FIDE Chess Tournament: విజేత సామ్యూల్‌ స్టీఫెన్‌ | FIDE Chess Tournament: Telangana Samuel emerges champion at V4 Chess Tournament | Sakshi
Sakshi News home page

FIDE Chess Tournament: విజేత సామ్యూల్‌ స్టీఫెన్‌

Published Tue, Feb 7 2023 4:56 AM | Last Updated on Tue, Feb 7 2023 4:56 AM

FIDE Chess Tournament: Telangana Samuel emerges champion at V4 Chess Tournament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ ఓపెన్‌ ‘ఫిడే’ రేటెడ్‌ బిలో–1600 చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 ఏళ్ల కుర్రాడు సామ్యూల్‌ స్టీఫెన్‌ నోబెల్‌ విజేతగా నిలిచాడు. వీ4 చెస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో సామ్యూల్‌ స్టీఫెన్‌ తొమ్మిది రౌండ్లకుగాను 8.5 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

సామ్యూల్‌ ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన సామ్యూల్‌కు భారీ ట్రోఫీతోపాటు రూ. 1 లక్ష ప్రైజ్‌మనీగా లభించింది. హర్షల్‌ పాటిల్‌ (మహారాష్ట్ర; 8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రూ. 60 వేలు... కె.సమర్‌తేజ (తెలంగాణ; 8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి రూ. 40 వేలు ప్రైజ్‌మనీ గెల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం  అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌ విజేతలకు ట్రోఫీలు అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement