
ట్యూనిషియాలో జరిగిన జుహైర్ ఎస్గయిర్ అంతర్జాతీయ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో భారత మహిళా రెజ్లర్లు ఏడు పతకాలతో అదరగొట్టారు. ఫ్రీస్టయిల్ విభాగంలో 145 పాయింట్లతో ఓవరాల్ టీమ్ టైటిల్ను సొంతం చేసుకున్నారు.
అంతిమ్ (53 కేజీలు), సరిత (59 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించారు. నిషా (68 కేజీలు), బిపాషా (72 కేజీలు) రజత పతకాలు... మాన్సి (57 కేజీలు), సాక్షి (62 కేజీలు), మనీషా (65 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు.
చదవండి: Sri Lanka Crisis: శ్రీలంక క్రికెట్ కీలక నిర్ణయం.. టీ20 లీగ్ వాయిదా..!