ఘనంగా పూచ్చెరిదల్ వేడుక
సేలం: దేశంలో ఉన్న శక్తి పీఠాలలో ప్రసిద్ధి చెందిన తిరుచ్చి సమయపురం మారియమ్మన్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో పూచ్చెరిదల్ (పువ్వులతో మొక్కు తీర్చుకోవడం) వేడుక ఆదివారం ప్రారంభమైంది. భక్తులు పువ్వులను ఊరేగింపూ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుచ్చి జిల్లా సమ యపురం మారియమ్మన్ ఆలయంలో పూచ్చెరిదల్ వేడుకలు గణపతి పూజతో ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. అనంతరం వాస్తు శాంతి, అంకురార్పణ పూజలు చేశారు. అమ్మవారికి పలు రకాల పువ్వుల పళ్లేలను ఏనుగుతోపాటు ఊరేగింపుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద నుంచి ప్రారంభమై మేళతాళాల నడుమ ఆలయానికి తీసుకెళ్లారు. తర్వాత అమ్మవారికి పుష్పాలను సమర్పించి విశేష పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పువ్వుల పళ్లేలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment