
ట్రాక్టర్ను ఢీకొన్న కారు
టెక్కలి రూరల్: మండలంలోని లచ్చన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు ధ్వంసమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న కారు లచ్చన్నపేట మలుపు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జయ్యింది. ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కారులో ఉన్న వ్యక్తులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.