Ind vs Eng: ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​కు భారత్ జట్టు ప్రకటన | India team announcement for Test series with England | Sakshi
Sakshi News home page

Ind vs Eng: ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​కు భారత్ జట్టు ప్రకటన

Published Sat, Jan 13 2024 4:31 AM | Last Updated on Sat, Jan 13 2024 10:27 AM

India team announcement for Test series with England - Sakshi

ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగనున్న టెస్ట్ సీరీస్‌ నేపథ్యంలో బీసీసీఐ జట్టును ప్రకటించింది. మొదటి రెండు టెస్టులకు పదహారు మందితో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. రోహిత్ శర్మ సారథ్యం వహించనున్న ఈ జట్టుకు... ప్రధాన పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఇషాన్‌ కిషన్‌పై వేటు పడగా.. కొత్త కుర్రాడు ధ్రువ్‌ జురెల్‌ వికెట్‌ కీపర్‌కోటాలో స్థానం దక్కించుకున్నాడు. కాగా జనవరి 25 నుంచి టీమిండియా-  ఇంగ్లండ్‌ మధ్య టెస్టులు ఆరంభం కానున్నాయి.

మొదటి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్​మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్రె జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్​దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్‌), ఆవేశ్‌ ఖాన్‌.

చదవండి: వెళ్లడం వరకే నీ ఇష్టం!.. ద్రవిడ్‌ ‘వార్నింగ్‌’ తర్వాత ఇషాన్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement