, లారెన్ ఫైలర్ 8 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 38.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అలైసా హీలీ (70) ఆసీస్ గెలుపుకు పునాది వేయగా.. ఆష్లే గార్డ్నర్ (44 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) తన జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఫోబ్ లిచ్ఫీల్డ్ 4, ఎల్లిస్ పెర్రీ 14, బెత్ మూనీ 28, అన్నాబెల్ సదర్ల్యాండ్ 10, తహిళ మెక్గ్రాత్ 2, అలానా కింగ్ 11 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్ తలో రెండు, లారెన్ బెల్, చార్లెట్ డీన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మెల్బోర్న్ వేదికగా జనవరి 14న జరుగనుంది. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. యాషెస్ సిరీస్లో భాగంగా ఈ మ్యాచ్లన్నీ జరుగనున్నాయి. -
Aus vs Eng: యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల.. 43 ఏళ్ల తర్వాత ఇలా!
ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్కు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) బుధవారం షెడ్యూల్ను ప్రకటించింది. పెర్త్ వేదికగా వచ్చే ఏడాది నవంబరు 21 నుంచి ఇరుజట్ల మధ్య టెస్టులు మొదలవుతాయని తెలిపింది. అదే విధంగా.. పింక్ బాల్తో జరిగే రెండో టెస్టుకు ఐకానిక్ గాబా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొంది.ఇక ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టుకు అడిలైడ్ ఓవల్ మైదానం, బాక్సింగ్ డే మ్యాచ్కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ), ఆఖరి టెస్టుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికలుగా ఉంటాయని సీఏ తెలిపింది. కాగా యాషెస్ సిరీస్లో తొలి టెస్టుకు పెర్త్ ఆతిథ్యం ఇవ్వనుండటం 43 ఏళ్లలో ఇదే తొలిసారి.ఇంగ్లండ్లోడ్రాఇంగ్లండ్ వేదికగా జరిగిన గత యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ గెలవగా.. మూడో టెస్టులో ఫలితం తేలలేదు. నాలుగు, ఐదో టెస్టుల్లో ఇంగ్లండ్ గెలిచింది. ఇక ఈ ప్రతిష్టాత్మక తాజా సిరీస్ కంగారూ గడ్డపై జరుగనుంది.ఆసీస్ గడ్డపై గెలుపునకై తహతహఇదిలా ఉంటే.. 2010 నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా గెలవలేదు. 2010లో 3-1తో ఓడిన ఇంగ్లిష్ జట్టు.. ఆ తర్వాత ఇప్పటి వరకు మూడుసార్లు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఆడిన 15 టెస్టుల్లో 13 ఓడి.. రెండు డ్రా చేసుకుంది.ఇక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2021-2023 గెలిచిన ఆస్ట్రేలియా తదుపరి స్వదేశంలో టీమిండియాతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే ఈ మ్యాచ్లు ఆసీస్కు కీలకం.ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- యాషెస్ సిరీస్-2025- 26 షెడ్యూల్👉మొదటి టెస్టు- పెర్త్ స్టేడియం, నవంబరు 21-25, 2025👉రెండో టెస్టు- ది గాబా(డే, నైట్ పింక్బాల్ మ్యాచ్)- డిసెంబరు 4-8, 2025👉మూడో టెస్టు- అడిలైడ్ ఓవల్, డిసెంబరు 17- 21, 2025👉నాలుగో టెస్టు- ఎంసీజీ, డిసెంబరు 26- 30, 2025👉ఐదో టెస్టు- ఎస్సీజీ, జనవరి 4-8, 2026.చదవండి: అతడి స్థానంలో ఆడితే ఏంటి?; శతక ధీరుడిపై బాబర్ ఆజం పోస్ట్ వైరల్ -
ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు అప్కమింగ్ పేస్ గన్ జోష్ టంగ్ గాయం బారిన పడి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఇంగ్లండ్ టీమ్ సెలెక్టర్లు టంగ్ స్థానాన్ని వెటరన్ పేసర్ క్రిస్ జోర్డన్తో భర్తీ చేశారు. కాగా, యాషెస్-2023 సిరీస్కు ముందు జరిగిన ఐర్లాండ్ టెస్ట్తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన 25 ఏళ్ల టంగ్.. ఐర్లాండ్ మ్యాచ్తో పాటు యాషెస్ సిరీస్లోని లార్డ్స్ టెస్ట్లోనూ అద్భుతంగా రాణించాడు. ఈ రెండు మ్యాచ్ల్లో టంగ్ 25.7 సగటున 10 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ 5 వికెట్ల ఘనత కూడా ఉంది. ఇదిలా ఉంటే, 4 టీ20లు, 4 వన్డే సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈనెల (ఆగస్ట్) 30న ప్రారంభమయ్యే ఈ సిరీస్లలో తొలుత టీ20 సిరీస్ (ఆగస్ట్ 30 నుంచి సప్టెంబర్ 5 వరకు), ఆతర్వాత వన్డే సిరీస్ జరుగుతుంది. తొలి టీ20 ఆగస్ట్ 30న, రెండోది సెప్టెంబర్ 1న, మూడోది సెప్టెంబర్ 3న, నాలుగో టీ20 సెప్టెంబర్ 5న జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 8న తొలి వన్డే, సెప్టెంబర్ 10న రెండో వన్డే, సెప్టెంబర్ 13న మూడో వన్డే, సెప్టెంబర్ 15న నాలుగో వన్డే జరుగనున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ కోసం ఇంగ్లండ్ టీ20 జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డన్, ల్యూక్ వుడ్ -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో మొత్తం యాషెస్ స్టార్లే.. ఒక్కరు మాత్రం..!
2023 జులై నెలకు గాను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 7) ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ను ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్కరు మినహా మొత్తం యాషెస్ 2023 స్టార్లే ఉండటం విశేషం. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జాక్ క్రాలే, క్రిస్ వోక్స్లతో పాటు నెదర్లాండ్స్ ఆల్రౌండర్ బాస్ డి లీడ్ నామినేట్ కాగా.. మహిళల విభాగంలో ఆసీస్ ప్లేయర్స్ ఆష్లే గార్డ్నర్, ఎల్లిస్ పెర్రీతో పాటు ఇంగ్లండ్ నాట్ సీవర్ బ్రంట్ నామినేట్ అయ్యింది. పై పేర్కొన్న జాబితాలో నెదర్లాండ్స్ బాస్ డి లీడ్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ అదరగొట్టగా.. మిగతా ఐదుగురు పురుషులు, మహిళల యాషెస్లో ఇరగదీసారు. శ్రీలంకలో జరిగిన వన్డే వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో కనబర్చిన అత్యుత్తమ ఆల్రౌండ్ ప్రదర్శనకు (5/52, 123 (92)) గాను లీడ్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్).. యాషెస్ సిరీస్లో తొలి రెండు టెస్ట్లు మిస్ అయ్యి, మూడో టెస్ట్ నుంచి బరిలోకి దిగిన వోక్స్.. జులై నెలలో జరిగిన 3,4,5 యాషెస్ టెస్ట్ల్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సైతం దక్కించుకున్నాడు. వోక్స్ జులైలో ఆడిన 3 మ్యాచ్ల్లో 18.15 సగటున 19 వికెట్లు పడగొట్టాడు. జాక్ క్రాలే (ఇంగ్లండ్).. జులైలో జరిగిన 2, 3, 4, 5 యాషెస్ టెస్ట్ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన క్రాలే.. ఈ నాలుగు టెస్ట్ల్లో 58.85 సగటున 412 పరుగులు చేశాడు. ఇందులో మాంచెస్టర్ టెస్ట్లో అతను చేసిన 189 పరుగుల ఇన్నింగ్స్, నిర్ణయాత్మక ఐదో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో చేసిన 73 పరుగుల ఇన్నింగ్స్లు హైలైట్గా నిలిచాయి. ఆష్లే గార్డ్నర్ (ఆసీస్).. జూన్ నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు విన్నర్ అయిన ఆష్లే గార్డ్నర్ జులైలో జరిగిన మ్యాచ్ల్లో 232 పరుగులతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు వరుసగా రెండో నెల కూడా నామినేట్ అయ్యింది. ఎల్లిస్ పెర్రీ (ఆసీస్).. పెర్రీ.. జులై నెలలో ఇంగ్లండ్, ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ల్లో బ్యాట్తో అద్భుతంగా రాణించి (4 మ్యాచ్ల్లో 276 పరుగులు) తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. నాట్ సీవర్ బ్రంట్ (ఇంగ్లండ్).. మహిళల యాషెస్ సిరీస్లో భాగంగా జరిగిన 3 వన్డేల సిరీస్లో బ్రంట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఈ సిరీస్లో భాగంగా జులై నెలలో జరిగిన ఆఖరి 2 మ్యాచ్ల్లో ఈమె రెండు సెంచరీలు (111 నాటౌట్, 129) సాధించింది. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. -
ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్కు నైట్హుడ్.. ఇకపై "సర్" స్టువర్ట్ బ్రాడ్గా..!
కొద్ది రోజుల కిందట క్రికెట్కు గుడ్బై చెప్పిన ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్కు అత్యున్నత గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ క్రికెట్కు, ముఖ్యంగా ఇంగ్లండ్ క్రికెట్కు చేసిన సేవలకు గాను బ్రాడ్కు నైట్హుడ్ ఇవ్వాలని యూకే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఆంగ్ల పత్రిక డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. యూకే ఎంపీలంతా బ్రాడ్కు నైట్హుడ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. క్రికెట్ అభిమానులు, సాధారణ ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుందట. బ్రాడ్ నైట్హుడ్కు అర్హుడని యూకే ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ కూడా తీర్మానించిందట. ఇందుకు ఆ దేశ ప్రధాని రిషి సునక్ కూడా సుముఖంగా ఉన్నాడట. ఈ విషయాలను డైలీ మెయిల్ ఓ కథనంలో పేర్కొంది. ఒకవేళ బ్రాడ్కు నైట్హుడ్ ఇస్తే.. అతని పేరుకు ముందు "సర్" వచ్చి చేరుతుంది. క్రికెట్లో అతి తక్కువ మందికి ఈ గౌరవం దక్కింది. సర్ బిరుదు తొలుత ఇంగ్లండ్ ఆటగాడు ఫ్రాన్సిస్ ఎడెన్ లేసీ (1895-1946)కి దక్కింది. ఆతర్వాత క్రికెట్ దిగ్గజం, ఆసీస్ ఆటగాడు డాన్ బ్రాడ్మన్, జాక్ హాబ్స్ (ఇంగ్లండ్), లెన్ హటన్ (ఇంగ్లండ్), రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్), గ్యారీ సోబర్స్ (విండీస్), కర్ట్లీ ఆంబ్రోస్ (విండీస్), అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఆండ్రూ స్ట్రాస్ (ఇంగ్లండ్) వంటి పలువురు క్రికెట్ దిగ్గజాలు నైట్హుడ్ దక్కించుకున్నారు. భారత క్రికెటర్లలో విజయనగరం మహారాజ్కుమార్కు నైట్హుడ్ దక్కినప్పటికీ, అతనికి క్రికెటేతర కారణాల చేత ఈ గౌరవం దక్కింది. కాగా, ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్-2023 ఆఖరి టెస్ట్, మూడో రోజు ఆట సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి 2 టెస్ట్లు ఓడిపోయి వెనుకపడినప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని 2-2తో డ్రా చేసుకుంది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ విజయాల్లో బ్రాడ్ కీలకపాత్ర పోషించాడు. 22 వికెట్లతో సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. బ్రాడ్ అంతర్జాతీయ కెరీర్లో తానెదుర్కొన్న చివరి బంతిని సిక్సర్గా, తాను సంధించిన చివరి బంతిని వికెట్గా మలిచి ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్గా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఓవరాల్గా బ్రాడ్ టెస్ట్ల్లో ఐదో అత్యధిక వికెట్ టేకర్గా (604), ఓవరాల్గా ఏడో అత్యధిక వికెట్ టేకర్గానూ (847) రికార్డుల్లో నిలిచాడు. -
బెన్ స్టోక్స్కు చేదు అనుభవం.. లగేజి మిస్సింగ్! స్పందించిన ఎయిర్లైన్స్
ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య జరిగిన యాషెస్ సిరీస్-2023 డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. లండన్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించడంతో సిరీస్ 2-2తో సమమైంది. చివరి టెస్టు అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు వారి గమ్యస్ధానాలకు పయనమయ్యారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్కు చేదు అనుభవం ఎదురైంది. అతడు లండన్ నుంచి డర్హామ్కు బ్రిటీష్ ఎయిర్వేస్లో ప్రయాణం చేశాడు. ఈ సందర్భంగా అతడి లగేజి బ్యాగ్లు కన్పించకుండా పోయాయి. ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి కూడా తీసుకువెళ్లాడు. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ.. ఇంతవరకు లగేజీ అందించలేదని స్టోక్స్ ట్విటర్ వేదికగా తన ఆవేదనను తెలియజేశాడు.విమానంతో పాటు నా లగేజి రాలేదు. నేను మీ సహాయం కోసం ఎదురుచూస్తున్నా అని బ్రిటీష్ ఎయిర్వేస్ను ట్యాగ్ చేస్తూ స్టోక్స్ ట్వీట్ చేశాడు. వెంటనే దానికి సదరు విమానయాన సంస్థ కూడా స్పందించింది. "హాయ్ బెన్, మీకు ఆసౌకర్యం కలిగినందుకు చింతుస్తున్నాం. మీ వివరాలను మాకు పంపించండి. మేము పరిశీలిస్తాము" అని బ్రిటీష్ ఎయిర్వేస్ రిప్లే ఇచ్చింది. ఇక యాషెస్ తర్వాత స్టోక్స్ సుదీర్ఘ విరామం తీసుకోనున్నాడు. అతడు తిరిగి మళ్లీ వచ్చే ఏడాది జనవరిలో భారత్తో జరిగే టెస్టు సిరీస్తో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కాగా స్టోక్స్ ఇప్పటికే వైట్బాల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: IND vs WI: విండీస్తో రెండో టీ20.. శుబ్మన్ గిల్పై వేటు! విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ Bags not turned up off the plane @British_Airways and help would be greatly appreciated — Ben Stokes (@benstokes38) August 2, 2023 -
స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్లకు భారీ షాక్
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టులు ఆసీస్ నెగ్గితే.. మూడు, ఐదో టెస్టు ఇంగ్లండ్ నెగ్గింది. ఇక నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఐదోటెస్టు గెలిచిన ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పట్టికలో పాయింట్ల పరంగా ఆస్ట్రేలియాతో సమానంగా నిలిచింది. ఇరుజట్లు ఐదు టెస్టుల్లో రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో నిలిచాయి. ఈ లెక్కన ఇరుజట్లు 26 పాయింట్లు(43.33 పర్సంటేజీ పాయింట్స్)తో పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్కు ఈ మురిపెం ఒక్కరోజుకే పరిమితమైంది. తాజాగా బుధవారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు ఐసీసీ షాక్ ఇచ్చింది. యాషెస్ సిరీస్లో భాగంగా ఐదుటెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో జరిమానా విధించడంతో పాటు ఇరుజట్లకు డబ్ల్యూటీసీ పాయింట్లలోనూ భారీ కోత పడింది. ఆస్ట్రేలియా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. టెస్టుల్లో ఒకరోజుకు ఇన్నింగ్స్లో 90 ఓవర్లు వేయాల్సి ఉంటుంది(ఇరుజట్లు లేదా ఒకే జట్టు). అయితే ఆసీస్ నాలుగో టెస్టులో నిర్ణీత సమయంలోగా 10 ఓవర్లు తక్కువగా వేసినందుకు గానూ ఒక్క షార్ట్ ఓవర్ కింద ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఓవర్కు 5శాతం చొప్పున జరిమానాతో పాటు ఒక డబ్ల్యూటీసీ పాయింట్ కోత విధిస్తారు. ఈ లెక్కన ఆసీస్ 10 ఓవర్లు చొప్పున 10 డబ్ల్యూటీసీ పాయింట్లను కోల్పోయింది. ఇక మ్యాచ్లో ఆటగాళ్లకు 50శాతం జరిమానా విధించారు. ఇక ఇంగ్లండ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. యాషెస్లో జరిగిన ఐదు టెస్టుల్లో ఏకంగా నాలుగు టెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన ఇంగ్లండ్కు గట్టి దెబ్బపడింది. తొలి టెస్టుల్లో రెండు ఓవర్లు, రెండో టెస్టులో తొమ్మిది ఓవర్లు, నాలుగో టెస్టులో మూడు ఓవర్లు, ఇక చివరి టెస్టులో ఐదు ఓవర్లు.. మొత్తంగా 19 ఓవర్లు తక్కువ వేసింది. దీంతో ఒక ఓవర్ చొప్పున ఇంగ్లండ్కు 19 ఓవర్లకు 19 డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పడ్డాయి. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ జరిమానా పడింది. తొలి టెస్టులో 10 శాతం, రెండో టెస్టులో 45 శాతం, నాలుగో టెస్టులో 15శాతం, చివరి టెస్టులో 25శాతం జరిమానా విధించారు. దీంతో ఒక్కరోజు వ్యవధిలోనే డబ్ల్యూటీసీ పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకోవడం విశేషం. 19 పాయింట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ప్రస్తుతం 13 పాయింట్లు(15 పర్సంటేజీ పాయింట్స్)తో ఐదో స్థానానికి పడిపోయింది. ఇక 10 పాయింట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 30 పర్సంటేజీ పాయింట్స్తో మూడో స్థానంలో ఉన్నప్పటికి భారీగా పాయింట్లు కోల్పోవడం ఆ జట్టుకు దెబ్బ అని చెప్పొచ్చు. ఇక టీమిండియాతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఓటమి పాలైన విండీస్ 16.67 పర్సంటేజీ పాయింట్స్తో నాలుగో స్థానంలో నిలిచింది. The latest points table of WTC 2023-25: 1. Pakistan - 100% 2. India - 66.67% 3. Australia - 30% 4. West Indies - 16.67% 5. England - 15% pic.twitter.com/gaoojRbIUi — CricketMAN2 (@ImTanujSingh) August 2, 2023 🚨 Points Deduction 🚨 Due to slow over-rates during the Ashes series, England lost 19 points and Australia lost 10 points in the WTC points table. 🏴🇦🇺#WTC #Ashes #ENGvAUS pic.twitter.com/wdFXbSgDhu — Sportskeeda (@Sportskeeda) August 2, 2023 చదవండి: R Ashwin: 'టీమిండియా బజ్బాల్ ఆడితే జట్టులో ఎవరు మిగలరండి' -
చివరి టెస్టులో విజయం.. ఆసీస్తో సమానంగా ఇంగ్లండ్
యాషెస్ సిరీస్లో భాగంగా చివరి టెస్టును గెలిచిన ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే మూడో స్థానంలో ఉన్న డిపెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియాకు, ఇంగ్లండ్కు సమాన పాయింట్లు ఉండడం విశేషం. ఈ రెండు జట్లు 43.33 పర్సంటేజీ పాయింట్స్(PTC)తో 26 పాయింట్లు(ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా) కలిగి ఉన్నాయి. పెనాల్టీ కింద ఇరుజట్లకు రెండు పాయింట్లు కోత పడడంతో వారి పాయింట్స్లో వ్యత్యాసం లేకుండా పోయింది. ఇక తొలి రెండు స్థానాల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇటీవలే లంకపై టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన పాకిస్తాన్ 100 పర్సంటైల్తో 24 పాయింట్లతో(రెండు మ్యాచ్ల్లో రెండు గెలుపు) తొలి స్థానంలో ఉండగా.. టీమిండియా 66.67 పర్సంటైల్తో 16 పాయింట్లతో(రెండు మ్యాచ్ల్లో ఒక గెలుపు, ఒక డ్రా) రెండో స్థానాన్ని నిలుపుకుంది. ఇక వన్డే వరల్డ్కప్ ముగిసే వరకు ఏ జట్లకు టెస్టు సిరీస్లు లేవు. వరల్డ్కప్ ముగిశాకా టీమిండియా డిసెంబర్లో సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఆడనుంది. అటు పాకిస్తాన్ ఆస్ట్రేలియా గడ్డపై డిసెంబర్-జనవరిలో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టెస్టు సిరీస్ల ఫలితాల అనంతరం పాయింట్స్ టేబుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. చదవండి: WI Vs IND 3rd ODI: టాస్ గెలిచిన విండీస్.. ప్రయోగాలు వదలని టీమిండియా, సిరీస్ గెలిచేనా? Ben Stokes: 'తప్పుడు వార్తలు.. ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు' -
'తప్పుడు వార్తలు.. ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ గెలవడంతో ఇంగ్లండ్ కథ ముగిసేనట్లేనని అంతా భావించారు. కానీ మూడో టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో ఐదోటెస్టు ఇంగ్లండ్కు కీలకంగా మారింది. చివరి టెస్టు గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని భావించిన ఇంగ్లండ్ అందుకు తగ్గట్లుగానే బజ్బాల్ ఆటతీరుతో ఆసీస్ను కట్టడి చేసింది. కానీ 384 పరుగుల టార్గెట్ను ఆసీస్ చేధించేలా కనిపించింది. కానీ ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకోవడంతో ఆట ఐదోరోజు తొలి సెషన్లో కథ మొత్తం మారిపోయింది. ఆసీస్ తొందరగా వికెట్లు కోల్పోవడంతో 49 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. కాగా మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసీస్ ఆటగాళ్లు, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక దగ్గర చేరి డ్రెస్సింగ్రూమ్లోనే మందు కొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఖండించాడు. స్టోక్స్ మాట్లాడుతూ.. ''పార్జీ జరిగిన మాట నిజమే.. కానీ మీరు అనుకుంటున్నట్లు డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు. నిజానికి మ్యాచ్ ముగిసిన తర్వాత కరచాలనం అనంతరం ఆసీస్ ఆటగాళ్లు మా దగ్గరకు వచ్చారు. కానీ మా ప్రధాన ఆటగాళ్లు స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీ రిటైర్మెంట్పై స్పెషల్ స్పీచ్లతో చిన్న పార్టీ చేసుకున్నాం. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఒక గంటపాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. మేం బిజీగా ఉండడంతో మమ్మల్ని కలవకుండానే ఆసీస్ ఆటగాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిజానికి యాషెస్ సిరీస్ ముగిశాక ఆసీస్ ఆటగాళ్లతో కలిసి సంప్రదాయ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. కానీ బ్రాడ్, మొయిన్ అలీ రిటైర్మెంట్, ఇతర కార్యక్రమాల వల్ల కలవడం కుదరలేదు. అయితే ఆసీస్ ఆటగాళ్లతో కలిసి నైట్క్లబ్కు వెళ్లి పార్టీ ఎంజాయ్ చేయాలని నిశ్చయించుకున్నాం. నెలరోజుల పాటు యాషెస్ ఆడాం. ఎన్ని గొడవలు జరిగినా అది మ్యాచ్ల వరకే పరిమితం. బయట ఆ విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించుకోం.. సరదాగా ఎంజాయ్ చేయడానికి చూస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Ricky Ponting: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి' ఉస్మాన్ ఖవాజా అరుదైన ఘనత! యాషెస్ చరిత్రలో 26 ఏళ్ల తర్వాత.. -
Ashes 2023: ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డు! యాషెస్ చరిత్రలో..
The Ashes, 2023- England vs Australia: యాషెస్ సిరీస్-2023లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(141) సాధించి శుభారంభం అందుకున్న ఈ ఓపెనర్.. మొత్తంగా మూడు అర్ద శతకాలు కూడా సాధించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఓవరాల్గా 496 పరుగులతో మెరిశాడు. ఈ క్రమంలో యాషెస్ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన ఆసీస్ ఓపెనర్ల జాబితాలో చేరాడు. కాగా 1997లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ మాథ్యూ ఇలియట్ యాషెస్ సిరీస్లో మొత్తంగా 556 పరుగులు చేశాడు. అతడి కెరీర్ మొత్తంలో సాధించిన రన్స్లో సగానికి పైగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ సందర్భంగానే స్కోర్ చేయడం గమనార్హం. 26 ఏళ్ల తర్వాత.. ఈ నేపథ్యంలో 26 ఏళ్ల తర్వాత ఖవాజా అత్యధికంగా 496 పరుగులు సాధించి మాథ్యూ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. 1997 తర్వాత యాషెస్ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆసీస్ ఓపెనర్గా నిలిచాడు. ఆ రికార్డు మిస్! ఇదిలా ఉంటే.. 1948లో 39 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ యాషెస్లో 508 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక వయసులో 500కు పైగా రన్స్ సాధించిన ఆసీస్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో 496 పరుగుల వద్ద నిలిచిపోయిన 36 ఏళ్ల ఖవాజా.. బ్రాడ్మన్ తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బ్యాటర్గా రికార్డులకెక్కే అవకాశం కోల్పోయాడు. కాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్-2023 డ్రాగా ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొంది సిరీస్ను 2-2తో సమం చేయగా.. గత సిరీస్ గెలిచిన ఆసీస్ ట్రోఫీని తమ వద్దే అట్టిపెట్టుకోనుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న క్రిస్ వోక్స్.. మిచెల్ స్టార్క్తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పంచుకున్నాడు. యాషెస్-2023లో ఉస్మాన్ ఖావాజా సాధించిన పరుగులు ►ఎడ్జ్బాస్టన్ టెస్టులో- 141, 65. ►లండన్ టెస్టులో- 17, 77. ►లీడ్స్ టెస్టులో- 13, 43. ►మాంచెస్టర్ టెస్టులో- 3, 18. ►ఓవల్ మైదానంలో- 47, 72. చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ -
Moeen Ali Unseen Photos: ట్రెండింగ్లో ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ (ఫోటోలు)
-
'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి'
దాదాపు నెలరోజులకు పైగా అలరించిన యాషెస్ సిరీస్ ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి 'యాషెస్'ను ఎగురేసుకపోతుందని అంతా భావించారు. కానీ మూడో టెస్టును గెలిచిన ఇంగ్లండ్ 2-1కి ఆధిక్యం తగ్గించింది. ఇక నాలుగో టెస్టులో ఇంగ్లండ్కు గెలిచే అవకాశం వచ్చినప్పటికి వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక కీలకమైన ఐదోటెస్టులో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ విధించిన 384 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 334 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-2తో సమం చేసింది. అయినప్పటికి గత యాషెస్ను గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి ట్రోఫీని రిటైన్ చేసుకుంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకుంది. దాదాపు 37 ఓవర్ల పాటు అదే బంతితో బౌలింగ్ చేసింది. బంతి స్వింగ్ కాకపోవడంతో ఇంగ్లండ్ పేసర్లు ఎంత ప్రయత్నించినా వాళ్లను ఔట్ చేయలేకపోయారు. అయితే నాలుగో రోజు మార్క్ వుడ్ వేసిన ఒక బంతి ఖవాజా హెల్మెట్ ను బలంగా తాకింది. దీంతో ఆ బాల్ పాడవడంతో అంపైర్లు మరో బాల్ తీసుకున్నారు. అక్కడి నుంచే కథ మారిపోయింది. ఐదో రోజు ఉదయం ఆస్ట్రేలియా ఓపెనర్లును త్వరగా కోల్పోయింది. కాగా మ్యాచ్ ముగిశాకా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ బంతిని మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతిని మార్చడం వల్లే ఆస్ట్రేలియా మ్యాచ్ ఓడిందని పేర్కొన్నాడు. స్కైస్పోర్ట్స్తో మాట్లాడుతూ.. '' బంతి పరిస్థితి అంచనా వేయకుండానే దానిని మార్చాలని నిర్ణయించడం సరైంది కాదు. రెండు బంతులను పోలుస్తే సరైనవి చెప్పే మార్గంలో ప్రపంచంలో మరెక్కడా చూడలేదు. మధ్యలో అలా కొత్త బంతిని తీసుకోవడం సరైంది కాదు. మీరు ఒకవేళ బంతిని మార్చాలని భావిస్తే ఆ తరహాలోనే ఉండేలా చూడాలి. అంపైర్లు పరీక్షిస్తున్న పెట్టలో మరీ పాతబడిన బంతులు ఎక్కువగా లేవు. కొన్ని చూసినప్పటికి వాటిని పక్కన పడేశారు. పాత బంతి స్థానంలో కొత్తదానిని ఎంపిక చేసినట్లుగా ఉంది. ఐదోరోజు పిచ్ ఉదయం బౌలింగ్కు అనుకూలంగా ఉంది. నాలుగోరోజు చివర్లో బంతిని మార్చడం వల్ల ఇంగ్లండ్కు కలిసొచ్చింది. అందుకే ఈ విషయంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా. బాక్స్లో అలాంటి పాత బంతులు లేవా? లేకపోతే అంపైర్లు ఏదొకటి ఎంచుకుని ఆడించారా? అనేది తేలాలి. అప్పటికి 37 ఓవర్లు మాత్రమే ఆ బంతితో ఆట జరిగింది. కానీ మార్చిన బంతి మాత్రం దానికి తగ్గట్టుగా లేదు'' అంటూ పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక ఉస్మాన్ ఖవాజా మాట్లాడుతూ.. "వాళ్లు బంతిని మార్చగానే ఆ కొత్త బాల్ చాలా భిన్నంగా ఉన్నట్లు అర్థమైంది. అప్పుడే అంపైర్ కుమార్ ధర్మసేన దగ్గరికి వెళ్లి ఈ బాల్ ఎంత పాతది? 8 ఓవర్లు వేసినట్లు కనిపిస్తోంది అని అడిగాను. ఆ బంతి నా బ్యాట్ ను చాలా బలంగా తాకింది. యాషెస్ లో ప్రతి టెస్టులో ఓపెనింగ్ చేశాను. కానీ ఏ బంతి కూడా అంత బలంగా నా బ్యాట్ను తాకలేదు. కొత్తగా బ్యాటింగ్ చేయడానికి వచ్చే వాళ్లతో ఈ కొత్త బంతి కాస్త భిన్నంగా ఉందని చెప్పాను. కొన్ని విషయాలు మనం నియంత్రించలేము. ఇది నిరాశ కలిగించింది. ఇంగ్లండ్ ది క్లాస్ బౌలింగ్ అటాక్. వాళ్లకు కాస్త సందు దొరికినా దానిని అద్భుతంగా ఉపయోగించుకుంటారు" అని ఖవాజా అన్నాడు. "There's no way in the world you can look at those two balls there and say in any way that they're comparable" 😤 Ricky Ponting is NOT happy with that 'new' ball 😳 pic.twitter.com/maDFpv8RhM — Sky Sports Cricket (@SkyCricket) July 31, 2023 Won WC by boundary count now winning ashes by changing ball. Is this how a 40 overs old ball change would look alike @ECB_cricket ? pic.twitter.com/aJPWSB2qkZ — ̴D̴̴e̴̴e̴̴p̴̴s̴ (@vkrcholic) July 31, 2023 చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ -
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్..
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్కు మరోసారి విడ్కోలు పలికాడు. లండన్ వేదికగా జరిగిన యాషెస్ ఆఖరి టెస్టు అనంతరం మొయిన అలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. ఇంగ్లండ్ విజయంలో అలీ కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుతమైన విజయం అందించాడు. తొలిసారి అలా.. కాగా అంతకుముందు మొయిన్ అలీ 2021 సెప్టెంబర్లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ యాషెస్ సిరీస్-2023కు ముందు ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో యాషెస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ మెక్కల్లమ్ నచ్చచెప్పడంతో మెయిన్ అలీ టెస్టు రిటైర్మెంట్పై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో అతడిని ఈ ఏడాది యాషెస్ సిరీస్కు ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన అలీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్గా యాషెస్ 2023లో నాలుగు మ్యాచ్లో ఆడిన మొయిన్.. 180 పరుగులతో పాటు 9 వికెట్లు సాధించాడు. ఓ వైపు చేతి గాయంతో బాధపడుతున్నప్పటికీ తన వంతు సేవలను అలీ అందించాడు. ఇదే చివరి మ్యాచ్.. ఇక మ్యాచ్ అనంతరం మొయిన్ అలీ మాట్లాడుతూ.. "రిటైర్మెంట్ విషయం గురించి స్టోక్స్ నాకు మళ్లీ మెసేజ్ చేస్తే, వెంటనే డిలీట్ చేస్తాను. నేను వచ్చిన పని పూర్తి చేశాను. ఈ సిరీస్ను బాగా ఎంజాయ్ చేశాను. చివరి మ్యాచ్ను విజయంతో ముగించడం చాలా సంతోషంగా ఉంది. స్టోక్సీ నన్ను రీ ఎంట్రీ ఇవ్వమని అడిగినప్పుడు తొలుత నో చెప్పాను. ఎందకంటే నేను ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఎప్పుడూ బాగా ఆడలేదు. అందుకే నేను మళ్లీ ఆడను అని చెప్పా. స్టోక్స్ మాత్రం నాకు సపోర్ట్గా నిలిచి, నీవు అద్భుతంగా రాణించగలవని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను అని అన్నాడు. దీంతో మళ్లీ రెడ్ బాల్ క్రికెట్లో ఆడేందుకు ఒప్పుకున్నాను. మళీ జిమ్మీ,బ్రాడ్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్ వంటి జట్టుకు జాతీయ స్ధాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. చదవండి:IND Vs WI: టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు -
చివరి బంతికి సిక్స్.. వికెట్ కూడా! వారెవ్వా బ్రాడీ! వీడియో వైరల్
40 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన యాషెస్ సిరీస్కు ఎండ్ కార్డ్ పడింది. లండన్ వేదికగా జరిగిన యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ 2-2తో సమమైంది. అయితే గత సిరీస్ను గెలిచిన ఆసీస్ వద్దే ‘యాషెస్’ ఉండిపోనుంది. ఇక ఆఖరి రోజు 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్నైట్ స్కోరు 135/0తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆస్ట్రేలియా 94.4 ఓవర్లలో 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖ్వాజా(72), డేవిడ్ వార్నర్(60), స్టీవ్ స్మిత్(54) పరుగులతో రాణించినప్పటికీ.. ఓటమి మాత్రం తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మొయిన్ అలీ మూడు, బ్రాడ్ రెండు వికెట్లు సాధించారు. కెరీర్లో చివరి వికెట్ ఇక ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన టెస్టు కెరీర్కు చిరస్మణీయ ముగింపు పలికాడు. తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన బ్రాడ్.. రెండు కీలక వికెట్లు పడగొట్టి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. క్రీజులో పాతుకుపోయిన ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీని ఔట్ చేసి.. చారిత్రత్మక యాషెస్ సిరీస్ను సమం చేశాడు. ఆస్ట్రేలియా ఆఖరి రెండు వికెట్లు కూడా బ్రాడ్ సాధించినవే కావడం గమానార్హం. కాగా బ్రాడ్ ఫేర్వెల్ మ్యాచ్ చూడటానికి అతడి కుటంబ సభ్యులు స్టేడియంకి వచ్చారు. బ్రాడ్ తన కెరీర్ చివరి వికెట్ సాధించిగానే.. స్టాండ్స్లో ఉన్న అతడి కుటంబ సభ్యులు ఆనందంలో మునిగి తెలిపోయారు. కాగా అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 80 ఓవర్లోఆఖరి బంతిని బ్రాడ్ అద్భుతమైన సిక్సర్ మలిచాడు. అదే అతడి కెరీర్లో చివరి బంతి కావడం గమానర్హం. అదే విధంగా బౌలింగ్లో కూడా ఆఖరి బంతిని వికెట్తోనే ముగించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రికార్డుల రారాజు.. కెరీర్లో 167 టెస్ట్లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు (604) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ENG vs AUS: ఆఖరి మజిలీలో ఇంగ్లండ్దే విక్టరీ.. విజయంతో బ్రాడ్ విడ్కోలు A fairytale ending for a legend of the game. Broady, thank you ❤️ #EnglandCricket | #Ashes pic.twitter.com/RUC5vdKj7p — England Cricket (@englandcricket) July 31, 2023 -
ముందే సంబరపడితే ఇలాగే ఉంటది.. కీలకమైన స్టీవ్ స్మిత్ క్యాచ్ పట్టి వదిలేసిన స్టోక్స్
యాషెస్ సిరీస్ 2023 ఐదో టెస్ట్ చివరి రోజు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఘోర తప్పిదం చేశాడు. కీలక సమయంలో (లంచ్కు ముందు ఓవర్ తొలి బంతికి) మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే స్టీవ్ స్మిత్ (40) క్యాచ్ను జారవిడిచాడు. మొయిన్ అలీ బౌలింగ్లో స్మిత్ గ్లవ్స్ను తాకిన బంతిని లెగ్ గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్ అతికష్టం మీద (చాలా ఎత్తుకు ఎగిరి) పట్టుకున్నట్లే పట్టుకుని వదిలేశాడు. STOKES 😒pic.twitter.com/OUD88ZWZkF — CricTracker (@Cricketracker) July 31, 2023 సంబురాలు చేసుకునే తొందరలో స్టోక్స్ మోకాలికి తగిలి బంతి నేలపాలైంది. ఇంతటితో ఆగకుండా స్టోక్స్ రివ్యూకి వెళ్లి ఇంకో ఘోర తప్పిదం చేశాడు. రీప్లేలో బంతి స్మిత్ గ్లవ్స్కు తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. బంతి నిర్దిష్ట సమయం పాటు స్టోక్స్ చేతిలో లేకపోవడంతో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఇంగ్లండ్ అప్పీల్కు నాటౌట్ అని సమాధానం ఇచ్చాడు. దీంతో కీలక సమయంలో ఇంగ్లండ్కు వికెట్ దక్కకపోగా, రివ్యూ కోల్పోయింది. It's lunch on Day 5. Steve Smith and Travis Head keep Australia steady as teams head for Lunch. pic.twitter.com/8mTKpA0eXZ — CricTracker (@Cricketracker) July 31, 2023 కాగా, స్టోక్స్.. స్టీవ్ స్మిత్ క్యాచ్ జారవిడిచాక ఆట మరో 5 బంతుల పాటు సాగింది. అనంతరం అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు. ఇదే సమయంలో వర్షం కూడా మొదలైంది. లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 238/3గా ఉంది. స్టీవ్ స్మిత్ (40), ట్రవిస్ హెడ్ (31) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆసీస్ గెలవాలంటే 146 పరుగులు, ఇంగ్లండ్ విజయానికి 7 వికెట్లు కావాల్సి ఉంది. లంచ్ విరామ సమయం పూర్తయ్యాక కూడా వర్షం పడుతుండటంతో అంపైర్లు మ్యాచ్ను పాక్షికంగా నిలిపివేశారు. ఇదిలా ఉంటే, 384 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 135/0 ఓవర్నైట్ స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా, తొలి సెషన్లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కొత్త బంతితో ఇంగ్లండ్ పేసర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా క్రిస్ వోక్స్, మార్క్ వుడ్లు ఆసీస్ ఆటగాళ్లను వణికించారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (60), ఉస్మాన్ ఖ్వాజా (72).. తమ ఓవర్నైట్ స్కోర్లకు రెండు, మూడు పరుగుల చొప్పున జోడించి ఔట్ కాగా.. లబూషేన్ 13 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. -
Ashes 5th Test Day 5: ఆసీస్ను వణికిస్తున్న ఇంగ్లండ్ పేసర్లు.. తొలి సెషన్లోనే..!
యాషెస్ సిరీస్-2023లో ఆఖరి (ఐదవది) టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. 384 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 135/0 ఓవర్నైట్ స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా, తొలి సెషన్లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కొత్త బంతితో ఇంగ్లండ్ పేసర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా క్రిస్ వోక్స్, మార్క్ వుడ్లు ఆసీస్ ఆటగాళ్లను వణికిస్తున్నారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (60), ఉస్మాన్ ఖ్వాజా (72).. తమ ఓవర్నైట్ స్కోర్లకు రెండు, మూడు పరుగుల చొప్పున జోడించి ఔట్ కాగా.. లబూషేన్ 13 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. Chris Woakes gets David Warner early on Day 5. 📸: Sony LIV pic.twitter.com/yvj0U7KmiE — CricTracker (@Cricketracker) July 31, 2023 ఐదో రోజు ఆట ప్రారంభమయ్యాక 4వ ఓవర్ రెండో బంతికి క్రిస్ వోక్స్ బౌలింగ్లో వికెట్కీపర్ జానీ బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి డేవిడ్ వార్నర్ పెవిలియన్కు చేరగా.. ఆ వెంటనే ఆరో ఓవర్ రెండో బంతికి అదే క్రిస్ వోక్స్ బౌలింగ్లో ఉస్మాన్ ఖ్వాజా ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 49వ ఓవర్ ఆఖరి బంతికి మార్క్ వుడ్ బౌలింగ్లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి లబూషేన్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఆసీస్ 34 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి (169/3) బిక్కుబిక్కుమంటుంది. Chris Woakes is in the act for England.pic.twitter.com/UlekQeEhqX — CricTracker (@Cricketracker) July 31, 2023 లబూషేన్ ఔటయ్యాక కాస్త దూకుడు పెంచిన ఆసీస్ వేగంగా పరుగులు చేస్తూనే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. స్టీవ్ స్మిత్ (35 బంతుల్లో 21; 4 ఫోర్లు, ట్రవిస్ హెడ్ (25 బంతుల్లో 22; 4 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. 57 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 210/3గా ఉంది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 174 పరుగులు చేయాలి. అదే ఇంగ్లండ్ విజయం సాధించలాంటే మరో 7 వికెట్లు పడగొట్టాలి. తొలి సెషన్లో ఇప్పటివరకు 19 ఓవర్లు జరిగాయి. ఈ రోజు ఇంకా 71 ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. -
ఒకే ఓవర్లో 6 సిక్సర్లు! రియల్ లెజెండ్ అంటూ బ్రాడ్పై యువీ ట్వీట్.. వైరల్
Yuvraj Singh Tweet On Stuart Broad Retirement: ‘‘టేక్ ఏ బో.. స్టువర్ట్ బ్రాడ్! టెస్టుల్లో అసాధారణ రీతిలో సాగింది నీ ప్రయాణం. అందుకు నా అభినందనలు. రెడ్ బాల్ క్రికెట్లో బ్యాటర్లను భయపెట్టే అత్యద్భుతమైన బౌలర్లలో ఒకడివి నువ్వు. నువ్వు.. రియల్ లెజెండ్. నీ సుదీర్ఘ ప్రయాణం సాఫీగా సాగడానికి ఆట పట్ల నీకున్న అంకితభావమే కారణం. సూపర్ ఇన్స్పైరింగ్. నీ జీవితంలోని తదుపరి దశకు గుడ్లక్ బ్రాడీ!!’’ అంటూ టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. 17 ఏళ్ల కెరీర్కు గుడ్బై ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడికి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా అతడితో ఉన్న అరుదైన ఫొటోను యువీ అభిమానులతో పంచుకున్నాడు. కాగా 17 ఏళ్ల కెరీర్కు స్వస్తి పలుకుతూ స్టువర్డ్ బ్రాడ్ ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పీడకలను మిగిల్చిన యువీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఓవల్లో జరుగుతున్న ఐదో టెస్టు తనకు చివరిదని పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టెస్టుల్లో 600 దాకా వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్ 2016లోనే వన్డేలకు దూరమయ్యాడు. ఇక 2014లో ఇంగ్లండ్ తరఫున చివరి టీ20 ఆడిన బ్రాడ్కు.. యువరాజ్ సింగ్ ఓ పీడకలను మిగిల్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అంతర్జాతీయ టీ20లలో 2006లో అడుగుపెట్టిన బ్రాడ్.. 2007లో పొట్టిఫార్మాట్లో జరిగిన మొట్టమొదటి ప్రపంచకప్ ఈవెంట్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్ అతడికి కోలుకోలేని షాకిచ్చింది. బ్రాడ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సాధించి అతడికి కాళరాత్రిని మిగిల్చాడు. అందుకే వైరల్గా యువీ ట్వీట్ ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్.. 37 ఏళ్ల స్టువర్ట్ బ్రాడ్ను ఉద్దేశించి ఈ మేరకు లెజెండ్ అంటూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో బ్రాడ్ మూడు ఫార్మాట్లలో కలిపి 850 వికెట్ల దాకా పడగొట్టాడు. ఇంగ్లండ్ మేటి పేసర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. చదవండి: పిచ్చి ప్రయోగాలకు చెక్.. జట్టులోకి జట్టులోకి వారిద్దరూ! 9 ఏళ్ల తర్వాత Take a bow @StuartBroad8 🙇🏻♂️ Congratulations on an incredible Test career 🏏👏 one of the finest and most feared red ball bowlers, and a real legend! Your journey and determination have been super inspiring. Good luck for the next leg Broady! 🙌🏻 pic.twitter.com/d5GRlAVFa3 — Yuvraj Singh (@YUVSTRONG12) July 30, 2023 -
Ashes 5th Test Day 4: డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు
ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ల్లో అత్యధిక సార్లు (25) 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఉస్మాన్ ఖ్వాజాతో తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో వార్నర్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అతను జాక్ హబ్స్, గ్రేమ్ స్మిత్, అలిస్టర్ కుక్ (24)ల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో మైఖేల్ ఆథర్టన్ (23), వీరేంద్ర సెహ్వాగ్ (23) మూడో స్థానంలో ఉన్నారు. కాగా, యాషెస్ ఆఖరి టెస్ట్లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 38 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 135 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్కు నిలిపి వేశారు. ఆసీస్ గెలుపుకు ఇంకా 249 పరుగుల దూరంలో ఉంది. డేవిడ్ వార్నర్ (58), ఉస్మాన్ ఖ్వాజా (69) క్రీజ్లో ఉన్నారు. 2017-18 సిరీస్ తర్వాత తొలిసారి.. యాషెస్లో 2017-18 సిరీస్ తర్వాత తొలిసారి శతక భాగస్వామ్యం నమోదైంది. ఆ సీజన్లో ఆసీస్ ఓపెనింగ్ పెయిర్ వార్నర్-కెమరూన్ బాన్క్రాఫ్ట్ తొలి వికెట్కు 122 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేయగా.. తాజాగా జరుగుతున్న మ్యాచ్లో వార్నర్-ఖ్వాజా జోడీ అజేయమైన 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఏ వికెట్కైనా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన నాలుగో ఆటగాడిగా.. యాషెస్లో ఏ వికెట్కైనా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జాబితాలో వార్నర్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. యాషెస్లో వార్నర్ ఇప్పటివరకు 8 సెంచరీ పార్ట్నర్షిప్స్లో భాగమయ్యాడు. ఈ రికార్డుకు సంబంధించిన జాబితాలో జాక్ హబ్స్ (16) టాప్లో ఉండగా.. హెర్బర్ట్ సట్చ్క్లిఫ్ (15), మార్క్ టేలర్ (10) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. యాషెస్ ఐదో టెస్ట్ స్కోర్ వివరాలు (నాలుగో రోజు వర్షం అంతరాయం కలిగించే సమయానికి) ఇంగ్లండ్: 283 & 395 ఆసీస్: 295 & 135/0 -
పోతూ పోతూ రికార్డుల్లోకెక్కిన స్టువర్ట్ బ్రాడ్.. సిక్సర్తో..!
దిగ్గజ ఫాస్ట్ బౌలర్, ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్ స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్లో చివరాఖరి మ్యాచ్లో ఓ రికార్డు నమోదు చేశాడు. 37 ఏళ్ల బ్రాడీ అంతర్జాతీయ కెరీర్లో తానెదుర్కొన్న ఆఖరి బంతిని సిక్సర్గా మలిచి రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో బ్రాడ్ టెస్ట్ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. కెరీర్లో 167 టెస్ట్లు ఆడిన బ్రాడ్ 55 సిక్సర్లు బాది బెన్ స్టోక్స్ (124), కెవిన్ పీటర్సన్ (81), ఆండ్రూ ఫ్లింటాఫ్ (78), ఇయాన్ బోథమ్ (67) తర్వాతి స్థానాల్లో నిలిచాడు. Most sixes for England in Tests: 124* - Ben Stokes 81 - K Pietersen 78 - A Flintoff 67 - I Botham 55 - Stuart Broad@StuartBroad8 ends his Test career with fifth-most sixes for Englandpic.twitter.com/xLrFzLqIcd — CricTracker (@Cricketracker) July 30, 2023 ఆఖరి టెస్ట్ కావడంతో బ్యాటింగ్కు దిగే ముందు ఆసీస్ ఆటగాళ్ల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్న బ్రాడ్.. అభిమానుల కేరింతలు, చప్పట్ల ధ్వనుల మధ్య క్రీజ్లోకి వచ్చాడు. వచ్చీ రాగానే (నాలుగో రోజు తొలి ఓవర్ ఆఖరి బంతి) స్టార్క్ బౌలింగ్లో సిక్సర్ బాది స్టేడియంలో ఉన్నవారిని ఉర్రూతలూగించాడు. Australia wins hearts with their gesture.pic.twitter.com/5ewxALuy44 — CricTracker (@Cricketracker) July 30, 2023 అనంతరం మర్ఫీ వేసిన ఆ మరుసటి ఓవర్లో ఆండర్సన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 395 పరుగుల వద్ద ముగిసింది. కెరీర్లో ఆఖరి ఇన్నింగ్స్లో బ్రాడ్ (8, సిక్స్) నాటౌట్గా మిగిలాడు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ సాధించిన స్వల్ప లీడ్ను తీసేస్తే ఆ జట్టు టార్గెట్ 384 పరుగులైంది. ఛేదనకు దిగిన ఆసీస్.. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (39), డేవిడ్ వార్నర్ (30) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ విజయానికి 309 పరుగులు, ఇంగ్లండ్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. కాగా, కెరీర్లో 167 టెస్ట్లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు (602) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
స్టువర్ట్ బ్రాడ్కు జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు..
యాషెస్ సిరీస్ 2023 చివరి టెస్ట్ సందర్భంగా క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్కు తన కెరీర్లో చివరిసారి బ్యాటింగ్కు దిగిన సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఘనంగా మైదానంలోకి స్వాగతం పలికారు. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు బ్రాడ్.. తన చిరకాల సన్నిహితుడు ఆండర్సన్తో కలిసి బరిలోకి దిగుతుండగా, ఆసీస్ క్రికెటర్ల నుంచి బ్రాడ్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నాడు. Australia wins hearts with their gesture.pic.twitter.com/5ewxALuy44 — CricTracker (@Cricketracker) July 30, 2023 ఆసీస్ ఆటగాళ్లు ఇరువైపులా నిలబడి చప్పట్లతో బ్రాడ్ను మైదానంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రాడ్.. ఇవాళ (జులై 30) పుట్టినరోజు జరుపుకుంటున్న ఆండర్సన్ను కూడా తనతో పాటు మైదానంలోని అడుగుపెట్టాలని బలవంతం చేశాడు. అయితే ఇందుకు ఒప్పుకోని ఆండర్సన్, బ్రాడ్ ఒక్కడినే మైదానంలోకి సాగనంపాడు. Who's cutting onions? 🥺🥺pic.twitter.com/6wEoLEpp9Q — CricTracker (@Cricketracker) July 30, 2023 బ్రాడ్ మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఆసీస్ ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ఉన్నవారంతా లేచి నిలబడి చప్పట్లతో దిగ్గజ ఫాస్ట్ బౌలర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బ్రాడ్ భావోద్వేగానికి లోనైనట్లు కనిపించాడు. ఇంగ్లండ్ తరఫున సుదీర్ఘ టెస్ట్ కెరీర్ కలిగిన బ్రాడ్కు ఈ క్షణాలు చిరకాలం గుర్తుండిపోతాయి. అభిమానుల కేరింతలు, చప్పట్ల ధ్వనుల మధ్య క్రీజ్లోకి వచ్చిన బ్రాడ్.. వచ్చీ రాగానే (నాలుగో రోజు తొలి ఓవర్ ఆఖరి బంతి) స్టార్క్ బౌలింగ్లో సిక్సర్ బాది స్టేడియంలో ఉన్నవారిని ఉర్రూతలూగించాడు. అనంతరం మర్ఫీ వేసిన ఆ మరుసటి ఓవర్లో ఆండర్సన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 395 పరుగుల వద్ద ముగిసింది. కెరీర్లో ఆఖరి ఇన్నింగ్స్లో బ్రాడ్ (8) నాటౌట్గా మిగిలాడు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ సాధించిన స్వల్ప లీడ్ను తీసేస్తే ఆ జట్టు టార్గెట్ 384 పరుగులైంది. అనంతరం ఛేదనకు దిగిన ఆసీస్.. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (39), డేవిడ్ వార్నర్ (30) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ విజయానికి 309 పరుగులు, ఇంగ్లండ్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. -
ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడమే కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు
ప్రపంచక్రికెట్లో మరో శకం ముగిసింది. ఇంగ్లండ్ దిగ్గజం, స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్కు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ ఆఖరి టెస్టు అనంతరం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు అతడు వెల్లడించాడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంగ్రేటం చేసిన స్టువర్ట్ బ్రాడ్...తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాయిలను అందుకున్నాడు. అయితే ఒక సాధారణ స్ధాయి నుంచి ఇంగ్లండ్ లెజెండ్గా ఎదిగిన బ్రాడ్ నవ్వుల వెనుక గుండెలను పిండేసే వ్యథ దాగి ఉంది. ప్రీ మెచ్యూర్ బేబీ.. ఇంగ్లండ్ క్రికెట్ రారాజుగా ఎదిగిన బ్రాడ్ తన పుట్టకతోనే చావు అంచుల దాకా వెళ్లాడు. బ్రాడ్ ఒక ప్రీ మెచ్యూర్ బేబీ. తన తల్లికి నెలల నిండకముందే బ్రాడ్ జన్మించాడు. 12 వారాల ముందుగానే భూమిపైకి వచ్చాడు. అంటే వాళ్ల అమ్మ 6వ నెలలోనే అతడికి జన్మను ఇచ్చింది. బ్రాడ్ నాటింగ్హామ్లోని సిటీ హాస్పిటల్లో 24 జూన్ 1986న పుట్టాడు. బ్రాడ్ పుట్టినప్పుడు కేవలం 907 గ్రాములు. ఆ సమయంలో అతడు బ్రతుకుతాడని ఎవరూ ఊహించలేదు. అతడు ఊపిరి కూడా తీసుకోవడానికి కష్టపడేవాడు. దాదాపు నెల రోజుల పాటు ఇంక్యుబేటర్లోనే ఉంచారు. అయితే ఆఖరికి బ్రాడ్ మృత్యువును జయించాడు. కానీ అతడి ఊపిరితిత్తుల సమస్య మాత్రం పూర్తిగా నయం కాలేదు. అతడు ప్రీ మెచ్యూర్ బేబీ కావడంతో బ్రాడ్ ఊపిరితిత్తులు సరిగ్గా ఎదగలేదు. ఇప్పటికీ అతడు ఆస్తమాతో బాధపడుతున్నాడు. అతడు చాలా సందర్భాల్లో ఇన్హిల్లర్ వాడుతూ కన్పించేవాడు. బ్రాడ్కు చిన్నతనం నుంచే క్రీడలు అంటే చాలా ఇష్టం. అతడు శీతాకాలంలో ఫుట్బాల్, వేసవిలో క్రికెట్ ఆడేవాడు. కాగా అతడి తండ్రి క్రిస్ బ్రాడ్ కూడా ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించాడు. ఫస్ట్ క్లాస్ ఎంట్రీ బ్రాడ్ తన ఫాస్ట్ క్లాస్ కెరీర్ను 2005లో లీసెస్టర్షైర్ తరపున ప్రారంభించాడు. అనంతరం 2008లో నాటింగ్హామ్షైర్కు తన మకంను మార్చాడు. తన ఫస్ట్క్లాస్ కెరీర్లో 264 మ్యాచ్లు ఆడిన బ్రాడీ 948 వికెట్లు పడగొట్టాడు. అందులో 20 సార్లు పైగా 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను సాధించాడు. 2006లో అరంగేట్రం.. స్టువర్ట్ బ్రాడ్ 2006లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. సోఫియా గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్పై తన తొలి మ్యాచ్ బ్రాడ్ ఆడాడు. తన తొలి మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన బ్రాడ్..14 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అదే ఏడాది పాకిస్తాన్పై టీ20 డెబ్యూ చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్లోనే రెండు కీలక వికెట్టు పడగొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత 2007లో టెస్టు క్రికెట్లో కూడా బ్రాడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన అరంగేట్రం నుంచి ఇంగ్లీష్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతూ వచ్చిన బ్రాడ్.. 2016లో వైట్బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. తన చివరి వన్డే మ్యాచ్ 2016లో దక్షిణాఫ్రికాపై ఆడాడు. అప్పటి నుంచి 37 ఏళ్ల బ్రాడ్ కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతూ వస్తున్నాడు. తన కెరీర్లో కొన్నాళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్గా కూడా బ్రాడ్ వ్యవహరించాడు. రికార్డుల రారాజు.. 17 ఏళ్లు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన బ్రాడ్ ఎన్నో అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. బ్రాడ్ తన కెరీర్లో ఇప్పటివరకు 166 టెస్టుల్లో 600 వికెట్లు సాధించాడు. అదే విధంగా 121 వన్డేల్లో 178 వికెట్లు తీశాడు. 56 టి20ల్లో 65 వికెట్లు సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లండ్ తరుపున అత్యధిక టెస్టులు ఆడిన రెండో క్రికెటర్గా ఉన్నాడు. జెమ్స్ అండర్సన్ 182 మ్యాచ్లతో అగ్ర స్ధానంలో ఉండగా.. బ్రాడ్ 166 టెస్టులతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అదే విధంగా టెస్టుల్లో అత్యధిక వికెట్ల పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో బ్రాడ్ 600 వికెట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. 60 పరుగులకే ఆలౌట్.. 2015 యాషెస్ సిరీస్లో స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. ఈ సిరీస్లో కేవలం 15 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ సంచలన స్పెల్ కారణంగా ఆస్ట్రేలియా ఆ ఇన్నింగ్స్లో 60 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్లో బ్రాడ్ బ్యాటింగ్లో కూడా రాణించాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి 97 పరుగులు చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ కేవలం 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. టెస్టుల్లో సెంచరీ.. సాధరణంగా బాల్తో ప్రభావితం చూపే బ్రాడ్.. 2010లో లార్డ్స్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన టెస్టులో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. 8 స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన బ్రాడ్ 169 పరుగులతో అదరగొట్టాడు. ఓవరాల్గా తన టెస్టు కెరీర్లో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలతో 3640 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్కు చుక్కలే.. ఇక బ్రాడ్ తన టెస్టు కెరీర్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్కు చుక్కలు చూపిండాడు. గత కొన్ని ఏళ్ల నుంచి బ్రాడ్ బౌలింగ్ను ఎదుర్కొవడానికి వార్నర్ తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. బ్రాడ్ ఇప్పటి వరకు టెస్టుల్లో డేవిడ్ వార్నర్ని 17 సార్లు ఔట్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ప్లేయర్ని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్గా బ్రాడ్ చరిత్ర సృష్టించాడు. అదొక కాలరాత్రి.. టీ20 ప్రపంచకప్-2007లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ బ్రాడ్కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యువరాజ్ సింగ్, ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాది బ్రాడ్కు కలరాత్రిని మిగిల్చాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన సెడ్జింగ్ కారణంగా యువీ సిక్సర్ల వర్షం కురిపించాడు. చదవండి: చాలా బాధగా ఉంది.. మా ఓటమికి కారణం అదే! అతడొక అద్భుతం: హార్దిక్ -
రిటైర్మెంట్తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్
ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఓవల్లో జరుగుతున్న మ్యాచే తనకు చివరి టెస్టు అని 37 ఏళ్ల బ్రాడ్ వెల్లడించాడు. యాషెస్లో చివరి టెస్టుకు ముందు 166 టెస్టుల్లో 27.68 సగటుతో 600 వికెట్లు తీసిన బ్రాడ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో చివరి వన్డే ఆడిన బ్రాడ్ అప్పటినుంచి ఒక్క టెస్టులకే పరిమితమయ్యాడు. ఈతరం టెస్టు క్రికెట్లో గొప్ప బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు స్టువర్ట్ బ్రాడ్. తన సహచర పేసర్ జేమ్స్ అండర్సన్తో పోటీ పడి మరీ వికెట్లు తీసే బ్రాడ్ అర్థంతరంగా రిటైర్మెంట్ ఇవ్వడం అభిమానులకు షాక్ కలిగించింది. ఇక స్టువర్ట్ బ్రాడ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్. 2007 టి20 వరల్డ్కప్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో బ్రాడ్ బౌలింగ్లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఇప్పటికి బ్రాడ్ అనగానే ఆ ఆరు సిక్సర్లే కళ్లు ముందు కదలాడతాయి. అంతకముందు ఓవర్లో యువరాజ్తో ఆండ్రూ ఫ్లింటాఫ్ వైరం పెట్టుకున్నాడు. దీంతో యువరాజ్ కోపం ఆ తర్వాత బౌలింగ్కు వచ్చిన బ్రాడ్కు శాపంగా మారింది. ఓవరాల్గా స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్టుల్లో 3656 పరుగులు.. 602 వికెట్లు, 121 వన్డేల్లో 529 పరుగులు.. 178 వికెట్లు, 56 టి20ల్లో 118 పరుగులు.. 65 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014లో జరిగిన టి20 వరల్డ్కప్లో బ్రాడ్ ఇంగ్లండ్కు కెప్టెన్గానూ వ్యవహరించాడు. అయితే ఇంగ్లండ్ను సెమీస్ చేర్చడంలో బ్రాడ్ విఫలమయ్యాడు. BREAKING 🚨: Stuart Broad announces he will retire from cricket after the Ashes ends. pic.twitter.com/dNv8EZ0qnC — Sky Sports Cricket (@SkyCricket) July 29, 2023 Forever remembered for 𝘁𝗵𝗼𝘀𝗲 mesmerising spells, 𝘁𝗵𝗼𝘀𝗲 Ashes battles, 𝘁𝗵𝗼𝘀𝗲 602* wickets. Take a bow, Stuart Broad 👏#EnglandCricket | #Ashes pic.twitter.com/6WvdTW5AoA — England Cricket (@englandcricket) July 29, 2023 చదవండి: Ben Stokes: యాషెస్ చరిత్రలో తొలి బ్యాటర్గా రికార్డు; రోహిత్ను దాటలేకపోయాడు ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ -
యాషెస్ చరిత్రలో తొలి బ్యాటర్గా రికార్డు; రోహిత్ను దాటలేకపోయాడు
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తోంది. మూడోరోజు ఆటలో మూడో సెషన్లో బ్యాటింగ్ ఆడుతున్న ఇంగ్లండ్ ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. జో రూట్ 71, జానీ బెయిర్ స్టో 56 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవరాల్గా ఇంగ్లండ్ 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో నాలుగో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఆసీస్ ముంగిట ఇంగ్లండ్ కనీసం 400 పరుగుల టార్గెట్ను పెట్టాలని భావిస్తోంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన స్టోక్స్ 67 బంతుల్లో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ క్రమంలో స్టోక్స్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో స్టోక్స్ చోటు సంపాదించాడు. ఆసీస్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023లో స్టోక్స్ ఇప్పటివరకు 15 సిక్సర్లు బాదాడు. 2018-19లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో వెస్టిండీస్ ఆటగాడు హెట్మైర్ కూడా 15 సిక్సర్లు బాదాడు. ఇక తొలి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ 2019-20లో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో 19 సిక్సర్లు బాది తొలి స్థానంలో ఉన్నాడు. ఇక యాషెస్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన టెస్టు సిరీస్లు కలిపి ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్గా స్టోక్స్ రికార్డులకెక్కాడు. స్టోక్స్ తర్వాతి స్థానంలో కెవిన్ పీటర్సన్(2005 యాషెస్లో) 14 సిక్సర్లు బాదగా, 2019 యాషెస్లో మళ్లీ బెన్ స్టోక్స్ 13 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా.. 2005 యాషెస్లో ఆండ్రూ ఫ్లింటాఫ్ 11 సిక్సర్లు బాది నాలుగో స్థానంలో ఉన్నాడు. Ben Stokes straightaway in the mood. Smashes Josh Hazlewood for a six in the first over after Lunch. pic.twitter.com/z9Di8YY4PM — Mufaddal Vohra (@mufaddal_vohra) July 29, 2023 చదవండి: Cristiano Ronaldo: 'అవతలికి పో'.. కెమెరామన్పై రొనాల్డో అసహనం వాళ్లు లేరు.. వీళ్లకు ఛాన్స్.. బెడిసికొట్టిన ప్రయోగం! 8 బంతుల్లో ఒక్క పరుగు చేసి.. -
Ashes 2023: ఒకరి జెర్సీని మరొకరు.. 'మతిమరుపు' గానీ వచ్చిందా?
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి రోజు ఇంగ్లండ్ ఆలౌట్ అయితే.. రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు ఆలౌట్ చేశారు. కాగా ఆసీస్ కేవలం 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. మూడోరోజు ఆటలో లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 75 బంతుల్లో 73 పరుగులతో వేగంగా ఆడుతుండగా.. స్టోక్స్ కూడా 30 బంతుల్లో 20 పరుగులతో దాటిగా ఆడుతూ అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 128 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒకరి జెర్సీని మరొకరు ధరించారు. ఇది చూసిన అభిమానులకు కాసేపు అర్థం కాలేదు. ఇంగ్లండ్ ఆటగాళ్లు మరిచిపోయి ఒకరి జెర్సీ ఒకరు వేసుకున్నారేమోనని అభిప్రాయపడ్డారు. నిజానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలా జెర్సీలను మార్చుకోవడానికి ఒక కారణం ఉంది. అల్జీమర్స్(Dementia-మతిమరుపు)వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు మద్దతుగా బెన్ స్టోక్స్ బృందం ఒకరి జెర్సీలు మరొకరు ధరించారు. కెప్టెన్ స్టోక్స్ వికెట్ కీపర్ జానీ బెయిర్స్టో జెర్సీ వేసుకున్నాడు. మోయిన్ అలీ మాజీ కెప్టెన్ జోరూట్ జెర్సీతో వచ్చాడు. జేమ్స్ అండర్స్ మరో పేసర్ స్టువార్ట్ బ్రాడ్ జెర్సీతో దర్శనమిచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఒక్క చోట చేరారు. అల్జీమర్స్ సొసైటీ సభ్యులు ఆలపించిన పాట విన్నారు. ఆ తర్వాత మూడోరోజు ఆటను ప్రారంభించారు. అల్జీమర్స్ అనేది ఒక వృద్దాప్య సమస్య. 60 ఏళ్లు పైబడిన వాళ్లలో రోజు రోజుకు మతిమరుపు పెరుగుతుంటుంది. దాంతో, వాళ్లు అన్ని విషయాలు మర్చిపోతారు. కుటుంబసభ్యులను, ప్రాణ స్నేహితులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటారు. డిమెన్షియా వల్ల వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. A moving and powerful rendition of Jerusalem 👏@alzheimerssoc | #CricketShouldBeUnforgettable pic.twitter.com/cMC37JWC96 — England Cricket (@englandcricket) July 29, 2023 Today is the day! It's the @lv=Men's Ashes Test Match: Day 3 Supporting Alzheimer’s Society. 🏏 Huge thanks to the Kia Oval (@surreycricket) and @englandcricket - and sending lots of luck to our boys! 🤞 Great #CricketShouldBeUnforgettable https://t.co/oFsZXP1wXb pic.twitter.com/vbFrIO8HXj — Alzheimer's Society (@alzheimerssoc) July 29, 2023 చదవండి: ICC ODI WC 2023: గుడ్న్యూస్.. ఆగస్టు 10 నుంచి వన్డే వరల్డ్కప్ టికెట్లు అందుబాటులో! -
యాషెస్ చరిత్రలో తొలిసారి.. ‘అరుదైన’ రికార్డు బద్దలు! ఎంత గొప్పగా అంటే..
England vs Australia, 5th Test: ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ యాషెస్ సిరీస్లో ‘అరుదైన’ రికార్డు నమోదు చేశారు. యాషెస్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా స్లో ఇన్నింగ్స్ ఆడి రికార్డులకెక్కారు. కాగా లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య గురువారం ఐదో టెస్టు ఆరంభమైంది. లబుషేన్ జిడ్డు బ్యాటింగ్ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(47), డేవిడ్ వార్నర్(24) ఫర్వాలేదనిపించారు. అయితే, క్రిస్వోక్స్ బౌలింగ్లో వార్నర్ పెవిలియన్ చేరిన క్రమంలో వన్డౌన్లో వచ్చిన మార్నస్ లబుషేన్ జిడ్డు బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మొత్తంగా 82బంతులు ఎదుర్కొన్న అతడు 10.98 స్ట్రైక్రేటుతో కేవలం 9 పరుగులు సాధించాడు. రన్రేటు 1.61.. ఖవాజాతో కలిసి 26 ఓవర్ల ఆటలో.. రెండో వికెట్కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్క్వుడ్ బౌలింగ్లో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి లబుషేన్ అవుటయ్యే సమయానికి ఖవాజా 123 బంతులాడి 37 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఇక వీరిద్దరి పార్ట్నర్షిప్లో రన్రేటు 1.61గా నమోదైంది. వారి రికార్డు బద్దలు కొట్టి యాషెస్ చరిత్రలో.. ఒక ఇన్నింగ్స్లో కనీసం 150 బంతులు ఎదుర్కొని ఈ మేరకు అత్యల్ప రన్రేటుతో పరుగులు రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో 2013 నాటి అడిలైడ్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు మైకేల్ కార్బెర్రి, జోరూట్ 1.75 రన్రేటుతో 27 ఓవర్లలో 48 పరుగులు సాధించారు. ఖవాజా, లబుషేన్ ఇప్పుడు వారి రికార్డు బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘మీకంటే నత్త నయమనుకుంటా. మహగొప్పగా ఆడారు.. 1.61 రన్రేటు గ్రేటు’’ అంటూ ఖవాజా, లబుషేన్లను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐదో టెస్టులో మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ స్టీవ్ స్మిత్ 71 పరుగులతో రాణించడంతో.. ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 295 పరుగులు చేయగలిగింది. ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. చదవండి: 151 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా 104 మీటర్ల భారీ సిక్స్! వీడియో వైరల్ -
ఆసీస్ ఇంత చెత్తగా ఆడటం నా జీవితంలో చూడలేదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
The Ashes, 2023- England vs Australia, 5th Test: యాషెస్ సిరీస్-2023 ఐదో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శలు గుప్పించాడు. కంగారూ జట్టు ఇంత బెరుగ్గా, భయం భయంగా బ్యాటింగ్ చేయడం ఎన్నడూ చూడలేదన్నాడు. ఓవల్ మైదానంలో ఆసీస్ ప్రదర్శన చెత్తగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇప్పటికే 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ట్రోఫీ తమ వద్దే పెట్టుకునే అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై.. ఆఖరి మ్యాచ్లో గెలిచి 2-2తో సిరీస్ను డ్రా చేసుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. స్వల్ప ఆధిక్యంలో ఇక బజ్బాల్ విధానం పేరిట దూకుడుగా ఆడుతున్న స్టోక్స్ బృందం.. ఓవల్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. హ్యారీ బ్రూక్(85) మెరుగైన ప్రదర్శన కారణంగా తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో.. బ్యాటింగ్కు వచ్చిన ఆసీస్.. రెండో రోజు ఆట ముగిసే సరికి 295 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. ఇంత చెత్తగా ఆడటం ఎప్పుడూ చూడలేదు స్టీవ్ స్మిత్ అర్ధ శతకం(71) కారణంగా 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించగలిగింది. ఆచితూచి ఆడుతూ ఈ మేరకు స్కోరు సాధించింది. వన్డౌన్లో వచ్చిన మార్నస్ లబుషేన్ 82 బంతులు ఎదుర్కొని 9 పరుగులు మాత్రమే చేశాడంటే కంగారూల బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ స్పందిస్తూ.. ‘‘ఆస్ట్రేలియా ఇంత డిఫెన్సివ్గా ఆడటం ఎప్పుడూ చూడలేదు. సాధారణంగా వాళ్లు దూకుడుగా ఆడతారు. మ్యాచ్ చూసే వాళ్లకు మజా అందిస్తారు. కానీ ఈసారి.. బౌలర్లపై ఏమాత్రం ఒత్తిడి పెంచలేకపోయారు. నేనైతే ఆస్ట్రేలియా ఇంత చెత్తగా ఆడటం నా జీవితంలో ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. నిజం.. వాళ్లు గతంలో ఇలా అస్సలు ఆడలేదు’’ అని బీబీసీ మ్యాచ్ స్పెషల్ ప్రోగ్రామ్లో చెప్పుకొచ్చాడు. చదవండి: అస్సలు నేను ఊహించలేదు.. అతడు ఓపెనర్గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి -
82 బంతుల్లో 9 పరుగులు.. సూపర్ ఇన్నింగ్స్! మరో పుజారా అంటూ
లండన్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న యాషెస్ ఆఖరి టెస్టు రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 295 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 61/1 తో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన ఆసీస్ 151 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్మిత్ (71; 6 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 12 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే ఆసీస్కు లభించింది. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. లబుషేన్పై ట్రోల్స్.. ఇక ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ స్లో ఇన్నింగ్స్పై విమర్శల వర్షం కురుస్తోంది. అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో లబుషేన్ తన ఆటతీరుతో విసుగు తెప్పించాడు. 82 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన లబుషేన్.. ఆఖరికి వుడ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. లుబషేన్ స్లో ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ రెండో రోజు తొలి సెషన్లో కేవలం 54 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో లుబషేన్ను ఉద్దేశించి మరో ఛతేశ్వర్ పుజారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంగ్లండ్ బజ్బాల్కు వ్యతిరేకంగా లబుషేన్ ఆడుతున్నాడని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కాగా అంతకముందు నాలుగో టెస్టులో లబుషేన్ సెంచరీ నమోదు చేశాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి 162 పరుగులు చేశాడు. చదవండి: MLC 2023: జూనియర్ 'ఏబీడీ' సూపర్ ఇన్నింగ్స్.. ఫైనల్కు చేరిన ముంబై ఇండియన్స్ టీమ్ -
ఔటని వెళ్లిపోయిన స్మిత్.. ఇంగ్లండ్ కొంపముంచిన బెయిర్ స్టో తప్పిదం!
యాషెస్ సిరీస్ 2023లో మరో వివాదం తలెత్తింది. లండన్ వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్లో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ చాకచాక్యంగా వ్యవహరించడంతో.. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తృటిలో రనౌటయ్యే అవకాశాన్ని తప్పించుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే? ఆసీస్ ఇన్నింగ్స్ 78 ఓవర్ వేసిన క్రిస్ వోక్స్ బౌలింగ్లో మూడో బంతికి స్మిత్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. దీంతో స్మిత్ సింగిల్ పూర్తి చేసుకుని రెండో రన్ కోసం వికెట్ కీపర్ ఎండ్కు పరిగెత్తాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ జార్జ్ ఎల్హామ్ మెరుపు వేగంతో బంతిని అందుకుని వికెట్ కీపర్ జానీ బెయిర్స్టో వైపు త్రోచేశాడు. బంతిని అందుకున్న బెయిర్ స్టో వెంటనే బెయిల్స్ పడగొట్టాడు. స్మిత్ కూడా తన వికెట్ను కాపాడుకోవడానికి అద్భుతంగా డైవ్ చేశాడు. అయితే ఇంగ్లండ్ ఆటగాళ్లు ఔట్ అని సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ విల్సన్ థర్డ్ అంపైర్కు రీఫర్ చేశాడు. అయితే తొలుత రీప్లేలో బంతి వికెట్లకు తాకే సమయానికి స్మిత్ క్రీజులోకి రాలేదు. దాంతో అందరూ రనౌటని భావించారు. స్మిత్ కూడా తను ఔటని భావించి పెవిలియన్ వైపు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లాడు. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చేటు చేసుకుంది. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం పలుకోణాల్లో చాలాసేపు పరిశీలించి.. బెయిర్ స్టో బంతిని అందుకోక ముందే తన గ్లోవ్తో ఒక బెయిల్ను పడగొట్టినట్లు తేల్చాడు. అయితే మరో రెండు బెయిల్స్ కింద పడినప్పటికీ స్మిత్ క్రీజులోకి వచ్చేశాడు. దీంతో నితిన్ మీనన్ తన నిర్ణయాన్ని నాటౌట్గా ప్రకటించాడు. అది చూసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇంగ్లండ్ అభిమానులు మాత్రం అది ఔటే అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 295 పరుగులకు ఆలౌటైంది. స్మిత్ 75 పరుగులతో రాణించాడు. చదవండి: Zim Afro T10: యూసుఫ్ పఠాన్ ఊచకోత.. కేవలం 26 బంతుల్లోనే! వీడియో వైరల్ George Ealham 🤝 Gary Pratt An incredible piece of fielding but not to be... 😔 #EnglandCricket | #Ashes pic.twitter.com/yWcdV6ZAdH — England Cricket (@englandcricket) July 28, 2023 -
రాణించిన స్మిత్.. 295 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్ ఆఖరి ఐదో టెస్టులో ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్లో 103.1 ఓవర్లలో 295 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 61/1 తో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన ఆసీస్ 151 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్మిత్ (71; 6 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. కమిన్స్ (36; 4 ఫోర్లు), మర్ఫీ (34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తొమ్మిదో వికెట్కు 49 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లు వోక్స్ 3 వికెట్లు... బ్రాడ్, వుడ్, రూట్ తలా 2 వికెట్లు తీశారు. -
చరిత్ర సృష్టించిన స్టువర్ట్ బ్రాడ్.. తొలి ఇంగ్లండ్ బౌలర్గా
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ అరుదైన ఫీట్ సాధించాడు. యాషెస్ చరిత్రలో ఆసీస్పై 150 వికెట్లు తీసిన మొదటి ఇంగ్లండ్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ ఆఖరి టెస్టులో అతను ఈ మైలురాయిని అందుకున్నాడు. ఫామ్లో ఉన్న ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(47) ఎల్బీగా ఔట్ చేయడం ద్వారా బ్రాడ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా ఇంగ్లండ్ తరపున 166 టెస్టుల్లో 600 వికెట్లు, 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టి20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. ఈ దశాబ్దంలో టెస్టు క్రికెట్లో 600కు పైగా వికెట్లు తీసిన బౌలర్లలో బ్రాడ్ ఒకడిగా నిలిచాడు. ఇక అండర్సన్ తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్గానూ బ్రాడ్ రికార్డులకెక్కాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో తడబడుతోంది. ఇంగ్లండ్ను తక్కువకు ఆలౌట్ చేశామన్న ఆనందం ఆసీస్ నిలబెట్టుకోలేకపోయింది. వరుస విరామాల్లో ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు తీస్తుండడంతో ఆసీస్ ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 64 పరుగులు.. అర్థసెంచరీతో రాణించగా.. కెప్టెన్ కమిన్స్ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, మార్క్వుడ్లు రెండు వికెట్లు తీయగా.. అండర్సన్, వోక్స్, జోరూట్ తలా ఒక వికెట్ తీశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా 57 పరుగుల దూరంలో ఉంది. చదవండి: Japan Open 2023: సెమీస్కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి -
పాంటింగ్పై ద్రాక్ష పండ్లతో దాడి.. 'వాళ్లను ఊరికే వదలను'
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్కు ఇంగ్లండ్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ జరిగిన తీరు గురించి పాంటింగ్ మాట్లాడుతున్న సమయంలో స్టాండ్స్లో ఉన్న అభిమానుల్లో ఒక ఆకతాయి పాంటింగ్వైపు ద్రాక్షా పండ్లను విసిరారు. అవి నేరుగా పాంటింగ్ షూ వద్ద పడగా.. కొన్ని అతని మొహాన్ని తాకాయి. దీంతో అభిమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాంటింగ్.. తనపైకి ద్రాక్ష పండ్లు విసిరిన వ్యక్తిని పట్టుకోవాలని అక్కడి సెక్యూరిటీ అధికారులకు తెలిపాడు. ''నాపై ద్రాక్ష పండ్లతో దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని కనిపెట్టాల్సిందే.. వాళ్లు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు'' అంటూ పేర్కొన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలిరోజు ఆట ముగిసిన అనంతరం షో హోస్ట్ ఇయాన్ వార్డ్, రికీ పాంటింగ్లు స్పిన్నర్ టాడ్ మర్ఫీని ఇంటర్య్వూ చేశారు. ఇది ముగిసిన అనంతరం తొలిరోజు ఆట ఎలా జరిగిందన్న విషయాన్ని పాంటింగ్ వివరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలిరోజే ఆసక్తికరంగా సాగింది. ఇంగ్లండ్ను తొలిరోజే ఆలౌట్ చేయడంలో సక్సెస్ అయిన ఆస్ట్రేలియా ఆ తర్వాత బ్యాటింగ్లోనూ నిలకడను ప్రదర్శించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్ల దాటికి బ్రూక్ మినహా పెద్దగా ఎవరు రాణించలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 26, లబుషేన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ మరో 222 పరుగులు వెనుకబడి ఉంది. Hi @piersmorgan & @TheBarmyArmy Is this within the spirit of the game? Pelting grapes at Ponting who’s just a commentator. I know you’ve lost the Ashes and all talk about Sour grapes pic.twitter.com/xkewu1h8v3 — FIFA Womens World Cup Stan account ⚽️ (@MetalcoreMagpie) July 28, 2023 చదవండి: టీ20 వరల్డ్ కప్ 2024కు అర్హత సాధించిన ఐర్లాండ్.. Novak Djokovic: జొకోవిచ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. ఆందోళనలో అభిమానులు -
ఇంగ్లండ్ 283 ఆలౌట్
లండన్: ఆ్రస్టేలియాతో గురువారం మొదలైన యాషెస్ సిరీస్ చివరిదైన ఐదో టెస్టును ఇంగ్లండ్ అదే దూకుడుతో ప్రారంభించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 54.4 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్లు డకెట్ (41; 3 ఫోర్లు), జాక్ క్రాలీ (22; 3 ఫోర్లు), మొయిన్ అలీ (34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (91 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకట్టుకున్నారు. ఆసీస్ పేస్ బౌలర్ స్టార్క్ (4/82) రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. వార్నర్ (24) అవుటయ్యాడు. -
మొదలైన ఐదో టెస్టు.. ఇంగ్లండ్ గెలిచినా యాషెస్ కంగారులదే
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ఓవల్ వేదికగా ఐదో టెస్టు గురువారం ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగింది. కామెరాన్ గ్రీన్ ఈ టెస్టుకు దూరం కావడంతో అతని స్థానంలో స్పిన్నర్ టాడ్ మర్ఫీ తుదిజట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. బెన్ డకెట్ 29, జాక్ క్రాలీ 10 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్స్టో(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), జోష్ హేజిల్వుడ్, టాడ్ మర్ఫీ ఇంగ్లండ్ గెలిచినా ఆసీస్దే యాషెస్.. ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లో 2-1తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది. ఒకవేళ చివరి టెస్టులో ఇంగ్లండ్ గెలిచి 2-2తో సిరీస్ సమం అయినా యాషెస్ ట్రోఫీ మాత్రం ఆస్ట్రేలియా వద్దనే ఉంటుంది. చివరగా 2021లో జరిగిన యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా 4-1తో ఇంగ్లండ్పై నెగ్గింది. రూల్ ప్రకారం యాషెస్ సిరీస్ ఎప్పుడు జరిగినా సిరీస్ డ్రాగా ముగిస్తే గత ఎడిషన్లో ట్రోఫీ సాధించిన జట్టు వద్దే యాషెస్ ఉంటుంది. ఈ లెక్కన ఆస్ట్రేలియా చివరి టెస్టులో ఓడినా, డ్రా అయినా యాషెస్ మాత్రం వారి వద్దే ఉంటుంది. ఇక ఇంగ్లండ్ చివరిసారి 2015లో యాషెస్ దక్కించుకుంది. స్టోక్స్ సారధ్యంలో బజ్బాల్ ఆటతీరుతో దూకుడుగా కనిపిస్తున్న ఇంగ్లండ్ ఈసారి కచ్చితంగా యాషెస్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ డిఫెండింగ్ ఛాంపియన్ ఆటతీరు ప్రదర్శించిన ఆస్ట్రేలియా తొలి రెండు టెస్టుల్లో నెగ్గి ఇంగ్లండ్పై ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో టెస్టులో ఓడినప్పటికి.. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ దూకుడు చూపించినా.. వరుణుడి ఆటంకం, లబుషేన్ అద్భుత సెంచరీతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: Kylian Mbappe: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె! World cup 2023: భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు ఫుల్ డిమాండ్.. 10 సెకన్లకు 30 లక్షలు! -
వరల్డ్కప్ టోర్నీకి అందుబాటులో ఉండను.. హాలిడేకి వెళ్తున్నా: ఇంగ్లండ్ కెప్టెన్
Ben Stokes Ends Retirement U-turn speculation: ఇంగ్లండ్ అభిమానుల ఆశలపై వన్డే వరల్డ్కప్-2019 హీరో బెన్ స్టోక్స్ నీళ్లు చల్లాడు. ఈ ఏడాది జరుగనున్న మెగా టోర్నీకి అందుబాటులో ఉండే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టాడు. యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత తాను హాలిడే ట్రిప్నకు వెళ్లనున్నట్లు తెలిపాడు. కాగా స్వదేశంలో 2019లో జరిగిన ప్రపంచకప్ ఈవెంట్లో ఇంగ్లండ్ తొలిసారి చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. లండన్లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. స్టోక్స్ సూపర్ ఇన్నింగ్స్ కారణంగా మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా విజయం ఇంగ్లండ్ను వరించింది. అదే మొదటిసారి ఈ నేపథ్యంలో ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు మొట్టమొదటిసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఈసారి భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి మొదలుకానున్న ఈ ఐసీసీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. ఊహించని నిర్ణయంతో ఇదిలా ఉంటే.. అభిమానులు, జట్టుకు ఊహించని షాకిస్తూ స్టోక్స్ గతేడాది వన్డేలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో అతడు లేకుండానే ఈసారి ఇంగ్లండ్ ప్రపంచకప్ ఆడనుంది. అయితే, ఇటీవల.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్ మాథ్యూ మాట్, కెప్టెన్ జోస్ బట్లర్.. ఈ ఆల్రౌండర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆశలు రేపాయి. రిటైర్మెంట్ వెనక్కి బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయట్లు వాళ్లు సంకేతాలు ఇచ్చారు. ఈ విషయమై తాజాగా స్టోక్స్ను ప్రశ్నించగా.. ‘‘నేను రిటైర్ అయ్యాను. ఈ టెస్టు ముగిసిన తర్వాత నేను సెలవులు తీసుకుంటాను. ఇప్పటికైతే ఇంతవరకే నేను ఆలోచిస్తున్నాను’’ అని సమాధానమిచ్చాడు. దీంతో స్టోక్స్ వన్డే వరల్డ్కప్ ఆడే ఛాన్స్ లేదని స్పష్టమైంది. యాషెస్లో మాత్రం కాగా ఇంగ్లండ్ టెస్టు సారథిగా జో రూట్ నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత బజ్బాల్ విధానంతో స్టోక్స్ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. కోచ్ బ్రెండన్ మెకల్లమ్తో కలిసి దూకుడైన ఆటతో ప్రత్యర్థులను వణికిస్తున్నారు. అయితే, స్వదేశంలో ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో మాత్రం వారి పప్పులు ఉడకలేదు. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్ ట్రోఫీని తమ వద్దే పెట్టుకునే అర్హత సాధించింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- ఆసీస్ మధ్య గురువారం నిర్ణయాత్మక ఐదో టెస్టు జరుగనుంది. లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానం ఇందుకు వేదిక. చదవండి: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. అలా అయితే సచిన్, గంగూలీ! -
ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు!
England Remain Unchanged For Fifth Ashes Test: యాషెస్ సిరీస్-2023లో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఓవల్ వేదికగా జరుగనున్న మ్యాచ్లో మాంచెస్టర్లో ఆడిన జట్టునే కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. కాగా నాలుగో టెస్టులో విఫలమైన వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్పై విమర్శల నేపథ్యంలో.. ఆఖరి మ్యాచ్లోనూ ఇంగ్లండ్ అతడికి అవకాశం ఇవ్వడం విశేషం. కాగా లీడ్స్లో జరిగిన మూడో టెస్టులో అండర్సన్ మిస్ అయ్యాడు. ఈ క్రమంలో మాంచెస్టర్లో అతడికి ఛాన్స్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. వైఫల్యాలు కొనసాగిస్తూ గత వైఫల్యాలను కొనసాగిస్తూ కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లో మొత్తంగా 114 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 1000 వికెట్ల(ఫస్ట్క్లాస్)తో లెజెండరీ బౌలర్గా పేరు తెచ్చుకున్న అతడు.. తాజా యాషెస్ సిరీస్లో మాత్రం జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వంటి వాళ్లు ఘాటు విమర్శలు చేశారు. దీంతో.. ఆఖరి టెస్టులో అండర్సన్ ఆడిస్తారా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అతడిని కొనసాగిస్తున్నట్లు మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. దీంతో ఇంత మొండితనం పనికిరాదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 2-1తో ఆధిక్యంలో ఆస్ట్రేలియా అండర్సన్కు బదులు ఓలీ రాబిన్సన్, జోస్ టంగ్లలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కాగా జూలై 27 నుంచి ఇంగ్లండ్- ఆసీస్ మధ్య ఐదో టెస్టు ఆరంభం కానుంది. లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్లో.. 2-1తో ఆధిక్యంలో ఉన్న కమిన్స్ బృందంపై ఇంగ్లండ్ పైచేయి సాధిస్తుందా లేదా వేచి చూడాలి!! యాషెస్ 2023- ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలీ, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్. చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా.. -
Ashes 2023: అదొక్కటే మార్పు.. చివరి టెస్టులో వార్నర్కు చోటు!
The Ashes, 2023- England vs Australia, 5th Test: ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 తుది అంకానికి చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జూలై 27న ఆరంభం కానుంది. ఇక ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా రెండు, ఇంగ్లండ్ ఒక మ్యాచ్ గెలవగా.. నాలుగో టెస్టు వర్షార్పణం అయింది. ఆ ఒక్కటి గెలిచి కచ్చితంగా గెలుస్తామని భావించిన ఆతిథ్య ఇంగ్లండ్కు వరణుడు చేదు అనుభవం మిగల్చడంతో మాంచెస్టర్ డ్రాగా ముగిసిపోయింది. దీంతో.. ట్రోఫీ కోల్పోయినప్పటికీ ఐదో టెస్టు గెలిచి సిరీస్ సమం చేయాలని స్టోక్స్ బృందం ఆశిస్తోంది. అదే సమయంలో 2-1తో ఆధిక్యంలో ఉన్న పర్యాటక ఆసీస్ చివరి మ్యాచ్లోనూ సత్తా చాటి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఐదో టెస్టు తుది జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి టీమ్లో స్థానంలో కల్పించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ను పటిష్టం చేసే క్రమంలో మర్ఫీని నాలుగో టెస్టు నుంచి తప్పించి తప్పుచేశారని అభిప్రాయపడ్డారు. అదొక్కటే మార్పు ‘‘ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా ఏం చేయబోతోందో చూడాలి. నా లెక్క ప్రకారమైతే మర్ఫీని కచ్చితంగా జట్టులోకి తీసుకురావాలి. ఓవల్ మైదానంలో పిచ్ స్పిన్కు అనుకూలిస్తుంది. కాబట్టి అతడిని ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. మర్ఫీ ఒక్కడు తప్ప జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవనుకుంటున్నా. మాంచెస్టర్లో పర్వాలేదనిపించాడు. తక్కువ స్కోర్లకే పరిమితమైనా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తను ఓపెనర్గా రావడం ఖాయమనిపిస్తోంది’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా జూలై 27- 31 వరకు ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఐదో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. యాషెస్ ఐదో టెస్టుకు పాంటింగ్ ఎంచుకున్న ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), టాడ్ మర్ఫీ, జోష్ హాజిల్వుడ్. పాంటింగ్ ఇంగ్లండ్ తుదిజట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జోష్ టంగ్. చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా.. -
మొన్న యాషెస్.. నిన్న క్వీన్స్ పార్క్.. ఇవాళ కొలొంబో..!
ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు క్రికెట్ పాలిట విలన్లా తయారయ్యాయి. మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్న సమయంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు అభిమానులకు తెగ చిరాకు తెప్పిస్తున్నాయి. టీమిండియా, ఇంగ్లండ్ జట్లు విండీస్, ఆసీస్లపై గెలవాల్సిన మ్యాచ్లు వర్షాల కారణంగా డ్రాగా ముగియడంతో ఇరు దేశాల ఆటగాళ్లు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తాజాగా మరో మ్యాచ్ కూడా వర్షానికి బలయ్యేలా కనిపిస్తుంది. పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య కొలొంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు కేవలం 10 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో రెండో రోజు ఆట రద్దైనట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 166 పరుగులకు ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (87), బాబర్ ఆజమ్ (28) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ 12 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్కు ముందు ముగిసిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిన విషయం తెలిసిందే. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం ఆఖరి రోజు ఆటను పూర్తిగా తుడిచిపెట్టేయడంతో గెలవాల్సిన మ్యాచ్ను ఇంగ్లండ్ డ్రాతో సర్దుకోవాల్సి వచ్చింది. ఆఖరి రోజు మరో 5 వికెట్లు తీస్తే ఇంగ్లండ్ మ్యాచ్ గెలవడంతో పాటు యాషెస్ అవకాశాలను కూడా సజీవంగా ఉంచుకుని ఉండేది. కానీ, ఇంగ్లండ్ యాషెస్ అవకాశాలపై వరుణుడు నీళ్లు చల్లాడు. దీనికి ఒక రోజు తర్వాత (జులై 24) టీమిండియాను సైతం వర్షం ఇలాగే ముంచింది. గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా డ్రాతో సరిపెట్టుకుంది. విండీస్తో రెండో టెస్ట్ ఆఖరి రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడలేదు. ఆఖరి రోజు బౌలర్లు మరో 8 వికెట్లు తీసుంటే టీమిండియా మ్యాచ్ గెలిచి, సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసేది. వరుణుడు టీమిండియాను దెబ్బకొట్టి, క్లీన్స్వీప్ కాకుండా విండీస్ను కాపాడాడు. -
Ashes 5th Test: మొండిగా వెళ్తున్న టీమ్ ఇంగ్లండ్.. కీలక ప్రకటన
5 మ్యాచ్ల యాషెస్ సిరీస్లో చివరి టెస్ట్కు ముందు టీమ్ ఇంగ్లండ్ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగో టెస్ట్లో ఆడిన 14 మంది సభ్యుల జట్టునే ఐదో టెస్ట్లోనూ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. సిరీస్లో 1-2తో వెనుపడినప్పటికీ ఎలాంటి మార్పులు చేయకుండా మొండిగా ముందుకెళ్తుంది. గత మ్యాచ్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన జేమ్స్ ఆండర్సన్ను సైతం కొనసాగించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. వయసు మీద పడి జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేకపోతున్న ఆండర్సన్ను అయినా తప్పిస్తారని అంతా ఊహించినప్పటికీ.. ఇంగ్లీష్ మేనేజ్మెంట్ మాత్రం అనుభవజ్ఞుడైన ఆండర్సన్ను జట్టులో కొనసాగించేందుకు మొగ్గు చూపింది. తుది జట్టులో ఆండర్సన్కు అవకాశం ఇస్తుందో లేదో తెలీదు కానీ, 14 మంది సభ్యుల జట్టులో అతన్ని కొనసాగించి సంచలన నిర్ణయమే తీసుకుంది. ఎలాగూ యాషెస్ చేజారింది కాబట్టి, ఆండర్సన్ను ఆఖరి టెస్ట్ బరిలోకి దించి అతనిచే బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటన చేయించాలని అనుకుంటుదేమో కాని, మొత్తానికి ఆండర్సన్ను కొనసాగించి ఇంగ్లండ్ టీమ్ పెద్ద సాహసమే చేసింది. కాగా, నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ చేతి దాకా వచ్చిన గెలుపు వరుణుడి కారణంగా చేజారింది. ఆఖరి రోజు ఇంగ్లండ్ బౌలర్లు మరో 5 వికెట్లు తీస్తే మ్యాచ్ గెలిచే అవకాశంతో పాటు సిరీస్ అవకాశాలు కూడా సజీవంగా ఉండేవి. అయితే ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆఖరి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్ను డ్రా గా ప్రకటించారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ యాషెస్ను నిలబెట్టుకుంది. అంతకుముందు తొలి రెండు టెస్ట్ల్లో ఓటమిపాలైన ఇంగ్లండ్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని మూడో టెస్ట్ల్లో విజయం సాధించి, నాలుగో టెస్ట్లో గెలుపు అంచుల వరకు వచ్చింది. నాలుగో టెస్ట్లో వరుణుడి పుణ్యమా అని ఆసీస్ ఓటమి బారి నుంచి తప్పించుకుని యాషెస్ను నిలబెట్టుకుంది. చివరిదైన ఐదో యాషెస్ టెస్ట్ కియా ఓవల్ వేదికగా జులై 27 నుంచి ప్రారంభమవుతుంది. ఐదో యాషెస్ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు.. బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ రాబిన్సన్, జో రూట్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ -
అంతకు మించి! బొక్కబోర్లా పడ్డ ఇంగ్లండ్.. టీమిండియా వరల్డ్ రికార్డు!
West Indies vs India, 2nd Test: వెస్టిండీస్తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు ధనాధన్ ఇన్నింగ్స్తో అదరగొట్టారు. టెస్టు క్రికెట్లో ‘బజ్బాల్’ అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ను మించిపోయే విధంగా దంచికొట్టారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ 30 బంతుల్లో 38, రోహిత్ శర్మ 44 బంతుల్లో 57, నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 52(నాటౌట్) ఆకాశమే హద్దుగా బ్యాట్తో వీరవిహారం చేశారు. సంచలన ఇన్నింగ్స్తో సరికొత్త రికార్డు ఈ ముగ్గురి అద్భుత ఆట తీరు కారణంగా రెండో ఇన్నింగ్స్లో2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది భారత జట్టు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి విండీస్కు 365 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో ట్రినిడాడ్ టెస్టులో సంచలన ఆట తీరుతో టీమిండియా టెస్టుల్లో చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా పేరిట ఉన్న అరుదైన రికార్డు బద్దలు కొట్టి సత్తా చాటింది. కాగా విండీస్తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 24 ఓవర్లలో రోహిత్ సేన 7.54 రన్రేటుతో 181 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. తద్వారా టెస్టుల్లో కనీసం 20 ఓవర్ల ఆటలో అత్యధిక రన్రేటుతో ఎక్కువ పరుగులు రాబట్టిన జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది. ఆస్ట్రేలియా అప్పుడలా అంతకు ముందు ఆస్ట్రేలియా.. 2017లో సిడ్నీలో పాకిస్తాన్తో జరిగిన టెస్టు మ్యాచ్లో 32 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 7.53 రన్రేటుతో 241 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఆసీస్ను వెనక్కి నెట్టి ఈ జాబితాలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది. అంతేకాదు.. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగుల మార్కు అందుకున్న జట్టుగా శ్రీలంక పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించింది. ఇది ద్రవ్బాల్.. ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బజ్బాల్ కాదు.. అంతకుమించి! ఇది ‘ద్రవ్బాల్’(హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ను ఉద్దేశించి). ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. వాట్ టుడూ వాట్ నాట్ టుడూ’’ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అయితే, విండీస్ లాంటి బలహీన(ప్రస్తుతం) జట్టుపై ఆడటం కాదు.. పటిష్ట జట్లపై ప్రతాపం చూపాలని పెదవి విరిచేవాళ్లూ లేకపోలేదు. మెకల్లమ్ వచ్చిన తర్వాత కాగా న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆట తీరులో పలు మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ నాయకత్వంలో మెకల్లమ్ మార్గదర్శనంలో పరిమిత ఓవర్ల మాదిరే టెస్టు క్రికెట్లోనూ దూకుడుగా ఆడుతోంది. ఈ క్రమంలో బజ్బాల్ ఫేమస్ అయింది. అయితే, ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్-2023లో మాత్రం ఈ విధానంతో ఇంగ్లండ్ బొక్కబోర్లా పడింది. ఇప్పటికే 1-2తో వెనుకపడి ట్రోఫీని కోల్పోయే దుస్థితి తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ట్రినిడాడ్లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి వెస్టిండీస్ 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా 289 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: Ashes 2023: లెజెండ్ కదా అని మొహమాటానికి పోయి జట్టులో పెట్టుకున్నందుకు... -
Ashes 2023: లెజెండ్ కదా అని మొహమాటానికి పోయి జట్టులో పెట్టుకున్నందుకు...
దిగ్గజ పేసర్, ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. యాషెస్ సిరీస్-2023లో ఇంగ్లండ్ నష్టపోవడానికి ఆండర్సన్ ప్రధాన కారణమని ఆరోపించాడు. లెజెండ్ బౌలర్ కదా అని మొహమాటానికి పోయి జట్టులో పెట్టుకున్నందుకు ఇంగ్లండ్ టీమ్ తగిన మూల్యం చెల్లించుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్లో ఆండర్సన్ ఏమాత్రం ప్రభావం చూపలేదని, ఒక్కటంటే ఒక్క కీలక వికెట్ కూడా తీసి జట్టుకు ఉపయోగపడింది లేదని ఫైరయ్యాడు. యాషెస్ సిరీస్ 2023లో పేలవ ప్రదర్శనకు గాను ఆండర్సన్ను తూర్పారబెట్టిన వాన్.. మరోవైపు నుంచి కవర్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. ఆండర్సన్ను దిగ్గజ బౌలర్గా పరిగణించడాన్ని ఎవరూ కాదనలేరని, జట్టులో చోటుకు అతను వంద శాతం అర్హుడే అని అంటూనే ఆండర్సన్ సేవల వల్ల ఇంగ్లండ్కు ఒరిగిందేమీ లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. వర్షం కారణంగా నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన అనంతరం బీబీసీ యాషెస్ డైలీ పోడ్కాస్ట్తో మాట్లాడుతూ వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఇప్పటివరకు జరిగిన 4 యాషెస్ టెస్ట్ల్లో 3 మ్యాచ్లు ఆడిన ఆండర్సన్ 114 ఓవర్లు వేసి కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. వాన్ చెప్పినట్లు ఆండర్సన్ పేలవ ప్రదర్శన కారణంగా ఇంగ్లండ్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఆండర్సన్ స్థానంలో మరే బౌలర్ను తీసుకున్నా ఫలితాలు ఇంగ్లండ్కు అనుకూలంగా ఉండేవి. నాలుగో టెస్ట్లో అయితే ఆండర్సన్ ప్రదర్శన అరంగేట్రం బౌలర్ కంటే దారుణంగా ఉండింది. నాలుగో రోజు ఆండర్సన్ ఏ మాత్రం ప్రభావం చూపించినా ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచి, సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకునేది. మొత్తంగా చూస్తే కెరీర్లో సుమారు 1000 వికెట్లు తీసిన దిగ్గజ బౌలర్ ప్రస్తుతం జట్టుకు భారంగా మారాడు. ఐదో టెస్ట్లో అయినా ఇంగ్లండ్ మేనేజ్మెంట్ మేల్కొనకపోతే ఇంతకుమించిన భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. దిగ్గజ బౌలర్, కెరీర్ చరమాంకంలో ఉన్నాడు అని ములాజకు పోతే ఐదో టెస్ట్లో కూడా ఇంగ్లండ్కు భంగపాటు తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆఖరి మ్యాచ్లో ఆండర్సన్ను పక్కకు పెట్టి ఓలీ రాబిన్సన్, జోస్ టంగ్లలో ఎవరో ఒకరిని ఆడించాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, నిన్న ముగిసిన నాలుగో టెస్ట్ డ్రా కావడంతో ఆసీస్ యాషెస్ను నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆ జట్టు యాషెస్ను ఈ దఫా కూడా తమ వద్దనే ఉంచుకోనుంది. ఒకవేళ ఇంగ్లండ్ ఆఖరి టెస్ట్ గెలిచినా సిరీస్ 2-2తో డ్రా అవుతుందే తప్ప ఇంగ్లండ్కు ఒరిగేదేమీ లేదు. -
ఆసీస్దే ‘యాషెస్’ సిరీస్
మాంచెస్టర్: నాలుగో టెస్టులో గెలిచి యాషెస్ సిరీస్లో సజీవంగా ఉండాలని ఆశించిన ఇంగ్లండ్ జట్టుపై వరుణ దేవుడు కరుణించలేదు. ఎడతెరిపిలేని వాన కారణంగా ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టులో ఐదో రోజు ఆట సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 214/5తో మరో 61 పరుగులు వెనుకంజలో నిలిచింది. ఐదో రోజు త్వరగా ఆ్రస్టేలియాను ఆలౌట్ చేసి విజయంపై ఇంగ్లండ్ కన్నేసింది. కానీ వర్షం కారణంగా ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుత ఐదు టెస్టుల సిరీస్లో ఆ్రస్టేలియా 2–1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో ఇంగ్లండ్ నెగ్గినా సిరీస్ 2–2తో సమంగా ముగుస్తుంది. అయితే క్రితంసారి యాషెస్ సిరీస్లో ఆ్రస్టేలియా గెలుపొందడంతో ఈసారీ ఆ జట్టు వద్దే యాషెస్ సిరీస్ ట్రోఫీ ఉంటుంది. -
ఇంగ్లండ్ యాషెస్ అవకాశాలను నీరుగారుస్తున్న వరుణుడు
5 మ్యాచ్ల సిరీస్లో 1-2తో వెనుకపడినప్పటికీ అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తూ.. యాషెస్ను కైవసం చేసుకునే దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్కు వరుణుడు అడ్డు తగులుతున్నాడు. విజయానికి కేవలం 5 వికెట్ల దూరంలో ఉన్న ఇంగ్లండ్ పాలిట వర్షం విలన్లా మారింది. నాలుగో టెస్ట్ తొలి మూడు రోజులు ఏమాత్రం ఇబ్బంది పెట్టని వర్షం నాలుగో రోజు నుంచి ఇంగ్లండ్కు సినిమా చూపిస్తుంది. Spot the irony ☔️#Ashes pic.twitter.com/Tb2QGYjAws — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) July 23, 2023 నిన్న పూర్తి ఆట సాగి ఉంటే నిన్ననే ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచి, సిరీస్ సమం చేసుకుని ఉండేది. నిన్న ఆఖరి సెషన్లో ఇంగ్లండ్పై జాలి చూపించిన వర్షం కాసేపు ఎడతెరిపినిచ్చింది. వరుణుడు కరుణించినా లబూషేన్ (111) కనికరించకపోవడంతో నాలుగో రోజు ఇంగ్లండ్ కేవలం ఒక్క వికెట్తోనే సరిపెట్టుకుంది. నిన్న జరిగిన 27 ఓవర్ల ఆటలో ఆసీస్ 101 పరుగులు స్కోర్ చేసి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఐదో రోజైనా వరుణుడు కరుణిస్తాడని గంపెడాశలు పెట్టుకున్న ఇంగ్లీష్ టీమ్కు మరోసారి ఆశాభంగం కలిగింది. వర్షం కారణంగా ఐదో రోజు తొలి సెషన్ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. లంచ్ సమయం తర్వాత కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇదే పరిస్థితి మరో 2 గంటలు కొనసాగితే మ్యాచ్ జరిగడం దాదాపుగా అసంభవమని అక్కడి వారు చెబుతున్నారు. మరి ఈ మధ్యలో వరుణుడు ఇంగ్లండ్ను కరుణిస్తాడో లేక కనికరం లేకుండా వ్యవహరిస్తాడో వేచి చూడాలి. లంచ్ తర్వాత మైదాన ప్రాంతంలో కుంభవృష్టి కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు సోషల్మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఆసీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 61 పరుగులు వెనుకపడి ఉంది. కనీసం 30 ఓవర్ల ఆట సాధ్యపడినా ఇంగ్లండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. -
లబుషేన్ సెంచరీ.. పోరాడుతున్న ఆస్ట్రేలియా
మాంచెస్టర్: ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో ఓటమినుంచి తప్పించుకునేందుకు పోరాడుతున్న ఆ్రస్టేలియాకు శనివారం వర్షం రూపంలో అదృష్టం కూడా కలిసొచ్చింది. ఇక ఆ జట్టు మ్యాచ్ చివరి రోజు ఆదివారం కూడా వాన కురవడంపై కూడా ఆశలు పెట్టుకోవాలి! 162 పరుగులు వెనుకబడి ఓవర్నైట్ స్కోరు 113/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. పట్టుదలగా ఆడిన మార్నస్ లబుషేన్ (173 బంతుల్లో 111; 10 ఫోర్లు, 2 సిక్స్లు) కెరీర్లో 11వ సెంచరీ పూర్తి చేసుకోగా, మిచెల్ మార్ష్ (31 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 103 పరుగులు జోడించారు. వాన కారణంగా శనివారం మొత్తం 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, ఆస్ట్రేలియా మరో 101 పరుగులు జత చేసింది. అయితే ఆసీస్ ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది. చివరి రోజు మిగిలిన ఐదు వికెట్లతో మరికొన్ని పరుగులు సాధించడంతో పాటు వర్షం కూడా అంతరాయం కలిగిస్తే ‘డ్రా’కు అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ్రస్టేలియా ‘యాషెస్’ను నిలబెట్టుకుంటుంది. -
దురదృష్టవంతుల లిస్ట్లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్గా
ఇంగ్లండ్ వికెట్కీపర్ జానీ బెయిర్ స్టో బ్యాడ్లక్కు బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔట్ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవర్ పూర్తయిందని భావించిన బెయిర్ స్టో క్రీజు బయటకు రాగా.. ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని నేరుగా వికెట్ల మీదకు విసిరాడు. బంతి ఇంకా డెడ్ కాలేదని.. రూల్ ప్రకారం బెయిర్ స్టో ఔట్ అని అంపైర్ ప్రకటించాడు. దీంతో చేసేదేం లేక బెయిర్ స్టో పెవిలియన్ చేరాడు. అయితే ఈ ఔట్పై ఆ తర్వాత చాలా పెద్ద చర్చే జరిగింది. సహచర బ్యాటర్ రూపంలో వెంటాడిన దురదృష్టం.. తాజాగా బెయిర్ స్టోను మరోసారి దురదృష్టం వెంటాడింది. అయితే ఈసారి ఔట్ రూపంలో కాదు.. సెంచరీ రూపంలో. సెంచరీ చేసే అవకాశమున్నా ఆ అదృష్టానికి నోచుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీకి దూరమయ్యాడు. మరి ఔట్ అయ్యాడా అంటే అదీ లేదు. తన సహచర బ్యాటర్ చివరి వికెట్గా వెనుదిరగడంతో బెయిర్ స్టో 99 పరుగులు నాటౌట్గా నిలవాల్సి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే గాయంతో ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన బెయిర్ స్టో రీఎంట్రీ దగ్గరి నుంచి బ్యాడ్లక్ వెంటాడుతన్నట్లుగా అనిపిస్తోంది. ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి బెయిర్ స్టో తన ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ను పటిష్ట స్థితిలో నిలిపాడు. బెయిర్స్టో ఇన్నింగ్స్తో 592 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్లో 273 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. జాక్ క్రాలీ 189, మొయిన్ ఆలీ 54, జో రూట్ 84, హారీ బ్రూక్ 61, బెన్ స్టోక్స్ 51 పరుగులు చేసి ఔటయ్యారు. క్రిస్ వోక్స్,బ్రాడ్, అండర్సన్లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జానీ బెయిర్ స్టో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న సమయంలో జేమ్స్ అండర్సన్ని కామెరూన్ గ్రీన్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు తెరపడింది. 99 వద్ద నాటౌట్గా మిగిలిన ఏడో బ్యాటర్గా.. టెస్టు క్రికెట్ చరిత్రలో 99 పరుగుల వద్ద నాటౌట్గా మిగిలిన ఏడో క్రికెటర్గా జానీ బెయిర్స్టో నిలిచాడు. ఇంతకుముందు జోఫ్రె బాయ్కాట్, స్టీవ్ వా, అలెక్స్ టూడర్, షాన్ పోలాక్, ఆండ్రూ హాల్, మిస్బా వుల్ హక్లు 99 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌట్ అయ్యింది.మార్నస్ లబుషేన్ 51, మిచెల్ మార్ష్ 51, ట్రావిస్ హెడ్ 48, స్టీవ్ స్మిత్ 41, మిచెల్ స్టార్క్ 36, డేవిడ్ వార్నర్ 32, అలెక్స్ క్యారీ 20 పరుగులు చేసి సంయుక్తంగా రాణించారు. క్రిస్ వోక్స్ 5 వికెట్లు తీశాడు. 273 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడోరోజు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసిది. క్రీజులో మార్నస్ లబుషేన్(44 బ్యాటింగ్), మిచెల్ మార్ష్ ఒక్క పరుగుతో ఉన్నారు. ఆసీస్ ఇంకా 162 పరుగులు వెనుకబడి ఉంది. View this post on Instagram A post shared by We Are England Cricket (@englandcricket) చదవండి: #Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది వేరే బంతిని -
పట్టు బిగించిన ఇంగ్లండ్
మాంచెస్టర్: ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో విజయంపై ఇంగ్లండ్ గురి పెట్టింది. మూడో రోజు ఆట ముగిసే సరికి ఆ్రస్టేలియా ఇన్నింగ్స్ ఓటమినుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్లో ఆ్రస్టేలియా ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. వార్నర్ (28), ఖ్వాజా (18), స్మిత్ (17), హెడ్ (1) పెవిలియన్ చేరగా...లబుషేన్ (44 నాటౌట్), మార్ష్ (1 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఇంకా 162 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 384/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 592 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (61), బెన్ స్టోక్స్ (51) అర్ధ సెంచరీలు సాధించగా...జానీ బెయిర్స్టో (81 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్లు) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. హాజల్వుడ్ 5 వికెట్లు పడగొట్టగా, గ్రీన్, స్టార్క్ చెరో 2 వికెట్లు తీశారు. 99 వద్ద నాటౌట్గా ముగించిన ఏడో బ్యాటర్గా బెయిర్స్టో నిలిచాడు. -
Ashes 4th test: దంచి కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. 592 పరుగులకు ఆలౌట్
మాంచెస్టర్ వేదికగా జరగుతున్న యాషెస్ నాలుగు టెస్టులో ఆస్ట్రేలియాకు ఇంగ్లండ్ ధీటుగా బదులు ఇస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 592 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 384/4 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లండ్.. అదనంగా మరో 208 పరుగులు సాధించి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్కు తొలి ఇన్నింగ్స్లో 275 పరుగుల అధిక్యం లభిచింది. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ(189), జానీ బెయిర్ స్టో(99 నాటౌట్), రూట్(84) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. అదే విధంగా ఆసీస్ బౌలర్లలో హాజిల్వుడ్ 5 వికెట్లతో చెలరేగగా.. స్టార్క్ గ్రీన్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 317 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. పాపం బెయిర్ స్టో.. ఇక ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో టీ20 తరహా ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 81 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బెయిర్స్టో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 99 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆఖరి వికెట్గా అండర్సన్ వెనుదిరిగడంతో బెయిర్ స్టో తృటిలో సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్తో రెండో టెస్టు.. సెంచరీతో చెలరేగిన కింగ్ కోహ్లి -
రూట్తో కలిసి చరిత్ర సృష్టించిన జాక్ క్రాలీ! అరుదైన రికార్డు బద్దలు
Ashes- 2023- England vs Australia, 4th Test: యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ అద్భుతం చేశాడు. బజ్బాల్ విధానానికి అర్థం చెబుతూ 182 బంతుల్లో 189 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. మాంచెస్టర్లో వందకు పైగా స్ట్రైక్రేటుతో పరుగుల వరద పారించడం ద్వారా క్రాలీ వ్యక్తిగతంగా ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన జో రూట్(84)తో కలిసి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా ఈ మ్యాచ్లో మొయిన్ అలీ(54)తో కలిసి రెండో వికెట్కు 121 పరుగులు జోడించిన క్రాలీ.. మాజీ సారథి జో రూట్తో కలిసి 206 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. అయితే, 178 బంతుల్లోనే ఈ మేరకు మూడో వికెట్కు భారీగా పరుగులు జోడించడం విశేషం. ఈ క్రమంలో క్రాలీ- రూట్ జోడీ వరల్డ్ రికార్డు సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ సాధించిన జంటగా నిలిచింది. ఈ క్రమంలో తమ సహచర ఆటగాళ్లు జానీ బెయిర్స్టో- బెన్స్టోక్స్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టింది. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీలివే! 1.జాక్ క్రాలీ- జో రూట్: మాంచెస్టర్, 2023- ఆస్ట్రేలియా మీద 206(178) 2.జానీ బెయిర్స్టో- బెన్ స్టోక్స్: కేప్టౌన్, 2016- సౌతాఫ్రికా మీద- 399 (306) 3.ఆడం గిల్క్రిస్ట్- మాథ్యూ హెడెన్: పెర్త్, 2002- జింబాబ్వే మీద- 233 (203) 4.జాక్ క్రాలీ- బెన్ డకెట్- రావల్పిండి: 2022- పాకిస్తాన్ మీద- 233 (214) 5.జో బర్న్స్- డేవిడ్ వార్నర్- బ్రిస్బేన్: 2015- న్యూజిలాండ్ మీద- 237 (226) 6. ఏబీ డివిల్లియర్స్- గ్రేమ్ స్మిత్- కేప్టౌన్: 2005- జింబాబ్వే మీద- 217 (209). చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! ఆసియా కప్-2023 ఫైనల్కు చేరిన పాకిస్తాన్.. A fourth Test century, coming in just 93 balls 💯 Take a bow, Zak Crawley! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/25Nah8QBTh — England Cricket (@englandcricket) July 20, 2023 -
జాక్ క్రాలీ సంచలనం.. యాషెస్ చరిత్రలో మూడో ఇంగ్లండ్ బ్యాటర్గా
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైనప్పటికి బజ్బాల్ దూకుడు మాత్రం వదల్లేమని తేల్చి చెప్పింది. మూడో టెస్టులో విజయం అందుకున్న ఇంగ్లండ్ ఎలాగైనా సిరీస్ కోల్పోకూడదనే పట్టుదలతో ఉంది. అందుకే మాంచెస్టర్ వేదికగా మొదలైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మరోసారి బజ్బాల్ ఆటతీరును చూపించింది. ఒక్కరోజులోనే దాదాపు 400 పరుగులు మార్క్ అందుకునేలా కనిపించిన ఇంగ్లండ్ చివరకు రెండో రోజు ఆటను 4 వికెట్ల నష్టానికి 384 పరుగుల వద్ద ముగించింది. ఒకవేళ ఆసీస్ తొలి సెషన్ ఆరంభంలోనే ఔటయ్యి ఉంటే ఇంగ్లండ్ 400 పరుగులు మార్క్ను కూడా క్రాస్ చేసేదే. ఇక ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వన్డే తరహాలో వేగంగా ఆడిన క్రాలీ తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నప్పటికి 182 బంతుల్లో 189 పరుగులు చేశాడు. 93 బంతుల్లోనే శతకం మార్క్ సాధించిన క్రాలీ ఇన్నింగ్స్లో 21 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అతనికి రూట్(95 బంతుల్లో 84 పరుగులు) జత కలవడంతో ఇంగ్లండ్ స్కోరు ఓవర్కు ఐదు పరుగుల రనరేట్కు తగ్గకుండా పరిగెత్తడం విశేషం. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు కేవలం మూడు మెయిడెన్ ఓవర్లు మాత్రమే ఇచ్చుకున్నారంటే ఇంగ్లండ్ ఎంత ధాటిగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ► ఈ క్రమంలో జాక్ క్రాలీ ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు.యాషెస్ చరిత్రలో ఒక్క రోజు వ్యవధిలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఇంగ్లండ్ బ్యాటర్గా జాక్ క్రాలీ నిలిచాడు. క్రాలీ ఈ మ్యాచ్లో 182 బంతుల్లో 189 పరుగులు చేశాడు. క్రాలీ కంటే ముందు టిప్ ఫోస్టర్(1902లో సిడ్నీ వేదికగా 214 పరుగులు) తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వాలీ హామండ్(1938లో లార్డ్స్ వేదికగా 210 పరుగులు) ఉన్నాడు.ఇక బాబ్ బార్బర్(1966లో సిడ్నీ వేదికగా 185 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నాడు. ► ఇక యాషెస్ టెస్టులో ఒక్క సెషన్లోనే సెంచరీ అందుకున్న ఆరో ఇంగ్లండ్ బ్యాటర్గా క్రాలీ రికార్డులకెక్కాడు. ► క్రాలీ స్ట్రైక్రేట్ 103 కాగా యాషెస్ చరిత్రలో ఇది రెండో బెస్ట్గా ఉంది. 103 స్ట్రైక్రేట్తో ఒక ఇన్నింగ్స్లో 150కి పైగా పరుగులు సాధించిన బ్యాటర్గా ఆడమ్ గిల్క్రిస్ట్తో కలిసి క్రాలీ సంయుక్తంగా ఉన్నాడు. ► 93 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న క్రాలీ యాషెస్ టెస్టులో వేగవంతంగా సెంచరీ సాధించిన నాలుగో ఇంగ్లండ్ బ్యాటర్గా నిలిచాడు. A fourth Test century, coming in just 93 balls 💯 Take a bow, Zak Crawley! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/25Nah8QBTh — England Cricket (@englandcricket) July 20, 2023 చదవండి: 500వ మ్యాచ్లో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి -
ఇంగ్లండ్ దూకుడు
మాంచెస్టర్: ఆ్రస్టేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజు అదరగొట్టింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 72 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 384 పరుగులు సాధించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 67 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓపెనర్ జాక్ క్రాలీ (182 బంతుల్లో 189; 21 ఫోర్లు, 3 సిక్స్లు) ఆసీస్ బౌలర్ల భరతంపట్టి త్రుటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. మొయిన్ అలీ (82 బంతుల్లో 54; 7 ఫోర్లు), జో రూట్ (95 బంతుల్లో 84; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం హ్యారీ బ్రూక్ (14 బ్యాటింగ్), బెన్ స్టోక్స్ (24 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 299/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 18 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయి 317 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 5 వికెట్లు... బ్రాడ్ 2 వికెట్లు తీశారు. -
Ashes 4th Test: మొయిన్ అలీ డబుల్ ధమాకా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ డబుల్ ధమాకా సాధించాడు. ఈ సిరీస్కు ముందే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన మొయిన్.. టెస్ట్ల్లో 3000 పరుగులు, 200 వికెట్లు సాధించిన 16వ క్రికెటర్గా, నాలుగో ఇంగ్లండ్ ఆల్రౌండర్గా రికార్డుల్లోకెక్కాడు. కెరీర్లో 67వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న మొయిన్.. 3020 పరుగులు 201 టెస్ట్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొయిన్కు ముందు ఇయాన్ బోథమ్ (5200 పరుగులు, 383 వికెట్లు), ఆండ్రూ ఫ్లింటాఫ్ (3845, 226), స్టువర్ట్ బ్రాడ్ (3640, 600) ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, 299/8 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్లో 317 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓవర్నైట్ స్కోర్కు మరో 18 పరుగులు మాత్రమే జోడించి, మిగతా 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ బజ్బాల్ అంటూ ధాటిగా ఆడుతుంది. ఆ జట్టు రెండో సెషన్ సమయానికి 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. డకెట్ (1) ఔట్ కాగా.. జాక్ క్రాలే (60), మొయిన్ అలీ (43) క్రీజ్లో ఉన్నారు. డకెట్ వికెట్ స్టార్క్కు దక్కింది. అంతకుముందు, ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51), హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41), డేవిడ్ వార్నర్ (32), మిచెల్ స్టార్క్ (36 నాటౌట్). ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. బ్రాడ్ 2, ఆండర్సన్, వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. -
Ashes 4th Test: క్రికెట్ చరిత్రలో కేవలం రెండో జట్టుగా టీమ్ ఇంగ్లండ్
యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు ఓ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ దేశానికి చెందిన జట్టు సాధించని ఓ రికార్డును టీమ్ ఇంగ్లండ్ సాధించింది. ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో ఆ ఘనత సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. యాషెస్ నాలుగో టెస్ట్కు ముందు టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం ఒకే ఒక్క జట్టులో మాత్రమే కనీసం 10 మంది ఆటగాళ్లు 1000 పరుగులు చేశారు. ఆ జట్టు కూడా ఏ దేశానికి చెందినది కాదు. 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ టెస్ట్లో ఐసీసీ వరల్డ్ ఎలెవెన్ జట్టు ఈ ఘనత సాధించింది. ఆ మ్యాచ్లో వరల్డ్ ఎలెవెన్లోని 10 మంది ఆటగాళ్లు కనీసం 1000 పరుగుల మార్కును దాటారు. నాటి జట్టులో స్టీవ్ హార్మిసన్ (743) మినహా అందరూ 1000 పరుగులు దాటిన వారు ఉన్నారు. అందులో ముగ్గురు తమతమ కెరీర్లు ముగిసే నాటికి ఏకంగా 11000 పరుగుల మార్కును దాటారు. ఆ తర్వాత ఇనాళ్లకు (18 ఏళ్ల తర్వాత) తిరిగి మరో జట్టులో కనీసం 10 మంది ఆటగాళ్లు 1000 పరుగుల మార్కును దాటిన వారు ఉన్నారు. ఆసీస్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ తుది జట్టులోని మార్క్ వుడ్ (681) మినహా మిగతా 10 మంది ఆటగాళ్లు 1000 పరుగుల మార్కును దాటారు. ఇక్కడ మరో విశేషమేమింటంటే.. నాటి ప్రత్యర్ధి, నేటి ప్రత్యర్ధి రెండూ ఆస్ట్రేలియానే. యాషెస్ నాలుగో టెస్ట్ ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు.. జాక్ క్రాలే (1920), బెన్ డకెట్ (1037), మొయిన్ అలీ (2977), జో రూట్ (11236), హ్యారీ బ్రూక్ (1028), జానీ బెయిర్స్టో (5623), క్రిస్ వోక్స్ (1717), మార్క్ వుడ్ (681), స్టువర్ట్ బ్రాడ్ (3641), జేమ్స్ ఆండర్సన్ (1327). 2005లో ఆస్ట్రేలియాతో ఆడిన వరల్డ్ ఎలెవెన్ జట్టు (ఆటగాళ్ల కెరీర్లు ముగిసిన నాటి స్కోర్లు).. గ్రేమ్ స్మిత్ (9265), వీరేంద్ర సెహ్వాగ్ (8586), రాహుల్ ద్రవిడ్ (13288), బ్రియాన్ లారా (11953), జాక్ కలిస్ (13289), ఇంజమామ్ ఉల్ హాక్ (8830), ఆండ్రూ ఫ్లింటాఫ్ (3845), మార్క్ బౌచర్ (5515), డేనియల్ వెటోరీ (4531), స్టీవ్ హార్మిసన్ (743), ముత్తయ్య మురళీథరన్ (1261). -
తొలి బంతికే వికెట్ తీసిన ఆండర్సన్.. ఐదేసిన వోక్స్.. ఆసీస్ ఆలౌట్
యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ రెండో రోజు ఆట మొదలైంది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తొలి బంతికే వికెట్ తీశాడు. డ్రైవ్ షాట్ ఆడబోయిన కమిన్స్ (1).. కవర్ పాయింట్లో ఉన్న స్టోక్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఆసీస్ ఓవర్నైట్ స్కోర్ 299 వద్దనే తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 301 పరుగుల వద్ద ఆలౌట్.. అయితే..! క్రిస్ వోక్స్ బౌలింగ్లో హాజిల్వుడ్ సెకెండ్ స్లిప్లో క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 301 పరుగుల వద్ద ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే అంపైర్ దాన్ని నో బాల్గా ప్రకటించడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కొనసాగింది. ఐదేసిన వోక్స్.. ఆసీస్ 317 ఆలౌట్ హాజిల్వుడ్ (4)ను క్రిస్ వోక్స్ ఔట్ చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 317 పరుగుల వద్ద ముగిసింది. 36 పరుగులతో స్టార్క్ అజేయంగా నిలిచాడు. క్రిస్ వోక్స్కు ఇది యాషెస్లో తొలి ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41), డేవిడ్ వార్నర్ (32), మిచెల్ స్టార్క్ (36 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ ఐదేయగా, బ్రాడ్ 2, ఆండర్సన్, వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. -
అప్పుడు, ఇప్పుడు అతడే.. ఆండర్సన్, బ్రాడ్లకు ఒకడే లక్కీ హ్యాండ్..!
మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 600 వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ (48) వికెట్ పడగొట్టడం ద్వారా బ్రాడ్ ఈ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ చరిత్రలో బ్రాడ్ సహా కేవలం ఐదుగురు మాత్రమే టెస్ట్ల్లో 600 వికెట్ల మార్కును అందుకున్నారు. బ్రాడ్కు ముందు మురళీథరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (688), అనిల్ కుంబ్లే (619) 600 వికెట్ల ల్యాండ్ మార్క్ను దాటారు. వీరిలో బ్రాడ్, అతని సహచరుడు ఆండర్సన్ మాత్రమే పేసర్లు కావడం విశేషం. కాగా, టెస్ట్ల్లో 600 వికెట్ల మార్కును దాటిన ఇద్దరు పేసర్ల విషయంలో ఓ కామన్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఆండర్సన్ 600వ వికెట్లో, బ్రాడ్ 600వ వికెట్లో వీరి సహచరుడు జో రూట్ పాత్ర ఉంది. ఆండర్సన్, బ్రాడ్లకు చిరకాలం గుర్తుండిపోయే ఈ సందర్భాల్లో రూట్ భాగమయ్యాడు. ఇద్దరి 600వ వికెట్ల క్యాచ్లను రూటే అందుకున్నాడు. Joe Root 🤝 Getting Anderson and Broad to 600 Test wickets#CricketTwitter #Ashes #ENGvAUS pic.twitter.com/LAjtRmbp1p — ESPNcricinfo (@ESPNcricinfo) July 20, 2023 ఆండర్సన్ 600వ వికెట్ పాక్ ఆటగాడు అజహర్ అలీ క్యాచ్ను, బ్రాడ్ 600వ వికెట్ ట్రవిస్ హెడ్ క్యాచ్ను రూటే పట్టుకున్నాడు. ఇక్కడ మరో విశేషమేమిటంటే, బ్రాడ్ తన 600వ వికెట్ను ఆండర్సన్ సొంత మైదానంలో అండర్సన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ సాధించాడు. ఈ విషయాన్ని బ్రాడ్ తొలి రోజు ఆట అనంతరం ప్రస్తావిస్తూ.. తన సహచరుడి ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ ఈ అరుదైన ఘనత సాధించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్ తొలి రోజు ఇంగ్లండ్ పేసర్లు రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ (149) అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు ఇయాన్ బోథమ్ (148) పేరిట ఉండేది. ఈ జాబితాలో ఆండర్సన్ (115) నాలుగో స్థానంలో ఉన్నాడు. -
'అనుకున్నంత గొప్ప క్యాచ్ ఏమి కాదులే..'
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే. తొలిరోజు ఇరుజట్లు సమాన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. అయితే ఆట ముగిసే సమయంలో మాత్రం ఇంగ్లండ్దే కాస్త పైచేయిగా అనిపించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్లో ఇంగ్లండ్ కీపర్ జానీ బెయిర్ స్టో సంచలన క్యాచ్తో మెరిశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 63వ ఓవర్ క్రిస్ వోక్స్ వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతిని వోక్స్ వైడ్ లైన్ స్టంప్ మీదుగా వేశాడు. మార్ష్ పొజిషన్ మార్చి షాట్ ఆడాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ను తాకి స్లిప్స్ కార్డన్ దిశగా వెళ్లింది. అయితే బంతి కాస్త లో యాంగిల్లో వెళ్లడంతో క్యాచ్ కష్టతరమనిపించింది. కానీ కీపర్ బెయిర్ స్టో డైవ్ చేస్తూ తన గ్లోవ్స్ను దూరంగా పెట్టడం.. బంతి సేఫ్గా అతని చేతుల్లో పడింది. దీంతో షాక్ తిన్న మార్ష్ నిరాశతో పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన అభిమానులు బెయిర్ స్టో క్యాచ్పై విభిన్న రీతిలో స్పందించారు. ''ఇదేమంత గొప్ప క్యాచ్గా అనిపించడం లేదు.. మాములుగానే ఉంది'' అంటూ కామెంట్ చేశారు. STOP THAT JONNY BAIRSTOW! 🤯 #EnglandCricket | #Ashes pic.twitter.com/aZ7wKcncRW — England Cricket (@englandcricket) July 19, 2023 చదవండి: ICC ODI WC 2023: 'కింగ్' ఖాన్ చేతిలో వన్డే వరల్డ్కప్ ట్రోఫీ.. ఫ్యాన్స్ రచ్చ Virat Kohli: '500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్ కొట్టాల్సిందే' -
600 వికెట్ల క్లబ్లో.. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో బౌలర్గా
ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. హెడ్ను అవుట్ చేయడం ద్వారా బ్రాడ్ టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్గా నిలిచాడు. అత్యధిక వికెట్ల జాబితాలో మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), అండర్సన్ (688) మాత్రమే బ్రాడ్కంటే ముందున్నారు. 𝗧𝗵𝗲 moment.#EnglandCricket | #Ashes https://t.co/lz2j0t9LN5 pic.twitter.com/9RxHutgLDC — England Cricket (@englandcricket) July 19, 2023 చదవండి: భారత్కు ఎదురుందా! #ChrisMartin: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, కట్చేస్తే.. ఇప్పుడు సూపర్ మార్కెట్లో -
యాషెస్ నాలుగో టెస్ట్కు వర్షం ముప్పు.. బజ్బాల్ డోస్ పెంచుతామన్న స్టోక్స్
బజ్బాల్ అప్రోచ్ విషయంలో, యాషెస్ సిరీస్ నెగ్గే విషయంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఏమాత్రం తగ్గేదేలేదంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో యాషెస్ సిరీస్ గెలుస్తామని ధీమాగా చెబుతున్నాడు. నాలుగో టెస్ట్కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టోక్స్ మాట్లాడుతూ.. సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచే నాలుగో టెస్ట్లో ఎలాగైనా గెలిచి తీరతామని.. ఆసీస్ ఆధిక్యాన్ని 0-2 నుంచి 1-2కు తగ్గించాం, దీన్ని 2-2కు తీసుకువచ్చి, 3-2గా ముగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. నాలుగో టెస్ట్ మొత్తానికి వర్షం ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై స్పందిస్తూ.. వాస్తవానికి మేము వాతావరణం గురించి ఆలోచించం. అయితే ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. వరుణుడు ఇబ్బంది పెడితే తమ సాధారణ ఆటలో శృతి పెంచి, ఫలితం సాధిస్తామని చెప్పాడు. తప్పక గెలవాల్సిన మూడో టెస్ట్కు ముందు కూడా వర్షం ఇలానే మమ్మల్ని బయపెట్టిందని, అదే తమలోని అత్యుత్తమ ఆటతీరును వెలికి తీసి విజయం సాధించేలా చేసిందని తెలిపాడు. కాగా, నాలుగో టెస్ట్కు వేదిక అయిన ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మ్యాచ్ తొలి రోజు (జులై 19) వర్షం పడే అవకాశాలు కాస్త అటు ఇటుగా ఉన్నా, మిగతా నాలుగు రోజుల్లో మ్యాచ్కు ముందు, మ్యాచ్ జరిగే సమయంలో ఓ మోస్తరుకు మించి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తమ నివేదికలో పేర్కొంది. వర్షం కురువని సమయంలో గాలి వేగం అధికంగా ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉంటే, వర్షం కురువకుండా గాలి వేగం అధికంగా ఉంటే ఫాస్ట్ బౌలర్లు రెచ్చిపోతారు. ముందస్తు వాతావరణ హెచ్చరికల కారణంగానే ఇరు జట్లు స్పిన్నర్లను పక్కకు పెట్టి, కేవలం పేస్ దళంతోనే బరిలోకి దిగుతున్నారు. ఆల్రౌండర్లతో కలిపి ఇరు జట్లు ఐదుగురు పేసర్లతో కత్తులు దూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ -
Ashes Series: నాలుగో టెస్ట్కు ముందు ఆస్ట్రేలియా సాహసోపేతమైన నిర్ణయం
మాంచెస్టర్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 19) ప్రారంభం కానున్న నాలుగో యాషెస్ టెస్ట్కు ముందు ఆస్ట్రేలియా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేకుండా, ఏకంగా ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్లను ఎంపిక చేసుకున్న ఆసీస్ మేనేజ్మెంట్.. స్పెషలిస్ట్ పేసర్లుగా మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్లను బరిలోకి దించుతుంది. మూడో టెస్ట్లో స్పెషలిస్ట్ స్పిన్నర్గా టాడ్ మర్ఫీ బరిలో నిలువగా.. నాలుగో టెస్ట్కు ప్రకటించిన తుది జట్టులో అతనికి చోటు లభించలేదు. మర్ఫీ స్థానంలో గత మ్యాచ్కు దూరంగా ఉన్న కెమరూన్ గ్రీన్ తుది జట్టులోకి రాగా.. మూడో టెస్ట్లో అంతగా ప్రభావం చూపని స్కాట్ బోలండ్ స్థానాన్ని హాజిల్వుడ్ భర్తీ చేశాడు. మూడో టెస్ట్ ఆడిన జట్టులో ఆసీస్ ఈ రెండు మార్పులు చేసింది. గత మూడు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్పై కెప్టెన్ కమిన్స్ సహా మేనేజ్మెంట్ కూడా నమ్మకముంచింది. మాంచెస్టర్ పిచ్పై స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించదని భావించిన ఆసీస్.. ఒక్క రెగ్యులర్ స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగుతూ పెద్ద సాహసమే చేస్తుంది. పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, లబూషేన్ సేవలను వినియోగించుకోవాలని ఆసీస్ యాజమాన్యం భావిస్తుంది. మరోవైపు ఇంగ్లండ్.. ఆసీస్ కంటే ముందే తమ తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించిన ఇంగ్లండ్.. కేవలం ఒక్క మార్పు చేసింది. గాయం కారణంగా మూడో టెస్ట్లో బౌలింగ్ చేయలేకపోయిన ఓలీ రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల ఈ యాషెస్ సిరీస్లో పర్యాటక ఆసీస్ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆసీస్ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. బజ్బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే,మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ -
Ashes 2023: ఇంగ్లండ్ బ్యాటర్ వరుస శతకాలు.. యాషెస్ నిలబెట్టుకున్న ఆసీస్
మహిళల యాషెస్ సిరీస్ను ఆసీస్ నిలబెట్టుకుంది. మల్టీ ఫార్మాట్లో జరిగిన ఈ సిరీస్ను ఆసీస్ 8-8 పాయింట్లతో సమం చేసుకుంది. నిన్న జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ నెగ్గినప్పటికీ, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ టైటిల్ నిలబెట్టుకుంది. వన్డే సిరీస్ ఇంగ్లండ్దే.. వర్షం అంతరాయాల నడుమ సాగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 69 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. Alyssa Healy reckons there's an opportunity for the @AusWomenCricket team to reset following a drawn #Ashes series pic.twitter.com/gZbbkCgFxp — cricket.com.au (@cricketcomau) July 18, 2023 వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ చేసిన నాట్ సీవర్ బ్రంట్.. నాట్ సీవర్ బ్రంట్ వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ (129) చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో కీలకపాత్ర పోషించింది. అనంతరం ఆసీస్ బ్యాటింగ్కు దిగే ముందు వర్షం మొదలుకావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 44 ఓవర్లలో 269 పరుగులకు కుదించారు. చేతులెత్తేసిన ఆసీస్.. 269 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, ఆసీస్ను 35.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ చేశారు. ఫలితంగా 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఇంగ్లండ్ 2-1 తేడాతో (రెండో వన్డేలో ఆసీస్ గెలుపు) కైవసం చేసుకుంది. Series drawn! Is this the best Women's #Ashes we've ever seen? pic.twitter.com/TtwwMhds0f — cricket.com.au (@cricketcomau) July 18, 2023 టీ20 సిరీస్ కూడా ఇంగ్లండ్దే.. వన్డే సిరీస్కు ముందు జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ను ఆతిధ్య జట్టు 2-1 తేడాతో (తొలి టీ20లో ఆసీస్ గెలుపు) గెలుచుకుంది. Neither were entirely satisfied, nor downbeat. But both recognised they’d been part of something special #Ashes | @JollyLauz18 https://t.co/5znIBCCxxp — cricket.com.au (@cricketcomau) July 18, 2023 ఆసీస్ యాషెస్ను ఎలా నిలుపుకుందంటే..? మల్టీ ఫార్మాట్ సిరీస్లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో గెలవడంతో ఆసీస్ ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. ఆతర్వాత జరిగిన టీ20 సిరీస్ను ఆ జట్టు 1-2తో కోల్పోయినప్పటికీ, పాయింట్ల పరంగా (ఒక్కో గెలుపుకు 2 పాయింట్లు) అప్పటికీ ఆధిక్యంలోనే (6-4) ఉండింది. వన్డే సిరీస్ను ఇంగ్లండ్ 2-1 తేడాతో చేజిక్కించుకోవడంతో 8-8తో పాయింట్లు సమం అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ యాషెస్ను నిలుపుకుంది. -
Ashes 4th Test: వార్నర్కు కెప్టెన్ మద్దతు.. ఆసీస్ జట్టులో ఓ మార్పు
మాంచెస్టర్ వేదికగా జులై 19 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. అయితే తుది జట్టును ప్రకటించే విషయంలో ఆసీస్ మేనేజ్మెంట్ మాత్రం వేచి చూచే ధోరణిని ప్రదర్శిస్తుంది. మరికొద్ది గంటల్లో మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉండగా.. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ కేవలం లీకులు ఇచ్చాడు. తుది జట్టును మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. తొలి 3 టెస్ట్ల్లో విఫలమైన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు కమిన్స్ అండగా నిలిచాడు. వార్నర్ కీలకమైన నాలుగో టెస్ట్లో ఆడతాడని చెప్పకనే చెప్పాడు. వార్నర్ గతంలో చాలా సందర్భాల్లో కీలక సమయాల్లో ఫామ్ను అందుకని తమను గెలిపించాడని ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్లో ప్రస్తావించాడు. దీన్ని బట్టి చూస్తే నాలుగో టెస్ట్ కోసం వార్నర్కు లైన్ క్లియర్ అయ్యిందన్న విషయం అర్ధమవుతుంది. తుది జట్టులో ఓ మార్పు విషయంపై కూడా కమిన్స్ నోరు విప్పాడు. మూడో టెస్ట్లో ఆశించినంత ప్రభావం చూపని స్కాట్ బోలండ్ స్థానాన్ని అనుభవజ్ఞుడైన హాజిల్వుడ్ భర్తీ చేస్తాడని తెలిపాడు. తుది జట్టులో మరేమైనా మార్పులుంటాయన్న ప్రశ్నకు కమిన్స్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. తుది జట్టు ప్రకటనపై తొందరేం లేదని, మ్యాచ్కు కొద్ది గంటల ముందు ఆ ప్రకటన ఉంటుందని కాన్ఫరెన్స్ను కంక్లూడ్ చేశాడు. మరి కమిన్స్ చెప్పినట్లుగా వార్నర్ కొనసాగుతాడో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. మరో పక్క ఇంగ్లండ్ మాత్రం తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది. ఓపెనర్లుగా బెన్ డకెట్, జాక్ క్రాలే, వన్డౌన్లో మొయిన్ అలీ, నాలుగో ప్లేస్లో జో రూట్, ఆతర్వాత హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ వరుస స్థానాల్లో ఉంటారని తెలిపింది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల ఈ యాషెస్ సిరీస్లో పర్యాటక ఆసీస్ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆసీస్ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. బజ్బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. -
యాషెస్ నాలుగో టెస్ట్.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
మాంచెస్టర్ వేదికగా జులై 19 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తుది జట్టును ఇవాళ (జులై 17) ప్రకటించింది. ముందుగా ప్రచారం జరిగిన విధంగా మూడో టెస్ట్ ఆడిన జట్టునే ఈసీబీ కొనసాగించలేదు. నాలుగో టెస్ట్ కోసం ఈసీబీ ఓ మార్పు చేసింది. ఓలీ రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. One change for the 4th @LV_Cricket #Ashes Test at @EmiratesOT 🏟🏏 — England Cricket (@englandcricket) July 17, 2023 మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగనుంది. ఓపెనర్లుగా బెన్ డకెట్, జాక్ క్రాలే, వన్డౌన్లో మొయిన్ అలీ, నాలుగో ప్లేస్లో జో రూట్, ఆతర్వాత హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ వరుస స్థానాల్లో ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాగా, మూడో టెస్ట్లో ఆసీస్పై ఇంగ్లండ్ చిరస్మరణీ విజయం సాధించిన తర్వాత ఇంగ్లీష్ మేనేజ్మెంట్ అదే జట్టును కొనసాగిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈసీబీ మాత్రం నాలుగో టెస్ట్ కోసం రాబిన్సన్ స్థానంలో అనుభవజ్ఞుడైన ఆండర్సన్ వైపే మొగ్గు చూపింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. మూడో టెస్ట్ సందర్భంగా రాబిన్సన్ స్వల్పంగా గాయపడ్డాడు. అతను రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ కూడా చేయలేదు. తొలి రెండు టెస్ట్ల్లో 10 వికెట్లతో రాణించిన రాబిన్సన్ మూడో టెస్ట్లో మాత్రం తేలిపోయాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల ఈ యాషెస్ సిరీస్లో పర్యాటక ఆసీస్ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆసీస్ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. బజ్బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలే,మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ -
వీరోచిత శతకం వృధా.. యాషెస్ను నిలుపుకున్న ఆసీస్
మహిళల యాషెస్ సిరీస్లో నిన్న (జులై 16) జరిగిన ఉత్కంఠ పోరులో ఆతిధ్య ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా వన్డే సిరీస్లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 1-1కి తగ్గించిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలుండగానే యాషెస్ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ ఉండగానే ఎలా..? మల్టీ ఫార్మాట్ సిరీస్లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో గెలవడంతో 4 పాయింట్లు సాధించిన ఆసీస్, ఆతర్వాత జరిగిన టీ20 సిరీస్ను 1-2తో కోల్పోయినప్పటికీ, పాయింట్ల పరంగా (ఒక్కో గెలుపుకు 2 పాయింట్లు) అప్పటికీ ఆధిక్యంలోనే ఉండింది. అయితే తొలి వన్డేలో ఇంగ్లండ్ గెలవడంతో 6-6తో పాయింట్లు సమం అయ్యాయి. తాజాగా ఆసీస్ రెండో వన్డే గెలవడం ద్వారా ఇంగ్లండ్పై మళ్లీ ఆధిక్యత (8-6) సాధించింది. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో ఒకవేళ ఇంగ్లండ్ గెలిచినా సిరీస్ 8-8తో సమం అవుతుంది. అప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ యాషెస్ను నిలుపుకుంటుంది. మ్యాచ్ విషయానికొస్తే.. తీవ్ర ఉత్కంఠ రేపిన రెండో వన్డేలో ఇంగ్లండ్పై ఆసీస్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. ఆతర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడినప్పటికీ గెలవలేకపోయింది. బ్రంట్ వీరోచిత శతకం వృధా.. 283 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ను నాట్ సీవర్ బ్రంట్ (99 బంతుల్లో 111 నాటౌట్; 10 ఫోర్లు) గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. సీవర్కు ట్యామీ బేమౌంట్ (60), యామీ జోన్స్ (37), సారా గ్లెన్ (22 నాటౌట్) సహకరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లండ్ ఆఖరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి రాగా.. 11 పరుగులే చేయడంతో ఓటమిపాలైంది. టీ20 సిరీస్ డిసైడర్ రేపు (జులై 18) జరుగనుంది. -
'అరె శాండ్పేపర్ మరిచిపోయా'.. ఆసీస్ ప్రధానికి రిషి సునాక్ కౌంటర్
ప్రతిష్టాత్మ యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడు టెస్టు మ్యాచ్లు ముగిశాయి. తొలి రెండింటిలో ఆసీస్ విజయం సాధించగా.. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించి రేసులో నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై 19 నుంచి 23 వరకు జరగనుంది. ఈ విషయం పక్కనబెడితే లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంతి డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజు దాటడంతో ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ వికెట్లకు గిరాటేశాడు. నిబంధనల ప్రకారం థర్డ్ అంపైర్ బెయిర్ స్టో ఔట్ అని ప్రకటించాడు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఆస్ట్రేలియా ప్రవర్తించిందంటూ అభిమానులు సహా ఇంగ్లీష్ మీడియా తమ కథనాల్లో హోరెత్తించింది. విమర్శల స్థాయి ఎలా ఉందంటే అది మూడో టెస్టుకు కూడా పాకింది. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అలెక్స్ కేరీ కనిపించిన ప్రతీసారి ఇంగ్లీష్ అభిమానులు అతన్ని టార్గెట్ చేశారు. ఇక బెయిర్ స్టో ఔట్ వివాదంపై రెండు దేశాల ప్రధానులు కూడా జోక్యం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమంటే.. ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ రిషి సునాక్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అయితే క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ అని.. ఇక్కడితో ఈ వివాదానికి స్వస్తి పలకాలని ఇరు దేశాల ప్రధానులు అభిమానులను కోరారు. తాజాగా ఇరుదేశాల ప్రధానులు మరోసారి సమావేశమయ్యారు. అయితే ఈసారి దేశాల మధ్య అనుబంధం మరింత పెంపొందించేందుకు సమ్మిళిత అభివృద్ధి సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ చాలెంజెస్, యూకే-ఆస్ట్రేలియా మధ్య వ్యాపార రంగానికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నారు. వీటిలోనే యాషెస్ సిరీస్ ప్రస్తావన కూడా వచ్చినట్లు ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ ట్విటర్ వేదికగా తెలిపారు. ఆసీస్ ప్రధాని ఆంథోని షేర్ చేసిన వీడియోలో.. యాషెస్పై ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మొదట అల్బనీస్ యాషెస్లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉన్నట్లు ఒక పేపర్పై చూపించారు. ఆ తర్వాత రిషి సునాక్ లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించిన పేపర్ కట్ను చూపించారు. ఇక ఆసీస్ ప్రధాని ఈసారి లార్డ్స్ టెస్టులో బెయిర్ స్టో ఔటైన విధానంకు సంబంధించిన పేపర్ క్లిప్ను చూపించగా.. రిషి సునాక్.. ''సారీ తాను శాండ్పేపర్(Sandpaper-Ball Tampering) గేట్ ఉదంతం పేపర్ క్లిప్పింగ్ను మరిచిపోయాను'' అంటూ పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శాండ్పేపర్ వివాదమేంటి? రిషి సునాక్ ప్రస్తావించిన శాండ్ పేపర్ వివాదం 2018లో జరిగింది. ఐదేళ్ల క్రితం సౌతాఫ్రికాతో టెస్టు సందర్భంగా ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్క్రాఫ్ట్ శాండ్పేపర్ ముక్కతో బంతిని రుద్దడం అప్పట్లో వైరల్గా మారింది. ఇలా చేయడం వల్ల బంతి స్వింగ్కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ శాండ్పేపర్ ఉదంతం వెనుక అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లది కీలకపాత్ర అని తేలడంతో ఏడాది నిషేధం పడింది. బెన్క్రాఫ్ట్ తొమ్మిది నెలలు నిషేధానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ తన తప్పును క్షమించమంటూ కెమెరా ముందు బోరున ఏడ్వడం ఎప్పటికి మరిచిపోలేం. ఈ ఉదంతం అనంతరం స్మిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే ఏడాది తర్వాత స్మిత్, వార్నర్లు మళ్లీ జట్టులోకి రాగా.. బెన్క్రాఫ్ట్ మాత్రం మళ్లీ అడుగుపెట్టలేకపోయాడు. And of course we discussed the #Ashes pic.twitter.com/FeKESkb062 — Anthony Albanese (@AlboMP) July 11, 2023 చదవండి: Asia Cup 2023: 'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే' #NovakDjokovic: 46వసారి సెమీస్లో.. ఫెదరర్ రికార్డు సమం -
Ashes 2023: కీలకమైన టెస్టుకు మళ్లీ అదే జట్టు! మొండిగా వ్యవహరిస్తే..
The Ashes, 2023- England vs Australia: యాషెస్ సిరీస్ నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. లీడ్స్లో మ్యాచ్లో విజయం సాధించిన టీమ్నే మాంచెస్టర్ టెస్టులోనూ కొనసాగించనుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది మేనేజ్మెంట్. కాగా గత మ్యాచ్లో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టోకు మరో అవకాశం ఇవ్వడం విశేషం. బొక్కబోర్లా పడి ఈ నేపథ్యంలో బెన్ ఫోక్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో స్టోక్స్ బృందం ఓటమి పాలైన విషయం తెలిసిందే. బజ్బాల్ విధానంతో సొంతగడ్డపై బొక్కబోర్లా పడి పర్యాటక జట్టు చేతిలో ఓడి 0-2తో వెనుకబడింది. అయితే, అనూహ్య రీతిలో పుంజుకుని మూడో టెస్టులో గెలుపొంది బోణీ కొట్టింది. గెలుపు జోష్లో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. హెడ్డింగ్లీ మైదానంలో హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇంగ్లండ్ బౌలర్ మార్క్వుడ్ 8 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచి తమ జట్టుకు విజయం అందించాడు. ఇదే జోష్లో మాంచెస్టర్ టెస్టుకు సిద్ధమవుతోంది ఇంగ్లండ్. కాగా జూలై 19- జూలై 23 వరకు నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిస్తే ఐదో టెస్టు నిర్ణయాత్మకంగా మారుతుంది. లేదంటే ఆసీస్ ఎంచక్కా టైటిల్ ఎగరేసుకుపోతుంది. కాగా బెయిర్స్టోకు వరుస అవకాశాలు ఇవ్వడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెయిర్స్టోను తప్పించకుండా మొండిగా వ్యవహరించినందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జొనాథన్ బెయిర్స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ రాబిన్సన్, జో రూట్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్, మార్క్వుడ్. చదవండి: అమ్మ నమ్మట్లే! ఈ బుడ్డోడు టీమిండియాలో అత్యంత కీలక వ్యక్తి.. గుర్తుపట్టారా? Ind Vs WI: ఛీ.. మరీ ఘోరంగా ఉంది.. నాకైతే! -
David Warner: హుందాగా తప్పుకుంటాడా లేక తప్పించే దాకా తెచ్చుకుంటాడా..?
వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు ఇకపై ఆసీస్ జట్టులో చోటు దక్కడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఘోరంగా విఫలమవుతూ వస్తున్న వార్నర్కు నాలుగో టెస్ట్లో చోటు దక్కదని ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ పరోక్షంగా చెప్పాడు. వయసు పైబడటం, ఫామ్ లేమి, గతంతో పోలిస్తే చురుకుదనం లోపించడం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుని ఆసీస్ మేనేజ్మెంట్ స్టార్ క్రికెటర్పై వేటు వేయవచ్చు. మరి వార్నర్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకునే వరకు తెచ్చుకుంటాడా..? లేక హుందుగా యాషెస్ నాలుగో టెస్ట్కు ముందే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అన్న విషయంపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో జోరుగా చర్చ సాగుతుంది. వార్నర్ తన రిటైర్మెంట్కు ముహూర్తం ఖరారు చేసుకున్నప్పటికీ, ఇంత హడావుడిగా ఈ విషయంపై చర్చకు కారణం లేకపోలేదు. View this post on Instagram A post shared by Mrs Candice Warner (@candywarner1) మూడో టెస్ట్లో ఆసీస్ ఓటమి అనంతరం వార్నర్ భార్య క్యాండిస్ సోషల్మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఈ పోస్ట్లో క్యాండిస్.. వార్నర్ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్పై సంకేతాలు ఇచ్చింది. తమ కుటుంబం మొత్తం ఉన్న ఫోటోను షేర్ చేస్తూ క్యాండిస్ ఇలా రాసుకొచ్చింది. టెస్ట్ క్రికెట్లో ఓ శకం ముగిసింది. ఈ ప్రయాణం చాలా సరదాగా ఉండింది. చిరకాలం నీ అతి పెద్ద మద్దతుదారులు.. నీ గర్ల్ గ్యాంగ్.. లవ్ యూ వార్నర్ అంటూ క్యాండిస్ తన ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్లో క్యాండిస్.. వార్నర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసేసుకున్నట్లే రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తక్షణమే వార్నర్ రిటైర్మెంట్ అమల్లోకి వస్తుందనే భావన కలిగిస్తుంది. దీంతో అభిమానులు యాషెస్ నాలుగో టెస్ట్ ఆడకుండానే వార్నర్ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని అనుకుంటున్నారు. ఇకపై ఎలాగూ జట్టులో చోటు దక్కదని తెలిసి వార్నర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రీ పోన్ చేసుకున్నాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు వార్నర్ ఏం ప్రకటన చేస్తాడో తేలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. కాగా, వార్నర్ వచ్చే ఏడాది (2024) జనవరిలో తన సొంత మైదానమైన సిడ్నీలో తన చివరి టెస్ట్ మ్యాచ్ (పాకిస్తాన్) ఆడనున్నట్లు ఇదివరకే ప్రకటించాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హుందాగా తప్పుకోవడమే మంచిదని భావించి, వార్నర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రీ పోన్ చేసుకున్నట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్లో మూడు టెస్ట్లు ఆడిన వార్నర్ కేవలం ఒక్క అర్ధసెంచరీ సాయంతో 141 పరుగులు మాత్రమే చేశాడు. -
చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. ధోని ప్రపంచ రికార్డు బద్దలు
యాషెస్ సిరీస్ ఆశలను ఇంగ్లండ్ సజీవంగా నిలుపుకుంది. లీడ్స్ వేదికగా జరిగిన యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. తద్వారా ఆస్ట్రేలియా అధిక్యాన్ని 2-1కు ఇంగ్లండ్ తగ్గించింది. ఇంగ్లండ్ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్(75) కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు ఆల్రౌండర్ క్రిస్ వోక్స్(32 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రపంచరికార్డు. టెస్టు క్రికెట్లో 250 ప్లస్ టార్గెట్ను అత్యధిక సార్లు ఛేజింగ్ చేసిన జట్టుకు కెప్టెన్గా స్టోక్స్ నిలిచాడు. ఇప్పటివరకు స్టోక్స్ సారధ్యంలో ఇంగ్లండ్ జట్టు ఐదు సార్లు 250 పైగా లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని సారధ్యంలో టీమిండియా నాలుగు సార్లు 250 పైగా టార్గెట్ను ఛేజ్ చేసింది. తాజా మ్యాచ్తో ధోని రికార్డును స్టోక్స్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాతి స్ధానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఉన్నారు. వీరిద్దరూ మూడు సార్లు 250 పైగా పరుగులు ఛేజింగ్ చేసిన జట్లకు కెప్టెన్లగా నిలిచారు. -
Ashes 3rd Test: ఆసీస్పై ఇంగ్లండ్ గెలుపు.. చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్
యాషెస్ సిరీస్ మూడో టెస్ట్లో ఆసీస్పై ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో హ్యారీ బ్రూక్ (75) కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ను గెలిపించాడు. మిచెల్ స్టార్క్ (5/78) ఫైఫర్తో ఇంగ్లండ్ను భయపెట్టినా.. వోక్స్ (32 నాటౌట్) సహకారంతో బ్రూక్ ఇంగ్లండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. బ్రూక్ ఔటయ్యాక వుడ్ (12 నాటౌట్) అండతో వోక్స్ ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు. చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ఈ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ను గెలిపించిన బ్రూక్ ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ బంతుల్లో టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసినా ఆటగాడిగా చరిత్ర సృస్టించాడు. బ్రూక్ 1058 బంతుల్లో వెయ్యి పరుగులు మైలురాయిని చేరుకోగా.. గతంతో ఈ రికార్డు కివీస్ ఆల్రౌండర్ కొలిన్ గ్రాండ్హోమ్ (1140) పేరిట ఉండేది. ఈ జాబితాలో గ్రాండ్హోమ్ తర్వాత టిమ్ సౌథీ (1167), బెన్ డకెట్ (1168) ఉన్నారు. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 1000 పరుగులు.. టెస్ట్ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్లో 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు హెర్బర్ట్ సచ్లిఫ్ (12 ఇన్నింగ్స్లు), విండీస్ మాజీ ఎవర్టన్ వీక్స్ (12)ల పేరిట సంయుక్తంగా ఉండగా.. యాషెస్ సిరీస్ మూడో టెస్ట్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్ ఈ జాబితాలో ఐదో స్థానానికి చేరాడు. బ్రూక్ 17 ఇన్నింగ్స్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుని, ఇంగ్లండ్/జింబాబ్వే ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్ సరసన నిలిచాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్మన్ (13) రెండో స్థానంలో, వినోద్ కాంబ్లీ (14) మూడో స్థానంలో, లెన్ హటన్ (16), ఫ్రాంక్ వారెల్ (16), రోవ్ (16) నాలుగో స్థానంలో ఉన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించడం ద్వారా, 5 మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. 251 పరుగుల లక్ష్యాఛేదనలో 27/0 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్, రెండో సెషన్లోనే ఆటను ముగించింది (50 ఓవర్లలో 254/7). బ్రూక్, వోక్స్, వుడ్లతో పాటు జాక్ క్రాలే (44), బెన్ డకెట్ (23), జో రూట్ (21)లు కూడా ఇంగ్లండ్ గెలుపులో తమవంతు పాత్ర పోషించగా.. మొయిన్ అలీ (5), స్టోక్స్ (13), బెయిర్స్టో (5) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5.. కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
Ashes Series 3rd Test: ఉత్కంఠ పోరులో ఆసీస్పై ఇంగ్లండ్ గెలుపు
యాషెస్ సిరీస్ మూడో టెస్ట్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో ఆతిధ్య జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొంది, 5 మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. 251 పరుగుల లక్ష్యాఛేదనలో 27/0 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్, రెండో సెషన్లోనే ఆటను ముగించింది (50 ఓవర్లలో 254/7). హ్యారీ బ్రూక్ (75) అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఆఖర్లో క్రిస్ వోక్స్ (32 నాటౌట్), మార్క్ వుడ్ (16 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చారు. నాలుగో రోజు ఆటలో మిచెల్ స్టార్క్ (5/78) బెదరగొట్టినా.. బ్రూక్, వోక్స్, వుడ్ల బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడటంతో ఆసీస్కు ఓటమి తప్పలేదు. బ్రూక్, వోక్స్, వుడ్లతో పాటు జాక్ క్రాలే (44), బెన్ డకెట్ (23), జో రూట్ (21)లు కూడా ఇంగ్లండ్ గెలుపులో తమవంతు పాత్ర పోషించగా.. మొయిన్ అలీ (5), స్టోక్స్ (13), బెయిర్స్టో (5) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5.. కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. After losing two back to back matches, finally England beat Australia in the 3rd test to keep them alive in the ashes series.#Ashes2023 #ENGvAUS pic.twitter.com/9cEpOGcthL — Mujahid (@mujahid_bhattii) July 9, 2023 -
రూట్ను వదలని కమిన్స్.. స్టార్క్ దెబ్బకు పల్టీలు కొట్టిన వికెట్లు
యాషెస్ సిరీస్లో మూడో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. 251 పరుగుల లక్ష్య ఛేదనలో 27/0 ఓవర్నైట్ స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. లంచ్ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి, లక్ష్యానికి 98 పరుగుల దూరంలో ఉంది. హ్యారీ బ్రూక్ (40), బెన్ స్టోక్స్ (7) క్రీజ్లో ఉన్నారు. మిస్ఫైర్ అయిన మొయన్ అలీ ప్రయోగం.. ఛేదనలో మొయిన్ అలీని వన్డౌన్లో దింపి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం మిస్ఫైర్ అయ్యింది. అలీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. స్టార్క్.. అలీని ఔట్ చేసిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. వికెట్లు గాల్లో పల్టీలు కొట్టిన వైనం ఆసీస్ ఫ్యాన్స్కు కనువిందు చేసింది. రూట్ను వదలని కమిన్స్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (21)ను పాట్ కమిన్స్ ఫోబియా వదిలిపెట్టడం లేదు.కమిన్స్ రూట్ను వరుసగా మూడో ఇన్నింగ్స్లో కూడా ఔట్ చేశాడు. రూట్.. ఒకే బౌలర్ చేతిలో వరుసగా మూడు ఇన్నింగ్స్ల్లో ఔట్ కావడం ఇది మూడోసారి. గతంలో అల్జరీ జోసఫ్, స్కాట్ బోలండ్.. రూట్ను వరుసగా మూడుసార్లు ఔట్ చేశారు. ఓవరాల్గా చూస్తే..రూట్ తన కెరీర్లో అత్యధిక సార్లు (11) కమిన్స్ బౌలింగ్లోనే ఔటయ్యాడు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
హోరాహోరీగా సాగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్
యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ హోరాహోరీగా సాగుతుంది. నాలుగో రోజు 251 పరుగుల లక్ష్యఛేదనలో 27/0 ఓవర్నైట్ స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. తొలి సెషన్లోనే 3 వికెట్లు కోల్పోయింది. అయినా ఆ జట్టుకే విజయావకాశాలు ఉన్నాయి. ఓవర్నైట్ స్కోర్కు మరో 15 పరుగులు జోడించిన అనంతరం మిచెల్ స్టార్క్ బౌలింగ్లో బెన్ డకెట్ (23) ఎల్బీడబ్ల్యూ కాగా.. ఆతర్వాత 60 పరుగుల వద్ద మొయిన్ అలీ (5)ని క్లీన్బౌల్డ్ చేశాడు స్టార్క్. అప్పటికే క్రీజ్లో కుదురుకున్న జాక్ క్రాలే (44)ను 93 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ పెవిలియన్కు పంపాడు. మార్ష్ బౌలింగ్లో వికెట్కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి క్రాలే ఔటయ్యాడు. అనంతరం మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్న ఇంగ్లండ్.. 26 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 120 పరుగుల చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. జో రూట్ (16), హ్యారీ బ్రూక్ (22) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 131 పరుగులు అవసరం కాగా.. ఆసీస్ గెలుపుకు 7 వికెట్లు అవసరంగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
'వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది'
యాషెస్ సిరీస్లో మ్యాచ్లు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో.. మ్యాచ్ బయట జరిగే విషయాలు కూడా అంతే ఆసక్తిగా ఉంటున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో వివాదాస్పద ఔట్ తర్వాత ఇంగ్లీష్ మీడియా, అభిమానులు వీలు చిక్కినప్పుడల్లా ఆసీస్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీని విలన్గా ముద్రించారు. అతను కనిపించిన ప్రతీసారి ఏదో ఒకరీతిలో అతన్ని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టులో బ్యాటింగ్, కీపింగ్కు వచ్చిన సందర్భంలో మైదానంలోని ఇంగ్లండ్ అభిమానుల నుంచి అతనికి చీత్కారాలే ఎక్కువగా వచ్చాయి. దీనికి తోడు ఇంగ్లీష్ పత్రిక ది సన్ అలెక్స్ కేరీ కటింగ్షాపు ఓవర్కు డబ్బులు ఎగ్గొట్టాడంటూ ఒక కథనాన్నే ప్రచురించింది. ''లీడ్స్లోని ఒక కటింగ్షాపుకు వెళ్లిన కేరీ హెయిర్ కట్ అనంతరం ఓనర్కు డబ్బులు ఎగ్గొట్టాడు. దాంతో సదరు వ్యక్తి కేరీకి డెడ్లైన్ విధించాడంటూ'' రాసుకొచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన థ్రెడ్స్ ఖాతాలో వివరణ ఇస్తూ సదరు పత్రికపై విమర్శలు గుప్పించాడు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదంటూ హితభోద చేశాడు. ''అలెక్స్ కేరీ లండన్ వచ్చినప్పటి నుంచి హెయిర్ కటింగ్ చేయించుకోలేదు. దానిని నేను కచ్చితంగా చెప్పగలను. ముందు నిజాలను తెలుసుకుంటే బాగుంటుంది'' అని స్మిత్ పోస్టు చేశాడు. ఇక యాషెస్ సిరీస్ మూడో టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. 251 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. డకెట్ (18 నాటౌట్), క్రాలీ (9 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. ఆ జట్టు మరో 224 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: #PrithviShaw: ''పుజారా సార్' నాలా బ్యాటింగ్ చేయలేడు.. నేను అంతే!' విలన్గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి -
ఇంగ్లండ్ కోచ్ మెక్కల్లమ్కు చేదు అనుభవం..
యాసెస్ సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. మూడోరోజు ఆటలో రెండు సెషన్లు దాదాపు వర్షంతో తుడిచిపెట్టుకుపోయినప్పటికి.. ఇంగ్లండ్ పైచేయి సాధించింది. కేవలం ఆఖరి సెషన్లోనే మిగతా ఆరు వికెట్లు కూల్చిన ఇంగ్లండ్.. ఆసీస్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ముందు 251 పరుగుల టార్గెట్ను ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడంతో ఇంగ్లండ్ గెలుస్తుందా.. లేక ఆసీస్ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంటుందా అనేది చూడాలి. కాగా లార్డ్స్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు సహా సిబ్బందికి ఏదో ఒక రకంగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ అభిమానుల దృష్టిలో అలెక్స్ కేరీ విలన్గా మారిపోయాడు. ఇక ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్కు కూడా లీడ్స్లోని హెడ్డింగ్లే స్టేడియంలో చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టు ప్రారంభానికి ముందు స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎంట్రీ పాస్ లేదని ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ను స్టేడియం లోపలికి అనుమతించలేదని సమాచారం. ఇంగ్లండ్ మీడియాలో దీని గురించి కథనాలు వెలువడ్డాయి. ఆ కథనాల ప్రకారం.. సరైన ఎంట్రీ పాస్ లేకపోవడంతో మెక్కల్లమ్ను భద్రతా సిబ్బంది గేటు వద్ద ఆపేశారు. డ్యూటీలో ఉన్న సెక్యురిటీ గార్డ్ మెక్కల్లమ్ను గుర్తుపట్టలేదు. అంతేకాకుండా అతడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో సెక్యురిటీ గార్డ్ తన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మెక్కల్లమ్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని భద్రతా సిబ్బందిని హెచ్చరించి అక్కడి నుంచి ముందుకుసాగాడు. ఇక మెక్కల్లమ్ న్యూజిలాండ్ తరపున 101 టెస్టులు, 260 వన్డేలు, 71 టి20 మ్యాచ్లు ఆడి.. ఓవరాల్గా అన్ని ఫార్మాట్లు కలిపి 14,676 పరుగులు సాధించాడు. విధ్వంసకర బ్యాటర్గా పేరు పొందిన మెక్కల్లమ్ ఖాతాలో 19 సెంచరీలు, 76 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం -
రసవత్తరంగా యాషెస్ మూడో టెస్టు.. ఇంగ్లండ్ విజయ లక్ష్యం 251 పరుగులు
లీడ్స్: ‘యాషెస్’ సిరీస్ మూడో టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. 251 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. డకెట్ (18 నాటౌట్), క్రాలీ (9 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. ఆ జట్టు మరో 224 పరుగులు చేయాల్సి ఉంది. లక్ష్యం చిన్నదిగానే కనిపిస్తున్నా పిచ్ బ్యాటింగ్కు కష్టంగా మారుతున్న స్థితిలో ఆసీస్ పదునైన బౌలింగ్ను ఎదుర్కొని ఇంగ్లండ్ ఎలా ఛేదిస్తుందనేది ఆసక్తికరం. శనివారం వాన టెస్టుకు తీవ్ర అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా తొలి సెషన్లో ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా... మొత్తం 25.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఓవర్నైట్ స్కోరు 116/4తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోవడంతో ఆసీస్కు పరుగులు రావడం కష్టంగా మారింది. 20.1 ఓవర్లలోనే ఆ జట్టు మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ ట్రవిస్ హెడ్ (112 బంతుల్లో 77; 7 ఫోర్లు, 3 సిక్స్లు) పట్టుదలగా ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. అతనికి కొద్ది సేపు మిచెల్ మార్‡్ష (28) అండగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, వోక్స్ చెరో 3 వికెట్లు పడగొట్టగా...మొయిన్ అలీ, మార్క్వుడ్ చెరో 2 వికెట్లు తీశారు. -
విలన్గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి
యాషెస్ సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడోరోజు ఆటకు వరుణుడు అడ్డు పడ్డాడు. ఇప్పటికైతే ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 18, మిచెల్ మార్ష్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔట్ వివాదంతో ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ విలన్గా మారిపోయాడు. లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్ అభిమానులు అలెక్స్ కేరీని టార్గెట్ చేస్తూ గేలి చేశారు''ఆడింది చాలు.. పెవిలియన్ వెళ్లు.. అంటూ షూ, చెప్పులు చూపించడం'' వైరల్గా మారింది. ఇంగ్లీష్ మీడియాలో యాషెస్ విలన్గా ముద్ర పడిన అలెక్స్ కేరీ తన చర్యతో మరోసారి వార్తల్లో నిలిచాడు. లీడ్స్లోని ఒక కటింగ్షాపు ఓనర్కు డబ్బులు ఎగ్గొట్టాడు. దాంతో సదరు వ్యక్తి కేరీకి డెడ్లైన్ విధించాడు. విషయంలోకి వెళితే.. ఆడం మహమూద్ అనే బార్బర్ వద్ద కేరీ కటింగ్ చేసుకున్నాడు.అందుకు 30 యూరోలు అంటే.. మన కరెన్సీలో రూ.2,718 అయింది. అయితే ఆసీస్ కీపర్ తన వద్ద అంత డబ్బు లేదని తప్పకుండా ఇచ్చేస్తానని ఆడంతో పేర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు అతడికి పైసా కూడా ఇవ్వలేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మహమూద్.. క్యారీకి డెడ్లైన్ విధించాడు. ఈ సోమవారం(జూలై 10)లోగా డబ్బులు ముడితే తాను సంతోషిస్తానని లేదంటే తన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిపాడు. అయితే అలెక్స్ కేరీ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: IND Vs WI: అంతా కొత్త మొహాలే.. ఎవర్రా మీరంతా? -
నువ్వేం తండ్రివి? యువీ చితకబాదినపుడు ఎక్కడున్నావు? నీ స్థాయి మరచి..
The Ashes, 2023: ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తండ్రి, ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. వయసు పెరగగానే సరిపోదు.. కాస్త బుద్ధి కూడా ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రిఫరీగా వ్యవహరిస్తూ ఓ ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 సీజన్లో ఇంగ్లండ్పై ఇప్పటికే రెండు విజయాలతో ఆస్ట్రేలియా పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా గురువారం మూడో టెస్టు ఆరంభమైంది. తమకు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పదిహేడో సారి ఈ నేపథ్యంలో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ అద్భుత సెంచరీ(118) కారణంగా మెరుగైన స్కోరు నమోదు చేయగలిగింది. 263 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక ఈ మ్యాచ్లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(4) స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో పదహారోసారి అవుటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో(1)నూ అతడికే వికెట్ సమర్పించుకున్నాడు. కాగా టెస్టుల్లో బ్రాడ్ బౌలింగ్లో వార్నర్ అవుట్ కావడం ఇది పదిహేడోసారి. దీంతో వార్నర్ను ట్రోల్ చేస్తూ ఇంగ్లండ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్తో రెచ్చిపోయారు. మీమ్ను రీషేర్ చేసిన క్రిస్ బ్రాడ్ ఇందులో భాగంగా ఓ నెటిజన్.. అమెరికన్ యానిమేటెడ్ సిట్కామ్ సిరీస్ ది సింప్సన్స్లోని బార్ట్ అనే క్యారెక్టర్ను వార్నర్ ముఖంతో మార్ఫింగ్ చేసి పెట్టాడు. స్టువర్ట్ బ్రాడ్ మళ్లీ నన్ను అవుట్ చేశాడు అని వార్నర్ బోర్డు మీద రాస్తున్నట్లుగా మీమ్ క్రియేట్ చేశాడు. ఒకే ఓవర్లో 6 సిక్సర్లను గుర్తుచేస్తూ ఈ మీమ్ను స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ రీషేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘కొడుకు ప్రతిభ చూసి సంతోషపడటంలో తప్పులేదు. కానీ ఐసీసీ మ్యాచ్ రిఫరీ అయి ఉండి ఇలా దిగజారిపోవడం ఏమీ బాగాలేదు. వార్నర్ను మరీ అంతగా తీసిపారేయాల్సిన అవసరం లేదు. మీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు’’ అని క్రిస్కు చురకలు అంటిస్తున్నారు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2007లో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు బాదిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ‘‘యువీ బ్రాడ్ బౌలింగ్లో చితక్కొట్టినపుడు ఇలాంటి ట్వీట్లు చేయలేదు ఎందుకు?’’ అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: సినిమాను తలపించే ట్విస్టులు! కుటుంబాల మధ్య గొడవ.. సీక్రెట్గా ప్రేమా, పెళ్లి! ఆఖరికి Ind vs WI: కోహ్లి, రోహిత్ వాళ్లిద్దరి బౌలింగ్లో! వీడియో వైరల్ What a start! 🤩 Broad gets Warner for the... *Checks notes* ...Sixteenth time! 🤯 #EnglandCricket | #Ashes pic.twitter.com/WfSoa5XY1G — England Cricket (@englandcricket) July 6, 2023 Couldn’t have found a better partner to watch this together with after 15 years 👶 🏏 #15YearsOfSixSixes #ThisDayThatYear #Throwback #MotivationalMonday #GetUpAndDoItAgain #SixSixes #OnThisDay pic.twitter.com/jlU3RR0TmQ — Yuvraj Singh (@YUVSTRONG12) September 19, 2022 pic.twitter.com/76dG8lgOkv — Chris Broad (@ChrisBroad3) July 7, 2023 -
Eng Vs Aus: మేమింకా గెలవగలిగే స్థితిలోనే ఉన్నాం: ఇంగ్లండ్ స్టార్
The Ashes, 2023- England vs Australia, 3rd Test- Day 2- లీడ్స్: యాషెస్ సిరీస్ మూడో టెస్టు ఆసక్తికర మలుపులతో సాగుతోంది. రెండో రోజు కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పోటాపోటీగా పోరాడాయి. రెండో రోజు నాటి శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (43), డేవిడ్ వార్నర్ (1), మార్నస్ లబుషేన్ (33), స్టీవ్ స్మిత్ (2) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 142 పరుగులకు చేరింది. స్టోక్స్ దూకుడు అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 68/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (80; 6 ఫోర్లు, 5 సిక్స్లు) ఒంటిచేత్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చివర్లో మార్క్ వుడ్ (8 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరుపులు ఇంగ్లండ్ భారీ ఆధిక్యం కోల్పోకుండా కాపాడాయి. ఇక ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (6/91) రాణించాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. గెలవగలిగే స్థితిలోనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్పిన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ బీబీసీతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యాషెస్ సిరీస్ మూడో టెస్టులో తామింకా గెలవగలిగే స్థితిలోనే ఉన్నామని ధీమా వ్యక్తం చేశాడు. వికెట్ బాగుందని.. తమ జట్టు కచ్చితంగా ఈ మ్యాచ్లో పైచేయి సాధిస్తుందని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్లో 200 మార్కు దాటడం తమలో సానుకూల దృక్పథం నింపిందన్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. రెండు వికెట్లు పడగొట్టి ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో ఆరంభం నుంచే తాను దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నానన్న అలీ.. రెండు వికెట్లు తీయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. కాగా రెండో రోజు ఆటలో మొయిన్ అలీ లబుషేన్, స్మిత్ వికెట్లు పడగొట్టగా.. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజాను క్రిస్ వోక్స్, డేవిడ్ వార్నర్ను స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్కు పంపారు. ఇదిలా ఉంటే.. యాషెస్ తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఆసీస్ విజయం సాధించి 2-0తో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాతో సిరీస్కు జట్టును ప్రకటించిన విండీస్.. ఆ ఇద్దరు తొలిసారి -
బజ్బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు
యాషెస్ సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టు రసవత్తరంగా మారుతుంది. రెండో రోజు రెండో సెషన్లోనే ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో ఆసీస్కు 26 పరుగులు స్వల్ప ఆధిక్యం లభించినట్లయింది. అయితే తాను మొదటినుంచి చెప్పుకుంటున్న బజ్బాల్ ఆటను మరోసారి ఆస్ట్రేలియాకు రుచి చూపించాడు. ఫలితం సంగతి ఎలా ఉన్నా స్టోక్స్ మాత్రం తాను ఉన్నంతసేపు దాటిగా ఆడాడు. మొదట క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న స్టోక్స్ ఆ తర్వాత ఫాస్ట్గా ఆడాడు. అయితే ఏ జట్టైనా వికెట్లు కోల్పోతుంటే బ్యాటర్ కూడా స్లో ఆడడానికి ప్రయత్నిస్తాడు. కానీ స్టోక్స్ మాత్రం ఎదురుదాడి చేశాడు.ఇంగ్లండ్ 168 పరుగుల వద్ద మార్క్వుడ్(24 పరుగులు) ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరగ్గానే స్టోక్స్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. అప్పటికి ఇంగ్లండ్ ఇంకా 95 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో కుదురుకున్న స్టోక్స్ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 39 బంతుల్లో 61 పరుగులు చేయడం విశేషం. మర్ఫీ బౌలింగ్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన స్టోక్స్ ఆ తర్వాత కమిన్స్, స్టార్క్ బౌలింగ్లో సిక్సర్లతో చెలరేగాడు. ఓవరాల్గా 106 బంతుల్లో 80 పరుగులు చేసిన స్టోక్స్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే స్టోక్స్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో ఆరువేల పరుగులు, వంద వికెట్లు సాధించిన మూడో ఆల్రౌండర్గా స్టోక్స్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు స్టోక్స్ 94 టెస్టుల్లో 6008 పరుగులు చేయడంతో పాటు 197 వికెట్లు పడగొట్టాడు. ఇక తొలి స్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్(13289 పరుగులు, 292 వికెట్లు), రెండో స్థానంలో విండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్(8032 పరుగులు, 235 వికెట్లు) ఉన్నాడు. చదవండి: #TamimIqbal: దేశ ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్ #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం -
ఆరు వికెట్లతో చెలరేగిన కమిన్స్.. ఇంగ్లండ్ 237 ఆలౌట్
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసకందాయంలో పడింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగులకు ఆలౌట్ అయింది. స్టోక్స్ (108 బంతుల్లో 80 పరుగులు) ఒంటరిపోరాటం చేశాడు. పాట్ కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ భరతం పట్టాడు. ఇక ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించినట్లయింది. మూడు వికెట్ల నష్టానికి 68 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ కాసేపటికే రూట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు పడ్డప్పటికి ఒక ఎండ్లో స్టోక్స్ మాత్రం కుదురుగా ఆడాడు. 168 పరుగుల వద్ద మార్క్వుడ్(24 పరుగులు) ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరగ్గానే స్టోక్స్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. అప్పటికి ఇంగ్లండ్ ఇంకా 95 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో కుదురుకున్న స్టోక్స్ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 39 బంతుల్లో 61 పరుగులు చేయడం విశేషం. మర్ఫీ బౌలింగ్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన స్టోక్స్ ఆ తర్వాత కమిన్స్, స్టార్క్ బౌలింగ్లో సిక్సర్లతో చెలరేగాడు. తన దూకుడైన ఇన్నింగ్స్తో ఆసీస్కు స్వల్ప ఆధిక్యం దక్కేలా చేశాడు. స్టోక్స్ మినహా మిగతా బ్యాటర్లలో మొయిన్ అలీ 21, మార్క్ వుడ్ 24, జాక్ క్రాలీ 33 పరుగులు చేశారు. కమిన్స్ ఆరు వికెట్లు తీయగా.. స్టార్క్ రెండు, టాడ్ మర్ఫీ, మిచెల్ మార్ష్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్ సెంచరీతో రాణించాడు. చదవండి: #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం #Ashes2023: నిప్పులు చెరుగుతున్న కమిన్స్.. కష్టాల్లో ఇంగ్లండ్ -
హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. రెండో రోజు ఆటలో ఆసీస్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. ముఖ్యంగా కమిన్స్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతూ ఇంగ్లండ్ భరతం పట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో సెషన్లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులతో ఆడుతుంది. స్టోక్స్ 60 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తుండగా.. కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా 51 పరుగులు వెనుకబడి ఉంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ వివాదాన్ని ఇంగ్లండ్ అభిమానులు అంత తొందరగా మరిచిపోయేలా కనిపించడం లేదు. తాజాగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ఇంగ్లండ్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న లీడ్స్.. జానీ బెయిర్ స్టోకు హోమ్ గ్రౌండ్. కాగా బెయిర్ స్టో ఇలాకాలో ఇంగ్లండ్ అభిమానులు హద్దుమీరి ప్రవర్తించారు. ఆసీస్ ఆటగాడు అలెక్స్ కేరీని ఉద్దేశించి ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అలెక్స్ కేరీ ఔటయ్యి పెవిలియన్ వెళ్తున్న సమయంలో ఇంగ్లండ్ అభిమానులు అతన్ని గేలి చేశారు.. ''గుడ్ బై.. ఇక మైదానంలోకి రాకు.. వస్తే ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది'' అంటూ చప్పట్లు కొట్టారు. మరి కొంతమంది అభిమానులు తన షూస్ విప్పి చేతిలో పట్టుకొని కేరీ వైపు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.అయితే ఆసీస్ అభిమానులు కూడా కాస్త దీటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి రోజు తొలిసెషన్ ఆటలో ఇంగ్లాండ్ 193/5గా ఉన్న సమయంలో.. గ్రీన్ బౌన్సర్ను తప్పించుకునేందుకు బెయిర్స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్ పడగొట్టాడు. బంతి డెడ్ కాలేదని భావించిన థర్డ్ అంపైర్.. బెయిర్స్టోను స్టంపౌట్గా ప్రకటించాడు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆసీస్ ‘క్రీడా స్ఫూర్తి’ ప్రదర్శించలేదని ఇంగ్లాండ్ అభిమానులు విమర్శలు గుప్పించారు. తాము ఐసీసీ నిబంధనల ప్రకారమే ఔట్ చేసినట్లు ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు కౌంటర్ ఇచ్చారు. The Western Terrace is alive as Alex Carey departs 👋#Ashes pic.twitter.com/t6bWvcQRpF — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) July 6, 2023 “Welcome” Alex Carey pic.twitter.com/tCNv1bKEsY — Justin it for the Cloutinho (@JUSTIN_AVFC_) July 6, 2023