రాష్ట్ర స్థాయి ఇజ్తిమా ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి ఇజ్తిమా ప్రారంభం

Published Sun, Feb 23 2025 12:24 AM | Last Updated on Sun, Feb 23 2025 12:23 AM

రాష్ట్ర స్థాయి ఇజ్తిమా ప్రారంభం

రాష్ట్ర స్థాయి ఇజ్తిమా ప్రారంభం

కొడవలూరు: మండలంలోని చంద్రశేఖరపురంలో రాష్ట్ర స్థాయి ఇజ్తిమా శనివారం ప్రారంభమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు తరలి వచ్చారు. ప్రపంచ శాంతి కోసం శని, ఆదివారాల్లో ఇక్కడ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. శనివారం పలువురు మతబోధకులు బోధనలు, ప్రార్థనలు చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు నీళ్ల బాటిళ్లు ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు అన్నదానం చేశారు. ఇజ్తిమాకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగుకుండా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సైలు కోటిరెడ్డి, నరేష్‌, సీఐ సురేంద్రబాబు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement