తిరుక్కురల్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం
తిరువళ్లూరు: మహిళ దినోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన తిరుక్కురల్ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. తిరువళ్లూరు జిల్లా సెండ్రాన్పాల్యం గ్రామంలో కలాం పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో మంగళవారం మహిళ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వేడుకల సందర్బంగా పాఠశాలలోని విద్యార్థులకు తిరుక్కురల్, డ్రాయింగ్ తదితర పోటీలను నిర్వహించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను ప్రిన్సిపల్ పారాణ, అన్బు ట్రస్టు నిర్వాహకులు నవీన తదితరులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే ఉపాధ్యాయుడు గోకుల్రాజ్, కార్తీక్రాజ్కుమార్, భరణీకుమార్, రాజ్కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment