హనీమూన్‌కు వెళ్లి డాక్టర్‌ దంపతులు మృతి.. అసలేం జరిగింది? | - | Sakshi
Sakshi News home page

హనీమూన్‌కు వెళ్లి డాక్టర్‌ దంపతులు మృతి.. అసలేం జరిగింది?

Published Sun, Jun 18 2023 7:30 AM | Last Updated on Sun, Jun 18 2023 7:33 AM

మృతి చెందిన నవదంపతులు (ఫైల్‌)  - Sakshi

తిరువళ్లూరు: హనీమూన్‌ కోసం మాల్దీవులు వెళ్లి మృతి చెందిన నూతన డాక్టర్‌ దంపతుల మృతదేహాలు రెండు వారాల క్రితం విమానం ద్వారా ఇంటికి చేర్చారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి చెన్నీర్‌కుప్పం ప్రాంతానికి చెందిన సెల్వం కుమార్తే విభూష్న డాక్టర్‌. ఈమేకు చైన్నెకు చెందిన డాక్టర్‌ లోకేశ్వరన్‌తో గత ఒకటిన అంత్యంత వైభవంగా వివాహం జరిగింది. వివాహం జరిగిన రెండు రోజుల తరువాత నూతన జంట హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లారు. అనంతరం అక్కడున్న రిజర్వాయర్‌లో బోట్‌లో వెళుతూ ఫొటో షూట్‌ తీసుకున్నారు.

ఈ సమయంలో జరిగిన ప్రమాదంలో పడవ బోల్తా పడడంతో నూతన జంట నీటిలో మునిగి అక్కడే మృతిచెందారు. మృతదేహలను వెలికి తీసిన అక్కడి పోలీసులు లాంచనాలను పూర్తీ చేశారు. అనంతరం అక్కడి నుంచి విమానం ద్వారా మలేషియాకు అక్కడి నుండి చైన్నెకు మృతదేహాలను తరలించారు. కాగా చైన్నెకు చేరిన తరువాత విభూష్న మృతదేహాన్ని చెన్నీర్‌కుప్పానికి, లోకేశ్వరన్‌ మృతదేహాన్ని సేలంకు బంధువులు తరలించారు.

శనివారం మధ్యాహ్నం విభూష్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా గత రెండు వారాల క్రితం పచ్చటి తోరణాలు, మంగళవాయిద్యాలతో కలకలాడిన ప్రాంతంలో చావు మేళాలు వినిపించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కానిస్టేబుల్‌పై దుండగుల దాడి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement