తొలి పూజలందుకున్న పోతలయ్య స్వామి | - | Sakshi
Sakshi News home page

తొలి పూజలందుకున్న పోతలయ్య స్వామి

Published Mon, Mar 3 2025 12:51 AM | Last Updated on Mon, Mar 3 2025 12:51 AM

తొలి పూజలందుకున్న  పోతలయ్య స్వామి

తొలి పూజలందుకున్న పోతలయ్య స్వామి

కనగానపల్లి: మండలంలోని దాదులూరు గ్రామంలో పోతలయ్య స్వామి జాతర ఆదివారం భక్తుల కోలాహలం మధ్య ప్రారంభమైంది. తొలి రోజు వేకువజామునే గంతిమర్రి, కలికివాండ్లపల్లి గ్రామాల నుంచి భక్తులు ఎలవగంపలో స్వామి ఆభరణాలు, పూలను ఊరేగింపుగా తీసుకు వచ్చారు. ఆలయంలో విశేష పూజల అనంతరం మూలవిరాట్‌ను ఆభరణాలతో అలంకరించారు. అలాగే చెన్నకేశవస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేసి స్వామి కాపులు దాసంగాలు (పంక్తి భోజనాలు) నిర్వహించారు. తొలిరోజు పూజా కార్యక్రమాల్లో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

నేడు జ్యోతుల మహోత్సవం

జాతరలో భాగంగా సోమవారం పోతలయ్య స్వామికి జ్యోతుల మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. ఆలయం చుట్టూ పన్నేరపు బండ్లను ప్రదక్షిణ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కాగా, కీలకమైన గావుల మహోత్సవాన్ని మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో ఇప్పటికే పోతురాజులు ఆలయం వద్దకు చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement