కొనుగోలు ధరను పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు ధరను పెంచాలి

Published Thu, Mar 20 2025 1:57 AM | Last Updated on Thu, Mar 20 2025 1:56 AM

కొనుగోలు ధరను పెంచాలి

కొనుగోలు ధరను పెంచాలి

అన్నానగర్‌: తమిళనాడులో ఆవిన్‌ తరఫున పాల ఉత్పత్తిదారుల నుంచి లీటర్‌ ఆవు పాలను లీటరుకు గరిష్ట ధర రూ.32, గేదె పాలను లీటరుకు రూ.42 నాణ్యత ఆధారంగా కొనుగోలు చేస్తారు. పాల కొనుగోలు ధరను ఆవు పాలకు రూ.45, గేదె పాలకు రూ.51గా నిర్ణయించాలని కూడా పాల ఉత్పత్తిదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ స్థితిలో కొనుగోలు ధర పెంపు సహా పలు డిమాండ్లను నొక్కి చెబుతూ తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సంఘం తరఫున రోడ్డుపై పాలు పోసి నిరసన చేపడతామని ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే బుధవారం దిండుగల్‌ జిల్లాలో 9 చోట్ల పాల ఉత్పత్తిదారులు నిరసనలో పాల్గొన్నారు. చానార్‌పట్టి సమీపంలోని మరునూతు గ్రామంలో పాల ఉత్పత్తిదారులు నిరసన తెలిపారు. డబ్బాల్లో తెచ్చిన పాలను రోడ్డుపై పోసి తమ డిమాండ్ల కోసం నినాదాలు చేయడంతో కలకలం ఏర్పడింది. వేడసందూర్‌ పూడు రోడ్డు, పళని సమీపంలోని తొప్పంపట్టి బస్టాప్‌, ఊతం ఛత్రంలోని రామపట్టినంబదూర్‌, కన్నివాడి, వీరూవీడు వద్ద పాల ఉత్పత్తిదారులు ఆందోళనలలో పాల్గొన్నారు. అనంతరం రోడ్డుపై పాలు పోసి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement