doctor
-
అత్తను పైకి పంపాలి... మాత్రలు ఇవ్వండి
బనశంకరి(కర్ణాటక): అత్తను పై లోకానికి పంపడానికి రెండు మాత్రలు ఇవ్వాలని కోడలు ఓ డాక్టర్ వాట్సాప్కు మెసేజ్ చేసింది. కంగుతిన్న గురైన డాక్టర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. బెంగళూరు (Bengaluru)కు చెందిన డాక్టర్ సునీల్కుమార్కు ఇన్స్టాలో ఓ మహిళ పరిచయమైంది. ఈనెల 17వ తేదీ ఆ మహిళ డాక్టర్కు వాట్సాప్లో మెసేజ్ (WhatsApp Message) పంపింది.తన అత్త చాలా వేధింపులకు పాల్పడుతోందని.. ఆమెను చంపడానికి రెండు మాత్రలు ఇవ్వాలని, ఇలా మాత్రలు అడిగినందుకు తనను తిట్టవద్దని అందులో పేర్కొంది. దీంతో డాక్టర్ ఆమెను మందలించగా మెసేజ్ డిలిట్ చేసింది. అప్పటికే ఆ మెసేజ్ను స్క్రీన్షాట్ తీసుకున్న డాక్టర్.. సంజయనగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల పేరుతో వంచన.. మాజీ పీడీఓ అరెస్ట్దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని విధానసౌధలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అమాయకుల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర మాజీ పీడీఓ యోగేంద్రను పోలీసులు కెంపేగౌడ ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరుతోనే కాకుండా క్రిప్టో కరెన్సీ, టింబర్ బిజినెస్ల పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసి దుబాయ్కి పరారయ్యాడు. మంగళవారం దుబాయ్ నుంచి కెంపేగౌడ ఎయిర్పోర్టుకు వచ్చిన యోగేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై చెన్నమ్మనకెరె, యలహంక, వీవీ పురం, హిరియూరు, చిత్రదుర్గ తదితర పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చదవండి: ఇల్లరికం అల్లుడితో కలిసి మామను హత్య చేసిన అత్త -
తుంగభద్రలో నగర వైద్యురాలి గల్లంతు
సాక్షి, బళ్లారి: సరదాగా విహారయాత్రకు వచ్చిన యువ వైద్యురాలు తుంగభద్ర నదిలో మునిగిపోయింది. ఈ సంఘటన బుధవారం కర్ణాటకలోని హంపీ వద్ద చోటుచేసుకుంది. డాక్టర్ అనన్యరావు (27), స్నేహితుడు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్కి వచ్చారు. నది ఒడ్డున సణాపురలో ఓ రిసార్టులో మకాం వేశారు. బుధవారం మధ్యాహ్నం నదిలో ఈత కొట్టడానికి వచ్చారు. సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు దూకి ఈత కొట్టాలనుకుంది. నదికి మరోవైపు నుంచి స్నేహితులు సరదాగా వీడియో తీస్తున్నారు. అంతెత్తు నుంచి దూకిన అనన్య కొన్ని క్షణాల పాటు ఈత కొట్టి నీటి ఉధృతికి నదిలో కొట్టుకుపోసాగింది. స్నేహితులు గట్టిగా కేకలు వేసినా ఫలితం లేదు. నీటి ప్రవాహంలో కనుమరుగైపోయింది. స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బందితో వచ్చి బండరాళ్ల మధ్య గాలించారు. రాత్రి అయినప్పటికీ అనన్యరావు జాడ కానరాలేదు. ఈ సంఘటన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అనన్యరావు తండ్రి డా.మెహన్రావు అని, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది. కొప్పళ జిల్లా ఎస్పీ రామ్ అరసిద్ది మాట్లాడుతూ ఆమె కోసం గాలిస్తున్నామని, ప్రాణాలతో ఉందో లేదో తెలియదని అన్నారు. గంగావతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
నీట్ ఎగ్జామ్ పాసైన 62 ఏళ్ల డాక్టర్.. స్టూడెంట్గా కాలేజ్లో..!
గతంలో చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని చాలామంది నిరూపించారు. అలా కాకుండా ఉన్నతమైన వృత్తిలో స్థిరపడి పదవీవిరమణ చేసే సమయంలో మరిన్ని విద్యా అర్హతలు సంపాదించాలనుకోవడం మాములు విషయం కాదు !. పైగా ఆ వయసులో కఠినతరమైన ఎంట్రెన్స్ ఎగ్జామ్ చదివి పాసవ్వడం అంటే ఆషామాషి కాదు. కానీ ఈ పెద్దాయన చాలా అలవోకగా సక్సస్ అయ్యి.. చదవాలంటేనే భారంగా భావించే విద్యార్థలందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతకీ అతడెవరో వింటే మాత్రం కంగుతినడం గ్యారంటీ. అంతటి బిజీ వృత్తి చేపట్టి కూడా ఆ వయసులో చదువుకోవాలనుకుంటున్నాడా..? అని నోరెళ్లబెడతారు. ఎవరంటే..62 ఏళ్ల వయసులో పీడియాట్రిక్ వైద్యుడు డాక్టర్ నీలి రాంచందర్ నీట్ పీజీ 2024 పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడాయన ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ తీసుకోనున్నారు. ఆయనకు సుదీర్ఘ కెరీర్ ఉన్నప్పటికీ..అత్యంత కఠినతరమైన పరీక్షలలో ఒకటైన నీట్ పీజీ 2024 ఎగ్జామ్ ప్రిపేరై పాసవ్వడం చాలామంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. ఈ వయసులో కూడా నేర్చుకునేందుకు మక్కువ చూపించడం అనేది విశేషం. సుదీర్ఘ కల సాకారం కోసం..నిజామాబాద్కు చెందిన నీలి రాంచందర్ ప్రముఖ శిశు వైద్యుడుగా 30 ఏళ్లకు పైగా సేవలందించారు. తన కెరీర్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త వైద్య అర్హతలను పొందడానికి నీట్ పీజీ 2024 పరీక్షకు హాజరయ్యారు. ఇప్పుడు ఆయన నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఎండీ(ఫార్మకాలజీ) కోర్సులో చేరి విద్యార్థిగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన 2014లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ పీడియాట్రిక్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడితో సహా ప్రతిష్టాత్మక పదవులను అలంకరించారు. అతను నేషనల్ రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్ (2017-2018)తో సహా అనేక అవార్డులను కూడా అందుకున్నారు. ఎండీ కోర్సును అభ్యసించాలనే అతని దీర్ఘకాల కోరిక అతన్ని NEET PG 2024కి హాజరు కావడానికి ప్రేరేపించింది.వైద్యుడిగా ప్రస్థానం..డాక్టర్ రాంచందర్ ప్రారంభంలో 1982లో బీ. ఫార్మా కోర్సును వదిలి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్లో చేరారు. అతను 1991, 1993ల మధ్య పీడియాట్రిక్స్లో సేవ చేయడానికి డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ (DCH) పూర్తి చేశారు. ఆ తర్వాత వెంటనే ప్రాక్టీస్ చేపట్టి వైద్యుడిగా బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఎండీ పూర్తి చేయలేకపోయారు. సరిగ్గా 62 ఏళ్లకు తన చివరి కలను సాకారం చేసుకునే అవకాశం చిక్కింది. ఆయన ఏమాత్రం సంశయించకుండా ఈ వయసులో ఉన్నత చదువు చదవాలనుకోవడం ప్రశంసించనదగ్గ విషయం. సాకులు చెప్పే ఎందరో విద్యార్థులకు స్ఫూర్తి ఈ శిశు వైద్యుడు.(చదవండి: దటీజ్ సుధీర్..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్గా మార్చి..) -
బరువు తగ్గడానికి 12-12 రూల్ ..!
బరువు తగ్గడానికి అడపదడపా ఉపవాసం ఒక ప్రసిద్ధమైన పద్ధతిగా మారింది. దీంతో అయితేనే ఈజీగా బరువు తగ్గుతామని చాలామంది ఈ పద్ధతి వైపుకే మొగ్గు చూపుతున్నారు. అయితే తాజాగా హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ చెందిన ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరబ్ సేథి ఈ అడదడప ఉపవాసం ది బెస్ట్ అని కితాబిచ్చారు. ఇది బరువు నిర్వహణ తోపాటు మొత్త ఆరోగ్యానికే మంచి ప్రయోజనాలను అందిస్తుందని చెప్పారు. ముఖ్యంగా కొవ్వుని కరిగించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. దీన్ని గనుక ఈ సింపుల్ టెక్నిక్లలో చేస్తే తక్షణమే ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. అదెలాగో చేసేద్దామా..!.డాక్టర్ సేథి బరువు తగ్గడం కోసం మూడు కీలక చిట్కాలను ఫాలోమని చెప్పారు. అవేంటంటే..నిర్మాణాత్మక ఉపవాస షెడ్యూల్, మంచి డిటాక్స్ పానీయాలు, సమతుల్య ఆహారం తదితరాలు. ఈ మూడింటిని ఎలా చేయాలో డాక్టర్ సేథి చాలా వివరంగా చెప్పారు. 12:12 ఉపవాస షెడ్యూల్:డాక్టర్ సేథి 12:12 అడపాదడపా ఉపవాస షెడ్యూల్నే నిర్మాణాత్మక ఉపవాసమని అన్నారు. ఇది అత్యంత తేలికగా నిర్వహించదగిన ప్రక్రియని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా 12 గంటలు ఉపవాసం ఉంటారు, మిగతా 12 గంటలు తినడం వంటివి చేస్తారు. ఈ విధానం అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ముఖ్యంగా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల నిద్రలేమి తాలుక సమస్యలు దూరం అవుతాయని అన్నారు. ఇది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నివారస్తుందని చెప్పారు. అలాగే ఇంత విరామం కారణంగా జీర్ణక్రియ పునరుద్ధరించడానికి తగినంత సమయం ఉంటుంది. ఉపవాస సమయంలో తీసుకోవాల్సినవి..ఈ పన్నెండు గంటల ఉపవాస సమయంలో కొవ్వుని కరిగించే జ్యూస్లు వంటివి తీసుకోవాలి. అంతేతప్ప కూల్డ్రింక్లు, ఫ్యాట్తో కూడిన జ్యూస్ల జోలికి వెళ్లకూడదని చెప్పారు. ముఖ్యంగా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ నీరు, ఫెన్నెల్ లేదా తులసి నీరు, చమోమిలే టీ లేదా అల్లం టీ వంటివి తీసుకోవడం మంచిదని చెప్పారు సేథి. ఇవి ఆకలిని అరికట్టడంలో సహాయపడటమే కాకుండా జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. వివిధ మార్గాల్లో శరీరానికి మద్దుతుని ఇస్తాయి.మిగతా 12 గంటలు తినే భోజనం ఎలా ఉండాలంటే..ఈ సమయంలో సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొవ్వు తగ్గేందుకు ప్రోత్సహించేలా అధిక ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టిపెట్టాలి. పనీర్, టోపు, చిక్పీస్, చికెన్, టర్కీ, చేపలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయాలు తీసుకోవడం మంచిదని సూచించారు. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడం తోపాటు అతిగా తినకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ప్రోటీన్, ఫైబర్ కలయిక కొవ్వుని తగ్గించడానికి మద్దతు ఇవ్వడమే కాకుండా శరీరానికి ఇంధనంగా మంచి పోషకాలను అందిస్తుంది. చివరగా బరువు తగ్గడంలో ఈ అడపాదడపా ఉపవాసం ప్రభావంతంగా ఉంటుందని క్లినికల్గా నిరూపితమైందని నొక్కి చెప్పారు. అయితే ఇక్కడ సరైన విధంగా చేయడంపైనే ఫలితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం(చదవండి: కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!) -
'ఇది కాస్మెటిక్ సర్జరీనే కానీ కళ్లకు'..ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా..!
మహిళలు కాస్మెటిక్ సర్జరీలతో అందాన్ని రెట్టింపు చేసుకుంటుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారలు, ప్రముఖులే వీటిని చేయించుకుంటుంటారు. ఓ మోస్తారు స్థాయిలో డబ్బున్న వాళ్లు చేయించుకునే సర్జరీలివి. ఇంతవరకు బ్రెస్ట్, పెదాలు, ఫేస్లిఫ్ట్లు, బోటాక్స్ వంటి కాస్మెటిక్ సర్జరీల గురించి విన్నాం. కానీ కంటికి కాస్మెటిక్ సర్జరీలు చేయడం గురించి వినలేదు కదా..!. ఇదేంటి కంటికి ఏం చేస్తారు అనుకోకండి. ఎందుకంటే నీలిరంగు, తేనె కళ్లతో ఉండేవాళ్లని చూస్తుంటాం కదా..! అలా మన కళ్లను నచ్చిన రంగుతో అందంగా మార్చుకునే సర్జరీనే ఇది. అయితే దీనికి ఖర్చు ఎంతవుతుందో తెలుసా..!.యూఎస్కి చెందిన డాక్టర్(US Doctor) బ్రియాన్ బాక్సర్ వాచ్లర్(Dr Brian Boxer Wachler) ఈ వినూత్న కాస్మెటిక్ సర్జరీ(cosmetic surgery)నే చేస్తున్నారు. ఇలా కంటి రంగుని మార్చడాన్ని కెరాటోపిగ్మెంటేషన్ సర్జరీగా పిలుస్తారు. కార్నియాలోకి వర్ణద్రవ్యాన్ని ఇంజెక్ట్ చేసి కంటి రంగుని మార్చే ప్రక్రియ ఇది. దీనికి జస్ట్ 15 నుంచి 20 నిమిషాలుపడుతుంది అంతే..!. ఈ కార్నియాకి ఇచ్చే ఇంజెక్షన్లో ఈ ఐ డ్రాప్స్ తిమ్మిరిని కలుగజేస్తాయి. అందువల్ల నొప్పి కూడా అస్సలు తెలియదు. ఇంత తక్కువ వ్యవధిలో ఎలాంటి నొప్పి లేకుండా చేసే ఈ సర్జరీ ఖరీదు మాత్రం అత్యధికమే. ఒక కంటికి సుమారు రూ. 5 లక్షల దాక అవుతుంది. అంటే రెండు కళ్లకు దగ్గర దగ్గర రూ. 10 లక్షలు పైనే ఖర్చు అవుతుందన్న మాట. ఈ సర్జరీ రిజల్ట్ తక్షణమే కనిపిస్తుంది. చాలామంది ఔత్సాహికులు మాత్రం ఆకుపచ్చ, సతత హరిత, రివేరా నీలం, పారిస్ నీలం వంటి రంగులను ఎంచుకుంటారట. ఎక్కువమంది హనీ గోల్డ్, స్టీల్ గ్రే, ఆలివ్ ఆకుపచ్చలకే ప్రాధాన్యత ఇస్తారట. తన పేషంట్లలలో చాలామంది ఈ సర్జరీ చేయించుకున్న వెంటనే తన కళ్లలోని మార్పుని చూసి ఆశ్చర్యపోవడం, కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగంగా మాట్లాడటం వంటివి చేస్తారని డాక్టన్ బ్రయాన్ చెబుతున్నారు. అయితే తాను మాత్రం ఈ సర్జరీని ట్రై చేయాలని అనుకోవడం లేదని అన్నారు. కేవలం అందం కోసం ఆరాటపడే వాళ్ల కళ్లలో ఆనందం కోసం ఈ సరికొత్త కాస్మెటిక్ సర్జరీ ప్రక్రియని కనుగొన్నట్లు తెలిపారు. ఆధునాతన లేజర్ని ఉపయోగించి ఈ మొత్తం కాస్మెటిక్ సర్జరీని పూర్తి చేస్తానని అన్నారు. ఇది చాలా సురక్షితమైనదని పేర్కొన్నారు. అంతేగాదు తన పేషంట్ల అనుభవాలకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఈ సర్జరీ గురించి వివరించారు. అయితే నెటిజన్లు ఈ అందం పిచ్చి రాబోయే రోజుల్లో ఎలాంటి భయానక కాస్మెటిక్ సర్జరీలు చేయించుకునేందుకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తూ.. చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Brian Boxer Wachler, MD (@drboxerwachler) (చదవండి: ఇద్దరు నారీమణుల సాహసం..భూగోళాన్ని చుట్టొచ్చారు..!) -
సైఫ్ అంతత్వరగా ఎలా కోలుకున్నారంటే..
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై జరిగిన దాడి గురించి దేశమంతా చర్చించుకుంది. పదునైన ఆయుధంతో ఆయనపై దాడి జరగ్గా.. సర్జరీ తదనంతరం వారం తిరగకముందే ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే.. అంత త్వరగా ఆయన కోలుకుని డిశ్చార్జి కావడం, పైగా ఆయనే స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఈ క్రమంలో.. ఓ డాక్టర్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)పై నిజంగానే దాడి జరిగిందా?.. నెట్టింట జోరుగా గిన చర్చ ఇది. ఇక మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే, సంజయ్ నిరుపమ్ లాంటి ప్రముఖ నేతలు సైతం సైఫ్ దాడి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆస్పత్రి నుంచి సైఫ్ బయటకు వచ్చేశారు. ఆయనకేం జరగనట్లు ఉంది. ఆయనపై నిజంగానే దాడి జరిగిందా? లేదంటే నటిస్తున్నారా?’’ అంటూ కామెంట్లు చేశారు. ఆఖరికి మీమ్స్ పేజీలు సైతం ఈ పరిణామాన్ని వదల్లేదు. అయితే ఆశ్చర్యకరరీతిలో వైద్యులు సైతం ఈ చర్చలో భాగమై తమవంతు అనుమానాలను బయటపెట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఆ అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.‘‘సుమారు 80 ఏళ్ల వయసున్న ఓ పెద్దావిడకు ఫ్రాక్చర్ కారణంగా వెన్నెముకకు సర్జరీ జరిగింది. పైగా ఆమె మడమకు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా ఆమె వాకర్ సాయంతో నడవగలిగింది. ఆ వీడియోనే ఆయన నెట్లో షేర్ చేశారు. పైగా ఆవిడ ఎవరో కాదట.. స్వయానా ఆయన తల్లేనట!‘‘సైఫ్కు నిజంగానే సర్జరీ జరిగిందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్లలో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. అలాంటివాళ్లందరి కోసమే ఈ ఉదాహరణ. ఇది 2022 నాటి వీడియో. మా అమ్మకు ఉదయం సర్జరీ అయితే.. సాయంత్రానికే ఆమె నడిచారు. అలాంటప్పుడు ఆవిడ కంటే తక్కువ వయసున్న వ్యక్తి(సైఫ్ను ఉద్దేశించి..) నిలబడి నడవలేరంటారా?.. అని ఆయన ప్రశ్నించారు.For people doubting if Saif Ali Khan really had a spine surgery (funnily even some doctors!). This is a video of my mother from 2022 at the age of 78y, walking with a fractured foot in a cast and a spine surgery on the same evening when spine surgery was done. #MedTwitter. A… pic.twitter.com/VF2DoopTNL— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) January 22, 2025సైఫ్కు అయిన గాయాలు.. ఆయనకు జరిగిన శస్త్రచికిత్సతో పోలిస్తే మా అమ్మ పరిస్థితి మరీ దారుణం. దాడిలో గాయపడ్డ సైఫ్కు వెన్నెముక వద్ద గాయం, ఫ్లూయెడ్ లీకేజీ జరిగాయి. అత్యవసర సర్జరీతో వెన్నెముక భాగంలో ఇరుక్కుపోయిన కత్తి భాగాన్ని తొలగించారు. ఆ ఫ్లూయెడ్ లీకేజీని సరిచేశారు. అలాగే మా అమ్మకు వెన్నెముకలోనే ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. ఈరోజుల్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నవాళ్లే.. మూడో, నాలుగో రోజుకి చక్కగా నడుస్తూ మెట్లు ఎక్కేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాకు వచ్చే ముందు కాస్త విషయ పరిజ్ఞానం పెంచుకోండి’’ అంటూ చురకలటించారాయన.మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. జనవరి 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో సైఫ్పై దాడి జరిగింది. నిందితుడు ఆయన్ని ఆరుసార్లు కత్తితో పొడిచాడు. వీపులో, నడుం భాగంలో, మెడ, భుజం, మోచేతి భాగంలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయనకు ఎమర్జెన్సీ సర్జరీలు చేశారు. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాక ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు.‘‘సైఫ్ మాట్లాడగలుగుతున్నారు. నడవగలుగుతున్నారు. చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశాం. శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీశాం. వెన్నెముకకు ఎటువంటి ప్రమాదం లేదు. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చాం. ప్రస్తుతం ఆహారం తీసుకుంటున్నారు. రెండుమూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తాం’’ అని జనవరి 18న ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. చెప్పినట్లుగానే మూడు రోజుల అబ్జర్వేషన్ తర్వాత ఆయన్ని డిశ్చార్జి చేశారు. -
హైదరాబాద్: కిడ్నీ ఆపరేషన్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ ఆపరేషన్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 8 మంది బ్రోకర్లను పోలీసులు గుర్తించారు. 6 నెలల నుంచి అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి వ్యవహారం జరుగుతోంది. బెంగళూరుకి చెందిన డాక్టర్దే కీలకపాత్రగా పోలీసులు తేల్చారు. బెంగళూరు, చెన్నైకి చెందిన బ్రోకర్లే కిడ్నీల మార్పిడిలో సూత్రధారులుగా పోలీసులు నిర్థారించారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.55 లక్షలు డాక్టర్ తీసుకున్నాడు. చెన్నై నుంచి ఇద్దరు మహిళలను తీసుకొచ్చి ఆపరేషన్ చేసిన వైద్యుడు.. బెంగళూరుకి చెందిన లాయర్, నర్స్కి కిడ్నీ మార్పిడి చేశాడు. కిడ్నీ మార్పిడికి డాక్టర్కి లాయర్ రూ.55 లక్షలు ఇవ్వగా, నర్స్ రూ.45 లక్షలు ఇచ్చింది. చెన్నైకి చెందిన భాను, ఫిరోజ్జ భానులను కిడ్నీ డోనర్స్గా పోలీసులు గుర్తించారు. కిడ్నీ డోనర్లకు రూ.5 లక్షలు చొప్పున నగదు చెల్లించారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి డాక్టర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.సాధారణ వైద్య చికిత్సలకు (జనరల్) మాత్రమే అనుమతి తీసుకుని ఏకంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తూ రూ.లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్న ఆస్పత్రి నిర్వాకాన్ని వైద్యాధికారులు, పోలీసులు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి డాక్టర్స్ కాలనీలోని అలకనంద ఆస్పత్రిలో అనుమతుల్లేకుండా కిడ్నీల మారి్పడి దందా సాగిస్తున్నన్నట్లు సమాచారం అందింది. దీంతో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి ఆస్పత్రిపై దాడి చేశారు.ఇదీ చదవండి: భార్యను చంపి, ముక్కలు చేసి.. కుక్కర్లో ఉడికించి..జనరల్, ప్లాస్టిక్ సర్జరీల నిమిత్తం ఆస్పత్రి నిర్వహణకు 6 నెలల అనుమతి తీసుకున్న సుమంత్ అనే వ్యక్తి.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమాయక యువతులకు డబ్బు ఆశ చూపి కిడ్నీలు దానం చేసేందుకు ఒప్పిస్తున్నాడు. హైదరాబాద్లో అవసరమైన వారికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాడు. ఇవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే చేస్తున్నట్లు గుర్తించిన జిల్లా వైద్యాధికారులు.. పోలీసులతో కలిసి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఇద్దరు కిడ్నీ దాతలతో పాటు ఇద్దరు కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులను కనుగొన్నారు.అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకొని వైద్యులు పరారయ్యారు. దీంతో చికిత్స పొందుతున్న నలుగురు బాధితులను అధికారులు అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలకనంద ఆస్పత్రిని సీజ్ చేశారు. -
ఆ డాక్టర్ డేరింగ్కి మతిపోవాల్సిందే..! వామ్మో మరీ ఇలానా..
ఓ డాక్టర్ తన భార్యకు భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు ఓ భయానక సాహసానికి ఒడిగట్టాడు. పైగా తన భార్య కోరికను తీర్చేందుకే ఇలా చేశానని చెబుతున్నాడు. ఆ ఘనకార్యం వింటే..అమ్మబాబోయే ఏం డాక్టర్వయ్యా బాబు అని మండిపడతారు.ఈ వింత ఘటన చైనా(China)లో చోటుచేసుకుంది. తైవాన్లోని తైపీకి చెందిన డాక్టర్ చెన్ వీ నోంగ్(Dr Chen Wei-nong) అనే సర్జన్ తనకు తానుగా వేసక్టమీ ఆపరేషన్(Dr Chen Wei-nong) చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోని డాక్యుమెంట్ రూపంలో నెట్టింట షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ సర్జన్(surgeon) నెట్టింట హాట్టాపిక్గా మారాడు. భవిష్యత్తులో ఇంక పిల్లలు పుట్టకూడదనే తన భార్య కోరికను నెరవేర్చేందుకు ఇలా చేశానని తెలిపాడు. అదే తాను తన భార్యకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని చెబుతుండటం విశేషం. ఆయన ఆ వీడియోలో తనకు తానుగా ఎలా వేసెక్టమీ ఆపరేషన్ చేసుకుంటున్నాడో కనిపిస్తుంది. నిజానికి ఈ సర్జరీ జస్ట్ 15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. కానీ ఆయన స్వయంగా చేసుకోవడంతో ఒక గంట వ్యవధి తీసుకుని విజయవంతంగా తన సర్జరీని పూర్తి చేసుకున్నాడు. అంతేగాదు ఆ సర్జరీ చేసిన ప్రదేశంలో ఎంత పెయిన్ ఉంటుందో కూడా వివరించాడు. డాక్టర్ చెన్ వేసెక్టమీ ఆపరేషన్ పదకొండు దశలు గురించి ఆ వీడియోలో వివరంగా వెల్లడించారు. అంతేగాదు ఆ వీడియోలో మరసటి రోజు తాను పూర్తిగా కోలుకున్నట్లు కూడా తెలిపాడు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆ డాక్టర్ డేరింగ్కి విస్తుపోయారు. ఎంత డాక్టర్ అయినా తనకు తాను స్వయంగా సర్జరీ చేసుకోవడం అంటే మాటలు కాదు. కచ్చితంగా ఈయన మంచి నైపుణ్యం గల సర్జన్ అయ్యి ఉండాలి అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఆ డాక్టర్ చెన్ దంపతులకు ఎంతమంది పిల్లలు అనేది తెలియాల్సి ఉంది. కానీ పిలల్లు పుట్టకుండా మహిళలే కాదు భర్తలు కూడా ఇలాంటి విషయంలో కాస్త ముందుకువచ్చి వారి బాధను తగ్గించే యత్నం చేయాలనే అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది ఇతడి సాహసం. వాస్తవానికి చాలామటుకు మహిళలే పిల్లలు పుట్టకుండా(ట్యూబెక్టమీ) ఆపరేషన్ చేయిచుకుంటున్నారు. View this post on Instagram A post shared by 陳瑋農 整形外科 醫師。晶華診所院長。 (@docchen3) (చదవండి: అనారోగ్యానికి ‘ఆహారం’ కావద్దు!) -
కోల్ కతా డాక్టర్ హత్యాచార కేసు నిందితుడికి నేడు శిక్ష ఖరారు
-
కోల్ కతా డాక్టర్ కేసులో దోషికి మరణశిక్ష?
-
కోల్కతా ఆర్జీకార్ కాలేజీ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సంచలన తీర్పు
-
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమాదంలో 26 ఏళ్ల భారత సంతతికి వైద్యుడు సులేమాన్ అల్ మాజిద్ దుర్మరణం పాలయ్యారు. యూఏఈలోని రస్ అల్ ఖైమా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్, కోపైలట్ ఇద్దరూ చనిపోయారని యుఎఇ ప్రభుత్వ విభాగమైన జెనెరల్ సివిల్ ఏమియేషన్ అథారటీ ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేసింది.చనిపోయిన ఇద్దరిలో 26 ఏళ్ల పాకిస్థానీ మహిళ కాగా మరొకరు సులేమాన్ అల్ మాజిద్. ఇతను విమానంలో కోపైలట్గా ఉన్నాడు. సులేమాన్ దుబాయ్లోనే పుట్టి పెరిగాడు. విమానాన్ని అద్దెకు తీసుకున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. బెంగుళూరుకి చెందిన ఇతని కుటుంబం యూఏఈ దేశానికి వలస వెళ్లింది. యూకే దేశంలోని డుర్హాం కౌంటీ, డార్లింగ్టన్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్లో ఫెలో డాక్టర్గా ఉద్యోగం చేసేవాడు. బిట్రీష్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా, హానరరీ సెక్రటరీ, నార్తరన్ రెసిడెంట్ డాక్టర్స్ కమిటీలో కో-చైర్మన్ పదవులు చేపట్టాడు. అలాగే యూకేలో డాక్టర్గా ఉన్న సమయంలోజూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల వేతనం పెంచాలని ఉద్యమం చేసినట్టు సోషల్మీడియా ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది.సులేమాన్ తన కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరాన్ని సరదాగా కొంత సమయం గడిపాడు. ఆ తరువాత తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి ఒక ప్రైవేట్ ఏమియేషన్ క్లబ్ కు వెళ్లాడు. అక్కడ ముందుగా సులేమాన్ సరదాగా గాల్లో విహరించేందుకు క్లబ్ విమానంలో వెళ్లాడు. పైలట్ ఒక పాకిస్తానీ మహిళ ఉన్నారు. అయితే వీరి విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కాంటాక్ట్ మిస్ అయింది. కోవ్ రొటానా హోటల్ సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ ఆస్పత్రి తరలించారు. కానీ ఇద్దరూ చనిపోయారు. సులేమాన్ అకాల మరణంపై తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకుతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో ఉన్నాం. త్వరలోనే అతడికి పెళ్లి కూడా చేయాలనుకున్నాం. కానీ ఇంతలోనే అతను మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. తమకు సర్వస్యం అయిన సులేమాన్ లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
14 ఏళ్ల పాటు వైద్యం అందించిన డాక్టర్కు రూ. 10 లక్షల జరిమానా
మనుషులన్నాక పొరపాట్లు చేయడం సహజం అని అంటారు. దీనికి వైద్యులేమీ మినహాయింపు కాదనిపించే పలు ఘటనలను మనం చూసే ఉంటాం. తాజాగా అటువంటి ఉదాహరణ మన ముందు నిలిచింది. ఒక వైద్యుడు తాను 14 ఏళ్లుగా వైద్యం అందించిన బాధితునికి రూ. 10 లక్షలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ బాధితునికి 14 ఏళ్లుగా వైద్యం అందించడం ఆ వైద్యునికి తలకుమించిన భారంలా మారింది. సదరు వైద్యుడు అందించిన ఔషధాలు ఆ బాధితునికి వికటించాయి. ఫలితంగా అతను ఇకముందు తండ్రి కాలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఈ ఉదంతం కోర్టు వరకూ చేరింది. వాదనల అనంతరం కోర్టు ఆ వైద్యునికి రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధితునికి 30 రోజుల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.యూపీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ప్రిసైడింగ్ అధికారి తన తీర్పులో డాక్టర్ అరవింద్ గుప్తాకు ఈ జరిమానాను విధించారు. జరిమానా మొత్తంతో పాటు కేసు ఖర్చుల నిమిత్తం బాధితునికి రూ.25 వేలు చెల్లించాలని కూడా ఆదేశించారు. 30 రోజుల్లోగా బాధితునికి తొమ్మిది శాతం వడ్డీతో సహా మొత్తం సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. జౌన్పూర్కు చెందిన ఓ బాధితుడు వినియోగదారుల కమిషన్లో ఈ ఉదంతంపై పిటిషన్ దాఖలు చేశాడు. తనకు పెళ్లి అయ్యిందని, పిల్లలను కనేందుకు 14 ఏళ్లుగా ప్రముఖ వైద్యుని దగ్గర చికిత్స చేయించుకున్నట్లు యువకుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు.ఆయనకు ఫీనిక్స్ హాస్పిటల్లో ప్రయాగ్రాజ్కు చెందిన డాక్టర్ అరవింద్ గుప్తా చికిత్స అందించారు. డాక్టర్ అరవింద్ గుప్తా ప్రయాగ్రాజ్లోని మోతీలాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో నెఫ్రాలజీ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు. ఆయన చికిత్స సమయంలో, బాధితుడికి పలుమార్లు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. అయినా బాధితునికి ఉపశమనం లభించకపోవడంతో ఆయన మరో వైద్యుడిని సంప్రదించారు ఆ రెండో వైద్యుడు నిర్వహించిన పరీక్షలో డాక్టర్ అరవింద్ గుప్తా చికిత్స కారణంగా బాధితునికి మరో అనారోగ్యం వాటిల్లిందని తేలింది. డాక్టర్ అరవింద్ గుప్తా చికిత్సలో దుష్ప్రభావాల కారణంగా బాధితునికి ఇక తండ్రి అయ్యే అవకాశాలు లేకుండా పోయాయని వైద్య పరీక్షల్లో తేలింది. ఇది కూడా చదవండి: నాలుగు రాష్ట్రాల్లో ‘మహిళా పథకాలు’.. ప్రయోజనాల్లో తేడాలివే -
రాతి కొండను జయించింది!
దాని ఎత్తు 3 వేల అడుగులే. అంటే దాదాపు ఓ కిలోమీటరు. కానీ దాన్ని ఎక్కాలంటే కొమ్ములు తిరిగిన ప్రొఫెషనల్ పర్వ తారోహకులకు సైతం ముచ్చెమటలు పడతాయి. ఎందుకంటే అది నిట్టనిలువుగా ఉండే ఏకశిల! అమెరికాలో కాలిఫోర్నియాలోని యోసెమైట్ నేషనల్ పార్క్లో ఉంది. పేరు ఎల్ కాపిటన్. ఆ నిలువు రాతి కొండను ఎక్కాలంటే ప్రొఫెషనల్స్కు కూ డా ఎన్నో ఏళ్ల అకుంఠిత పరిశ్రమ, సాధన తప్పనిసరి. అలాంటి కొండను ఎలాంటి తడబాటూ లేకుండా ఏకబిగిన ఎక్కేసింది ఆ్రస్టియాకు చెందిన బాబ్సీ జాంగెర్ల్ అనే 36 ఏళ్ల మహిళ. అది కూడా తొలి ప్రయత్నంలోనే! అంతేకాదు, ఈ ఘనత సాధించిన తొలి మహిళగా కూడా నిలిచిందామె!! క్లిష్టమైన మార్గంలో... ఎల్ కాపిటన్ను ఎక్కడానికి గోల్డెన్ గేట్, ఫ్రీ రైడర్, ప్రాఫెట్, డాన్వాల్ అని నాలుగు మార్గాలున్నాయి. ఫ్రీ రైడర్ మార్గంలో ఎక్కే ప్రయత్నంలో అనుభవజు్ఞలు కూడా పదేపదే కాలు జారుతుంటారు. కానీ వృత్తిరీత్యా రేడియోగ్రఫీ డాక్టర్ అయిన జాంగెర్ల్ మాత్రం తొలి ప్రయత్నమే ఆ మార్గంలోనే ప్రయత్నించి అసలు తడబాటే లేకుండా ఎక్కేశారు. ఇందుకామెకు నాలుగు రోజులు పట్టింది. రాత్రులు కొండ తాలూకు గోడలపై ఉండే స్థలాల్లో నిద్రించారు. పర్వతారోహణలో భాగస్వామి అయిన బాయ్ ఫ్రెండ్ జాకోపో లార్చర్ కూడా ఆమెతో పాటు ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ మధ్యలోనే పడిపోయారు. ‘‘మేమిద్దరం కలిసి ఈ ఫీట్ సాధించాలనుకున్నాం. లా ర్చర్ విఫలమవడం బాధగా ఉంది. కానీ ఓడినా నాకు స్ఫూర్తినిచ్చాడు’’అంటూ అత డిని పొగడ్తలతో ముంచెత్తింది జాంగెర్ల్. ఆ మె కంటే ముందు ఫ్రీ రైడర్ మార్గంలో ఎల్ కేపిటన్పైకి ఎక్కేందుకు ఎందరో పర్వతారోహకులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ జాబితాలో ప్రముఖ బ్రిటిష్ పర్వతారోహకుడు పీట్ విట్టేకర్ కూడా ఉన్నారు. అలెక్స్ హోనాల్డ్ మాత్రం ఎలాంటి తాళ్లూ లేకుండా ఫ్రీ రైడర్ మార్గంలో ఎల్ కాపిటన్ను అధిరోహించాడు. ఆ డాక్యుమెంటరీ ‘ఫ్రీ సోలో’ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!
ఒక విజయాన్ని అందుకోగానే హమ్మయ్యా..! అనుకుంటాం. ఏదో చాలా సాధించేశాం అన్నంతగా ఫోజులు కొడతాం. కానీ కొందరూ మాత్రం మహర్షి మూవీలో హీరో మహేష్ బాబు చెప్పినట్టుగా "సక్సెస్ అనేది గమ్యం కాదు, అదొక ప్రయాణం" అన్నట్లుగా విజయపరంపరతో దూసుకుపోతుంటారు. అబ్బా.. ! ఎన్ని విజయాలు అందుకున్నాడు..హీరో అంటే అలాంటి వాళ్లేనేమో అనే ఫీల్ కలుగుతుంటుంది మనకి. అలా వరుస విజయాలతో విస్మయానికి గురి చేస్తూ..ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు రాజస్థాన్కి చెందిన రోమన్ సైనీ. అతడి సక్సెస్ జర్నీ చూస్తే.. సాధించేయాలన్న పౌరుషం, కసి తన్నుకు రావాల్సిందే అన్నట్లుగా ఉంటుంది.రాజస్థాన్లో కోట్పుట్లీలోని రైకరన్పురా గ్రామానికి చెందిన రోమన్ సైనీ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. తల్లి గృహిణి, తండ్రి ఇంజనీర్. మన రోమన్ సక్సెస్ జర్నీ 16 ఏళ్ల వయసులో ఎయిమ్స్లో అర్హత సాధించడంతో ప్రారంభమయ్యింది. అలా రోమన్ 21 ఏళ్లకి ఎంబీబీఎస్ పూర్తిచేసి, డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయినా ఏదో తెలియని వెలితి వెన్నాడుతూ ఉండేది. అప్పుడే ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేరయ్యాడు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. తొలి పోస్టింగ్ మధ్యప్రదేశ్ రావడంతో అక్కడ జిల్లా కలెక్టర్గా పనిచేయడం ప్రారంభించారు. అయినా రోమన్ తన లక్ష్యాన్ని సాధించిన అనుభూతి కలగలేదు. ఇంకా ఏదో తెలియని అసంతృప్తి మెదులుతూనే ఉంది. ఇక లాభం లేదనుకుని ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి 2015లో గౌరవ్ ముంజాల్, హేమేష్ సింగ్లతో కలిసి సొంతంగా అన్ అకాడమీ అనే కోచింగ్ సెంటర్ని ప్రారంభించాడు.ప్రారంభంలో ఇదొక యూట్యూబ్ ఛానెల్. క్రమంగా ఇది ఒక ఎడ్టెక్గా మారి.. సివిల్స్ స్టడీ మెటీరియల్కి ప్రసిద్ధిగాంచింది. అలా ఇది కాస్త అన్ అకాడమీ సార్టింగ్ హ్యాట్ టెక్నాలజీస్ కంపెనీగా మారింది. ప్రస్తుతం దీని విలు రూ. 2600 కోట్లు. యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి సరసమైన ధరల్లో నాణ్యమైన కోచింగ్ని అందించే స్టడీ సెంటర్గా పేరుతెచ్చుకుంది. ఈ అకాడమీ నుంచి ఏటా వేలాది మంది విద్యార్థులు కోచింగ్ పొందుతున్నారు. రోమన్ అచంచలమైన కృషికి నిదర్శనంగా చాలా తక్కువ వ్యవధిలోనే మంచి కోచింగ్ సెంటర్గా పేరుతెచ్చుకుంది. అంతేగాదు ఈ అకాడమీతో రోమన్ ఆర్జించే జీతం తెలిస్తే విస్తుపోతారు. దగ్గర రూ. 88 లక్షల పైమాటే..!. ఇది కదా సక్సెస్కి సరైన నిర్వచనం..!.(చదవండి: వామ్మో ఇదేం సంస్కృతి..! ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ అంటున్న యువత..) -
హతవిధీ..! నిద్రలో పళ్ల సెట్ మింగేయడంతో..!
పళ్లు బాగా కదులుతున్నప్పుడు.. దంతవైద్యులు వాటిని తీసి, వాటి బదులు కృత్రిమ దంతాలు అమరుస్తారు. అలా అమర్చిన దంతాలు నిద్రలో ఉండగా ఊడిపోగా.. వాటిని మింగేశారో వ్యక్తి! అవి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నంలో జరిగిన ఈ విషయం గురించి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్ తెలిపారు.“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన 52 ఏళ్ల ఉద్యోగి సుమారు రెండు మూడేళ్ల క్రితం పళ్లు కట్టించుకున్నారు. దంతవైద్యులు ఆయనకు ఎప్పటికీ అతుక్కునే ఉండే పళ్ల సెట్ అమర్చారు. అయితే, అవి కూడా అప్పుడప్పుడు ఊడే ప్రమాదం ఉంటుంది. ఈయన నిద్రలో ఉన్నప్పుడు అలాగే అది ఊడిపోయింది. అప్పుడు ఆయన తెలియకుండానే దాన్ని మింగేయడంతో అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. కుడి ఊపిరితిత్తి మధ్యభాగంలో ఇది ఇరుక్కుంది. అయితే అదే సమయంలో ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా పనిచేస్తుండడం, కుడి ఊపిరితిత్తిలోనూ పైన, కింది భాగాలు పనిచేయడంతో శ్వాస సంబంధిత సమస్యలు రాలేదు గానీ, లోపల ఫారిన్ బాడీ ఉండడంతో బాగా దగ్గు వచ్చింది. దీంతో రోగి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనకు ముందుగా ఎక్స్ రే, తర్వాత సీటీ స్కాన్ చేసి చూస్తే.. కుడివైపు ఊపిరితిత్తిలో పళ్ల సెట్ ఉందని తెలిసింది. దాంతో ఆయనకు జనరల్ ఎనస్థీషియా ఇచ్చి, రిజిడ్ బ్రాంకోస్కొపీ అనే పరికరం సాయంతో అత్యంత జాగ్రత్తగా దాన్ని బయటకు తీశాం. దానికి రెండువైపులా లోహపు వస్తువులు ఉండడంతో వాటివల్ల ఊపిరితిత్తులకు గానీ, శ్వాస నాళానికి గానీ ఏమైనా గాయం అవుతుందేమోనని చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. ఒకవేళ అలా గాయమైతే అక్కడినుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు దాదాపు నోటివరకు వచ్చిన తర్వాతే చిన్న గాయం అయ్యింది, దాన్ని కూడా వెంటనే సరిచేయడంతో ఎలాంటి ఇబ్బంది కాలేదు. పెద్ద పరిమాణంలో ఉండి, వంపుతో ఉన్న, పదునైన వస్తువులను తీయడానికి రిజిడ్ బ్రాంకోస్కొపీ బాగా ఉపయోగపడుతుంది.సాధారణంగా మన శరీరంలో ఏదైనా వస్తువు ఎక్కడైనా అమర్చాల్సి వస్తే.. అలాంటి వాటికి కొంత జీవనకాలం ఉంటుంది. ఆ తర్వాత అవి ఎంతో కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేతప్ప, ఒకసారి వేశారు కాబట్టి జీవితాంతం అవి అలాగే బాగుంటాయని అనుకోకూడదు. ముఖ్యంగా పళ్ల సెట్ కట్టించుకునేవారు ఎప్పటికప్పుడు దంతవైద్యులను సంప్రదిస్తూ దాన్ని చూపించుకోవాలి. ఇలా నిద్రలో మింగేసి, అది ఎక్కువకాలం ఉండిపోతే లోపల దానిచుట్టూ కండ పెరిగిపోయి, ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది” అని డాక్టర్ భరత్ తెలిపారు.పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్, కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి(చదవండి: పెద్దపేగు కేన్సర్ నివారణకు...) -
' ఆ విషయం నాకు మాత్రమే తెలుసు'.. శోభిత పెళ్లిని తలచుకుని సమంత ఎమోషనల్!
ఈనెల 4వ తేదీన టాలీవుడ్ హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహావేడుకలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు విక్టరీ వెంకటేశ్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.ఈ పెళ్లి వేడుకలో శోభిత సిస్టర్ డాక్టర్ సమంత కూడా సందడి చేశారు. అక్క పెళ్లి దిగిన ఫోటోలను తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నా జీవితంలో చాలా ఎమోషనల్ మూమెంట్.. అక్కా.. నిన్ను చాలా ప్రేమిస్తున్నా.. మమ్మల్ని నువ్వు ఎంత ఇష్టపడతావో.. అలాగే నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తావో నాకు మాత్రమే తెలుసు.. అత్యంత గౌరవప్రదమైన జంట అక్క- చైతూ అని నాకు తెలుసు' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)కాగా.. శోభిత సిస్టర్ డాక్టర్ సమంత వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె 2022లోనే పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Samanta Dhulipala (@dr.samantad) -
డాక్టర్ కానున్న కేకేఆర్ స్టార్ ప్లేయర్
కేకేఆర్ ప్రామిసింగ్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ త్వరలోనే డాక్టర్ కానున్నాడు. 2018లో ఎంబీఏ పూర్తి చేసిన అయ్యర్.. త్వరలోనే ఫైనాన్స్లో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టర్ వెంకటేశ్ అయ్యర్గా పిలిపించుకుంటానంటున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అయ్యర్ ఈ విషయాన్ని వెల్లడించాడు.ఇంటర్వ్యూ సందర్భంగా అయ్యర్ మాట్లాడుతూ.. ఓ క్రికెటర్ 60 సంవత్సరాల వరకు క్రికెట్ ఆడలేడు. అయితే విద్య మాత్రం చనిపోయేంతవరకూ మనతోనే ఉంటుంది. బాగా చదువుకుంటే మైదానంలోనూ, నిజ జీవితంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. యువ క్రికెటర్లు చదువుకు కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తానని అన్నాడు.కాగా, వెంకటేశ్ అయ్యర్కు ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే అయ్యర్ క్రికెట్ కోసం ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్ను డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ రూ.23.75 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కెప్టెన్సీ రేసులో అయ్యర్ఐపీఎల్ 2024లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టడంలో వెంకటేశ్ అయ్యర్ కీలకపాత్ర పోషించాడు. అయినా మెగా వేలానికి ముందు కేకేఆర్ అతన్ని రిలీజ్ చేసింది. అయితే మెగా వేలంలో కేకేఆర్ ఊహించని విధంగా అయ్యర్పై భారీ మొత్తం వెచ్చింది తిరిగి సొంతం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ను వీడటంతో ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉంది. వచ్చే సీజన్ కోసం కేకేఆర్ కెప్టెన్సీ రేసులో వెంకటేశ్ అయ్యర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయ్యర్ నాలుగు సీజన్ల పాటు కేకేఆర్తో ఉన్నాడు.మరోవైపు కేకేఆర్ కెప్టెన్సీ కోసం అయ్యర్తో పాటు అజింక్య రహానే కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. మెగా వేలంలో కేకేఆర్ రహానేను 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. కెప్టెన్సీ కట్టబెట్టేందుకే కేకేఆర్ యాజమాన్యం రహానే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రహానేకు కెప్టెన్గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రహానే టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపించాడు. దేశవాలీ క్రికెట్లోనూ రహానే ముంబై జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. -
వైద్యురాలికి ఎస్ఐ వేధింపులు
దొడ్డబళ్లాపురం: యువ వైద్యురాలిని ప్రేమ పేరుతో లైంగికంగా వేధించిన పోలీస్ సబ్ఇన్స్పెక్టర్పై బెంగళూరు బసవనగుడి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు ఇదే ఠాణాలో ఎస్సై రాజ్కుమార్. వివరాలు.. ఫేస్బుక్ ద్వారా 2020లో ఎస్సైకి ఒక వైద్యురాలు పరిచయమయింది. అప్పుడు ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా రాజ్కుమార్ పోలీస్ అకాడెమిలో ఎస్సై శిక్షణలో ఉన్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులు తరువాత ప్రేమికులు అయ్యారు.ఈ క్రమంలో వైద్యురాలి నుంచి రాజ్కుమార్ రూ.1.71 లక్షలు నగదు తీసుకున్నాడు. ఆమె డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి నగ్నవీడియోలు, ఫోటోలు పంపించాలని బెదిరించేవాడు. కాల్ రికార్డ్స్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసేవాడు. దీంతో విసిగిపోయిన వైద్యురాలు అతని దురాగతాలపై బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆదేశాల మేరకు ఘరానా ఎస్సైపై కేసు నమోదు చేశారు. -
డాక్టర్పై ఏడు సార్లు కత్తితో దాడి ఘటన.. కుమారుడ్ని సమర్థించిన తల్లి
చెన్నై: తన తల్లికి సరిగ్గా వైద్యం చేయలేదని కోపంతో ఆమె కుమారుడు విఘ్నేష్ డాక్టర్పై ఏడుసార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడు విఘ్నేష్ని సమర్థిస్తూ ఆమె తల్లి మాట్లాడారు. అయ్యా.. నా మీదున్న ప్రేమే.. నా కుమారుడితో ఇంత పనిచేయించింది. వాడి తప్పేమీ లేదు. నాకు క్యాన్సర్ ఉంది. కీమో థెరఫీ అవసరం లేదని డాక్టర్ బాలాజీ చెప్పి వెళ్లిపోయారు. నేను ఆయనకు ఏమైనా శత్రువునా? అని ప్రశ్నించారు.చెన్నైలో కలకలం రేపిన ప్రభుత్వ వైద్యుడిపై దాడి ఘటనలో నిందితుడి తల్లి మీడియాతో మాట్లాడారు. నాకు క్యాన్సర్ స్టేజ్ 5లో ఉంటే గిండి కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు స్టేజ్ 2 క్యాన్సర్ ఉందని చెప్పారు. అలా ఎలా చెబుతారు? ఆర్థిక ఇబ్బందుల కారణంగా అడయార్ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకో లేకపోయాను. ఈ (కలైజ్ఞర్ సెంటినరీ) ఆస్పత్రికి వస్తే క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీ నాకు మరో కీమోథెరపీ అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఆయనకు శత్రువునా? అని ప్రశ్నిస్తూ.. డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్య గురించి చెబుతుంటే డాక్టర్ బాలాజీ నావైపు చూసేందుకు ఇష్టపడలేదు. నాపై ఉన్న ప్రేమ విఘ్నేష్తో ఇంత పనిచేయించింది. విఘ్నేష్ హార్ట్ పేషెంట్. మూర్ఛతో బాధపడుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. Prof.Balaji Jagannathan, Professor & HOD, Medical Oncology, Govt Kalaignar Hospital, #Chennai, stabbed by 7 times by criminal from Peringalathur, whose mother ws being Rx fr stage 4 lung #Cancer at this hospital.Prof Balaji is very, very serious now. 🙏. #MedTwitter #medX pic.twitter.com/eG2uN3mKqp— Indian Doctor🇮🇳 (@Indian__doctor) November 13, 2024 ఏం జరిగిందంటే?చెన్నై గిండిలోని కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీపై చెన్నై పెరుంగళత్తూర్కు చెందిన 25 ఏళ్ల విఘ్నేష్ కత్తితో దాడి చేశాడు. దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు విఘ్నేష్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న తన తల్లికి డాక్టర్ బాలజీ సరైన వైద్యం అందిచం లేదనే ఆవేదనతో దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అంతేకాదు, తన తల్లికి సరైన చికిత్స అందించకపోవడంపై డాక్టర్ బాలాజీని అడిగానని, వైద్య ఖర్చులు ఇవ్వాలని అడిగితే తనను కిందకి నెట్టివేశాడని, దీంతో కత్తితో దాడిచేసినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం వైద్యుడిపై దాడి ఘటన సంచలనంగా మారింది. -
బాత్రూంలోల ఎక్కువసేపు గడుపుతున్నారా? స్ట్రాంగ్గా హెచ్చరిస్తున్న నిపుణులు
బాత్రూంలోకి వెళ్లగానే చాలామంది రిలాక్స్ అయిపోయి పాటలు పాడుకుంటూ గంటల కొద్దీ గడిపేస్తుంటారు. ఎవ్వరికైనా కాస్త రిలాక్స్ అయ్యే ప్రదేశం అది. అయితే కొందరూ మరీ విపరీతంగా బాత్రూంలో ఎన్ని గంటలు ఉంటారో చెప్పలేం. అవతలి వాళ్లు వీడెప్పుడు ఊడిపడతాడ్రా.. బాబు అని తిట్టుకుంటుంటారు. అలాంటి వారు దయచేసి అంతలా అన్ని గంటలు ఉండకండి. అలా ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి అలవాటు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో సవివరంగా వెల్లడించారు. చాలామంది రకరకాల ఆరోగ్య సమ్యలతో వస్తుంటారు. వారందరీ సమస్యలకు మూల కారణాలపై విశ్లేషించగా ఈ అంశం వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఆయా సమస్యలతో బాధపడుతున్న రోగులంతా కూడా గంటలకొద్ది బాత్రూమ్లలో గడిపేవారని అన్నారు. కొందరైతే సెల్ఫోన్లు, ఐఫోన్లు ఇతర గాడ్జెట్లు తీసుకుని బాతూరూమ్ టాయిలెట్ సీట్పై కూర్చొని రిలాక్స్ అవుతుంటారని అన్నారు. ఇది అస్సలు మంచిది కాదని తెలిపారు. ఇప్పుడు చాలా వరకు అందరూ వెస్ట్రన్ టాయిలెట్లనే వాడుతున్నారు. అవి ఓవెల్ ఆకారంలో ఉండటంతో దానిపై తక్కువ ఎత్తులో కూర్చొంటాం. ఈ భంగిమలో గురత్వాకర్షణ శక్తి మనపై ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెకు రక్తాన్ని పంప్ చేయడాన్ని కష్టతరం చేస్తుంది. గురత్వాకర్షణ బలం తోపాటు నేలపై కలుగు చేసి ఒత్తిడి కలగలసి శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తుందట. ఫలితంగా పేగులో కొంత భాగం జారిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ భంగిమ వల్ల రక్త నాళాలు ఉబ్బి హేమరాయిడ్స్ ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. ఇలా ఎక్కువ సేపు కూర్చొంటే పెల్విక్ కండరాలపై ఒత్తిడికి దారితీస్తుందని అన్నారు. అంతేగాదు ఈ అలవాటు అంతరర్లీనంగా ఎన్నో ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుందని, ముఖ్యంగా మలబద్ధకం, ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణశయాంతర వ్యాధులను కలుగజేస్తుందని చెప్పుకొచ్చారు. అందువల్ల సుదీర్ఘంగా బాతూరూమ్లో గడపడాన్ని పరిమితం చేయమని చెబుతున్నారు. ముఖ్యంగా టాయిలెట్ సీటుపై కూర్చొనే అలవాటును దూరం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఎలాంటి గాడ్జెట్లు, మ్యాగ్జైన్లు వంటివి బాత్రూమ్ దరిదాపుల్లోకి తీసుకెళ్లవద్దని అన్నారు. (చదవండి: సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..) -
తల్లికి వైద్యం సరిగా చేయలేదని కత్తితో డాక్టర్పై దాడి
తల్లికి వైద్యం సరిగా చేయలేదని డాక్టర్ను ఓ యువకుడు కత్తితో పొడిచాడు. ఈ ఘటన బుధవారం తమిళనాడు చెన్నైలోని గిండీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువకుడు ఈ ఏడాది మే నుంచి నవంబర్ వరకు తన తల్లి ప్రేమకు క్యాన్సర్ వైద్యం చేయించాడు. ఆమె పరిస్థితి మెరుగు పడకపోవడంతో వైద్యుడు బాలాజీ జగన్నాథన్పై కక్ష పెంచుకుని దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ఓ యువకుడు ఉద్యోగి వేషధారణలో వచ్చి.. ప్రభుత్వ వైద్యుడిని ఏడుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆయన ఛాతీ పైభాగానికి గాయాలయ్యాయి. ప్రస్తుతం డాక్టర్ ఐసీయూలో ఉన్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కత్తితో పొడిచి పారిపోతుండగా నిందితుడిని వైద్యసిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.కలైంజర్ సెంటెనరీ హాస్పిటల్లోని ఓపీడీ లేదా ఔట్ పేషెంట్ విభాగంలో.. క్యాన్సర్ పేషెంట్ అయిన తన తల్లికి డాక్టర్ తప్పుగా మందులు రాశారని కక్ష పెంచుకొని ఆ యువకుడు ఈ డాక్టర్పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై.. తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ స్పందించారు. యువకుడు చిన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భద్రతా లోపం ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారణకు ఆదేశించారు. డాక్టర్కు వైద్య సహాయం హామీ ఇచ్చారు. అలాగే ఇటువంటి దాడి మళ్లీ జరగదని హామీ ఇచ్చారు.“సమయంతో సంబంధం లేకుండా రోగులకు చికిత్స అందించడంలో మన ప్రభుత్వ వైద్యుల నిస్వార్థ కృషి ఎనలేనిది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.చదవండి: బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
Krish Jagarlamudi : మళ్లీ పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్!
-
డాక్టర్ సీటొచ్చినా.. కూలి పనికి
తుంగతుర్తి: డాక్టర్ కావాలన్నది ఆ అనాథ బిడ్డ తపన. అందుకోసం కూలీ పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్ పరీక్షలో 507 మార్కులు సాధించింది మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. కానీ కనీసం పుస్తకాలు, దుస్తులు, ఫీజు చెల్లించడానికి డబ్బులు లేక ఎప్పటిలాగే తాత, నానమ్మతో కలిసి కూలీ పనులకు వెళ్తోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి తన మూడేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో గౌతమిని తాత శిగ రాములు, నాయనమ్మ వెంకటమ్మ కూలి పనులు చేస్తూ పోషించారు. గ్రామంలోని సర్కారు బడిలో ఐదో తరగతి వరకు, పసునూర్ ఆదర్శ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివించారు. గౌతమి పదో తరగతిలో 10/10 జీపీఏ, ఇంటర్ బైపీసీలో 992/1000 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. వైద్యురాలు కావాలనే కోరికతో నీట్కు హాజరై మొదటి ప్రయత్నంలోనే దంత వైద్య కళాశాలలో సీటు సాధించింది. దంత వైద్యురాలు కావడం ఇష్టం లేక మళ్లీ నీట్ రాయాలనుకున్న ఆమెకు ఆర్థిక సమస్యలు గుదిబండగా మారాయి. అయినప్పటికీ నానమ్మ పుస్తెలతాడు తాకట్టుపెట్టి హైదరాబాద్లో కోచింగ్కు పంపారు. గౌతమి డాక్టర్ కావాలనే లక్ష్యంతో తాత, నానమ్మతో కలిసి కూలి పనులకు వెళ్తూనే రెండోసారి నీట్కు సిద్ధమైంది. ఈసారి నీట్లో 507 మార్కులు సాధించి ఇటీవల జరిగిన ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాధించింది. కానీ ఎంబీబీఎస్ చదవడానికి ఏడాదికి రూ.1,50,000 ఖర్చు అవుతుందని, అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో చేసేది లేక కూలి పనులకు వెళ్లున్నట్లు శిగ రాములు తెలిపారు. ఫీజుకోసం అమ్మటానికి కూడా వారికి ఎలాంటిఆ ఆస్తులు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశ నెరవేరుతుందని గౌతమి తాత, నానమ్మ వేడుకుంటున్నారు. సహాయం చేయాలనుకున్న దాతలు ఫోన్ పే నంబర్ 93989 19127కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. -
కోల్కతా వైద్యురాలి కేసులో బిగ్ ట్విస్ట్
కోల్కతా: కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్.. తాను నిర్ధొషినని చెబుతున్నాడు. జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య చేయలేదని, ప్రభుత్వం కావాలనే తనను ఇరికిస్తుందని ఆరోపించాడు. తన మాట ఎవరూ వినడం లేదని, పోలీస్ అధికారులు తనను భయపెడుతున్నారని తెలిపాడు.కాగా నిందితుడు సంజయ్రాయ్ను సోమవారం సీబీఐ అధికారులు సీల్డా కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తరువాత కోర్టునుంచి వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్తుండగా.. వ్యాన్లో నుంచే మీడియాతో మాట్లాడాడు సంజయ్ రాయ్. నేను ఏ నేరం చేయలేదంటూ గట్టిగా కేకలు వేస్తూ చెప్పాడు. ప్రభుత్వం తనను ఇరికించి నోరు విప్పకుండా బెదిరిస్తోందన్నారు.మరోవైపు ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనపై కోల్కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీరికి మహిళలు కూడా మద్దతు తెలిపారు. భారీగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురి అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఎనభై ఏడు రోజుల తర్వాత కోల్కతా కోర్టు సోమవారం ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్పై అభియోగాలు మోపింది. ఈ కేసులో రోజువారీ విచారణ నవంబర్ 11 నుంచి ప్రారంభమవుతుందని కోర్టు వెల్లడించింది. రాయ్పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (అత్యాచారం), సెక్షన్ 66 (మరణానికి కారణమైనందుకు), 103 (హత్యకు శిక్ష) కింద కేసు నమోదైంది. -
బెంగాల్లో పేషెంట్పై డాక్టర్ అఘాయిత్యం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓ రోగిపై డాక్టర్ చేసిన అత్యాచార ఘటన కలకలం రేపింది. నార్త్ 24 పరగణాలలోని హస్నాబాద్లో 26 ఏళ్ల రోగిపై అత్యాచారం చేసినందుకు కోల్కతా పోలీసులు ఓ డాక్టర్ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘‘ నిందితుడైన డాక్టర్ సదరు మహిళా రోగికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి లైంగిక వేధింపులను చిత్రీకరించాడు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశాడు. నిందితుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు వీడియోను ఉపయోగించి మరీ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇటీవల నిందితుడు నూర్ ఆలం సర్దార్పై బాధిత మహిళ తన భర్తతో కలిసి.. హస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా.. నగరంలోని బరున్హాట్ ప్రాంతంలోని డాక్టర్ క్లినిక్ నుంచి పోలీసులు సర్దార్ను అరెస్టు చేశారు. నిందితుడు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. మహిళా రోగి.. అపస్మారక స్థితికి తీసుకువచ్చి అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు’’ అని పోలీసులు తెలిపారు.ఈ కేసుపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మహిళ రహస్య వాంగ్మూలం రికార్డ్ చేసి.. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు బరున్హాట్ ఎస్పీ హొస్సేన్ మెహెదీ రెహ్మాన్ తెలిపారు. దీంతో కోర్టు నిందితుడికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. మరోవైపు.. గత నెలలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యాచారం, హత్య కేసులకు సంబంధించి మరణశిక్షను తప్పనిసరి చేసే కఠినమైన కొత్త బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. -
డాక్టర్ చదువుకు డబ్బుల్లేక..కూలి పనులకు..
హుస్నాబాద్ రూరల్: వైద్యురాలు కావాలన్నది ఆ అడవి బిడ్డ తపన.. అందుకోసం కూలి పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్లో 447 మార్కులు సాధించింది. ప్రైవేటు కాలేజీలో సీటు రావడంతో ఫీజులకు డబ్బుల్లేక.. ఎప్పట్లాగే తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన లావుడ్య లక్ష్మి, రమేశ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. దంపతులు కూలిపని చేస్తూ కూతుళ్లను చదివిస్తున్నారు. పెద్ద కూతురు బీ–ఫార్మసీ చేస్తోంది. చిన్న కూతురు దేవిని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి గురుకులంలో చేరి్పంచి చదివించారు.పదో తరగతి, ఇంటర్మిడియెట్లో మంచి మార్కులు సాధించిన దేవి.. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఏడాదిగా తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తూనే నీట్కు సిద్ధమైంది. నీట్లో 447 (2లక్షల 80 వేల ర్యాంకు) మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వస్తుందని అశించిన లావుడ్య దేవికి.. సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో సీటు వచి్చంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకు ఏటా రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో.. చేసేదిలేక దేవి కూలి పనులకు వెళ్తోంది. ఆస్తులు అమ్మి ఫీజు కడదామంటే అడవిలో పెంకుటిల్లు ఒకటే దిక్కు. దానిని కొనేవారు కూడా ఎవరూ లేరు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశయం నెరవేరుతుందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
వీధుల్లో బిక్షాటన చేసే అమ్మాయి నేడు డాక్టర్గా..!
జీవితం అంటేనే కష్టాల మయం అనుకుంటాం. కటిక దారిద్ర్యంలో మగ్గుతున్న వాళ్లకు కూడా జీవితం కొన్ని సువర్ణావకాశాలు అందిస్తుంది. అయితే ఆ అవకాశాలను తెలివిగా అందిపుచ్చుకున్న వారే అద్భుతాలు చేసి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిందే పింకీ హర్యాన్. మురికి వాడల్లో తల్లిదండ్రులతో బిక్షాటన చేస్తూ బతికిన అమ్మాయి..నేడు డాక్టర్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక ఎందరికో స్ఫూర్తిని కలిగించింది. వివరాల్లోకెళ్తే.. పింకీ హర్యానా హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని మెక్లీడ్గంజ్లో నిరుపేద కుటుంబంలో జన్మించింది. చరణ్ ఖుద్లోని మురికివాడలో నివసించే ఆ కుటుంబం రోడ్డుపై భిక్షాటను చేస్తూ జీవనం సాగిస్తుండేది. చెత్త కుండిల్లో ఆహారాన్ని ఏరుకుని తినే దుర్భర జీవితాన్ని సాగించేది పింకీ కుటుంబం. ప్రారంభ జీవితం అంతా కటిక దారిద్య్రం, కష్టాల మధ్య సాగింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా ధర్మశాలలోని టోంగ్ లెన్ ఛారిటబుల్ ట్రస్ట్కు నేతృత్వం వహించే బౌద్ధ సన్యాసి లోబ్సాంగ్ జమ్యాంగ్ దృష్టిలో పింకీ పడింది. అదే ఆమె జీవితాన్ని మార్చబోతుందని ఆనాడు ఊహించలేదు. ఆయన పింకీని చూసి చదివించాల్సిందిగా ఆమె తండ్రి కాశ్మీరీ లాల్ను కోరాడు. అందుకు మొదట కాశ్మీరీ లాల్ అంగీకరించలేదు. ఐతే జమ్యాంగ్ తన మాటలతో అతడిని ఒప్పించి పింకీని ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్లో చేరిపించాడు. అలా అక్కడ నిరుపేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ హాస్టల్లో నివశించిన తొలి విద్యార్థిగా పింకీ నిలిచింది. తన జీవితాన్ని మంచిగా మార్చుకునేందుకు దేవుడిచ్చిన ఈ సువర్ణావకాశాన్ని పింకీ అస్సలు వదులుకోలేదు. ఆ పాఠశాలలో చేరినప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చకోవడమే గాక మంచి మార్కులతో అన్ని తరగతులు పాసయ్యింది. చివరికీ పింకీ 12వ తరగతి పరీక్షలు పూర్తి అయిన వెంటనే రాసిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్లో కూడా ఉత్తీర్ణత సాధించింది. కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాదించుకునేలా మంచి ర్యాంకు సాధించలేకపోయింది. అందువల్ల మిగతా పిల్లలు మాదిరిగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అంతంతా ఫీజులు చెల్లించి చదవుకులేని నిస్సహయ స్థితిలో పడింది పింకీ. మళ్లీ తన పరిస్థితి మొదటకొచ్చింది అనుకునేలోపే 2018లో, టోంగ్-లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ మరోసారి ఆమెను ఆదుకుంది. చైనాలోని ప్రఖ్యాత మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ పొందడంలో పింకీకి సహాయం చేసింది. అలా ఆమె ఆరేళ్లలో చైనీస్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొంది డాక్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ధర్మశాలకు తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలో వైద్యం అందించేందుకు అవసరమైన మెడికల్ లైసెన్స్ని పొందేందుకు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) కోసం సిద్ధమవుతుంది. ఇంతలా పింకీ జీవితాన్ని మార్చిన బౌద్ధ సన్యాసి లోబ్సాంగ్ జమ్యాంగ్ ఆమెను చూసి గర్వపడుతున్నానని అన్నారు. పిల్లలు మంచి మనుషులుగా మారేలా ప్రోత్సహించబడితే నిస్సందేహంగా అద్భుతాలు చేస్తారని విశ్వసిస్తానని చెప్పారు. ఇక పింకీ తన జీవితాన్ని ఇంతలా గౌరవప్రదంగా మార్చిన జమ్యాంగ్ని తన తండ్రిగా అభివర్ణించింది. అంతేగాదు పింకీలా ఆ ధర్మశాలలో చదివిన వందలాది మంది పిల్లలు జీవితాలు మారడమే గాక వారంతా వైద్యులు, ఇంజనీర్లు, ప్రభుత్వాధికారులుగా స్థిరపడ్డారు. ఈ పింకీ గాథ జీవితంలో లభించే అవకాశాన్ని అందిపుచ్చుకుని కష్టపడితే కష్టాల నుంచి బయటపడటమే గాక అద్భుతాలు చేసి చూపించొచ్చని తెలుస్తోంది కదూ..!.(చదవండి: ఈసారి దీపావళికి చీరను వెరైటీగా కట్టుకోండిలా..!) -
RG Kar Hospital: 50 మంది డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా
కోల్కతా: కోల్కతాలోని ఆర్జీఆర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతుగా ఆర్జీకర్ ఆసుపత్రికి చెందిన 50 మంది సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు మంగళవారం మూకుమ్మడి రాజీనామా చేశారు.కాగా హాస్పిటల్లో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్కున్యాయం చేయాలని, ఆసుపత్రిలో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు జూనియర్ డాక్టర్లు గత శనివారం సాయంత్రం నుంచి'ఆమరణ నిరాహార దీక్ష' చేపట్టిన విషయం తెలిసిందే. రోజురోజుకీ వీరి నిరసనలకు వైద్యుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలోనే నిరసనలు చేస్తున్న డాక్టర్లకు మద్దతుగా 50 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేశారు. దీంతో అక్కడున్న విద్యార్ధులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు.కాగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు కేంద్రీకృత రెఫరల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, పడకల ఖాళీల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. పని ప్రదేశాల్లో సీసీటీవీ ఆన్-కాల్ రూమ్లు వాష్రూమ్ల కోసం అవసరమైన నిబంధనలను నిర్ధారించడానికి టాస్క్ఫోర్స్ల ఏర్పాటు, ఆసుపత్రుల్లో పోలీసు రక్షణను పెంచాలని, పర్మినెంట్ మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలని, వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల విషయంలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్పై సీబీఐ కోల్కతాలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 45 పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక పోలీసుల దగ్గర పౌర వలంటీరుగా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఆగస్టు 9న ఈ నేరానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఆస్పత్రి సెమినార్ హాల్లో ట్రెయినీ డాక్టర్ తన బ్రేక్ సమయంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. అయితే చార్జిషీటులో గ్యాంగ్రేప్ గురించి ప్రస్తావించలేదు. అలాగే విచారణ ముగిసినట్లూ పేర్కొనలేదు. దాదాపు 200 మంది స్టేట్మెంట్లను సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. సుమారు 100 మంది సాక్షులను విచారించింది. ఇవన్నీ రాయ్నే ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్నాయని సీబీఐ వర్గాల సమాచారం. -
ప్రిస్క్రిప్షన్ అడిగి మరీ .. డాక్టర్ని కాల్చి చంపిన టీనేజర్లు
ఢిల్లీ : గాయమైన తన కాలుకి వైద్యం చేసిన ఓ డాక్టర్ను ప్రిస్క్రిప్షన్ అడిగి మరీ ఓ ఇద్దరు టీనేజర్లు కాల్చి చంపారు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపుతుంది. ఢిల్లీ పోలీసు వివరాల మేరకు.. ఢిల్లీలోని జైత్పూర్ ప్రాంతంలో జావేద్ అక్తర్ యునాని వైద్యుడిగా చెలామణీ అవుతున్నారు. నిమా ఆస్పత్రి పేరుతో ప్రాచీన వైద్యాలుగా పేరుగాంచిన యునానీ వైద్య పద్ధతుల ద్వారా పేషెంట్లకు వైద్య సేవలందిస్తున్నారు.జావెద్ అక్తర్ రెండ్రోజుల క్రితం కాలికి గాయమైన ఇద్దరు టీనేజర్లకు ట్రీట్మెంట్ అందించారు. అయితే ఆ ఇద్దరు టీనేజర్లు మరోసారి బుధవారం అర్థరాత్రి 1.30గంటల సమయంలో కాలికి డ్రెస్సింగ్ చేయాలని కోరారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది వారికి డ్రెస్సింగ్ చేశారు. అనంతరం ప్రిస్క్రిప్షన్ కావాలంటూ డాక్టర్ క్యాబిన్లోకి వెళ్లారు. వెళ్లిన క్షణాల్లోనే క్యాబిన్ నుంచి కాల్పులు శబ్ధం వినపడింది. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ క్యాబిన్ను పరిశీలించగా.. డాక్టర్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు.వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల గురించి ఆరా తీశారు. పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. రెండ్రోజుల క్రితం ఆ ఇద్దరు టీనేజర్లు ఆస్పత్రి భయట రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఎంబీబీఎస్ పూర్తి చేయని వైద్యుడితో చికిత్స.. హార్ట్ పేషెంట్ మృతి
కేరళలో విషాదం నెలకొంది. వైద్యుడి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంబీబీఎస్ రెండో ఏడాది కూడా పూర్తి చేయని ఓ వైద్యుడు.. రోగికి గుండె ఆపరేషన్ చేయడంతో అతడు మరణించాడు. ఈ దారుణం కోజికోడ్ జిల్లాలో సెప్టెంబర్ 23న జరగ్గా.. మృతుడి కుమారుడు వైద్యుడి విద్యార్హతలపై ప్రశ్నించడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది.వినోద్ కుమార్ అనే వ్యక్తి హార్ట్ పేషెంట్. కొన్ని రోజులుగా ఛాతీలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యం నిమిత్తం కోజికోడ్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స చేసిన కాసేపటికి ఆయన మరణించారు. అనంతరం సంబంధిత వైద్యుడు(రెసిడెంట్ మెడికల్ అధికారి) కనీసం తన వైద్యవిద్యను పూర్తి చేయలేదనే విషయం మృతుడి కుమారుడు అశ్విన్కు తెలిసింది. 2011లో ఎంబీబీఎస్ కోర్సులో చేరగా.. ఇప్పటికీ ఎంబీబీఎస్ రెండో ఏడాది కూడా పాస్ కాలేదని తేలింది. రెండు ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ పరీక్షలను క్లియర్ చేయలేకపోయాడని తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వైద్యుడిగా అర్హత లేని వ్యక్తిని వైద్యుడిగా ఎలా పనిచేయిస్తారని ప్రశ్నించారు. తన తండ్రి చావుకు వైద్యుడే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెసిడెంట్ మెడికల్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారుఅయితే ఆర్ఎంఓ వైద్యుడి అర్హతలను ధృవీకరించడంలో విఫలమైన ఆసుపత్రి యజమా న్యం.. అతడిని వెనకేసుకొని రావడం గమనార్హం. డాక్టర్ను అబూ అబ్రహం లూక్గా గుర్తించారు. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించారు. లూక్ని నియమించి ముందు అతని మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్ను తనిఖీ చేసినట్లు ఆసుపత్రి మేనేజర్ పేర్కొన్నారు. తమతో పనిచేసే ముందు కోజికోడ్, మలప్పురంలోని చాలా ఆసుపత్రులలో పనిచేశాడని తెలిపారు.గతంలో తమ కంటే పెద్ద ఆసుపత్రులలో పనిచేయడంతో అపాయింట్మెంట్తో ముందుకు సాగినట్లు చెప్పారు. అతను నిజంగా మంచి వైద్యుడని, ఆయను అందుబాటులో లేకుంటే రోగులు వారి అపాయింట్మెంట్లను రద్దు చేసేవారని తెలిపారు. రోగులతో బాగా ప్రవర్తించేవాడని, ాలా గౌరవించేవాడని తెలిపారు. -
క్యాన్సర్కు నమ్మకమే ఆన్సర్
బ్లడ్ క్యాన్సర్ సోకిన డాక్టర్ నేత్రావతి... తన గురించి తన ఆరేళ్ల కొడుకు ఎక్కడ భయపడతాడో, అసలే ఆందోళనలో ఉన్న తనను చూసి అతడెక్కడ బెంగపడతాడో అని తనకు జబ్బును ఆ చిన్నారి నుంచి దాచిపెట్టింది. తాను స్వయానా డాక్టర్. అందునా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కావడంతో కోవిడ్ కేసులు చాలా ఎక్కువగా చూస్తుండేది. దాంతో మొదట్లో తనలో కనిపించిన లక్షణాలను చూసి తనకూ కోవిడ్ సోకిందేమో అనుకుంది. ఎట్టకేలకు అది చాలా తీవ్రమైన ఓ తరహా బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. చికిత్స జరగకపోతే బతికేది రెండువారాలూ... మహా అయితే మూడు వారాలు!! ఇప్పుడామె పూర్తిగా కోలుకుని, తనలా క్యాన్సర్ బారిన పడి ఆందోళనతో బెంబేలెత్తుతున్నవారికీ కౌన్సెలింగ్ చేయడం, ధైర్యం చెప్పడం చేస్తోంది. అదీ తాను చికిత్స తీసుకున్న మణిపాల్ హాస్పిటల్లోనే. ఈలోపు మరికాస్త ఎదిగిన కొడుకు ఆమె వీడియోలను చూసి... ‘అమ్మా... నువ్వెంత ధైర్యవంతురాలివి. నిజంగా నువ్వు విజేతవమ్మా’’ అంటుంటే... క్యాన్సర్ మీద కంటే పెద్ద విజయమిది అంటోంది ఆ తల్లి. ఆ విజయగాధను విందాం రండి. డాక్టర్ నేత్రావతి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు ఊరట కలిగిస్తున్న సమయమది. అప్పట్లో 2020 – 2021 నాటి రోజుల్లో కరోనా వైరస్ ఉద్ధృతంగా ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తున్న ఆ క్షణాల్లో ఒకనాడు తనకూ జ్వరంగా ఉంది. ఒళ్లంతా నొప్పులు. తీవ్రమైన అలసట. ఒకవైపు చెయ్యి లాగేస్తోంది. విపరీతమైన నిద్రలేమి. ఒకవేళ నిద్రపడితే అకస్మాత్తుగా మెలకువ వచ్చి చూసుకుంటే ఒళ్లంతా చల్లటి చెమటలు. ఈ లక్షణాలన్నీ దాదాపుగా కోవిడ్నే తలపిస్తున్నాయి. అందునా తాను రోజూ కరోనా రోగులకు సేవలందిస్తూ ఉండటంతో కోవిడ్ సోకిందేమోనని మొదట అనుకుంది.తీరా చూస్తే తీవ్రమైన బ్లడ్క్యాన్సర్... అసలు సమస్య తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయించుకుని రి΄ోర్టు చూసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ 10,000 కంటే కిందికి పడి΄ోయింది. (ఇవి కనీసం 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉండాలి). హిమోగ్లోబిన్ కౌంట్ ఐదు కంటే తక్కువ! (ఇది మహిళల్లో 12 నుంచి 15 వరకు ఉండాలి). తెల్లరక్తకణాల సంఖ్య అనూహ్యంగా చాలా ఎక్కువగా పెరిగి΄ోయి ఉంది. అవేవీ కోవిడ్కు సంబంధించినవి కావు. ఏదో తేడా కొడుతోంది అనుకుంది. మణిపాల్ హాస్పిటల్లోని హిమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున కళాషెట్టిని సంప్రదించింది. వ్యాధి నిర్ధారణలో అది ‘అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా – ఏపీఎల్’ అనే బ్లడ్ క్యాన్సర్గా తేలింది.నాకే ఎందుకిలా... డాక్టర్ నేత్రావతి మంచి ఆరోగ్యస్పృహ ఉన్న వ్యక్తి. తానే స్వయానా డాక్టర్. ప్రతి వీకెండ్కూ బెంగళూరు కబ్బన్ పార్కులో పచ్చటి చెట్ల మీది నుంచి వచ్చే పచ్చి గాలి పీలుస్తూ కొడుకూ, భర్తతో సైక్లింగ్ చేస్తుంటుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తుంటుంది. వేళకు నిద్రలేవడం, సమయానికి నిద్ర΄ోవడంతో పాటు డాక్టర్ కావడంతో మంచి ఆరోగ్య స్పృహతో ఉండటం, ఆరోగ్యకరమైనవి తినడం ఇవన్నీ చేస్తుండేది. తీరా బ్లడ్ క్యాన్సర్ కనిపించాక... అందరూ చెప్పే మాటే తన నోటి నుంచీ వచ్చింది. అందరిలాగే తానూ అనుకుంది... ‘‘నాకే ఎందుకిలా?!’’ ఆమె వెతలు ఆమె మాటల్లోనే...‘‘ఎట్టకేలకు చికిత్స మొదలైంది. నిజానికి క్యాన్సర్ వ్యాధి కంటే దాని చికిత్సా... అది మనిషి మీద చూపే శారీరక, మానసిక దుష్ప్రభావాలే ఎక్కువగా కుంగదీస్తుంటాయి. నాకున్న ΄÷డవాటి ఒత్తైన జుట్టును చూస్తూ చూస్తూ కోల్పోవాల్సి వచ్చింది. కీమోతో నోట్లోని, కడుపులోని మ్యూకస్ పారలు తీవ్రంగా దెబ్బతిని, ‘మ్యూకోసైటిస్’ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. కీమో మొదలైన రెండు లేదా మూడు వారాల పాటు నోట్లో ఉండే మ్యూకస్ పారలు దెబ్బతినడం వల్ల నోట్లో తెల్లటి చీముమచ్చలు వస్తాయి. దాంతో తినడం, తాగడం, మాట్లాడటం కష్టమయ్యేది. కీమోథెరపీలోని మందులు ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను తుదముట్టిస్తూనే ఆరోగ్యకరమైన మంచి కణాలనూ దెబ్బతీస్తుంటాయి. దాంతో ఈ దుష్ప్రభావాలన్నీ కనిపిస్తుంటాయి. కష్టమనిపించనప్పునడు నా ఆరేళ్ల కొడుకు రూపాన్ని కళ్లముందుకు తెచ్చుకున్నా.’’డాక్టరే పేషెంట్ అయితే...‘‘ఈ చికిత్స ప్రక్రియల సమయంలో మరెన్నో కాంప్లికేషన్లు కనిపించాయి. ఉదాహరణకు గుండె, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరింది. కిడ్నీ సరిగా పనిచేయడం మానేసింది. రక్తపోటు పడిపోయింది. ఎందుకు వస్తోందో తెలియని తరచూ వచ్చే జ్వరాల మధ్య ఒక్కోసారి శ్వాస ఆడేది కాదు. ఊపిరి అందడమే కష్టమయ్యేది.’’ ‘‘ఇలాంటి దశలో చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. తమను తాము తమాయించుకోలేరు. ఇక ఆ బాధితురాలు ఒక డాక్టరైతే... లోపల ఏం జరుగుతోందో నాకు స్పష్టంగా తెలిసిపోతుంటుంది. కాబట్టి అది ఆవేదన మరింత పెరిగేలా చేస్తుంది. అయితే ఒక్కమాటలో చెప్పాలంటే జబ్బుకూ, నాకూ జరిగే ఈ పోరులో... నా మానసిక బలం, నా మీద నాకున్న విశ్వాసం ఇవన్నీ గతంలో నేనేనాడూ చూడని స్థాయికి పెరిగాయి. నేను తట్టుకోగలిగే నా సహనపు చివరి అంచు సరిహద్దును మరింత ఆవలకు నెట్టాను’’ అంటూ తన ఆవేదనను కళ్లకు కట్టారు డాక్టర్ నేత్రావతి. చివరగా...డాక్టర్ నేత్రావతి చెబుతున్న మాటలివి... ‘‘జబ్బు తర్వాత మంచి క్రమశిక్షణతో కూడిన జీవితం క్రమం తప్పకుండా ఫాలోఅప్, డాక్టర్ సలహాలు ఖచ్చితంగా పాటించడం. ఇతరులు చెప్పే ప్రత్యామ్నాయ చికిత్సలను పెడచెవిన పెట్టడం, ఇంట్లో వండిన భోజనం తీసుకోవడం, ఎనిమిది గంటల నిద్ర, మధ్యాహ్నం ఓ చిన్న పవర్న్యాప్... ఇవన్నీ చేస్తూ ఎప్పటికప్పడు కంప్లీట్ బ్లడ్ కౌంట్లో తెల్లరక్తకణాలు నార్మల్గా ఉన్నాయేమో చూసుకుంటూ ఉన్నా.ఇప్పుడు అంత ప్రమాదకరం కాదు... ‘అక్యూ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా – ఏపీఎల్’ అని పిలిచే ఆ బ్లడ్ క్యాన్సర్ ఒకప్పుడు చాలా ప్రమాదకరం. కానీ ఇటీవల కొత్త చికిత్సా ప్రక్రియలు వస్తున్న కొద్దీ దాని గురించిన భయం తగ్గుతూ వస్తోంది. కొన్ని గణాంకాల ప్రకారం ఈ జబ్బుకు చికిత్స తీసుకున్నవారిలో 99% మంది నాలుగేళ్లు పైబడి జీవిస్తుంటే... ఐదేళ్లకు పైబడి జీవిస్తున్నవారు 86% మంది ఉన్నారు. -
కోల్కతా ఘటన.. సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే
కోల్కతా: కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ సోమవారం సీబీఐ ఎందుట హాజరయ్యారు. పానిహతి ఎమ్మెల్యేఘోష్ ఈ ఉదయం 10.30 గంటలకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.అయితే ఆర్జి కర్ ఆసుపత్రి ఘటనపై విచారణకు ఆయన్ను పిలిపించామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. వైద్యురాలి మరణం తర్వాత అంత్రక్రియలను తొందరపాటుగా ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా వైద్యురాలిపై హత్యాచారం అనంతరం మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిర్మల్ ఘోష్ జోక్యం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సమన్లు జారీ చేయగా.. నేడు విచారణకు హాజరయ్యారు.చదవండి: మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రాదో కానీ..: నితిన్ గడ్కరీ -
చేయి తగిలిందని పోలీస్ మార్క్ కేసు!
గచ్చిబౌలి: పబ్లో చేయి తగిలిందని ఓ డాక్టర్ మీద కేసు నమోదు చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఫెనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని తబులా రసా పబ్కు ఓ ఐపీఎస్ ఆఫీసర్ భార్యతో కలిసి వెళ్లారు. అదే పబ్కు కొంత మంది డాక్టర్లు వెళ్లారు. ఐపీఎస్ భార్య వాష్రూమ్కు వెళ్లి తిరిగి వస్తుండగా మదీనాగూడకు చెందిన ఓ డాక్టర్ చేయి తగిలింది. పొరపాటు జరిగిందని సదరు డాక్టర్ ఆమెకు సారీ చెప్పారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆమె జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ తర్వాత క్షణాల మీద గచ్చిబౌలి పోలీసులు పబ్కు చేరుకున్నారు. సదరు డాక్టర్ను గచ్చిబౌ పీఎస్కు తరలించారు. నేను కావాలని చేయలేదని, యాదృచి్ఛకంగా జరిగిందని చెప్పినా పోలీసులు శాంతించలేదు. మద్యం ఎక్కువ తాగి అసభ్యంగా ప్రవర్తించాడా అనేది నిర్ధారించుకునేందుకు బ్రీత్ ఎనలైజర్ చేశారు. మద్యం అతిగా తాగలేదని తేలినట్లు సమాచారం. గంటల తరబడి స్టేషన్లోనే కూర్చోబెట్టారు. మరుసటి రోజు పబ్ నిర్వాహకులతో ఫిర్యాదు తీసుకొని ఆ డాక్టర్పై కేసు నమోదు చేసి, నోటీసు ఇచ్చి పంపించారు. మహిళలను కించపరిచే వ్యవహరించినా, అసభ్యంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కాని ఐపీఎస్ భార్య కావడంతో చిన్న విషయానికి పోలీసులు హంగామా చేశారనే ప్రచారం జరుగుతోంది. సామాన్యుల ఫిర్యాదుపైనా పోలీసులు ఇలానే వ్యవహరిస్తే బాగుండేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం తబులా రసా పబ్ కేసుపై నోరు మెదపడం లేదు. కేసు గురించి మాకు తెలియదని, కేవలం పబ్లలో తనిఖీలు మాత్రమే చేశామని గచ్చిబౌలి పోలీసులు బుకాయించడం గమనార్హం. -
దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి
-
దైవ దూషణ నెపం.. పాకిస్తాన్లో మరో దారుణం
కరాచీ: పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో అమానవీయ ఉదంతం చోటుచేసుకుంది. దైవదూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వైద్యుని మృతదేహాన్ని ఖననం చేయడానికి బదులుగా దహనం చేసిన వైనం వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే సింధ్ ప్రావిన్స్లో దైవ దూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న షానవాజ్ కంబార్ అనే వైద్యుడు పోలీసులకు లొంగిపోయేందుకు నిరాకరిస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఓ పోలీసు ఆ వైద్యునిపై కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కాల్పుల్లో ఆ వైద్యుడు మృతిచెందాడు. కంబార్ మృతదేహాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అప్పగించారు. మృతునికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, భార్య ఉన్నారు. అయితే వైద్యునిపై కాల్పులు జరిపిన పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నియాజ్ ఖోసో ఈ సంఘటనను ధృవీకరిస్తూ, ఆ వైద్యునితో పాటు అతని సహచరులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఈ నేపధ్యంలోనే తాము ఎదురు కాల్పులు జరిపినట్లు తెలిపారు.స్థానిక పోలీసు అధికారి షకుర్ రషీద్ మాట్లాడుతూ మృతుని కుటుంబ సభ్యులు తమ స్వగ్రామమైన జాన్హీరోలో వైద్యునికి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలో కొందరు ఆ మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో వారికి భయపడిన మృతుని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి భయంతో పారిపోయారు. దీంతో ఆ అల్లరి మూక వైద్యుని మృతదేహనికి నిప్పు పెట్టిందని రషీద్ తెలిపారు.ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఉమర్కోట్ నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వైద్యుడు సోషల్ మీడియాలో దైవ దూషణతో కూడిన ఒక పోస్ట్ పెట్టారనే ఆరోపణలతో పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 సీ కింద ఆ డాక్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం పోలీసులు అతనిని అరెస్టు చేసేందుకు వచ్చిన తరుణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: జనాలను ఉరుకులు పెట్టించిన మైసూర్ గజరాజులు -
చెప్పులు వేసుకుని రావద్దన్న డాక్టర్పై దాడి.. వీడియో వైరల్
భావ్నగర్: గుజరాత్లోని ఓ ఆసుపత్రిలో వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యులు తమ ప్రతాపాన్ని చూపించారు. ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించే ముందు చెప్పులు తీసేయమని కోరినందుకు ఆ వైద్యుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. భావ్నగర్లోని సిహోర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తలకు గాయమైన మహిళకు వైద్యులు చికిత్స అందిస్తుండగా, ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని అత్యవసర గదిలోని సీసీటీవీలో ఈ మొత్తం ఘటన అంతా రికార్డు అయింది. ఆ వీడియోలో మంచంపై ఉన్న మహిళ పక్కన కొంతమంది పురుషులు నిలబడి ఉండగా, డాక్టర్ జైదీప్సిన్హ్ గోహిల్ గదిలోకి వచ్చారు. వైద్యుడు వారిని చెప్పులను తీసివేయమని కోరాడు.ఇదీ చదవండి: 50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో డాక్టర్పై దాడి చేశారు. ఆయనను కిందపడేసి మరీ కొట్టడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. మంచంపై పడుకున్న మహిళ, నర్సింగ్ సిబ్బంది నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ నిందితులు వైద్యుడిని కొడుతూనే ఉన్నారు. ఈ ఘర్షణలో గదిలోని మందులు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి. నిందితులు హిరేన్ దంగర్, భవదీప్ దంగర్, కౌశిక్ కువాడియాలను పోలీసులు అరెస్ట్ చేశారు.Young Doctor assaulted at Sihor hospital in #Bhavnagar district;Altercation erupts over removing shoes. A verbal altercation turned violent when relatives of a female patient were instructed to remove their footwear before entering the emergency ward."#MedTwitter @JPNadda pic.twitter.com/b91PU6eECD— Indian Doctor🇮🇳 (@Indian__doctor) September 16, 2024 -
Kolkata Horror: సందీప్ ఘోష్పై సీబీఐ సంచలన ఆరోపణలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో వైద్యురాలిపై హత్యచార ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తలా పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో అభిజిత్ మండల్లను మూడు రోజుల(సెప్టెంబర్ 17) వరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ఇద్దరిని ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపరిచిన సీబీఐ.. సందీప్ ఘోష్పై తీవ్ర ఆరోపణలు చేసింది. వైద్యురాలిపై హత్యాచారం ఘటనను ఆత్మహత్యగా చూపించడానికి ప్రయత్నించాడని పేర్కొంది. ఇది నేరాన్ని తక్కువ చేసి చూపడంతోపాటు సాక్ష్యాలను నాశనం చేయడానికి దారి తీసిందని తెలిపింది.కాగా ఆర్జీ కర్ వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవలకు సంబంధించి ఈనెల 2న సందీప్ ఘోష్ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలను ఆ తర్వాత ఆయనపై నమోదు చేసింది. ఈ కేసులో తలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి అభిజిత్ మోండల్ను కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.కోర్టుకు సీబీఐ సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం.. మహిళా వైద్యురాలిపై హత్యాచారం విషయంపై ఆగస్టు 9న ఉదయం 9.58 గంటలకు సందీప్ఘోష్కు సమాచారం అందింది. అయితే ఆయన వెంటనే ఆసుపత్రిని సందర్శించలేదు. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. అదే విధంగా కేసు విచారణలో సందీప్ఘోష్ మోసపూరిత సమాధానాలు ఇస్తున్నారని సీబీఐ పేర్కొంది.ఆయనకు పాలీగ్రాఫ్ టెస్టు, వాయిస్ అనాలిసిన్ నిర్వహించగా.. కీలకమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఈ టెస్టుల్లో ఆయన ఇచ్చిన సమాధానాలు మోసపూరితమైనవని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక ఇచ్చినట్లు తెలిపారు.బాధితురాలి ఒంటిపై గాయాలు ఉన్నప్పటికీ.. ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. తమ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆసుపత్రి నుంచి వచ్చిన ఫోన్ కాల్ కూడా వచ్చిందని వైద్యుల తల్లిదండ్రులు తెలిపినట్లు చెప్పింది. ఈ ఘటన వెలుగుచూసిన అనంతరం ఘోష్, అభిజిత్ మోండల్తోపాటు ఓ లాయర్తో టచ్లో ఉన్నారని తెలిపింది.బాధితురాలి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా మాజీ ప్రిన్సిపాల్ వారిని కలవలేదని, ఘటన అనంతరం వైద్యపరమైన విధివిధానాలను సకాలంలో పూర్తి చేయడంలో డాక్టర్ ఘోష్ విఫలమయ్యారని తెలిపింది. వెంటనే మృతదేహాన్ని మార్చురీకి పంపాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించినట్లు సీబీఐ కోర్టుకు పేర్కొంది. అంతేకాక ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్కు సందీప్ సూచనలు చేసినట్లు కోర్టులో సీబీఐ తెలిపింది. ఘోష్, మండల్లు కలిసి నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని పేర్కొంది. -
Doctors Protest: సుప్రీంకోర్టు చెప్పినా వినరా?
కోల్కతాలోని ఆర్జీకర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై డాక్లర్లు తమ నిరసనలు రోజురోజుకీ ఉధృతం చేస్తున్నారు. ఓ వైపు వైద్యులు వెంటనే విధుల్లోకి చేరాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు ఆందోళనలు విరమించి, విధుల్లో చేరి రోగులకు సేవలు అందించాలని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. విధుల్లో చేరని వారిపై చర్యలు తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కూడా స్పష్టం చేసింది.అయినప్పటికీ వైద్యులు తమ ఆందోళనలపై వెనక్కి తగ్గడం లేదు. ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తేలేదంటూ వైద్యులు చెబుతున్నారు.మరోవైపు సుప్రీం ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత బెంగాల్ ప్రభుత్వం ముందు కొత్తగా డెడ్లైన్ పెట్టారు. నేటి సాయంత్రం 5లోగా తమ అయిదు డిమాండ్లు నెరవేర్చాలని అల్టిమేటం ఇచ్చారు. లేని పక్షంలో ఆరోగ్య సచివాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.#WATCH | West Bengal: Doctors hold protest near Swasthya Bhavan in Kolkata, demanding justice for RG Kar medical college and hospital rape and murder incident. pic.twitter.com/PkINPyHmEI— ANI (@ANI) September 10, 2024ఈ క్రమంలో వందలాది మంది జూనియర్ వైద్యులు కోల్కతా శివార్లలోని సాల్ట్ లేక్లో ఉన్న స్వస్థ భవన్ వైపు ర్యాలీగా కదులుతున్నారు. స్వస్థ భవన్ ప్రవేశద్వారం వద్ద ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాము విధించిన షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాతే తిరిగి విధుల్లో చేరుతామని ప్రకటించారు.అయితే వైద్యుల అయిదు డిమాండ్లలో కోల్కతా సిటీ పోలీస్ చీఫ్ వినీత్ గోయల్తో సహా, ఆరోగ్య కార్యదర్శి, హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్లను తొలగించాలని కోరుతున్నారు. న్యాయస్థానం విధించిన డెడ్లైన్ పూర్తి అయినా.. వైద్యులు మాత్రం ఇంకా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. -
సీఎం మమతా అబద్దం చెబుతున్నారు: కోల్కతా వైద్యురాలి తల్లి
కోల్కతా: కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తును అణచివేసేందుకు ప్రయత్నించారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, తమకు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపించారు.అయితే ఈ ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. బాధితురాలి తల్లిదండ్రుల వ్యాఖ్యలను దీ కొట్టిపారేశారు. తమ ప్రభుత్వంపై అపనిందలు వేసే ప్రయత్నమంటూ మండిపడ్డారు.‘బాధితురాలి తల్లిదండ్రులకు మేము ఎప్పుడూ డబ్బు ఇవ్వలేదు. ఒక నిండు జీవితాన్ని డబ్బు ఎప్పటికీ భర్తీ చేయలేదు. కానీ, వారి కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా మంచి పని చేయాలని భావిస్తే.. వారికి మా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చా. ఆ విషయంలో వారు నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు. ఎప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలుసు’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.ఇదిలా ఉండగా సీఎం దీదీ వ్యాఖ్యలను హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తల్లి ఖండించారు. మమతా బెనర్జీ అబద్దం చెబుతున్నారని ఆరోపించారు. వారికి డబ్బులు ఇవ్వాలని చూశారని మరోసారి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘సీఎం మమతా అబద్ధాలు చెబుతున్నారు. నష్టపరిహారం ఇప్పిస్తానని, మీ కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చని మాతో చెప్పారు. నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు నేను మీ ఆఫీసుకు వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పాను’ అని తెలిపారు.అదే విధంగా హత్యాచారం అనంతరం చేపట్టిన నిరసనలను అణచివేసేందుకు సీఎం మమతా ప్రయత్రించారని ఆమె ఆరోపించారు. తమ నిరసనలు ఆపాలని, రాబోయే దుర్గా పూజ ఉత్సవాలకు సిద్దం కావాలని సూచించారని పేర్కొన్నారు. అయితే దీదీ అలా మాట్లాడటం అమానవీయమని అన్నారు. తాను ఒక ఆడపిల్లకు తల్లినైనందున ఇది అమానుషంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
‘కొంచెం గొంతు తగ్గించి మాట్లాడండి’: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
కోల్కతా: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా న్యాయవాదిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేత, న్యాయవాది కౌస్తవ్ బాగ్చి మాట్లాడుతున్న సందర్భంలో జోక్యం చేసుకున్న సీజేఐ.. న్యాయవాదిని గొంతు తగ్గించి మాట్లాడాలని హెచ్చరించారు.ఈసలేం జరిగిందంటే.. కోల్కతా ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఆగష్టు 9న ప్రభుత్వ ఆధీనంలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై నిరసనలు చేస్తున్న వారిపై న్యాయవాది కౌస్తవ్ బాగ్చి రాళ్లు రువ్వుతున్నట్లు నిరూపించేందుకు తన వద్ద వీడియోలు, ఫోటోలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా కౌస్తవ్ బాగ్చి బీజేపీ నేత.. ఈ ఏడాదిఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. కపిల్ సిబల్ ఆరోపణలపై.. న్యాయవాది కౌస్తవ్ స్పందిస్తూ.. ఒక సీనియర్ న్యాయవాది కోర్టులో అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సీజేఐ కల్పించుకొని.. మీ ముందు ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు. ముందు గొంతు తగ్గించుకొని మాట్లాడండి’ అంటూ హెచ్చరించారు.‘గత రెండు గంటలుగా మీ ప్రవర్తనను గమనిస్తున్నాను. మీ మీ పిచ్ని ముందు తగ్గించడండి. మీరు న్యాయమూర్తులను ఉద్ధేశించి మాట్లాడుతున్నారు. కోర్టు వెలుపల ఉన్న గ్యాలరీని ఉద్దేశించి కాదు.’ అంటూ మండిపడ్డారు. దీంతో న్యాయవాది కౌస్తవ్ త్రిసభ్య ధర్మాసనానికి క్షమాపణలు తెలియజేశారు.ఇక చీఫ్ జస్టిస్ బాగ్చీని మందలించడంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘పార్ట్టైమ్ న్యాయవాది, ఫుల్టైం బీజేపీ కార్యకర్త అయిన కౌస్తవ్ బాగ్చి నుంచి ఇంకా ఏం ఆశించగలమని మండిపడింది. తమ(బీజేపీ) పాలనలో ఉన్న రాష్ట్రాల్లో మాదిరి కోర్టు గదిని బుల్డోజ్ చేయవచ్చని భావించే వీరి నుంచి ఇలాంటి ప్రవర్దనే ఉంటుందని విమర్శలు గుప్పించింది. నేడు సీజేఐ అతన్ని సరిగ్గా మందలించింది అంటూ తెలిపిందిఇదిలా ఉండగా మంగళవారం నాటికి నిరసనలు చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని సీజేఐ డీవే చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు ఆందోళనలు చేస్తున్న డాక్టర్లు విధుల్లో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ఒక వేళ విధుల్లోకి రాకపోతే వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది.అలాగే బాధితురాలికి సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు అన్నీ సోషల్ మీడియా వేదికల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐని విచారణపై కొత్త నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు సెప్టెంబర 17 వరకు గడువిచ్చింది. ఈ కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది -
అభయ ఘటనపై ప్రపంచ దేశాల్లో వెల్లువెత్తిన ఆందోళనలు
కోల్కతా ఆర్జీకార్ ఆస్పత్రి అభయ ఘటనలో న్యాయం చేయాలనే డిమాండ్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అభయకు మద్దతుగా భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో 130 నగరాల్లో ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు.జపాన్,ఆస్ట్రేలియా,తైవాన్,సింగపూర్,యూరప్ దేశాలతో పాటు అమెరికాలోని 60 ప్రాంతాల్లో అభయ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో జరిగిన నిరసన కార్యక్రమంలో నేరాలకు జవాబుదారీతనం, భారతీయ మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రవాస భారతీయులు నల్ల దుస్తులు ధరించిన మహిళలు ఆందోళన తెలిపారు.ఈ సందర్భంగా డ్యూటీలో ఉన్న అభయపై జరిగిన దారుణం ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. మానవ జీవితం పట్ల నిర్దాక్షిణ్యం,క్రూరత్వం,నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అని ఆందోళన కారులు మండిపడుతున్నారు. -
మనసును పిండేసే తల్లి లేఖ
గతనెలలో కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో పీజీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరుతున్నాయి. పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది.తాజాగా ఈ వ్యవహారంలో మరో పరిణామం చోటుచేసుకుంది. కామాంధుడి చేతిలో హత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లి తన కూతురి కోసం రాసిన ఓ లేఖ నెట్టింట్లో వైరల్గా మారింది. ఇందులో వైద్యురాలు కావడం తన కూతురు చిన్ననాటి కల అని, డబ్బు కోసం కాకుండా వీలైనంత ఎక్కువమందికి మెరుగైన వైద్యం అందిచాలనేది ఆమె కోరికగా ఆ లేఖలో పేర్కొంది.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బాధితురాలి తల్లి ఈ లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో తన కూతురు చిన్ననాటి కలను సాకారం చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను చనిపోయిన వైద్యురాలి తల్లిని. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా కూతురు తరపున ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది ఆమె కల. ఆ కలను నడిపించిన శక్తులు మీరే.మేము తల్లిదండ్రులుగా తమకు చేతనైనంత సపోర్ట్ చేసినా.. మీలాంటి మంచి ఉపాధ్యాయులు లభించినందున, ఆమె డాక్టర్ కావాలనే తన కలను నెరవేర్చుకోగలిగింది. నా కూతురు ఎప్పుడూ చెప్పేది. అమ్మా, నాకు డబ్బు అవసరం లేదు. నా పేరు ముందు నాకు చాలా డిగ్రీలు కావాలి. వీలైనంత ఎక్కువ మంది రోగులను నయం చేయాలనుకుంటున్నాను. హత్య జరిగిన గురువారం కూడా ఆమె ఇల్లు వదిలి వెళ్లి ఆసుపత్రిలో చాలా మంది రోగులకు సాయం చేసింది. డ్యూటీలో ఉన్నప్పుడు హంతకులు ఆమెను హత్య చేశారు. ఆమె కలలను దారుణంగా చంపారు.’ అని లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా తన కూతురైన డాక్టర్కు న్యాయం చేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉండగా బుధవారం, ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద నిరసనలో పాల్గొన్న బాధితురాలి తల్లిదండ్రులు.. తొలుత పోలీసులు ఈ కేసును అణిచివేసేందుకు, సమగ్ర దర్యాప్తు లేకుండా మూసివేయడానికి ప్రయత్నించిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. పోలీసులు తమకు డబ్బులు ఇవ్వాలని కూడా చూశారని తెలిపారు. కాగా ఈ ఘటన తర్వాత నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేసినా.. అన్ని వేళ్లు మాత్రం ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వైపే చూపించాయి. ఈ క్రమంలోనే ఈ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి వ్యవహారం బయటపడటం తీవ్ర దుమారం రేపింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో ఇప్పటికే సీబీఐ ఆయనను అరెస్టు చేయగా.. తాజాగా కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఘోష్ నివాసంపై శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. ఘోష్, అతడి సహచరులకు సంబంధించిన వివిధ ప్రదేశాలలో దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు చేశారు. ఆస్పత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రసూన్ ఛటర్జీ ఇంట్లో కూడా సోదాలు చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. -
కోల్కతా డాక్టర్ కేసు: రంగంలోకి ‘ఈడీ’
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించి పశ్చిమబెంగాల్లోని హౌరా, సోనార్పూర్, హుగ్లీ ప్రాంతాల్లో శుక్రవారం(సెప్టెంబర్ 6) ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది.హత్యాచారం జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ఘోష్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాలేజీలో అక్రమాలు, మనీలాండరింగ్ వ్యవహారాల్లో ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. ఆర్జీకర్మెడికల్ కాలేజీ అక్రమాల సీబీఐ కేసులో సందీప్ఘోష్ అరెస్టయ్యారు. ఆయన ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. 8 రోజుల పాటు ఘోష్ను విచారించేందుకు కోర్టు సీబీఐకి అనుమతిచ్చింది. మరోవైపు మహిళా డాక్టర్ హత్యాచారం కేసును సీబీఐ వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్రాయ్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. ఇదీ చదవండి.. బలవంతంగా దహనం చేశారు -
పోలీసులు మాకు లంచం ఇవ్వాలనుకున్నారు: వైద్యురాలి తల్లిదండ్రులు
కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. పలువురిని అరెస్ట్ చేస్తూ విచారణను వేగవంతం చేసింది. మరోవైపు బాధితురాలికి త్వరగా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్ధులు, పలు సంఘాల నిరసనలు పెరిగిపోతున్నాయి.తాజాగా మృతురాలి తల్లిదండ్రులు రాష్ట్ర పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును అణిచివేసేందుకు పోలీసులు తమకు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, సమగ్ర దర్యాప్తు లేకుండా కేసును మూసివేయడానికి యత్నించారని మండిపడ్డారు.జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనల్లో పాల్గొన్న బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘పోలీసులు మొదటి నుంచి కేసును మూసివేయడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని చూడటానికి మాకు అనుమతి లేదు. మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్షల కోసం తీసుకెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్లో వేచి ఉండాల్సి వచ్చింది. హడావుడిగా మా కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారు.మృతదేహాన్ని మాకు అప్పగించినప్పుడు, ఒక సీనియర్ పోలీసు అధికారి మాకు డబ్బును ఆఫర్ చేశారు. కానీ మేము వెంటనే దానికి తిరస్కరించాం. మా కుమార్తెకు న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ నిరసనలో పాల్గొంటున్నాం.’అంటూ బాధితురాలి తండ్రి పేర్కొన్నారు.కాగా ఈ కేసును తొలుత కోల్కతా పోలుసు దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసు దర్యాప్తులో పోలీసులు విఫలమయ్యారంటూ వైద్యులు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే కేసును కోల్కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఘటన చోటుచేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను అరెస్ట్ చేసింది. నిందితుడితోపాటు మరికొంతమందికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు.మరోవైపు అత్యాచార దోషులకు మరణశిక్ష విధించేలా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఈ వారం అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించింది. -
బెంగాల్ అసెంబ్లీ ముందుకు అత్యాచార నిరోధక బిల్లు
కోల్కతా: కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై విపక్షాలు, విద్యార్ధి సంఘాలు, వైద్యుల నిరసనలతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సమయంలో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం.. సోమవారం నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును బెంగాల్ న్యాయ మంత్రి మోలోయ్ ఘటక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనికి 'అపరాజిత స్త్రీ, చైల్డ్ బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాలు, సవరణ) బిల్లు 2024'గా పేరు పెట్టారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం, లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి మహిళలు పిల్లలకు రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బిల్లు తీసుకొచ్చింది.ఈ బిల్లులో ఏమి ఉంటుంది అత్యాచారం, హత్య కేసుల్లో మరణశిక్ష విధించే నిబంధన.ఈ బిల్లు ప్రకారం ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 36 రోజుల్లోగా మరణశిక్ష విధించే నిబంధన ఉంటుంది.అత్యాచారం మాత్రమే కాదు యాసిడ్ దాడి కూడా అంతే తీవ్రమైన నేరం, దీనికి జీవిత ఖైదు విధించే నిబంధన ఈ బిల్లులో ఉంది.ప్రతి జిల్లాలో స్పెషల్ ఫోర్స్-అపరాజిత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.ఈ అపరాజిత టాస్క్ ఫోర్స్ అత్యాచారం, యాసిడ్ దాడి లేదా వేధింపుల కేసుల్లో చర్య తీసుకుంటుంది.ఎవరైనా బాధితురాలి గుర్తింపును వెల్లడిస్తే, అతనిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు.కాగా ఈ బిల్లు గురించి గతంలో మమతా బెనర్జీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అత్యాచార ఘటనలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని దీదీ స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న చట్టాలను సవరించి, అత్యాచార నిందితులకు మరణ శిక్ష పడేలా అసెంబ్లీలో వచ్చేవారం బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతామని, దానికి ఆమోదం లభించకపోతే.. రాజ్భవన్ బయట నిరసన తెలుపుతామని హెచ్చరించారు.#WATCH | Kolkata, West Bengal: Junior Doctors continue to sit at the protest site in the Lalbazar area. They have been demanding justice for a woman doctor who was raped and murdered at RG Kar Medical College and Hospital on August 9. pic.twitter.com/HZ7mfOxAE2— ANI (@ANI) September 3, 2024 కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసుపై సీబీఐ రెండు సమాంతర దర్యాప్తులు జరుపుతోంది. మొదటిది అత్యాచారం, హత్య కేసుకు సంబంధించినది కాగా, రెండవది ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవలకు సంబంధించినది. ఈ నేరానికి సంబంధించి ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.మరోవైపు కోల్కతాలోని వివిధ వైద్య కళాశాలలకు చెందిన జూనియర్ వైద్యులు మంగళవారం ఉదయం బిబి గంగూలీ వీధిలో తమ నిరసనను కొనసాగించారు. కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. బీబీ గంగూలీ స్ట్రీట్లో పోలీసులు భారీ సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. లాల్బజార్లోని కోల్కతా పోలీస్ హెడ్క్వార్టర్స్కు ర్యాలీగా తరలివెళ్లే ప్రయత్నం చేశారు. -
ఉడకని మాంసం తింటే ఏం జరుగుతుందో తెలుసా..!
ఆ మాంసం సరిగి ఉడికించకుండా తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు వస్తాయో వివరించాడు అమెరికా వైద్యుడు. సీటీ స్కాన్ తీసి మరీ వెల్లడించారు. మాంసం సరిగ్గా ఉడక్కపోతే దానిలో ఉండే పరాన్నజీవి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కలిగిస్తుందో తెలిపారు. ఇంతకీ ఏ మాంసం గురించి అంటే..కొందరూ పంది మాంసం ఇష్టంగా తింటారు. ముఖ్యంగా మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా పందిమాంసం తింటుంటారు. అయితే ఈ మాంసాన్ని గనుక సరిగా ఉడికించపోతే అంతే సంగతులని చెబుతున్నారు వైద్యులు. మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తింటే ఎలాంటి రోగాలు వస్తాయో..?.. సిటీస్కాన్ చేసి మరి వివరించాడు అమెరికా వైద్యుడు డాక్టర్ సామ్ ఘాలి. సరిగా ఉడికించిన పంది మాంసం తిన్న రోగి కాళ్లలో పరాన్న జీవి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కలిగిస్తుందో సీటీస్కాన్ తీసి మరి వెల్లడించారు. అతడికి సిస్టోసెర్కోసిస్ ఉన్నట్లు నిర్థారించారు. దీన్ని వైద్య పరిభాషలో టేప్వార్మ్ ముట్టడి అని అంటారని చెప్పారు. అలాంటి ఇన్ఫెక్షన్ని నివారించాలంటే.. పంది మాంసాన్ని సరిగా ఉడికించి తినాలని అన్నారు. సిస్టిసెర్కోసిస్ అనేది టైనియా సోలియం లార్వా తిత్తుల వల్ల వస్తుందని అన్నారు. దీన్ని టేప్ వార్మ్(బద్దెపురుగులు) అని పిలుస్తారని చెప్పారు. అంటే పంది శరీరం పర్నాజీవిలా బద్దె పురుగులకు ఆశ్రయం ఇస్తుంది. అందువల్ల ఈ మాంసాన్ని తీసుకునేవాళ్లు బాగా ఉడికించి తీసుకోవాలి. లేదంటే ఈ బద్దెపురుగులు తిత్తులుగా మారి పలు రకాల ఇన్ఫెక్షన్ల బారినపడేలా చేస్తుంది. ఈ తిత్తులు జీర్ణశయాంతర ప్రేగులలో పరిపక్వ వయోజన టేప్వార్మ్లుగా పరిణామం చెందుతాయి. ఈ పరిస్థితిని ఇంటెస్టినల్ టైనియాసిస్ అంటారు" అని డాక్టర్ ఘాలి వివరించారు. అంతేగాదు ఈ వయోజన టేప్వార్మ్లు గుడ్లను తొలగిస్తాయి, అవి మానవ మలంలోకి విసర్జించబడతాయని తెలిపారు. అందువల్లే రోగులు సిస్టిసెర్కోసిస్ సిండ్రోమ్ బారిన పడతారని చెప్పారు. (చదవండి: మిస్ యూనివర్స్ నైజీరియాగా దక్షిణాఫ్రికా బ్యూటీ!) -
కోల్కతా వైద్యురాలి కేసు : సీబీఐ దర్యాప్తులో కీలక పరిణామం
కోల్కతా : ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆగస్ట్ 9న ఆర్జీ కార్ ఆస్పత్రిలో వైద్యురాలిపై దారుణం జరిగిన ప్రాంతాన్ని సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు.కేసు విచారణలో భాగంగా ఆర్జీకార్ ఆస్పత్రి ఎమర్జెన్సీ బిల్డింగ్,బాయ్స్ హాస్టల్, ప్రిన్సిపల్ ఆఫీస్లో తనిఖీలు నిర్వహించారు. ఇదే కేసు నిమిత్తం ఆగస్ట్ 29న సీబీఐ అధికారులు ఆర్జీకార్ ఆస్పత్రి శవాగారాన్ని పరిశీలించారు.మాజీ ప్రిన్సిపల్కు రెండుసార్లు పాలిగ్రాఫ్ టెస్ట్లు మరోవైపు వైద్యురాలి కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఆర్జీకార్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్కు రెండు సార్లు పాలిగ్రాఫ్ టెస్ట్లు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి అరెస్టయిన నిందితుడు సంజయ్రాయ్కు పాలిగ్రాఫ్ టెస్ట్లు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.చదవండి : మమత చుట్టూ బిగుస్తున్న ఉచ్చుఆ రాత్రి ఏం జరిగింది?కోల్కతా అభయపై జరిగిన దారుణంపై దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది. అభయ ఘటన జరగక ముందు రాత్రి అంటే ఆగస్ట్ 8న అభయ, ఇద్దరు మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, హౌస్ సర్జన్, ఒక ఇంటర్న్ కలిసి భోజనం చేశారు. అనంతరం ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్ను వీక్షించారు. అయితే, తెల్లవారు జామున (ఆగస్ట్9) 2 గంటలకు, ఇద్దరు సహచరులు డ్యూటీలో ఉన్న వైద్యులు విశ్రాంతి తీసుకునే గదిలోకి వెళ్లారు. బాధితురాలు సెమినార్ గదిలోనే ఉండిపోయింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ ఆగస్టు 9న తెల్లవారు జామున ఉదయం 3.50 గంటల సమయంలో ఆర్జీకార్ ఆసుపత్రికి చేరుకున్నాడు. తొలుత ఆపరేషన్ థియేటర్ డోర్ను పగలగొట్టిన నిందితుడు.. 4.03 గంటల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించాడు. అనంతరం మూడో అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్లో గాఢ నిద్రలో ఉండగా, రాయ్ అభయంపై దారుణానికి పాల్పడ్డాడు. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఉదయం 9.30 గంటలకు, పోస్ట్గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్లలో ఒకరు బాధితురాలి కోసం వెతికేందుకు వెళ్లాడు. దూరం నుంచి కదలలేని స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని చూశాడు. దీంతో అభయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దారుణం జరిగిన ప్రదేశంలో బ్లూటూత్ లభ్యమైంది. ఆ బ్లూటూత్ను అనుమానితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వారి ఫోన్లకు హెడ్ఫోన్ కనెక్ట్ చేయడానికి ప్రయత్నించగా అది సంజయ్ ఫోన్కు కనెక్ట్ అయ్యింది. దీంతో సంజయ్ రాయ్ అసలు నిందితుడిగా పోలీసులు తొలుత గుర్తించారు.అనంతరం విచారణ ముమ్మరం చేశారు. ఘటన జరిగిన అనంతరం నిందితుడు సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి తన దుస్తులపై ఉన్న రక్తపు మరకల్ని సంజయ్ శుభ్రం చేసుకున్నాడు. అయితే అతడి షూపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్ని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో సంజయ్ రాయ్తో పాటు ఆర్జీకార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు -
కోల్కతా అభయ కేసు : సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన ఐఎంఏ
న్యూఢిల్లీ: కోల్కతా అభయ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సస్పెండ్ చేసింది.ఆర్జీకార్ అభయపై జరిగిన దారుణంలో సందీప్ ఘోష్ ప్రమేయం ఉందని తేలలేదు. అయినప్పటికీ ఘటన జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం, ఆత్మహత్య అని బాధితురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై సీబీఐ సైతం దర్యాప్తు చేస్తుంది. అదే సమయంలో ఆర్జీకార్ మాజీ డాక్టర్, ప్రస్తుత ముర్షిదాబాద్ వైద్య కళాశాల డిప్యూటీ సుపరింటెండెంట్ అక్తర్ అలీ సందీప్ ఘోష్పై సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. మృతదేహాలతో వ్యాపారం,బయోమెడికల్ వ్యర్థాలను అక్రమంగా రవాణా చేశారని ఆరోపించారు.ఈ ఆరోపణలతో సీబీఐ అధికారులు సందీప్ ఘోష్ను 90 గంటల పాటు ప్రశ్నించారు. దీంతో పాటు ఆయన ఇల్లు, ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సైతం 11 గంటల పాటు సోదాలు జరిపారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేశారు.ఈ తరుణంలో ఐఎంఏ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఐఎంఏ సస్పెండ్ చేసింది. వైద్యురాలి మరణంతో పాటు ఆమె కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యం, సానుభూతి లేకపోవడాన్ని ప్రస్తావించింది. తన తీరుతో సందీప్ ఘోష్ వైద్యవృత్తికి చెడ్డపేరు తెచ్చారని, క్రమశిక్షణా కమిటీ అతనిని సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని ఐఎంఏ తెలిపింది. కాగా,ఆర్జీ కార్ ఆస్పత్రి వైద్యురాలి మరణం అనంతరం జరిగిన పరిణామలపై సందీప్ ఘోష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కొన్ని గంటల్లోనే మమతా ప్రభుత్వం అతన్ని కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు ప్రిన్సిపల్గా నియమించడం విశేషం. -
అభయ కేసు.... ఎప్పుడేం జరిగిందంటే..
కోల్కతాలో ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్పై హత్యాచారం ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన జరిగి 20 రోజులు కావస్తున్న దేశ వ్యాప్తంగా ఆగ్రహాజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో రోజురోజుకీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. విషాదకర ఘటనను ఖండిస్తూ రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు నిరసనలు చేపట్టడం.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో, మమతా బెనర్జీ ప్రభుత్వం, పోలీసులకు తీరుకు నిరసనగా బీజేపీ 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది. ప్రస్తుతం బెంగాల్లో బంద్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ట్రైనీ డాక్టర్పై హత్యాచారం, ఈ కేసుకు సంబంధించి హైలైట్స్.. ఆగష్టు 8ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలు గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇద్దరు ట్రెయినీ డాక్టర్లలో ఒకరు బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ఆసుపత్రి యాజమాన్యానికి, పోలీసులకు ఈ విషయాన్ని అందించారు.ఆగష్టు 9ఈ కేసులో పోలీసు వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. నేరం జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోని అర్ధరాత్రి సమయంలో నిందితుడు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అందులో నిందితుడి మెడ చుట్టూ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ కన్పించాయి. సెమినార్ హాల్లో వైద్యురాలి మృతదేహం గుర్తించిన ప్రాంతంలో ఈ బ్లూటూత్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసీటీవీ రికార్డుల ఆధారంగానే ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు.ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోల్కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారాంగా ఈ ఘోరానికి పాల్పడిని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుడు ఆసుపత్రిలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగిగా, అతడికి హాస్పిటల్లోని పలు విభాగాల్లో ప్రవేశించేందుకు అనుమతి ఉన్నట్లు గుర్తించారు.ఆగష్టు 10ఆసుప్రతిలోనే వైద్య విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడటం, ఆపై హత్య చేయడంపై వైద్యులు, వైద్య సిబ్బంది భగ్గుమన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. దోషులందరికీ కఠిన శిక్షలు పడాలంటూ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళనలకు తెర తీశారు.దీదీ తొలి స్పందనట్రైయినీ డాక్టర్ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం తొలిసారి స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, వైద్యుల నిరసనలకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు కూడా వారి డిమాండ్లను అంగీకరించారని అన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఈ కేసులో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే నిందితులను ఉరితీస్తారని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును వేగంగా విచారించి, నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు.ఆగష్టు 11పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవ పరీక్ష నివేదిక వెలువడింది. ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు అది నిర్ధారించింది. బాధితురాలి ముఖం,కుడి చేయి, మెడ, ఎడమకాలు,పెదవులు వంటి శరీర భాగాల మీద గాయాల గుర్తులు ఉన్నాయని, ఆమె కళ్లు, నోటి నుంచి, ప్రేవేటు భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు వెల్లడైంది.ఆగష్టు 12ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్య తర్వాత ఆసుపత్రి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆగస్టు 12న ఆర్జి కర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అవమానాన్ని తాను భరించలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. ‘నా పేరుతో రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. నా వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అవమానాన్ని భరించలేకపోతున్నా. నన్ను తొలగించేందుకే కొందరు కుట్రపన్ని విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. నిందితులకు శిక్ష పడాలని కోరుతున్నాను. చనిపోయిన అమ్మాయి నా కూతురు లాంటిది. నేను కూడా ఓ పేరెంట్నే.. పేరెంట్గానే రిజైన్ చేస్తున్నాను’ అని డాక్టర్ ఘోష్ తెలిపారు.ఆగష్టు 13కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిల్స్పై కలకత్తా హైకోర్టు మంగళవారం విచారించింది. కోల్కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. ఐదు రోజులు దాటినా ప్రగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.సీబీఐకి బదిలీఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిల్స్పై కలకత్తా హైకోర్టు మంగళవారం విచారించింది. కోల్కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. ఐదు రోజులు దాటినా ప్రగతి లేదంటూ వైద్యురాలి కేసు విచారణను సీబీఐకి బదలాయించింది. అనంతరం గంటల వ్యవధిలోనే ఫోరెన్సిక్, వైద్య నిపుణులతో కూడిన సీబీఐ ప్రత్యేక బృందం హుటాహుటిన కోల్కతా చేరుకుంది. కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. నిందితున్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టింది.ఆగష్టు 14హత్యకు గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్కు న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్, దేశవ్యాప్తంగా బుధవారం రాత్రి 'రీక్లైమ్ ది నైట్' నిరసన ప్రారంభమైంది. అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కాని అర్ధరాత్రి సురక్షితంగా జీవించే హక్కు స్త్రీలకు రాకపోవడంపై ఈ నిరసన చేపట్టారు. వేలాది మహిళలు వీధుల్లోకి వచ్చారు, ప్లకార్డులు పట్టుకుని బాధితురాలు కుటుంభానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఆందోళన తొలుత శాంతియుతంగా సాగింది. అయితే, ఆసుపత్రికి చేరుకున్నాక ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రిని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్ను విరగ్గొట్టారు. ఆసుపత్రి బయట ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమర్జెన్సీ వార్డును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బయట పార్క్ చేసిన పోలీసు వాహనాలపైనా ప్రతాపం చూపారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్ప వాయువు ప్రయోగించారు.ఆగష్టు 15వైద్యురాలి హత్యాచార ఉదంతంలో ప్రధాన నిందితుడు పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్తో పాటు మరికొందరి ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలను పోస్ట్మార్టం నివేదిక బలపరిచింది. మృతురాలి జననాంగంలో 151 గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్మార్టం నివేదిక వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇది కచ్చితంగా గ్యాంగ్ రేపేనని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సువర్ణ గోస్వామి చెప్పారు. ‘‘మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయాలున్నాయి. ఒక్క వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడు! ఎక్కువ మంది దాడి చేసినట్లు అనిపిస్తోంది’’ అన్నారు.ఆగష్టు 16 ఆస్పత్రి విధ్వంసంపై మమత, బెంగాల్ బీజేపీ నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. సీపీఎం, బీజేపీ కార్యకర్తలే విధ్వంసానికి పాల్పడ్డారని మమత ఆరోపించగా, అది ఆమె పంపిన తృణమూల్ గూండాల పనేనని బీజేపీ తిప్పికొట్టింది. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆస్పత్రి విధ్వంస ఘటన పౌర సమాజానికి సిగ్గుచేటని బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోసు అన్నారు. దాన్ని తీవ్రంగా ఖండించారు.ఆగష్టు 17వైద్యురాలి హత్యకు నిరసనగా శనివారం వైద్యుల దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. నివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు ఓపీ వైద్య సేవలు బంద్ చేయనున్నట్లు తెలిపింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఫలితంగా దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. కొన్ని కీలక విభాగాలు మాత్రమ పనిచేశాయి. ఆగష్టు 18 కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య.. తదనంతరం దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన, నిరసన కార్యక్రమాల ఉధృతం అవుతుండడం, ఆసుపత్రల్లో వైద్య సేవలు నిలిచిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచి్చంది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి తగిన భద్రత కలి్పంచడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేసింది. వారి భద్రతకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై సిఫార్సులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోల్కతా ఆర్జీకార్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ కేసును ఆగష్టు 18న అత్యున్నత న్యాయ స్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 20వ తేదీన (మంగళవారం) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది..ఆగష్టు 19వైద్యురాలి ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోల్కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు. అలాగే వైద్య సిబ్బంది భద్రతను కోరుతూ పలు డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. ప్రధాని మోదీకి లేఖ రాసిన వారిలో ప్రముఖ వైద్యులు హర్ష్ మహాజన్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సరిన్ తదితరులు ఉన్నారు.ఆగష్టు 20వైద్యురాలి అత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. అంత ఘోరం జరిగితే.. ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది.బాధితురాలి ఫొటో, పేరును ప్రచురించడంపై మీడియా సంస్థలపైనా మండపడింది. ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళనలపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈనెల 22 లోపు ఘటనపై నివేదిక ఇవ్వాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ కాలేజీలో భద్రత కోసం.. 10 మందితో నేషనల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది.ఆగష్టు 21నిందితుడు సంజయ్ రాయ్ అత్త ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ భార్యను తీవ్రంగా కొట్టేవాడని తెలిపారు. తీవ్రంగా కొట్టటంతో మూడు నెలల గర్భిణీ అయిన ఆయన భార్య గర్భస్రావానికి కారణమయ్యాడని ఆరోపణలు చేశారు. సంజయ్ మంచివాడు కాదని, చాలా రాక్షసంగా ప్రవర్తించేవాడని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన సంజయ్ను ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు.ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి తాజా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆస్పత్రి మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఒక జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడని,. ఆస్పత్రి, వైద్యకళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడని ఆరోపించారు.వైద్య విద్యార్థుల డిమాండ్ మేరకు ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్ను బెంగాల్ ప్రభుత్వం తొలగించింది. వైస్–ప్రిన్సిపల్ బుల్బుల్, మరో ఇద్దరిని కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది.ఆగష్టు 22 తో దర్యాప్తు పురోగతిపై గురువారం సీబీఐ స్థాయీ నివేదిక సమరి్పంచింది. బెంగాల్ సర్కారు కూడా ఓ నివేదిక సమర్పించింది. ఈ కేసులో కోల్కతా పోలీసుల దర్యాప్తు అత్యంత లోపభూయిష్టమంటూ జస్టిస్ పార్డీవాలా ఈ సందర్భంగా మండిపడ్డారు. అర్ధరాత్రి పోస్టుమార్టం తర్వాత గానీ క్రైం సీన్ను పోలీసులు అధీనంలోకి తీసుకోలేదంటూ సీజేఐ ఆక్షేపించారు. అసహజ మరణమని పొద్దున్నే తేలినా ఎందుకంత ఆలస్యం చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ దాఖలులో కోల్కతా పోలీసుల అసాధారణ జాప్యం అత్యంత తీవ్రమైన అంశమంటూ దుయ్యబట్టారు.డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ గురువారం అభ్యర్థించారు.ఈ పరిస్థితిని రాజకీయం చేయవద్దని, చట్టం తన పని తాను చేసుకుంటోందని తెలిపారు. వైద్యుల సంక్షేమం, భద్రతపై తాము ఆందోళన చెందుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో 11 రోజుల సమ్మెను విరమిస్తున్నట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) తెలిపింది.ఆగష్టు 23కోల్కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో తమ కుమార్తెపై అత్యాచారం, హత్య ఘటనపై సీబీఐ చేపట్టిన విచారణపై విశ్వాసముందని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. ‘ఈ ఘటన వెనుక ఉన్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు మాకున్న అనుమానం నిజమేనని తేలింది. ఈ నేరానికి కేవలం ఒక్కరు మాత్రమే కారణం కాదు’అని శుక్రవారం నార్త్ 24 పరగణాల జిల్లాలోని తమ నివాసంలో మీడియాతో వారన్నారు. ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగే అక్రమాల గుట్టును బయటపెట్టాలన్నారు.నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీవైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. శుక్రవారంతో సీబీఐ కస్టడీ ముగియగా.. సంజయ్ను భారీ భద్రత నడుమ పోలీసులు సీల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టుకు తరలించారు. కాగా, కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో.. పోలీసులు అతడిని జైలుకు తరలించారుఆగష్టు 24సంజయ్రాయ్తో పాటు మరో ఏడుగురికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. కేసులో పాలీగ్రాఫ్ పరీక్షకు నిందితుడు సమ్మతించడంతో కోర్టు అధికారులకు అనుమతినిచ్చింది. సంజయ్ రాయ్, ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీష్ హోష్, మరో నలుగురు డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు జైలులోనే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహిస్తామని, మిగతావారికి సీబీఐ కార్యాలయంలో టెస్ట్లు కొనసాగుతున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.అయితే, విచారణ సందర్భంగా సంజయ్రాయ్ న్యాయస్థానంలో సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తనను కావాలనే ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ పాలిగ్రాఫ్ పరీక్షతో ఆ విషయం బయటపడుతుందని ఆశిస్తున్నానని కోర్టుకు తెలిపాడు.ఆగష్టు 25నిందితుడు సంజయ్ రాయ్కి పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. నేరం జరిగిన రోజున వారు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్టు నిందితుడు చెప్పుకొచ్చాడు. ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్ వద్ద నిందితుడు ఉన్నాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్లోనే నిద్రిస్తోంది. కాసేపటి తర్వాత సంజయ్ రాయ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అలాగే, తాను చూసే సరికే లేడీ డాక్టర్ మరణించిందని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చెప్పాడు.ఆగష్టు 26ట్రెయినీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ వాడే బైక్ సిటీ పోలీస్ కమిషనర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది. దీంతో ఈ కేసులో పోలీసుల ప్రమేయంపై కూడా సీబీఐ విచారణ జరుపుతున్నది. ఇప్పటికే అతని బైక్ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. నిందితుడు సంజయ్ రాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో సివిక్ వాలంటీర్ అని తెలిపారు. కోల్కతా పోలీసుల వాహనాలు అన్నీ సిటీ పోలీస్ కమిషనర్ పేరుతోనే అధికారికంగా రిజిస్టర్ అయి ఉంటాయని చెప్పారు.ఆగష్టు 27అత్యాచారం, హత్యను ఖండిస్తూ ‘పశ్చిమబంగా ఛాత్ర సమాజ్’ స్టూడెంట్ యూనియన్ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ‘నబన్నా అభియాన్’ పేరుతో కోల్కతాలో స్టూడెంట్లు మంగళవారం ఉదయం హౌరా నుంచి సెక్రటేరియెట్కు ర్యాలీగా బయలుదేరారు. వీరిని సంత్రాగచి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్టూడెంట్లు, పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది. బారికేడ్లు తోసుకుంటూ స్టూడెంట్లు ముందుకెళ్లే ప్రయత్నం చేశారు.దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆగ్రహించిన స్టూడెంట్లు పోలీసులపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. దీంతో పోలీసులు వాటర్ కెనాన్లతో వారిని చెదరగొట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు స్టూడెంట్లు, పోలీసులకు గాయాలయ్యాయి. ఎంజీ రోడ్, హాస్టింగ్ రోడ్, ప్రిన్సెప్ ఘాట్ దగ్గర్లో, హౌరా మైదాన్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలువురు స్టూడెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగష్టు 28స్టూడెంట్ యూనియన్ నేతలపై పోలీసుల దాడిని ఖండిస్తూ బీజేపీ బుధవారం 12 గంటల పాటు జనరల్ స్ట్రైక్కు పిలుపునిచ్చింది. నిరసనల వెనుక బీజేపీ హస్తం ఉందని టీఎంసీ నేతలు చేస్తున్న కామెంట్లను ఖండించింది. స్టూడెంట్లపై లాఠీచార్జ్ చేయించిన మమతా బెనర్జీ తన సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా స్ట్రైక్ చేస్తామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులను పోలీసులే రెచ్చగొట్టారని మండిపడ్డారు. -
మీరు, మేము కాదు.. మనమంతా: కోల్కతా ఘటనపై మహువా ట్వీట్
కోల్కతా: కోల్కతాలో ఆర్జీ మెడికల్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనికి నిరసనగా నేడు(మంగళవారం) కోల్కతా సచివాలయం నవన్ అభియాన్ ముట్టడికి జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు దీనిని అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సచివాలయం వద్ద ర్యాలీకి అనుమతి లేదని బెంగాల్ పోలీసులు తేల్చి చెప్పారు. తాజాగా వైద్యురాలి ఘటనపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ఈ దారుణమైన హత్యాచారంపై న్యాయం కోరే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. ఈ విషయంలో మీరు, మేము అని కాకుండా అందరూ తమ కూతుళ్ల కోసం రక్తం చిందిస్తారని, న్యాయం కోసం పోరాడుతారని తెలిపారు.కాగా వైద్యురాలి ఉదంతంపై బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహువా ట్విటర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు."ఇది సామూహిక అత్యాచారం కాదు, ఎలాంటి ఫ్రాక్చర్ లేదు. హడావిడిగా దహన సంస్కారాలు చేయలేదు. పోస్టుమార్టం వీడియో తీశారు. 12 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఓ మృగం చేతిలో అత్యాచారానికి గురైన మన 31 ఏళ్ల కుమార్తె కోసం మనమంతా రక్తమోడుతున్నాం. మీరు, మేము కాదు. సత్వర విచారణ, న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని గట్టిగా చెప్పండి’’ అని మహువా ట్వీట్ చేసింది.It wasn’t a gangrape, there were no fractures, no hurried cremation & autopsy was videographed. Killer was caught within 12 hours & CBI is in charge of case. All of us bleed for our 31 year old daughter who was raped by this animal. There is no “us” & no “them”. Everybody wants…— Mahua Moitra (@MahuaMoitra) August 26, 2024 -
ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్పై దాడి
ఢిల్లీ: కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లకు 11 రోజుల పాటు సమ్మె చేసి ఇటీవల విరమించారు. సమ్మె విరమించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఓ రెసిడెంట్ డాక్టర్, మెడికల్ డ్రెస్సర్పై దాడి జరిగింది. ఈ ఘటన ఢిల్లీలోని కర్కర్దూమాలో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ హాస్పిటల్లో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. బాధిత డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘శనివారం అర్ధరాత్రి 1 గంటలకు తలపై గాయంతో ఓ వ్యక్తి హాస్పిటల్కు వచ్చాడు. గాయానికి కుట్లు వేయటం కోసం డ్రెసింగ్ రూంలోకి పేషెంట్ను తీసుకువెళ్లాను. నేను గాయానికి కుట్లు వేస్తున్న సమయంలో పేషెంట్ ఒక్కసారిగా నాపై దుర్భాషలాడు. రూంకి బయట ఉన్న.. పేషెంట్ కుమారుడు వెంటనే లోపలికి నా ముఖంపై దాడి చేశాడు. తర్వాత ఇద్దరూ నన్ను దుర్భాషలాడారు’’ అని బాధిత రెసిడెంట్ డాక్టర్ తెలిపారు. పేషెంట్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తానని డాక్టర్ తెలిపారు. ఢిల్లీలోని వందలాది రెసిడెంట్ డాక్టర్లు ఆగస్టు 23న తమ సమస్యలను పరిష్కరించి, రక్షణ కల్పించాలని సమ్మె చేపట్టారు. అయితే సుప్రీంకోర్టు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అనుసరించి విధుల్లో చేరారు. రెసిడెంట్ డాక్టర్లు.. ఆగస్టు 12న ప్రారంభించిన సమ్మె కారణంగా ఢిల్లీలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. -
నిందితుడు సంజయ్ది పశు ప్రవృత్తి
న్యూఢిల్లీ/ కోల్కతా: ట్రైనీ పీజీ డాక్టర్ హత్యాచారం కేసులో ప్ర ధాన నిందితుడైన సంజయ్ రాయ్ పశుప్రవృత్తిని కలిగి ఉన్నాడని సైకో అనాలసిస్ పరీక్షలో తేలింది. వైద్యురాలిపై పాశవిక రేప్, హత్యపై అతనిలో కించిత్తు కూడా పశ్చాత్తాపం లేదని, అశ్లీల చిత్రాలు విపరీతంగా చూస్తాడని సైకో అనాలసిస్లో తేలిందని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. “అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. రేప్, హత్యను ప్రతి చిన్న అంశంతో సహా పూసగుచ్చినట్లు వివరించాడు.ఏమాత్రం సంకోచించలేదు’అని సీబీఐ అధికారి చెప్పారు. సంజయ్ రాయ్ మొబైల్ ఫోన్లో పలు అశ్లీల చిత్రాలు పోలీసులకు లభించిన విషయం తెలిసిందే. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు సంజయ్ రాయ్ ఘటనా స్థలి (ఆర్.జి.కర్ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్) వద్ద ఉన్నట్లు నిరూపిస్తున్నాయని సీబీఐ తెలిపింది. హత్యాచారం జరిగిన ఆగస్టు 8న అర్ధరాత్రి దాటాక సంజయ్ రాయ్ తప్పతాగి ఉత్తర కోల్కతాలోని వేశ్యావాటికను సందర్శించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అక్కడ ఒక మహిళను నగ్న చిత్రాన్ని అడిగాడు. ఆగస్టు 9న వేకువజామున 4 గంటల ప్రాంతంలో సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నట్లు సీసీటీవీల్లో రికార్డైంది. జీన్స్ ప్యాంట్, టీ షర్టు ధరించిన అతని చేతిలో పోలీసు హెల్మెట్ ఉంది. రాయ్ కోల్కతా పోలీసు సివిల్ వాలంటీర్ అనే విషయం తెలిసిందే. రాయ్ మెడచుట్టూ బ్లూటూత్ డివైస్ సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తర్వాత ఇదే బ్లూటూత్ డివైస్ క్రైమ్ సీన్లో లభించింది. దర్యాప్తులో కీలకంగా మారింది. సంజయ్రాయ్కు సంబంధించిన డీఎన్ఏ పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. సందీప్ ఘోష్కు లై డిటెక్టర్ టెస్టు ఆర్.జి.కర్ ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకల కేసును కలకత్తా హైకోర్టు శుక్రవారం సీబీఐకి బదిలీ చేసింది. ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అప్పగించాలని ఆసుపత్రి మాజీ డిప్యూ టీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ వేయడంతో హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. మూడు వారాల్లో పురోగతి నివేదిక సమరి్పంచాలని ఆదేశిస్తూ కేసును సెపె్టంబరు 17కు వాయిదా వేసింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు మరో ఐదుగురికి లై డిటెక్టర్ పరీక్షలు చేయడానికి స్థానిక కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. అలాగే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్పై పాలిగ్రాఫ్ పరీక్షకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. మరోవైపు బీజేపీ కార్యాకర్తలు బెంగాల్ వ్యాప్తంగా పోలీసుస్టేషన్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
కలకత్తా ట్రైనీ డాక్టర్ కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
కలకత్తా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా మహిళా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్రాయ్కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సీబీఐ కస్టడీ ముగియడంతో నిందితునికి కట్టుదిట్టమైన భద్రత నడుమ కలకత్తాలోని సెల్డా క్రిమినల్ కోర్టు జడ్జి ముందు శుక్రవారం(ఆగస్టు23) హాజరుపరిచారు.దీంతో కోర్టు నిందితునికి 14 రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు. ఇటీవల కలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యంత దారుణంగా లైంగికదాడి జరిపి హత్య చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. -
Kolkata Case: ఒక రోజు ముందే వైద్యురాలిపై కన్నేసిన నిందితుడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతామహిళా డాక్టర్ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసుల దర్యాప్తుల్లో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. ఘటన జరిగే ముందు రోజే నిందితుడు బాధితురాలి కదలికలను గమనించి ఆమెను వెంబడించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు వెల్లడైంది. ట్రైనీ వైద్యురాలిపై ఆగష్టు9న(శుక్రవారం తెల్లవారుజామున) అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు రోజు అంటే ఆగష్టు 8న వైద్యురాలిని ఆసుపత్రిలని చెస్ట్ మెడిసిన్ వార్డ్లో ఫాలో అయినట్లు సంజయ్ రాయ్ తెలిపాడు.ఇందుకు సంబంధించి ఆగష్టు 8న ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. పౌర వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ బాధితురాలితోపాటు మరో నలుగురు జూనియర్ డాక్టర్లను వెంబడించినట్లు కనిపిస్తుంది.కాగా ఆగష్టు 8న నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ వైద్యురాలు.. విశ్రాంతి కోసం ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 1 గంటలకు సెమినార్ హాల్కు వెళ్లింది. సెమినార్ హాలులో తెల్లవారుజామున 2.30 గంటలకు ఓ జూనియర్ డాక్టర్ ఆమెతో మాట్లాడారు. వారి సంభాషణ అనంతరం వైద్యురాలు నిద్రపోయింది. ఆ సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోకి ప్రవేశించి.. వైద్యురాలిపై హత్యాచారానికి ఒడిగట్టాడు. సంజయ్ రాయ్ తెల్లవారుజామున 4 గంటలకు ప్రాంగణంలోకి ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అంతేగాక నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన బ్లూటూత్ హెడ్సెట్ ఆధారంగా రాయ్ని అరెస్ట్ చేశారు.ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. బాధితురాలికి న్యాయ చేయాలని కోరుతూ వైద్యులు, వైద్య సిబ్బంది విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు సైతం విచారణ చేపట్టింది. ఈ ఘటనలో కేసు నమోదు చేయడం, విచారణలో ఆలస్యంపై బెంగాల్ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. అయితేసంజయ్ రాయ్ మానసిక స్థితిని అంచనా వేయడానికి సీబీఐ కొందరు మానసిక విశ్లేషకులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందితుడిని అన్ని కోణాల్లో ప్రశ్నించిన తర్వాత అతడు ఓ 'కామ పిశాచి' అని నిర్ధారించారు. జంతులాంటి ప్రవృత్తితో విచ్చలవిడిగా తయారయ్యాడని తేల్చారు. పోర్న్ వీడియోలకు బానిసై, కామోన్మాదం బాగా తలకెక్కిన స్థితిలో దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని గుర్తించారు. విచారణ సమయంలో సంజయ్ రాయ్లో ఎలాంటి భయం కానీ పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. సెమినార్ హాల్లోకి ప్రవేశించడం దగ్గరి నుంచి, జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేయడం, ఆ తర్వాత ఆమెను చంపేయడం వరకు పూసగుచ్చినట్టు అతడు చెబుతుండడం చూసి మానసిక నిపుణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా, అత్యాచారం ఎలా చేసిందీ చెబుతున్నప్పుడు అతడి ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు లేకపోగా, అదేదో సాధారణమైన చర్య అయినట్టు అతడు జరిగింది జరిగినట్టు చెప్పడం సీబీఐ బృందాన్ని నివ్వెరపరిచింది. అదే సమయంలో సీబీఐ సంజయ్ రాయ్తోపాటు ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, మరో నలుగురు వైద్యులను పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. -
కోల్ కతా డాక్టర్ కేసులో సీబీఐ సంచలన నిజాలు
-
కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనలో క్రైం సీన్ మార్చేశారు... సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Kolkata Doctor Case: 50 రోజుల్లో శిక్ష పడేలా చట్టాలు రావాలి: అభిషేక్ బెనర్జీ
కోల్కతా: కోల్కతాలో ఆర్జీకార్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్ధిని హత్యాచారం ఘటనలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విభేదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీబీఐ వెంటనే దర్యాప్తు చేసి బాధితురాలికి న్యాయం చేయాలంటూ సీఎం మమతా చేస్తున్న ర్యాలీలకు అతడు దూరంగా ఉండటం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆయన స్పందించారు.ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై నిరసనలు వ్యక్తమవుతోన్న తరుణంలో.. దేశంలో ఆ తరహాలో ఎన్నో కేసులు వెలుగు చూశాయని టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార కేసుల్లో 50 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, దోషులకు శిక్షపడేలా చట్టాలు రావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘పది రోజులుగా ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం కావాలంటూ వైద్యులు, ఇతరులు రోడ్లపై నినదిస్తున్నారు. ఈ దిగ్భ్రాంతికర నేరానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపై ఉన్న సమయంలోనే దేశంలో అలాంటివి మరో 900 కేసులు వెలుగులోకి వచ్చాయి. రోజూ 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. వీటిని నిరోధించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా 50 రోజుల్లోగా విచారణలు పూర్తయి శిక్షలు ఖరారయ్యేలా కఠిన చట్టాలు రావాలి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి’’ అని పోస్టు పెట్టారు.Over the past 10 days, while the nation has been protesting against the #RGKarMedicalcollege incident and demanding justice, 900 RAPES have occurred across different parts of India - DURING THE VERY TIME WHEN PEOPLE WERE ON THE STREETS PROTESTING AGAINST THIS HORRIBLE CRIME.…— Abhishek Banerjee (@abhishekaitc) August 22, 2024 -
మరో రేప్, హత్య జరగనిదే.. మేలుకోమా?
మహిళలు సురక్షితంగా పని ప్రదేశాలకు వెళ్లలేకపోవడమంటే వారికి సమానత్వ హక్కును కాలరాయడమే. మరో రేప్, హత్య జరిగేదాకా వేచి చూడలేం. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు దేశవ్యాప్త ప్రోటోకాల్ కావాల్సిందే. దాని విధివిధానాల రూపకల్పనకు వైస్ అడ్మిరల్ ఆర్తీ సరిన్ సారథ్యంలో టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. మాపై నమ్మకం ఉంచి విధుల్లో పాల్గొనాల్సిందిగాn దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వైద్య సిబ్బందిని కోరుతున్నాం. – సుప్రీంకోర్టు ధర్మాసనం న్యూఢిల్లీ: కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారాన్ని అత్యంత పాశవిక ఘటనగా సుప్రీంకోర్టు అభివరి్ణంచింది. ఈ ఉదంతంలో మమత సర్కారు ఆద్యంతం తీవ్ర బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందంటూ తీవ్రంగా తలంటింది. ఎఫ్ఐఆర్ దాఖలులో ఆలస్యం మొదలుకుని ఈ దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించజూసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్కు మరో పోస్టింగ్, ఆస్పత్రిపై మూక దాడిని నిలువరించడంలో వైఫల్యం దాకా ఒక్క అంశాన్నీ ఎత్తి చూపుతూ నలుగు పెట్టింది. దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది ఏమాత్రం రక్షణ లేని పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.ఈ విషయమై మన వ్యవస్థలోని దారుణ లోపాలను కోల్కతా ఉదంతం మరోసారి తెరపైకి తెచి్చందని అభిప్రాయపడింది. మహిళలు సురక్షితంగా పని ప్రదేశాలకు వెళ్లలేకపోవడమంటే వారి సమానత్వపు హక్కును కాలరాయడమేనని స్పష్టం చేసింది. ‘‘మరో రేప్, హత్య జరిగేదాకా వేచి చూడలేం. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు దేశవ్యాప్త ప్రొటోకాల్ కావాల్సిందే’’ అని స్పష్టం చేసింది. దాని విధివిధానాల రూపకల్పనకు వైస్ అడ్మిరల్ ఆర్తీ సరిన్ సారథ్యంలో వైద్య ప్రముఖులతో కూడిన టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు వారాల్లోగా ప్రాథమిక నివేదిక, రెండు నెలల్లో పూర్తి నివేదిక అందించాల్సిందిగా టాస్్కఫోర్స్కు సూచించింది. హత్యాచార ఘటనపై ఏమేం చర్యలు తీసుకున్నారో నివేదించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని, దర్యాప్తు పురోగతిపై గురువారానికల్లా నివేదిక ఇవ్వాల్సిందిగా సీబీఐని ఆదేశించింది.హత్యాచారానికి, మూక దాడికి వేదికైన కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్య కాలేజీ, ఆస్పత్రికి సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత కలి్పంచాలని ఆదేశించింది. తమపై నమ్మకముంచి విధుల్లో పాల్గొనాల్సిందిగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న వైద్య సిబ్బందిని కోరింది. టాస్క్ఫోర్స్ నియామకాన్ని వైద్య సంఘాలు స్వాగతించినా విధుల బహిష్కరణను కొనసాగిస్తామని ప్రకటించాయి. చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న ట్రైనీ వైద్యురాలు దారుణ అత్యాచారానికి, హత్యకు గురవడం, దాన్ని నిరసిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగడం, ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించడం తెలిసిందే. జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్డీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ జరిపింది. ఈ ఉదంతంలో బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందంటూ విమర్శించింది. ‘‘ఎఫ్ఐఆర్ దాఖలుకు ఎందుకంత ఆలస్యమైంది? ఇంతటి దారుణం జరిగినా ఆస్పత్రిలో భద్రతను కట్టుదిట్టం చేయలేదెందుకు? వేలాదిగా అల్లరి మూకలు ఆస్పత్రిపై దాడికి దిగి నేరానికి సంబంధించిన కీలకమైన ఆధారాలన్నింటినీ చెరిపేస్తుంటే కోల్కతా పోలీసులు చేష్టలుడిగారేం? క్రైం సీన్కు వేదికైన ఆస్పత్రికి పక్కాగా కాపలా ఉండాల్సింది పోయి దాడి మొదలవగానే పారిపోవడమా! రాష్ట్ర ప్రభుత్వ తీరు విస్తుగొలుపుతోంది’’ అంటూ సీజేఐ దుయ్యబట్టారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వైద్య సిబ్బందిపై బలప్రయోగానికి దిగకుండా సున్నితంగా వ్యవహరించాలని ఆదేశించారు. హతురాలి పేరు, మృతదేహం ఫొటోలు, వీడియోలు బయటికి రావడంపై ఆందోళన వెలిబుచ్చారు. అన్నిరకాల మీడియా నుంచీ వాటిని తక్షణం తొలగించాల్సిందిగా ఆదేశించారు. వైఫల్యం లేదు: సిబల్ వైద్యురాలిపై జరిగిన దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించేందుకు వైద్య కాలేజీ, ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ప్రయతి్నంచారంటూ ధర్మాసనం మండిపడింది. ‘‘తల్లిదండ్రులను చాలాసేపటిదాకా మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించలేదు. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. ఇలాంటి వ్యక్తికి మరో వైద్య కాలేజీలో పోస్టింగ్ ఎలా ఇస్తారు?’’ అని మమత సర్కారును ప్రశ్నించింది.ఇందులో ప్రభుత్వ వైఫల్యమేమీ లేదని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదించారు. కోల్కతా పోలీసులు సత్వరం స్పందించి అవసరమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు. పోలీసులు నేర స్థలానికి చేరుకోకముందే హతురాలి ఫొటోలు, వీడియోలు బయటికొచ్చాయన్నారు. ఈ వాదనతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విభేదించారు. పోలీసులకు సమాచారం లేకుండా వేలాది మంది ఆస్పత్రిపైకి వచి్చపడటం అసాధ్యమన్నారు.టాస్క్ఫోర్స్ బృందం ఇదే...వైద్యుల భద్రత తదితరాలపై సిఫార్సుల కోసం సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్ఫోర్స్ సభ్యులు...చైర్పర్సన్: వైస్ అడ్మిరల్ ఆర్తీ సరిన్ (మెడికల్ సర్వీసెస్ డీజీ) సభ్యులు: డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డి (ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ ఎండీ), డాక్టర్ ఎం.శ్రీనివాస్ (ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్), డాక్టర్ ప్రతిమా మూర్తి (ఎన్ఐఎంహెచ్ఈ డైరెక్టర్), డాక్టర్ గోవర్ధన్ దత్ పురీ (జోధ్పూర్ ఎయిమ్స్ ఈడీ), డాక్టర్ సౌమిత్రా రావత్ (ఐఎస్జీ చైర్పర్సన్), అనితా సక్సేనా (బీడీ శర్మ మెడికల్ వర్సిటీ వీసీ), పల్లవీ సప్లే (జేజే గ్రూప్ ఆస్పత్రుల డీన్), డాక్టర్ పద్మా శ్రీవాత్సవ (ఢిల్లీ ఎయిమ్స్ మాజీ ప్రొఫెసర్) వీరితో పాటు టాస్క్ఫోర్స్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కేంద్ర కేబినెట్ కార్యదర్శితో పాటు హోం, ఆరోగ్య శాఖల కార్యదర్శులు తదితరులు వ్యవహరిస్తారుఏమిటీ అరుణా షాన్బాగ్ కేసు?కోల్కతా వైద్యురాలి కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ప్రస్తావించిన అరుణా షాన్బాగ్ ఉదంతం 1973 నాటిది. ఆమె మహారాష్ట్రలోని కింగ్ ఎడ్వర్డ్ ఆస్పత్రిలో నర్సుగా చేసేది. వైద్య ప్రయోగాలకు వాడే కుక్కల ఆహారాన్ని వార్డు బాయ్ కాజేస్తుండటంతో పై అధికారులకు చెబుతానని బెదిరించింది. ఆ కక్షతో ఆమెపై పాశవికంగా లైంగిక దాడికి పాల్పడటమే గాక కుక్కల గొలుసుతో కట్టేశాడు. మెదడుకు గాయమై అరుణ కోమాలోకి వెళ్లింది. అప్పటికామెకు పాతికేళ్లు. అరుణకు కారుణ్య మరణం ప్రసాదించాలన్న విజ్ఞప్తులను సుప్రీంకోర్టు తోసిపుచి్చంది. దాంతో 40 ఏళ్లపాటు మంచానికే పరిమితమై 2015లో కన్నుమూసింది. నిందితునిపై లైంగిక అభియోగాలు మోపకపోవడంతో కేవలం ఏడేళ్ల శిక్ష అనుభవించి 1980లో బయటికొచ్చాడు. బాత్రూములకూ దిక్కులేదు!అందరికీ ఆరోగ్యం అందించే వైద్య సిబ్బందికే పని ప్రదేశాల్లో ఏ మాత్రం భద్రత లేని దుస్థితి దేశవ్యాప్తంగా నెలకొని ఉందని సుప్రీంధర్మాసనం ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి రక్షణ కల్పించడంలో పూర్తిస్థాయి వైఫల్యముంది. వారికి డ్యూటీ రూముల్లేవు. మహిళా, పురుష వైద్యులకు, నర్సులకు విడిగా బాత్రూముల్లేవు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎవరు పడితే వారు ఏ విభాగంలోకైనా నిరి్నరోధంగా ప్రవేశిస్తున్నారు. దాంతో విధి నిర్వహణలోని వైద్యులు, వైద్య సిబ్బంది పలు రూపాల్లో హింసకు లక్ష్యంగా మారుతున్నారు.రోగులకు జరగరానిది జరిగితే వైద్యపరమైన నిర్లక్ష్యమే కారణమంటూ సంబం«దీకులు వైద్య సిబ్బందిపై హింసకు దిగుతున్నారు. పురుషాధిక్య భావజాలం కారణంగా మహిళా వైద్యులు, సిబ్బంది లైంగిక, లైంగికేతర హింసకు ఎక్కువగా బలవుతున్నారు. సహోద్యోగులు, సీనియర్లు, బాసుల నుంచి కూడా లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు. అరుణా షాన్బాగ్ వంటి ఉదంతాలే ఇందుకు నిదర్శనం. వైద్య డిగ్రీలను, కెరీర్లో ఎదుగుదలను ప్రభావితం చేయగల అధికారం ఈ బాసుల చేతుల్లోనే ఉంటోంది.ఇలాంటి హింసను నిరోధించే సమర్థమైన భద్రతా ఏర్పాట్లు ఆస్పత్రులు, వైద్య సంస్థల్లో లేకపోవడం ఆందోళనకరం. డాక్టర్లకు భద్రత కలి్పంచడం జాతి ప్రయోజనాలకు సంబంధించిన అంశం. పలు రంగాల్లో మహిళల ప్రవేశం నానాటికీ పెరుగుతున్నందున పని ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరముంది’’ అని ధర్మాసనం పేర్కొంది. -
సుప్రీం సీరియస్
-
వైద్య సిబ్బందిపై పీక్స్ కు చేరిన వేధింపులు..
-
వైద్య సిబ్బందికి నోటీసులు
-
సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
న్యూఢిల్లీ,సాక్షి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హత్యాచార ఘటన, కేసు దర్యాప్తు, ఆస్పత్రిలో దాడిపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ఘటన చోటు చేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సీజేఐ డీ.వై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాల ధర్మాసనం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితురాలి వీడియోలు, ఫోటోలు బయటకు రావటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ల రక్షణకు తాము చర్యలు తీసుకుంటామని తెలిపింది.డాక్టర్ హత్యాచారం కేసు నమోదులో జాప్యంపై కోర్టు ఆగ్రహించింది. మృతదేహానికి ఆ రోజు రాత్రి 8.30 గంటలకు అంత్యక్రియలు జరిగాయ. మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రిన్సిపాల్ చిత్రీకరించారు. దుండగులను కట్టడి చేయటంతో బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మృతురాలి తల్లిదండ్రులను 3 గంటల పాటు ఎందుకు వేచిచూసేలా చేశారని ప్రశ్నించింది. ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని, ఆయన్ను తొలిగించి, మళ్లీ ఎందుకు నియమించారని ప్రశ్నించింది. ఈ నెల 22లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.డాక్టర్ల రక్షణకు నేషనల్ టాస్క్ ఫోర్స్..డాక్టర్ల రక్షణకు పది మంది ప్రముఖ డాక్టర్లతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఇందులో హైదరాబాద్కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి శరిన్, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ ఎం. శ్రీనివాస్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. అదేవిధంగా అన్ని వర్గాలను టాస్క్ ఫోర్స్ సంప్రదించి రిపోర్టు తయారు చేయాలి. అన్ని ఆస్పత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించాలి. మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను, రెండు నెలల్లో పూర్తి నివేదికను సమర్పించాలని జాతీయ టాస్క్ ఫోర్స్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఈనెల 22 లోపు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.శాంతియుత నిరసనలను అడ్డుకోవద్దుహత్యాచార ఘటనపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేవారిపై అధికారం చెలాయించవద్దని బెంగాల్ ప్రభుత్వానికి సీజేఐ ఆదేశించారు. డాక్టర్లు, విద్యార్థులు, పౌరసమాజాన్ని అడ్డుకోవద్దని సూచించారు.ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచార ఘటన తర్వాత.. అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అక్కడ పని చేసే డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ఆందోళనకారుల పేరిట కొందరు భౌతిక దాడులకు దిగారు. పోలీసుల రక్షణ కల్పించినప్పటికీ.. వాళ్లంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే వాళ్ల ఆవేదనను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఓ యువలాయర్. ప్రొటెక్ట్ ది వారియర్స్ తరఫున అపరాజిత అనే న్యాయవాది ఈ విషయాన్ని సీజేఐ ధర్మాసనం వద్ద ప్రస్తావించారు. ఓ సీల్డ్ కవర్లో ఇందుకు సంబంధించిన వివరాల్ని ఆమె అందజేశారు. ఆ నివేదికను పరిశీలించిన సీజేఐ .. ఆస్పత్రిలో పరిస్థితి తీవ్రంగానే ఉందన్న అభిప్రాయంతో ఏకీభవించారు.కేసు వివరాలు..ఆగస్టు 9న వెలుగులోకి వచ్చిన కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో డాక్టర్ హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ను ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పోలీసులకు అనుబంధ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్న డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు ప్రిన్సిపల్గా నియమితులయ్యారు. ఈ నియామకం వివాదాస్పదం కావడంతో కలకత్తా హైకోర్టు స్పందించింది. సందీప్ ఘోష్ సుదీర్ఘ సెలవులో ఉండాలని ఆదేశించింది. మృతురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేట్టిన కోల్కతా హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసింది.ఘటన జరిగిన సమయంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ ఘోష్ను కొద్దిరోజులుగా సీబీఐ విచారిస్తోంది. ఆయనపై సీబీఐ పలు ప్రశ్నల సంధించింది. వాటిలో కొన్ని ప్రశ్నలు జాతీయ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ‘హాస్పిటల్లో చోటుచేసుకున్న మృతిని ఆత్మహత్యగా ప్రకటించాల్సిన తొందరేమొచ్చింది?. ఎవరి సలహా మేరకు ఘటన సమాచారం కుటుంబ సభ్యులకు ఇచ్చారు? అందులో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదు?. నేరం జరిగిన ప్రాంతాన్ని భద్రంగా ఉంచడం ముఖ్యమని మీకు అనిపించలేదా?. క్రైమ్సీన్లో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని మీకు తెలుసు. మరి విచారణ పూర్తి అయ్యేవరకు ఎందుకు భద్రంగా ఉంచలేదు?. బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం జరిగింది..? మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించటంలో ఎందుకు ఆలస్యం చేశారు?’ అని సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. -
కోల్కతా డాక్టర్ కేసులో నిందితుడికి లై-డిటెక్టర్ టెస్ట్
-
కోల్కతా ఘటన: కొనసాగుతున్న ఆందోళనలు.. రేపు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనతో కోల్కతా అట్టుడుకుతోంది. ఈ దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లోని జూనియర్ వైద్యులు చేస్తున్న ఆందోళనలు సోమవారానికి 11వ రోజుకు చేరుకున్నాయి. డాక్టర్ల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో అసలైన దోషులను చట్టం ముందు నిలబెట్టాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట డాక్టర్లు ఆందోళన చేపట్టారు. దీంతో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా అవుట్ పేషెంట్ సేవలూ నిలిచిపోయాయి. గవర్నర్ అత్యవసర సమావేశంవైద్యురాలిపై హత్యాచార ఘటనలో ఇప్పటి వరకూ విచారణ వేగవంతం కాకపోవడాన్ని ఆప్ రాజ్యసభ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాసిన లేఖపై బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. దీనిపై వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాజ్భవన్ కార్యాలయాన్ని ఆదేశించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఆనంద బోస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఈ రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదు. ఆడపిల్లలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం అసమర్థత వల్లే ఈ రోజు మహిళలు భయపడుతూ బతుకుతున్నారు’’ అని మండిపడ్డారు. ఈ ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.సీబీఐ దర్యాప్తు ముమ్మరంఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేయగా.. ఆర్జీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ దత్ను వరుసగాా నాలుగోరోజు విచారిస్తోంది. నిందితుడు సంజయ్ రాయ్కు సైకాలాజికల్ బిహేవియర్ అనాలసిస్ చేశారు. ఆదివారం ఆయన్ను విచారించిన సందర్భంగా సంఘటనకు ముందు, తరువాత చేసిన ఫోన్కాల్స్ వివరాలపైనే ప్రశ్నించారు.సుప్రీం విచారణమరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ ఘటనపై మంగళవారం విచారణకు సిద్ధమైంది. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. నిందితులను ఉరి తీయాలని మమత బెనర్జీ డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోల్కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు. ఇక కోల్కతా పోలీసులు ఆగస్టు 18 నుంచి ఆగస్టు 24 వరకు ఆర్జీ కార్ ఆస్పత్రి సమీపంలో నిషేధాజ్ఞలను విధించారు. -
ప్రాణాలు కాపాడే వైద్యులకు మనమే రక్షణగా ఉండాలి: సుమన్
పశ్చిమబెంగాల్ కోల్కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ ఘటన యావత్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. న్యాయం కావాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు అందరూ రోడ్డెక్కారు. వైద్య సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు తమ నిరసనగా భారత వైద్య సంఘం(ఐఎంఏ) పిలుపునిచ్చింది. ఈ ఘటనను ఖండిస్తూ ఇప్పటికే ఎందరో ప్రముఖులు స్పందించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి వచ్చిన సినీ హీరో సుమన్ అక్కడ వైద్యుల నిరసనను చూసి స్పందించారు.'మన సమాజంలో వైద్యులు చాలా పవిత్రమైన వృత్తిలో కొనసాగుతున్నారు. దేశాన్ని కాపాడుతున్న సైనికులు, పోలీసులు తర్వాత ఆ స్థానంలో వైద్యులు ఉన్నారు. కరోనా సమయంలో బంధువులు కూడా మన దగ్గరకు రాలేదు. అలాంటిది వైద్యులు మనకు రక్షణగా నిలిచి కాపాడారు. కులం, మతం అని చూడకుండా డాక్టర్లు సేవ చేస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే సేవ చేసేందుకు ముందుకు వస్తారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలను వారు కాపాడారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎందరో డాక్టర్లు, నర్సులు ముందుడి సేవ చేసి ఎంతో మందికి ప్రాణం పోశారు. అలాంటి వారిని మనమే కాపాడుకోవాలి. వారికి కొంత మంది మాత్రమే సపోర్టు చేయడం బాధాకరం. రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణగా ఉండాలి. మహిళలు కూడా సొంతంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని నేను ఎప్పటి నుంచో చెబుతున్నా. ఆపద సమయంలో వారికి తప్పకుండా మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడుతుంది.' అని సుమన్ తెలిపారు. -
కోల్కతా డాక్టర్ ఘటన: తిరుపతిలో నిరసన ర్యాలీ (ఫోటోలు)
-
విజయనగరంలో వైద్య సేవలు నిలిపివేసిన డాక్టర్లు
-
కోల్కతా డాక్టర్ కేసు: 42 డాక్టర్లపై బదిలీపై బీజేపీ ఫైర్
కోల్కతా: కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆదేశాల మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా వైద్య సేవలు కూడా నిలిపివేశారు. మరోవైపు.. 42 మంది డాక్టర్లను సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం బదిలీపై చేయటంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై ప్రతిస్పందిస్తూ బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మండిపడ్డారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ కోల్కతా మెడికల్ కాలేజీ, కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆమె ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా నిరసలను తెలపడానికి ఈ రెండు మెడికల్ కాలేజీలు కేంద్రాలుగా ఉన్నాయి. అందుకే వాటిని సీఎం మమత టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ రెండు మెడికల్ కాలేజీల నుంచి ఐదుగురు ప్రొఫెసర్లు బదిలీ చేయబడ్డారు. ఇది సీనియర్ డాక్టర్ల సంఘాన్ని భయపెట్టేలనే ప్రయత్నం. మమతా బెనర్జీ ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నారు?. ఆగస్టు 16న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 8 పేజీల బదిలీ ఉత్తర్వుల జాబితాను జారీ చేసింది. ఇది ఇప్పటికే గందరగోళ పరిస్థితికి దారితీస్తోంది’’ అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ఇక.. బదిలీ చేయబడిన 42 మంది డాక్టర్లలో ఇద్దరు డాక్టర్ల సంగీతా పాల్, డాక్టర్ సుప్రియా దాస్ గతంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో పని చేశారు. -
24 గంటలు ఓపీ వైద్యసేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: కోల్కతాలో యువ పీజీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ వైద్యసేవలు నిలిపి వేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. అయితే అత్యవసర వైద్య సేవలను మినహాయించింది. కోల్కతాలో వైద్యురాలి హత్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నేత డాక్టర్ నరహరి తీవ్రంగా ఖండించారు.శనివారం తెలంగాణ ప్రభుత్వ వైద్యులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక గంట పాటు నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చారు. జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె చేస్తున్న కారణంగా అవసరమైతే ఒక గంట ఎక్కువగా పనిచేసి ఓపీ నిర్వహించాలన్నారు. కోల్కతా ఘటనను తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల ఖండించారు. జూడాలు చేస్తున్న ధర్నాలకు హాజరు కావాలని నిర్ణయించామన్నారు. మంత్రి దామోదర సంఘీభావం డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ఒక ప్రకటనలో సంఘీభావం తెలిపారు. డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని ఆయన ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలను అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రతపై శాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు. ఇందిరా పార్కు వద్ద నేడు ధర్నా సుల్తాన్బజార్: మహిళా వైద్యురాలిపై అత్యాచారం,హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి.కాళీప్రసాద్రావు డాక్టర్ జె.విజయరావులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కూడా ధర్నాను విజయవంతం చేయాలన్నారు.నల్లబ్యాడ్జీలు ధరించి నేడు నిరసన వ్యక్తం చేయాలన్న నర్సుల సంఘంఉత్తరాఖండ్లో నర్సింగ్ ఆఫీసర్పై అత్యాచారం, హత్య, షాద్నగర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నర్సింగ్ ఆఫీసర్పై జరిగిన దాడితోపాటు కోల్కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను తెలంగాణ ప్రభుత్వ నర్సుల సంఘంప్రధాన కార్యదర్శి మరియమ్మ తీవ్రంగా ఖండించారు. శనివారం తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ తమ షిఫ్ట్ డ్యూటీలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. -
ఆస్పత్రులపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: బెంగాల్లోని కోల్కతాలో వైద్యురాలి హత్యచార ఘటనపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం.. అన్నీ అసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి వైద్యులపై, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడి జరిగితే.. ఆరు గంటల్లోగా పోలీసు కేసు కావాల్సిందేని పేర్కొంటూ.. అన్ని ఆసుపత్రులకు మెమో జారీ చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఫిర్యాదు అందకపోతే.. సంబంధిత ఆసుపత్రి, ఇన్స్టిట్యూట్ అధిపతి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై దాడులు ఎక్కువైనట్లు మా దృష్టికి వచ్చింది. అనేక మంది ఆరోగ్య కార్యకర్తలు తమ విధి నిర్వహణలో శారీరక హింసకు గురవుతున్నారు. మరికొందరికి బెదిరింపులు, వస్తున్నాయి.ఇందులో ఎక్కువ శాతం రోగి, వారి వెంట వచ్చిన అటెండర్ల వల్ల ఎదుర్కొన్నవే.. దీనిని పరిగణనలోకి తీసుకొని ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చాం. విధుల్లో ఉండగా వైద్య సిబ్బంది హింసను ఎదుర్కొంటే.. ఆరు గంటల్లోగా ఆసుపత్రి హెడ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని కేంద్రం వెల్లడించింది. In the event of any violence against any healthcare worker while on duty, the Head of Institution shall be responsible for filing an Institutional FIR within a maximum of 6 hours of the incident: Ministry of Health and Family Welfare pic.twitter.com/2YGDZVRx8O— ANI (@ANI) August 16, 2024కాగా కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో పనిచేసే వారికి మెరుగైన రక్షణ, సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్ధులు సమ్మెకు దిగారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కోల్కతా వైద్యురాలి కేసు.. సీబీఐకి మమతా అల్టిమేటం
కోల్కతా హత్యాచారం కోల్కతా ప్రభుత్వ వైద్య విద్యాసంస్థ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఆవరణలో అత్యాచారం, ఆపై హత్య జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. కామాంధుల కర్కశత్వానికి ఓ యువ వైద్యురాలు బలైంది. సమాజం తలదించుకోవాల్సిన ఈ ఘటనపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బెంగాల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి.తాజాగా వైద్యురాలి కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ సీఎం మమతా బెనర్జీ నేడు(శుక్రవారం) ర్యాలీ నిర్వహించనున్నారు. ఆదివారం లోగా దోషులకు ఉరిశిక్ష విధించాలని ఆమె కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐఈ)కి అల్టిమేటం ఇచ్చారు.అయితే పోలీసులు కేసును తప్పుదారి పట్టించారని, అధికార టీఎంసీ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం మమతా ర్యాలీకి పిలుపునివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా రాష్ట్రంలో పోలీసు, హోంశాఖ పోర్ట్ఫోలియోలను మమతానే నిర్వర్తిస్తున్నారు.-అయితే పార్టీ అధినేత, సీఎం దీదీ ఎందుకు ర్యాలీతో వీధుల్లోకి వస్తున్నారనే విషయంపై టీఎంపీ ఎంపీ, అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రెయిన్ క్లారిటీ ఇచ్చారు. కోల్కతాలో జరిగిన వైద్యురాలితిపై జరిగిన అత్యాచారం, హత్య కంటే దారుణమైన ఘటనను ఊహించడలేం. దీనిపై ప్రజల ఆగ్రహాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఆమె కుటుంబం కోసం అందరూ ప్రార్థించడండి అని పేర్కొన్నారు.‘ఆర్జీ కర్ హాస్పిటల్ ఘటనపై మమతా బెనర్జీ ఎందుకు ర్యాలీకి నాయకత్వం వహిస్తున్నారనేది సరైన ప్రశ్నే.. ఎందుకంటే ఇప్పుడు కేసును విచారిస్తున్న సీబీఐ, తమ దర్యాప్తుపై రోజువారీ అప్డేట్లు ఇవ్వాలి. అంతకముందు ఈ కేసులో దర్యాప్తును పూర్తి చేయడానికి కోల్కతా పోలీసులకు సీఎం ఇచ్చిన గడువు ఆగస్టు 17. అదే సీబీఐకి కూడా వర్తించాలి. ఇప్పటికే ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. సీబీఐ మిగతా వారందరినీ అరెస్టు చేసి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపినప్పుడే న్యాయం జరుగుతుంది. దోషులను కఠినంగా శిక్షించినప్పుడుఏ బాధితులకు సత్వర న్యాయం జరుగుతుది. ఈ కేసులో ఎవరినీ విడిచిపెట్టకూడదు’ అని ఆయన సూచించారు. -
వైద్యురాలిపై గ్యాంగ్రేప్!
కోల్కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతంలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్తో పాటు మరికొందరి ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలను పోస్ట్మార్టం నివేదిక బలపరుస్తోంది. మృతురాలి జననాంగంలో 151 గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్మార్టం నివేదిక వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇది కచి్చతంగా గ్యాంగ్ రేపేనని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సువర్ణ గోస్వామి చెప్పారు. ‘‘మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయాలున్నాయి. ఒక్క వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడు! ఎక్కువ మంది దాడి చేసినట్లు అనిపిస్తోంది’’ అన్నారు. ఒళ్లంతా గాయాలే నాలుగు పేజీల పోస్ట్మార్టం నివేదికలో విస్మయకర వివరాలున్నాయి. ‘‘రేప్ చేశాక గొంతు నులిమి చంపారు. పెనుగులాట సందర్భంగా కదలకుండా తలను గోడకు బలంగా అదమడంతో వెనక వైపు పెద్ద గాయమైంది. ముఖమంతా గీసుకుపోయింది. కేకలు వేయకుండా నోరు మూసేశారు. గొంతుపై బలంగా నొక్కడంతో థైరాయిడ్ కార్డిలేజ్ చితికిపోయింది. జననాంగాల వద్ద లోతైన గాయమైంది. లైంగికదాడే అందుకు కారణం. నడుము, పెదాలు, చేతి వేళ్లు, ఎడమ కాలిపై గాయాలున్నాయి. రెండు కళ్ల నుంచి, నోటి నుంచి రక్తస్రావమైంది. ముక్కు, నోరు గట్టిగా అదిమిపట్టి మూసేసినట్లు చర్మం కమిలింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘కాళ్లు పూర్తిగా 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగాయి. కటిభాగం వద్ద ‘పెలి్వక్ గార్డిల్’ చీలిపోయింది. అంటే కాళ్లను పూర్తిగా పక్కకు విరిచేశారు’ అని వైద్యురాలి బంధువు ఒకావిడ విలపిస్తూ చెప్పారు. మూడు గంటలు బయటే నిలబెట్టారు మృతదేహాన్ని చూపించకుండా ఆస్పత్రి బయట మూడు గంటలు బయటే నిలబెట్టారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ‘‘తర్వాత తండ్రిని అనుమతించారు. తన ఒంటిపై బట్టల్లేవు. కాళ్లు పక్కకు విరిచేసినట్లు ఫొటోలోకనిపిస్తోంది. కళ్లద్దాల ముక్కలు కంట్లో ఉన్నాయి. ఊపిరాడకుండా చేసి చంపేశారు’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. -
కోల్కతా వైద్యురాలి ఉదంతం.. ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు: మమతా
కోల్కతాలోని వైద్యురాలి హత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో గత శుక్రవారం తెల్లవారుజామున వైద్యారాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసును రాష్ట్ర పోలీసుల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తమ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించింది.మరోవైపు ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా వైద్య విద్యార్ధులు, డాక్టర్లు పశ్చిమబెంగాల్, ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యాచారం-హత్య కేసులో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ కేసులో సీఎం మమత నిందితులను రక్షించాలని ప్రయత్నిస్తున్నారని, ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.అయితే వైద్యురాలిపై హత్యచారం ఉదంతాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విపక్ష బీజేపీ నాయకులు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బెంగాల్లో బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు సృష్టించేందుకు బీజేపీ, సీపీఎం ప్రత్ని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.‘బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సింది పోయి.. వామపక్షాలు, బీజేపీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. వారు ఇక్కడ ఓ బంగ్లాదేశ్ను చేయగలమని భావిస్తున్నారు. అయితే నేనేం అధికారం కోసం అత్యాశతో లేను. ఈ కేసులో అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ తీరును కొందరు తప్పుపడుతున్నారు. ఈ కేసులో మేం ఏం చేయలేదా? ఎలాంటి చర్యలు తీసుకోలేదా? సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసు కమిషనర్తో మాట్లాడాను. బాధిత మహిళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాను. అత్యాచారం చేసిన వ్యక్తిని ఉరితీస్తానని వారితో చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను.ఘటజన జరిగిన రాత్రంతా కేసును పర్యవేక్షిస్తున్నాను. దహన సంస్కారాలు జరిగే వరకు పోలీసులతో టచ్లో ఉన్నాను. పోలీసులు ఆమె కుటుంబంతోనే ఉన్నారు. అంతేగాక 12 గంటల్లో హంతకుడిని అరెస్టు చేశారు. బాధితురాలి మృతదేహాన్ని తీసుకెళ్లడం, డీఎన్ఏ టెస్టు చేయడం, సీసీటీవీ ఫుటేజీ, సమగ్ర దర్యాప్తు అన్నింటిని పోలీసులు పూర్తి చేశారు.ఏదైనా విచారణ కోసం ముందు సమయం ఇవ్వాలి. నేను ఆదివారం వరకు పోలీసులకు గడువు విధించాను. సరైన విచారణ చేయకుండా ఎవరిపైనా చర్యలు తీసుకోలేరు. నేను సీనియర్, జూనియర్ డాక్టర్లను గౌరవిస్తాను. సరైన విచారణ లేకుండా నేను వ్యక్తులను అరెస్టు చేయలేను’అని తెలిపారు.ఈ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకోవడంతో కేసును మంగళవారం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ దర్యాప్తుపై మమతా మాట్లాడుతూ.. తాము పూర్తిగా హైకోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తామని, సీబీఐ దర్యాప్తుకు సహరిస్తున్నామని తెలిపారు. కేసును త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ముప్పై నాలుగు మందిని పోలీసులు విచారించారని, మరికొంతమందిని విచారించాల్సి ఉందన్నారు. అయితే ఈ లోపే హైకోర్టు జోక్యం చేసుకుని కేసును సీబీఐకి బదిలీ చేసిందని చెప్పారు. -
కోల్కతా వైద్యురాలి ఘటనపై మౌనం వీడిన రాహుల్.. ఏమన్నారంటే!
న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: కోల్కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. వైద్యురాలిపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.ఈ ఘటన దేశ వ్యాప్తంగా వైద్యరంగంలో మహిళల్లో అభద్రతాభావం పెంచుతోందన్నారు. విద్యా, వైద్య సంస్థల్లో భద్రతా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించడంలో స్థానిక అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు.‘భాదితులకు న్యాయం చేయడానికి బదులుగా నిందితులను రక్షించే ప్రయత్నం చూస్తుంటే.. ఆసుపత్రి, స్థానిక పరిపాలనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. మెడికల్ కాలేజీ లాంటి చోట డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువుల కోసం బయటకి ఎలా పంపుతారనే ఆలోచనను రేకెత్తిస్తోంది. నిర్భయ కేసు తర్వాత చేసిన కఠిన చట్టాలు కూడా ఇలాంటి నేరాలను అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నాయి’ అని ప్రశ్నించారు.‘హత్రాస్ నుంచి ఉన్నావ్ వరకు.. కథువా నుంచి కోల్కతా వరకు మహిళలపై నిరంతరం పెరుగుతున్న అరాచకాలపై ప్రతి పార్టీ, సమాజంలోని ప్రతి వర్గం తీవ్రమైన చర్చలు జరపాలి. వీటిని నిరోధించేందుకు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.कोलकाता में जूनियर डॉक्टर के साथ हुई रेप और मर्डर की वीभत्स घटना से पूरा देश स्तब्ध है। उसके साथ हुए क्रूर और अमानवीय कृत्य की परत दर परत जिस तरह खुल कर सामने आ रही है, उससे डॉक्टर्स कम्युनिटी और महिलाओं के बीच असुरक्षा का माहौल है।पीड़िता को न्याय दिलाने की जगह आरोपियों को…— Rahul Gandhi (@RahulGandhi) August 14, 2024మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం.. కోల్కతా వైద్యురాలి ఘటన భయానకమైనదిగా పేర్కొ న్న విషయం తెలిసిందే. దీనిని హృదయవిదారకమైన సంఘటనగా ఆమె అభివర్ణించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మమతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా మృతురాలి కుటుంబానికి, వైద్య సిబ్బందికి న్యాయం జరుగుతుందని ఆమె ఆకాంక్షించారు. పని ప్రదేశంలో మహిళల భద్రత అనేది ఒక పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనికి తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.శుక్రవారం తెల్లవారుజామున ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందేఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తోంది. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. -
కోల్కతా డాక్టర్ హత్య కేసు.. ఆస్పత్రిపై ఆరోపణలు
కలకత్తా : కలకత్తా ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం,హత్య ఘటనపై ఆమె తల్లిదండ్రులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ దారుణం గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రికి వచ్చామని, ఆస్పత్రిలో తమ కుమార్తె డెడ్ బాడీని చూసేందుకు మూడు గంటలు ఎదురుచూడాల్సి వచ్చిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.బాధితురాలి తల్లిదండ్రులు కుమార్తె మరణంపై ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ఆగస్ట్ 9న ఆస్పత్రి అధికారులు నాకు ఫోన్ చేసి మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వెంటనే రావాలి అని చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన వెంటనే తమ కుమార్తె ముఖాన్ని చూపించమని హాస్పిటల్ అధికారులను వేడుకున్నాం. కానీ చూపించలేదు. మూడు గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అని ఆరోపిస్తున్నారు. మూడు గంటల తర్వాత తండ్రిని లోపలికి వెళ్లి ఆమె మృతదేహాన్ని చూడటానికి అనుమతించారు. ఒక ఫొటో తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు.ఆమె శరీరంపై దుస్తులు లేవు. ఆమె కాళ్ళు 90 డిగ్రీల కోణంలో మెలి తిరిగి ఉన్నాయి. ‘కటి వలయంలో రెండు కాక్సల్ ఎముకలు(హిప్ ఎముకలు)ఉంటాయి. అవి విరిగితేనే కాళ్లు అలా ఉంటాయి’ అని బంధువులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్జికార్ ఆస్పత్రికి సీబీఐ అధికారులుమరోవైపు జూనియర్ డాక్టర్పై అత్యంత పాశవికంగా దాడి జరుగుతుందటే ఆస్పత్రిలో ఉన్నవారికి ఆ విషయం తెలియపోవడం, యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి పోలీసులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో కేసును సీబీఐతో విచారణ జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు న్యాయ స్థానాన్ని కోరారు. దీంతో కేసును సీబీఐకి అప్పగించింది. బుధవారం ఉదయం 10గంటల్లోపు కేసుకు సంబంధించిన అన్నీ ఆధారాల్ని సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ప్రధానన్యాయ మూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ ధర్మాసనం పోలీసులకు సూచించింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు బుధవారం ఉదయం ఆర్జీకార్ ఆస్పత్రికి చేరుకున్నారు. -
ట్రైనీ డాక్టర్ హత్య కేసు: సీబీఐ దర్యాప్తు ప్రారంభం
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలో అత్యంత భయానకంగా జరిగిన ట్రైనీ మహిళా డాక్టర్ హత్యకేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది.దర్యాప్తు కోసం సీబీఐ పోలీసులు బుధవారం(ఆగస్టు14) ఉదయాన్నే కలకత్తా చేరుకున్నారు. ఇప్పటివరకు కేసు దర్యాప్తు చేసిన కలకత్తా పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన సమాచారాన్ని, ఫైల్స్ను సీబీఐ స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు తీరుపై పశ్చిమబెంగాల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలకత్తా హైకోర్టు మంగళవారమే కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో మరుసటిరోజే సీబీఐ రంగంలోకి దిగింది. ఇటీవల కలకత్తాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్య జరిగిన తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. అన్ని రాష్ట్రాల్లోజూనియర్డాక్టర్లు ఆందోళనలు నిర్వహించారు. కేంద్రవైద్యశాఖ మంత్రి జేపీనడ్డా హామీతో తమ ఆందోళనలు విరమిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. -
వైద్యురాలి కేసు సీబీఐకి
కోల్కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్యురాలి హత్యాచారం కేసు విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశాలిచి్చంది. అనంతరం గంటల వ్యవధిలోనే ఫోరెన్సిక్, వైద్య నిపుణులతో కూడిన సీబీఐ ప్రత్యేక బృందం హుటాహుటిన కోల్కతా చేరుకుంది. కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. నిందితున్ని కస్టడీలోకి తీసుకుని విచారించడమే గాక క్రైం సీన్ను రిక్రియేట్ చేయనుంది. మరోవైపు తమ ప్రధాన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో దేశవ్యాప్త సమ్మెను విరమిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సెక్యూరిటీ విధుల్లో ఉన్న ఓ ప్రబుద్ధుడు గత గురువారం రాత్రి ఓ ట్రైనీ డాక్టర్ను రేప్ చేసి దారుణంగా హతమార్చడం తెలిసిందే. దీనిపై వైద్యులు, వైద్య సిబ్బంది భగ్గుమన్నారు. ఇందులో ఇతరుల హస్తమూ ఉందని, అందుకు సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ పక్కాగా చెరిపేశారని ఆరోపించారు. దోషులందరికీ కఠిన శిక్షలు పడాలంటూ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళనలకు తెర తీశారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిల్స్పై కలకత్తా ౖహైకోర్టు మంగళవారం విచారించింది. కోల్కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. ఐదు రోజులు దాటినా ప్రగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది. ప్రిన్సిపల్ తీరు క్షమార్హం కాదు ఈ ఉదంతంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తీరు దారుణమంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం మండిపడ్డారు. ‘‘కాలేజీ క్యాంపస్ లోపల ఏకంగా మహిళా డాక్టర్ను రేప్ చేసి దారుణంగా హతమార్చినా ఆయన సత్వరం స్పందించలేదు. హత్య జరిగిందంటూ కనీసం సకాలంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. ఇది క్షమార్హం కాదు’’ అంటూ తీవ్రంగా తలంటారు. వైద్య విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఘోష్ రాజీనామా చేయడం తెలిసిందే. మమత సర్కారు దాన్ని ఆమోదించకపోగా ఆయనను కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ (సీఎన్ఎంసీహెచ్)కు బదిలీ చేయడంపై సీజే విస్మయం వెలిబుచ్చారు. తక్షణం సెలవుపై వెళ్లాలని ఘోష్ను ఆదేశించారు. తదుపరి ఆదేశాలిచ్చే దాకా ఇంటికే పరిమితం కావాలని స్పష్టం చేశారు.డిమాండ్లకు కేంద్రం ఒప్పుకొంది: ఫోర్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ (ఫోర్డా) మంగళవారం రాత్రి ప్రకటించింది. ‘‘మంత్రితో భేటీ అయ్యాం. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు ఉద్దేశించిన కేంద్ర రక్షణ చట్టంపై ఫోర్డా సహకారంతో కమిటీ వేయాలనే ప్రధాన డిమాండ్ను 15 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు’’ అని తెలిపింది. -
అర్ధరాత్రిలో స్వతంత్ర పోరాటం
‘నైట్ ఈజ్ అవర్స్’ పేరుతో ఆగస్టు 14 అర్ధరాత్రి కోల్కతాలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలుపనున్నారు.అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కాని అర్ధరాత్రి సురక్షితంగా జీవించే హక్కు స్త్రీలకు రాకపోవడంపై ఈ నిరసన.కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య జరిగిన నేపథ్యంలో రాత్రిని చూసి భయపడుతూ బతకవలసిందేనా అని నిలదీస్తున్నారు స్త్రీలు.ఈ నిరసన, గతంలో ఇలాంటి ప్రతిఘటనలపై కథనం.‘ఏ రోజైతే అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా రోడ్డు మీద నడవగలదో ఆ రోజు ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అన్నారు గాంధీజీ. ఆయన కలలుగన్న స్వాతంత్య్రం ఇంకా ఒడిదుడుకుల్లోనే ఉంది. డిసెంబర్ 16, 2012లో ఢిల్లీలో అర్ధరాత్రి ఒక నిర్భయ దారుణంగా లైంగికదాడికి లోనై మరణిస్తే మొన్న గురువారం (ఆగస్టు 8) అర్ధరాత్రి కోల్కతాలోని ఆర్జి కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఒక ట్రయినీ డాక్టర్ దారుణంగా అత్యాచారానికీ హత్యకూ లోనైంది. దీంతో దేశవ్యాప్తంగా వైద్యబృందాలు భగ్గుమన్నాయి. నిరసనలు సాగుతున్నాయి. వైద్యులు వైద్యసేవలు మాని ఈ అన్యాయానికి జవాబేమిటని ప్రశ్నిస్తున్నారు. తక్షణ న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు.అర్ధరాత్రి నిరసన‘ఆగస్టు 14 అర్ధరాత్రి మనకు స్వాతంత్య్రం వచ్చింది. కాని స్త్రీలకు తమ ఇంట్లో, పని చోట, బహిరంగ ప్రదేశాల్లో రాత్రుళ్లు ఎటువంటి స్వేచ్ఛ లేని బానిసత్వమే మిగిలింది. కోల్కతాలో జరిగిన దారుణకాండ కు నిరసనగా ఈ ఆగస్టు 14 అర్ధరాత్రి మహిళలందరం నిరసన చేయనున్నాం’ అని కోల్కతాలోని మహిళలు తెలియచేస్తున్నారు. ఈ నిరసకు స్త్రీలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. మనదేశంలో సూర్యుడు అస్తమించగానే స్త్రీలలో, వారి కుటుంబ సభ్యుల్లో ఆ స్త్రీలు ఇంటికి చేరే వరకు ఆందోళన ఉంటుంది. వారి మీద ఏదోవిధమైన దాడి జరిగే వాతావరణం ఉండటమే ఇందుకు కారణం. ఒంటరి స్త్రీ బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తే ఆమెతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే తెగింపు కొన్ని మూకలలో ఈ సమాజంలో ఉంది. స్త్రీలకు పరిమిత సమయాలలో పరిమిత స్థలాలలోనే రక్షణ. లేదంటే లేదు. అయితే నిర్భయ ఘటన ఆమె రోడ్డు మీద ఉన్నప్పుడు జరిగితే కోల్కతాలో బాధితురాలు ఆస్పత్రిలో తన డ్యూటీలో ఉండగా దాడి జరగడం తీవ్రమైన ప్రశ్నను లేవదీసేలా ఉంది.మీట్ టు స్లీప్నిర్భయ ఘటన జరిగాక ఆమెను తలుచుకుంటూ ప్రతి డిసెంబర్ 16న పార్కుల్లో మహిళలు బృందాలుగా నిదురించే కార్యక్రమం ‘మీట్ టు స్లీప్’ నిర్వహించాలని బెంగళూరుకు చెందిన ‘బ్లాక్ నాయిస్’ అనే సంస్థ పిలుపునిస్తే దేశంలోని అన్ని మెట్రో నగరాలలో ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ‘పబ్లిక్ ప్లేసులపై మా హక్కు కూడా ఉంది. మేము అక్కడ సురక్షితంగా ఉంచే పరిస్థితిని డిమాండ్ చేస్తున్నాం’ అని ఈ కార్యక్రమం కోరుతోంది. బ్లాక్ నాయిస్ ఫౌండర్ జాస్మిన్ పతేజా దీని రూపకర్త.విమెన్ వాక్ ఎట్ మిడ్నైట్:ఢిల్లీ రోడ్ల మీద అర్ధరాత్రి స్వేచ్ఛగా నడిచే హక్కు స్త్రీలకు ఉంది అని ‘విమెన్ వాక్ ఎట్ మిడ్నైట్’ పేరుతో అక్కడి మహిళా బృందాలు రాత్రుళ్లు నడిచి తమ గళాన్ని వినిపించాయి. మల్లికా తనేజా అనే థియేటర్ ఆర్టిస్ట్ ఇందుకు పిలుపునిచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘రాత్రిపూట ఖాళీ ఫుట్పాత్ మీద స్వేచ్ఛగా కూచునే అనుభూతి ఇప్పుడు పొందాను’ అని ఈ అర్ధరాత్రి నడకలో పాల్గొన్న ఒక మహిళ అంది.సమాజంలో స్త్రీకి గౌరవం దక్కాలన్నా ఆమె సురక్షితంగా ఉండాలన్నా ఇంటిలో బడిలో పని చోట్ల ప్రభుత్వ విధానాలలో సినిమాలలో కళల్లో ఆమెను గౌరవించే వాతావరణం, బౌద్ధిక శిక్షణ అవసరం. కఠినమైన చట్టాలతో పాటు విలువల ఔన్నత్యం కూడా అవసరం. స్త్రీలను కించపరిచే భావజాలం ఎక్కడ ఉన్నా దానిని నిరసించడం అందరూ నేర్వాలి. లేని పక్షంలో అర్ధరాత్రి నిరసనలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూనే ఉంటాయి. -
ట్రైనీ డాక్టర్ హత్య కేసు.. మరొకరి ప్రమేయం ఉందా?
కోల్కతా: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న కోల్కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యకేసులో పలు అనుమానాలు, అటాప్సీ రిపోర్ట్లో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం (ఆగస్ట్13) ట్రైనీ డాక్టర్ ఆటాప్సీ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. అటాప్సీ రిపోర్ట్ ఆధారంగా..నిందితుడు సంజయ్ రాయ్ ట్రైనీ డాక్టర్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రాణాలు తీసినట్లు తేలింది. అమానుషంగా లైంగిక దాడి కారణంగా బాధితురాలి అంతర్గత శరీర భాగాల్లో ఏర్పాడిన గాయాల కారణంగా రక్త స్త్రావమైంది. ఆగస్టు 9 తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య హత్య, అత్యాచారం జరిగి ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.నిందితుడి సంజయ్ రాయ్ నుంచి తప్పించుకునేందుకు ట్రైనీ డాక్టర్ ప్రతిఘటించడంతో ఆమె ఉదరం, పెదవులు, వేళ్లు, ఎడమ కాలుపై గాయాలయ్యాయని, నిందితుడు నుంచి చెరనుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిలువరించేందుకు ఆమె తలను గోడకు బాదాడు. దారుణానికి ఒడిగట్టే సమయంలో అరుపులు వినపడకుండా ఉండేందుకు నోరు, గొంతు బిగించాడు. దీంతో ఆమె మెడ ఎముకలు విరిగినట్లు పోస్ట్మార్టం నివేదిక పేర్కొంది. అయితే, ఆమె కంటికి గాయం కావడానికి గల కారణాల్ని ఇంకా గుర్తించలేదు.ఆత్మహత్య చేసుకుందంటూ ఫోన్ కాల్మరోవైపు దారుణం వెలుగులోకి వచ్చిన రోజు ఆమె ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫోన్ కాల్ చేసింది అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని మీడియా కథనాలు చెబుతున్నాయి. సంజయ్ రాయ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా?దీంతో ఇదే అంశంపై సూపరింటెండెంట్ను విచారించేందుకు పోలీసులు ఇవాళ లాల్బజార్ పీఎస్కు పిలిపించారు. తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నారని తల్లిదండ్రులకు ఎందుకు ఫోన్ చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంజయ్ రాయ్తో పాటు ఇంకెవరైనా ఉన్న అన్న కోణంలో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు.